India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందల దుర్గేష్ శుక్రవారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాదెండ్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఇరువురు పలు శాఖా పరమైన అంశాలు చర్చించినట్లు తెలిపారు.
ఆకివీడు, ఉండి, పెంటపాడు, గణపవరం, కాళ్ల మండలాలలో ఎకో-సెన్సిటివ్ జోన్ ఖరారుపై జనవరి 6న గ్రామ సభలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. కొల్లేరు అభయారణ్యం చుట్టు ప్రక్కల ఎకో-సెన్సిటివ్ జోన్ ఖరారు చేయడంపై స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ఈ సమావేశాలు ఉంటాయన్నారు. ఆయా మండలాలకు సంబంధించి కొల్లేరు పరిధిలోని ప్రజలు గ్రామసభలకు హాజరై అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు.
శనివారం నుంచి ఏలూరు జిల్లాలో భోజన పథకం ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్నబడి భోజనం’ అనే పేరుతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో ప్రారంభం కాబోతున్నది. దీనికోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో విద్యార్థులు భోజనం చేయడానికి గిన్నెలు, గ్లాసులు, వంట పదార్థాలు సిద్ధం చేశామని ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి ప్రభాకరరావు చెప్పారు. నారాయణపురం కాలేజీలో ఏర్పాట్లను శుక్రవారం ఆయన పర్యవేక్షించారు.
రాజమండ్రిలో జరగబోయే గేమ్ ఛేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేసేందుకు ప.గో జిల్లా మెగా ఫ్యాన్ రెడీ అవుతున్నారు. ఈవెంట్ పాసులు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం లోకల్ లీడర్ల చుట్టూ మెగాభిమానులు, జనసైనికులు ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే అందరికీ పాస్లు అందించలేక నాయకులు తలలు పట్టుకుంటున్నట్లు సమాచారం. ఫ్యాన్స్ భారీగా వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు.
దేవరపల్లి మండలం జాతీయ రహదారిపై బంధపురం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. విజయవాడ నుంచి రాజమహేంద్రవరానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు బంధపురం వద్ద డివైడర్ ఢీకొట్టారు. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో యువకునికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
దేవరపల్లి మండలం గౌరిపట్నం తాలూకా కొండగూడెం 15వ వీధిలో రాపాక నాగార్జున(38) భార్యతో కలిసి నివాసం ఉంటున్నారు. కాగా భార్య మీద అనుమానం, పలుమార్లు ఫోన్ వాడొద్దని చెప్పిన మాట వినకపోవడంతో తీవ్ర అసహనానికి గురై భార్యపై కత్తితో దాడి చేశాడు. స్థానికులు స్పందించి ఆమెను కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దేవరపల్లి పోలీసులు సీఐ, ఎస్సైలు బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు.
సదరం సర్టిఫికెట్ల జారీపై వైద్య బృందాల పరిశీలన కొరకు సూక్ష్మ ప్రణాళిక, రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. గురువారం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి కె.కన్నబాబు, సెర్ఫ్ సిఇవో వీరపాండ్యన్ సదరం సర్టిఫికెట్ల పంపిణీపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం పెరేడ్ గ్రౌండ్లో మూడోరోజు కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలను జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ గురువారం ప్రారంభించారు. 346 మంది అభ్యర్థులు హాజరు కాగా 211 మంది క్వాలిఫై అయినట్లు తెలిపారు. 3, 4వ తేదీలలో మహిళా కానిస్టేబుల్స్కు మహిళ అధికారులతో ప్రత్యేక పోటీ పరీక్షలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సెల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, వాచీలకు అనుమతి లేదన్నారు.
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం దర్భగూడెం సమీపంలో జాతీయ రహదారిపై గురువారం సైకిల్ను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో దర్భగూడెం గ్రామానికి చెందిన పైడి మర్ల సోమిరెడ్డి(70) అక్కడికక్కడే మృతి చెందాడు. రోడ్డు దాటే క్రమంలో లారీ అతివేగంగా రావటంతో ఈ ఘటనా జరిగింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గోవాలో తాడేపల్లిగూడేనికి చెందిన రవితేజ అనే యువకుడు మృతి చెందాడు. అందిన సమాచారం మేరకు.. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా కాలంగూట్ బీచ్ కు వెళ్లారు. ఓ రెస్టారెంట్లో రవితేజ అతని మిత్రుడు సందీప్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు. అయితే వారి వద్ద నుంచి అధిక ధర డిమాండ్ చేయడంతో కుదరదని చెప్పారు. దీంతో రెస్టారెంట్ యాజమాన్యం రవితేజపై దాడికి పాల్పడింది. దెబ్బలు తాళలేక రవితేజ మృతి చెందినట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.