WestGodavari

News December 9, 2024

ప.గో: ’10వ తేది లాస్ట్.. తప్పులుంటే సరి చేసుకోండి’

image

ప.గో జిల్లాలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 10 తరగతి, ఇంటర్ విద్యార్థులు తమ వివరాల్లో తప్పులుంటే సరి చేసుకోవాలని డీఈవో నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. తప్పులు ఉంటే సంబంధింత పత్రాలతో సరిచేసుకోవాలన్నారు. డిసెంబర్ 10తో గడువు ముగుస్తుందన్నారు. జిల్లాలోని ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, ఏఐ కోఆర్డినేటర్లు విద్యార్థులకు ఈ విషయం తెలిసేలా సందేశాలు ఇవ్వాలన్నారు.

News December 8, 2024

జీలుగుమిల్లి: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

అశ్వారావుపేట మండలం నారంవారి గూడెం గ్రామ శివారులో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు ప్రకారం.. జీలుగుమిల్లి మండలం అంకంపాలెంకి చెందిన ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. అటుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారని, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెప్పారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News December 8, 2024

రవాణా శాఖ తనిఖీల్లో 832 కేసులు నమోదు

image

ఏలూరు జిల్లాలో కొనసాగుతున్న రవాణా శాఖ ప్రత్యేక తనిఖీల్లో భాగంగా 832 కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఉప రవాణా కమిషనరు షేక్ కరీమ్ తెలిపారు. డిసెంబరు ఒకటవ తేదీ నుంచి ఈరోజు వరకు వివిధ రకాల వాహనాలపై పలు ఉల్లంఘనలకు గాను 832 కేసులు నమోదు చేసి 14 లక్షల 92 వేల రూపాయల అపరాధ రుసుము విధించామన్నారు. విద్యా సంస్థల బస్సులపై 23 కేసులు నమోదు చేశామన్నారు.

News December 8, 2024

దత్తత పిల్లలకు హాని జరిగితే చర్యలు: కలెక్టర్

image

దత్తత పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైనే ఉంటుందని, దత్తత పిల్లలకు ఎటువంటి హాని జరిగిన శాఖపరమైన చర్యలు తీసుకుంటామని ఏలూరు కలెక్టర్ వెట్రి సెల్వి హెచ్చరించారు. శనివారం తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన పిల్లలు లేని తల్లిదండ్రులకు 7 నెలలు, 13 ఏళ్ల బాలికను కలెక్టర్ చేతుల మీదుగా దత్తత ఇచ్చారు. పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పించాలని దత్తత తీసుకున్న వారికి సూచించారు.

News December 7, 2024

రవాణా శాఖ తనిఖీల్లో 832 కేసులు నమోదు

image

ఏలూరు జిల్లాలో కొనసాగుతున్న రవాణా శాఖ ప్రత్యేక తనిఖీల్లో భాగంగా 832 కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఉప రవాణా కమిషనరు షేక్ కరీమ్ తెలిపారు. డిసెంబరు ఒకటవ తేదీ నుంచి ఈరోజు వరకు వివిధ రకాల వాహనాలపై పలు ఉల్లంఘనలకు గాను 832 కేసులు నమోదు చేసి 14 లక్షల 92 వేల రూపాయల అపరాధ రుసుము విధించామన్నారు. విద్యా సంస్థల బస్సులపై 23 కేసులు నమోదు చేశామన్నారు.

News December 7, 2024

చింతలపూడి: తల్లి మృతితో కుమారుడు సూసైడ్

image

చింతలపూడి(M) వెంకటాద్రి గూడెంలో కృష్ణ బాబు(31) అనే వ్యక్తి శుక్రవారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన కుటుంబీకులు చింతలపూడి ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శనివారం చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. తల్లి మృతితో కృష్ణబాబు 2 నెలల నుంచి మనస్తాపంతో ఉన్నాడన్నారు.

News December 7, 2024

జాతీయ స్థాయి యోగా పోటీలకు తణుకు విద్యార్థుల ఎంపిక

image

ఇటీవల రాజమండ్రిలో సౌత్ జోన్ యోగా ఎంపికల్లో తణుకు ఎస్.కె.ఎస్.డి మహిళా కళాశాల విద్యార్థులు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీ సుందరి బాయ్ తెలిపారు. ఎంపికైన భవానీ ప్రసన్న, నాగలక్ష్మి దుర్గ, జ్యోతి, సౌమ్య నాగవల్లి ఈనెల 24 నుంచి 27 వరకు భువనేశ్వర్ కిట్టి యూనివర్సిటీలో జరిగే జాతీయస్థాయి ఎంపికలకు హాజరవుతారని చెప్పారు. వీరిని కళాశాల సెక్రటరీ చిట్టూరి సత్య ఉషారాణి శుక్రవారం అభినందించారు.

News December 6, 2024

డిసెంబర్ నెలాఖరుకు ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి: ప.గో కలెక్టర్

image

పేదల ఇళ్ల నిర్మాణాలపై జిల్లాలోని అన్ని మండలాల హౌసింగ్ డిఈలు, ఎఈలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పగో జిల్లా కలెక్టర్ నాగరాణి శుక్రవారం సమీక్షించారు. జిల్లాకు కేటాయించిన 3,159 నిర్మాణాల లక్ష్యంలో 1,737 మాత్రమే పూర్తి చేయడం జరిగిందని, ఇంకా పూర్తి చేయవలసిన 1,422 ఇళ్ల నిర్మాణాలను డిసెంబర్ నెలాఖరు నాటికి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

News December 6, 2024

ప.గో: 111 మంది ఉద్యోగుల తొలగింపు

image

ఉమ్మడి ప.గో. జిల్లాలోని 111 మంది కాంట్రాక్టు ఎంపీహెచ్ఏ ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తూ డీఎంహెచ్‌వో శర్మిష్ట గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్హతలున్నప్పటికీ మెరిట్ లేకుండా పొందిన ఉద్యోగ నియామకాలు చెల్లవంటూ హైకోర్టు తీర్పు నిచ్చింది. జీవో 1207ని కొట్టి వేస్తూ ఉద్యోగాలు పొందిన వారు మెరిట్‌ప్రకారం రిక్రూట్ అయిన వారిని కొనసాగించాలని నవంబరు 29న తుదితీర్పులో కోర్టు ఆదేశించింది.

News December 6, 2024

ప.గో: ఇస్త్రీ పెట్టె దొంగలించారు..!

image

పెనుమంట్ర మండలం మార్టేరులో రెడ్డి కళ్యాణమండపం ఎదురుగా ఉన్న పుల్లల షాపులో బుధవారం రాత్రి దొంగతనం జరిగింది. దొంగలు 10 కేజీ, 5 కేజీల తూకం రాళ్లు, ఇస్త్రీ పెట్టి దొంగలించారు. పెనుమంట్ర మండలంలో గత కొంతకాలంగా దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రధానంగా మార్టేరులో మోటార్ సైకిల్ దొంగతనాలు ఎక్కువగా జరుగుతుండటంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు.