WestGodavari

News July 23, 2024

పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షపాతం వివరాలు

image

పశ్చిమగోదావరి జిల్లాలో వర్షపాత వివరాలను మంగళవారం అధికారులు వెల్లడించారు. తణుకు 1.0, పెంటపాడు, గణపవరం, ఆచంట 0.8, ఉండి 0. 6,అత్తిలి 0.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. జిల్లా మిగిలిన మండలాలో వర్షపాతం నమోదు కాలేదు. మొత్తం జిల్లాలో 4.2వర్షపాతం నమోదయింది. జిల్లా సగటు వర్షపాతం 0.2 మిల్లీ మీటర్లు అని అధికారులు తెలిపారు.

News July 23, 2024

లభ్యంకాని నరసాపురం MPDO ఆచూకీ

image

నరసాపురం ఎంపీడీవో అదృశ్యమై ఎనిమిది రోజులు దాటినా ఆచూకీ లభ్యం కాలేదు. పోలీసులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా ఫలించడం లేదు. ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఇంకా జీవించే ఉన్నారా? అనే దానిపై స్పష్టత రానట్లు తెలుస్తోంది. . సోమవారం కూడా ఏలూరు కాలువను పూర్తిగా గాలించినట్లు పోలీసులు తెలిపారు.  ఈ నేపథ్యంలో జీవించి ఉండవచ్చనే అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి.

News July 23, 2024

పగో జిల్లాలో వర్షాల కారణంగా నష్టం ఎంతంటే..!

image

అధికవర్షాలు, వరదలతో జిల్లా వ్యాప్తంగా 37,182 హెక్టార్లలో నారుమడులు, వరి నాట్లు దెబ్బతిన్నాయని పగో జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. 154.46 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం జరిగిందన్నారు. 424 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. 43 గ్రామాలపై ప్రభావం అధికంగా ఉందన్నారు. మూడు పట్టణాల పరిధిలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయని పేర్కొన్నారు. 14 గృహాలు, 66 రహదారులు దెబ్బతిన్నాయన్నారు.

News July 23, 2024

మేమున్నాం.. ప్రజలు ధైర్యంగా ఉండాలి: కలెక్టర్

image

ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ వెట్రిసెల్వి సోమవారం పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వరదల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా 5 కేంద్ర, రాష్ట్ర విపత్తు నివారణ బృందాలు, 12 బోట్లు వివిధ ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో హెలికాప్టర్లు సైతం సిద్ధంగా ఉన్నాయని, ప్రజలంతా ధైర్యంగా ఉండాలన్నారు.

News July 23, 2024

గోస్తని నది గండిని పూడ్చేసిన అధికారులు

image

పాలకోడేరు మండలం మోగల్లు గ్రామంలో గోస్తని నదికి ఆదివారం అర్ధరాత్రి పడిన గండిని అధికారులు సోమవారం సాయంత్రానికి పూడ్చి వేశారు. అర్ధరాత్రి నుంచి గండికి అడ్డుకట్టు వేయడానికి రైతులు, కూలీలు, అధికార యంత్రాంగం ఎంతో కష్టపడింది. గండి పడటంతో సుమారు 500 ఎకరాల పైచిలుకు పూర్తిగా జలమయమై చెరువులను తలపిస్తుంది. రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని అధికారులు హామీ ఇచ్చారు.

News July 23, 2024

ఆసుపత్రుల నిర్మాణ పనులపై ప.గో కలెక్టర్ సమీక్ష

image

పాలకొల్లు, ఆకివీడు ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణ పనులపై సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లతో ప.గో కలెక్టర్ చదలవాడ నాగరాణి సమీక్షించారు. సోమవారం స్థానిక కలెక్టర్ ఛాంబర్ నందు ఆమె మాట్లాడుతూ.. ఆగస్టు 5 నాటికి ఎట్టి పరిస్థితుల్లో పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రి పనులను పూర్తి చేయాలన్నారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆసుపత్రుల నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

News July 22, 2024

గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు కలెక్టర్ సూచనలు

image

భద్రాచలంలో నీటిమట్టం పెరిగిందని, రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయిన నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప.గో కలెక్టర్‌ CH.నాగరాణి సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం వివిధ శాఖల అధికారులతో సమావేశమైన కలెక్టర్.. గోదావరి వరద పరిస్థితిపై సమీక్షించారు. భద్రాచలం నుంచి వదులుతున్న నీటితో వశిష్ట గోదావరి నీటిమట్టం గంట గంటకూ పెరుగుతుందన్నారు. ముంపు బాధితులకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.

News July 22, 2024

ప.గో: కాలువలో స్నానానికి దిగి వ్యక్తి గల్లంతు

image

కాలువలో స్నానానికి దిగి వ్యక్తి గల్లంతైన ఘటన ప.గో జిల్లా యలమంచిలి మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. యలమంచిలి లంక గ్రామానికి చెందిన పి.ఆనందరావు(43) సోమవారం మధ్యాహ్నం నక్కల కాలువ రేవులో స్నానానికి దిగి కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న సిబ్బంది కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. నరసాపురం ఆర్డీవో అచ్యుత్ అంబరీష్, పాలకొల్లు ఫైర్ ఆఫీసర్ జానకీరామ్ పర్యవేక్షించారు.

News July 22, 2024

జగన్‌కు RRR రిక్వస్ట్

image

ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు వైసీపీ అధినేత జగన్‌ను <<13680466>>అసెంబ్లీలో<<>> పలకరించిన విషయం తెలిసిందే. అసెంబ్లీకి రోజూ రావాలని జగన్‌ను కోరానని రఘురామ తెలిపారు. ప్రతిపక్షం సభలో లేకపోతే బాగుండదని చెప్పానన్నారు. దీనికి జగన్ సానుకూలంగా స్పందించారన్నారు.

News July 22, 2024

పోలవరానికి ప్రత్యేక పోలీసులు రాక

image

గోదావరికి వరదలు, కొండ వాగులు విరుచుకుపడుతున్న దృష్ట్యా జిల్లా అధికారులు పోలవరం మండలానికి ప్రత్యేక పోలీసు బలగాలను పంపినట్లు ఎస్సై పవన్ కుమార్ తెలిపారు. ఏజెన్సీ గ్రామాల్లో కొండ వాగులు ప్రవహించే కాజ్‌వేల వద్ద, అఖండ గోదావరి కుడి గట్టు బలహీనంగా ఉన్న ప్రదేశాల్లో వారిని బందోబస్తుగా నియమిస్తామని చెప్పారు. వర్షాల నేపథ్యంలో శిథిలమైన పాఠశాల భవనాలు, పాత ఇళ్ల గురించి వివరాలు తెలుసుకుంటున్నామన్నారు.