WestGodavari

News June 29, 2024

ప.గో: దారికాసి యువకుడిపై రాడ్లతో దాడి

image

దారికాసి మరీ యువకుడిపై ఇనుప రాడ్లతో దాడి చేసిన ఘటన ప.గో జిల్లా తణుకు మండలం కొమరవరంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎం.రామ్మూర్తి శుక్రవారం బైక్‌పై వెళుతుండగా, అదే గ్రామానికి చెందిన ముత్యాల సుబ్బారావు, ముత్యాల సాయి మరికొందరితో కలిసి అడ్డగించారు. వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్లుతో వెంటపడి మరీ కొట్టారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.

News June 28, 2024

‘కల్కి2898 AD’ టీంలో మన ఏలూరు కుర్రోడు

image

రెబల్‌స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి2898 AD’ మూవీలో కీలకమైన బుజ్జి రోబోని డిజైన్ చేసిన సభ్యులలో మన ఏలూరు జిల్లా కుర్రోడు ఒకరవడం విశేషం. చింతలపూడి మండలం బోయగూడెం గ్రామానికి చెందిన రాకేష్ విశాఖపట్టణంలోని గీతం కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ చేశాడు. ప్రస్తుతం హైదరాబాద్ టీహబ్లో వర్క్ చేస్తున్నాడు. కల్కి మూవీలోని రోబో తయారీలో భాగస్వామ్యం అయినందుకు పలువురు అతణ్ని అభినందిస్తున్నారు.
☛ CONGRATS రాకేష్

News June 28, 2024

ప.గో: విషాదం.. పొలంలోనే ప్రాణాలొదిలిన రైతు

image

ప.గో జిల్లా పెనుగొండ మండలం వదలిలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. టి.గంగయ్య(50) అనే రైతు ఉదయం తన పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. కరెంట్ స్తంభం నుంచి తెగిపోయి నీటిలో పడి ఉన్న తీగను గమనించకుండా పొలంలో దిగాడు. షాక్ కొట్టడంతో పొలంలోనే గంగయ్య ప్రాణాలు వదిలాడు. గంగయ్య భార్య చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతోందని స్థానికులు తెలిపారు.

News June 28, 2024

ప.గో: కాటేస్తోన్న ‘కరెంట్’.. ఇప్పటికే 25 మంది మృతి

image

ప్రజల అజాగ్రత్త.. అధికారుల నిర్లక్ష్యం.. కారణాలేవైనా ఉమ్మడి ప.గో.లో విద్యుత్ ప్రమాద మృతుల సంఖ్య పెరుగుతోంది. గురువారం ఒక్కరోజే ఆగిరిపల్లిలో <<13521060>>తల్లీకొడుకు<<>>, తాడేపల్లిగూడెంలో <<13520724>>దంపతులు<<>> మరణించారు. 2022 APR 1 నుంచి దాదాపు 119మంది మృతిచెందారు. 2022-23లో 60 ప్రమాదాలు జరగ్గా 45మంది, 202324లో 58 ఘటనల్లో 49మంది చనిపోయారు. 2024-25లో ఇప్పటికే 49 విద్యుత్ ప్రమాదాలు జరగ్గా.. 25మంది ప్రాణాలొదిలారు.

News June 28, 2024

ప.గో జిల్లా వ్యాప్తంగా వర్షపాతం వివరాలు ఇలా

image

ప.గో జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 42.0 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. నరసాపురంలో అత్యధికంగా 87.0, పాలకొల్లు 72.4, భీమవరం 79.4, ఉండి 68.8 , వీరవాసరం 59.2, పాలకోడేరు 52.2, గణపవరం 46.4, ఆకివీడు 47.4, యలమంచిలి 40.2, కాళ్ల 40.2, పెనుగొండ 38.2, ఆచంట 38.0, పెనుమంట్ర 37.8, పోడూరు 30.4, అత్తిలి 25.2, మొగల్తూరు 24.6, తాడేపల్లిగూడెం 19.4, పెంటపాడు 17.2, ఇరగవరం 16.2, తణుకు 9.4 మిమీ చొప్పున నమోదైంది.

News June 28, 2024

రేపు ఉమ్మడి ప.గో వ్యాప్తంగా జాతీయ లోక్‌ అదాలత్

image

ఉమ్మడి ప.గో జిల్లాలోని అన్ని కోర్టులో ఈనెల 29న జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.పురుషోత్తమకుమార్‌ తెలిపారు. ఈ లోక్‌ అదాలత్‌లో ప్రామిసరీ నోటు దావాలు, ఆస్తి దావాలు, తనఖా, మోటారు వాహన ప్రమాద కేసులు, కార్మిక వివాదాలు, చిట్‌ఫండ్‌ సంబంధిత, ఆర్బిటేషన్‌ కింద రికవరీ కేసులు పరిష్కరిస్తామన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News June 28, 2024

భీమవరం: RTC బస్సు ఢీకొని బీటెక్ స్టూడెంట్‌ మృతి

image

భీమవరం మండలం తుందుర్రు గ్రామానికి చెందిన కోయ రాజేంద్రరామ్(20) రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు రామ్ భీమవరం నుంచి తుందుర్రు వెళ్తుండగా.. తాడేరు వద్ద ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీకొట్టడంతో మృతి చెందాడని స్థానికులు తెలిపారు. మృతుడి తమ్ముడికి తీవ్ర గాయాలు కావడంతో భీమవరంలోని ఆసుపత్రికి తరలించారు. దీనిపై భీమరం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News June 28, 2024

నిడదవోలు: సమన్వయంతో పనిచేయాలి: మంత్రి దుర్గేష్

image

ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకాన్ని లబ్ధిదారులైన పేదలకు అందించడంలో అధికారులు కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండల పరిషత్ కార్యాలయం వద్ద మండల స్థాయి అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులతో కలిసి అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.

News June 28, 2024

ఇరిగేషన్ అంశాలపై మంత్రి నిమ్మల చర్చ

image

గుంటూరు జిల్లా వెలగపూడి సచివాలయంలో ఇరిగేషన్ అంశాలపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర ఆర్థిక మంత్రి పి.కేశవ్‌తో కలిసి గురువారం చర్చించారు. ఈ వారంలో ప్రపంచ బ్యాంకు బృందం పోలవరం పర్యటన, నిర్వాసితుల సమస్యల నేపథ్యంలో చర్చలు సాగాయి. చర్చల్లో జలవనరుల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, జలవనరుల శాఖ సలహాదారులు వెంకటేశ్వరరావు, చీఫ్ ఇంజినీర్ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

News June 27, 2024

ఏలూరు: మరో విషాదం.. కరెంట్ షాక్‌తో తల్లీకొడుకు మృతి

image

ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలో గురువారం విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన దొండపాటి నాగరత్నం (60), ఆమె కొడుకు దొండపాటి రామదాసు విద్యుత్ షాక్‌కు గురై చనిపోయారు. దుస్తులు ఆరేస్తుండగా విద్యుత్ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. దీంతో మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా ప.గో. జిల్లా తాడేపల్లిగూడెంలో ఈ రోజు కరెంట్ షాక్‌తో భార్యాభర్తలు చనిపోయిన విషయం తెలిసిందే.