WestGodavari

News December 3, 2024

ఏలూరు జిల్లాలో రూ.367.63 కోట్ల ధాన్యం కొనుగోలు

image

ఏలూరు జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఇప్పటివరకు రూ.367.63 కోట్ల విలువైన 159782.960 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 20,959 మంది రైతుల నుండి కోనుగోలు చేశామని జిల్లా పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీలక్ష్మి మంగళవారం తెలిపారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు ప్రక్రియను జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నామన్నారు. సమస్య ఉంటే టోల్ ఫ్రీ నెం.18004256453 కు ఫోన్ చేయాలన్నారు.

News December 3, 2024

పెనుమంట్ర: బైక్‌ను ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి

image

పెనుమంట్ర మండలం మార్టేరులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మార్టేరు నుంచి పెనుగొండ వెళ్లే రోడ్డులో బైక్‌పై వెళుతున్న ఇద్దరు యువకులను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ఒకరు మృతి చెందగా.. గాయాలైన వ్యక్తిని చికిత్స నిమిత్తం స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News December 3, 2024

ఏలూరు: అమ్మాయిని మోసగించిన వ్యక్తికి పదేళ్ల జైలు

image

ఆకివీడు మండలం గుమ్ములూరు చెందిన గండికోట తరుణ్ అనే వ్యక్తి భీమవరం మండలం సీసలి గ్రామానికి చెందిన యువతని ప్రేమ పేరుతో శారీరకంగా కలిసి పెళ్లికి నిరాకరించడంతో 2022 మే10న భీమవరం టూ టౌన్‌లో కేసు నమోదు అయిందని అడిషనల్ పీపీ రామాంజనేయులు తెలిపారు. విన్న వాదనలు విన్న ఏలూరు మహిళా కోర్టు జడ్జ్ రాజేశ్వరి నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.3 వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారని చెప్పారు.

News December 3, 2024

ఉమ్మడి ప.గో. జిల్లాలో రెండు రోజులు మద్యం బంద్

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో MLC ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నేటి సాయంత్రం 4 గంటల నుంచి 5వ తేదీ వరకు పోలింగ్ కేంద్రాల సమీపంలో మద్యం షాపులు మూసి వేయనున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. సోమవారం రాత్రి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల దృష్ట్యా మద్యాన్ని విక్రయిస్తే చట్ట రీత్యా నేరమని హెచ్చరించింది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

News December 3, 2024

టీడీపీలోకి ఏలూరు మాజీ MLA ఆళ్ల నాని?

image

ఏలూరు మాజీ MLA, మాజీ Dy.CM ఆళ్ల నాని నేడు టీడీపీలోకి చేరునున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఆయన సీఎం చంద్రబాబుని కలవనున్న సమాచారం. ఆయనతో చర్చల అనంతరం ఆ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. నాని 3 సార్లు MLA, మంత్రిగా పనిచేశారు.

News December 3, 2024

‘ఉమ్మడి జిల్లాలో మద్యం బంద్’

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ నెల 3వ సాయంత్రం 4 గంటల నుంచి 5వ తేదీ సాయంత్రం వరకు మద్యం షాపులు మూసి వేయనున్నట్లు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ కె.ఎస్.వి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. సోమవారం రాత్రి ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల దృష్ట్యా మధ్య విక్రయిస్తే చట్టరీత్యా నేరమని హెచ్చరించారు.

News December 3, 2024

అర్జీల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం: ప.గో జిల్లా ఎస్పీ

image

పాలకోడేరు మండలం గొల్లలకోడేరులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పాల్గొని ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లా నలుమూలల నుంచి 11 దరఖాస్తులు వచ్చాయన్నారు. వాటిని సంబంధిత పోలీస్ స్టేషన్లకు పంపించి వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

News December 2, 2024

నిడదవోలు: పని ఒత్తిడి తగ్గించాలని పంచాయతీ కార్యదర్శుల వినతి

image

పని ఒత్తిడి తగ్గించాలంటూ నిడదవోలు మండల పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీవో డి. లక్ష్మినారాయణకు వినతి పత్రం అందించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న సర్వేలు, వివిధ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి పని ఒత్తిడి తగ్గించాలని కోరారు.  ఓ పక్క చేయాల్సిన పని, మరోపక్క వరుస వీడియో కాన్ఫరెన్సులు, సమీక్షలతో ఇబ్బందిగా ఉందని అన్నారు. 

News December 2, 2024

డిసెంబర్ నాటికి సీసీ రోడ్లు పూర్తి కావాలి: ఏలూరు కలెక్టర్

image

ఏలూరు జిల్లాలో జరుగుతున్న పల్లె పండుగ పనులపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో నిర్మాణం అవుతున్న సీసీ రోడ్డు పనులు డిసెంబర్ నాటికి పూర్తి కావాలని, 171 పనులకు సంబంధించిన బిల్లులను అప్డేట్ చేయాలని ఎంపీడీవోలకు ఆదేశించారు.

News December 2, 2024

ఉమ్మడి ప.గో. జిల్లాలో 31,185 మంది HIV రోగులు

image

రాష్ట్రంలోని 24 జిల్లాల్లో ఎయిడ్స్ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు ‘ఏపీ సాక్స్’ తెలిపింది. NTR జిల్లాలో అత్యధికంగా 19,865 మంది ఉండగా ప.గో. జిల్లాలో 15,612 ఏలూరు జిల్లాలో 15,573 మంది HIV రోగులు ఉన్నట్లు వెల్లడించింది. ఇక AP ART సెంటర్ల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 2.24లక్షల మంది చికిత్స పొందుతున్నారు. వారికి ప్రతి నెల రూ.4వేలు పింఛను అందిస్తోంది. గడిచిన ఆరు నెలల్లో 8,400 మంది కొత్త HIV కేసులు గుర్తించారు.