Y.S.R. Cuddapah

News September 13, 2024

స్వచ్ఛ భారత్ లక్ష్యం కోసం.. చిత్తశుద్ధితో పనిచేయాలి: కలెక్టర్

image

స్వచ్ఛ భారత్ లక్ష్యం కోసం చిత్తశుద్ధితో పనిచేసి కడపను రాష్ట్రంలోనే ఆదర్శ స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ శివశంకర్ అధికారులను ఆదేశించారు. గురువారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌పై సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగం మున్సిపాలిటీలు, పంచాయతీలతో చేపడుతున్న పారిశుధ్య నిర్వహణ చర్యలు చేపట్టాలన్నారు.

News September 12, 2024

కడప: విధులలో నిర్లక్ష్యం.. ఇద్దరు సస్పెన్షన్

image

కడప జిల్లాలోని తాళ్ల ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ విధుల్లో నిర్లక్ష్యం వహించి క్రమశిక్షణ ఉల్లంఘించిన వ్యవహారంపై జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు విచారణ చేపట్టారు. ప్రాధమిక విచారణ అనంతరం హెడ్ కానిస్టేబుల్ జి వెంకటేశ్వర్లు (హెచ్.సి 1379), కానిస్టేబుల్ సి.జి గంగాధర్ బాబు (పి.సి 563)లను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.

News September 12, 2024

కడప పోలీస్ శిక్షణ కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

image

నగర శివార్లలోని జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రాన్ని గురువారం జిల్లా SP హర్షవర్ధన్ రాజు తనిఖీ చేశారు. శిక్షణా కేంద్రంలో పోలీస్ సిబ్బందికి ఎలాంటి కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారో, సిబ్బందికి శిక్షణ ఇచ్చే ఫ్యాకల్టీ వివరాలు DTC ఇన్స్పెక్టర్ వినయ్ కుమార్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కంప్యూటర్ ల్యాబ్, ప్రిన్సిపల్ కార్యాలయం, పెరేడ్ గ్రౌండ్, జిమ్, తరగతి గదులను పరిశీలించారు.

News September 12, 2024

పోరుమామిళ్ల పోలీస్ స్టేషను తనిఖీ చేసిన డీఐజీ

image

పోరుమామిళ్ల పోలీస్ స్టేషను కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. స్టేషన్లోని రికార్డులను ఆయన తనిఖీ చేశారు. సర్కిల్ పరిధిలోని క్రైమ్ రిపోర్ట్ గురించి సీఐని అడిగి తెలుసుకున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. పోలీసులకు ఆయన పలు సూచనలు చేశారు.

News September 12, 2024

పోరుమామిళ్ల పోలీస్ స్టేషను తనిఖీ చేసిన డీఐజీ

image

పోరుమామిళ్ల పోలీస్ స్టేషను కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. స్టేషన్లోని రికార్డులను ఆయన తనిఖీ చేశారు. సర్కిల్ పరిధిలోని క్రైమ్ రిపోర్ట్ గురించి సీఐని అడిగి తెలుసుకున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. పోలీసులకు ఆయన పలు సూచనలు చేశారు.

News September 12, 2024

దేవుని కడపలో ఈ నెల 15 నుంచి ఉత్సవాలు

image

తిరుమలకు తొలిగడపగా పేరున్న దేవునికడప శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 15వ తేదీ నుంచి దోష పరిహార ఉత్సవాలు జరగనున్నాయి. ఏడాది పాటు ఆలయంలో పఠనోత్సవాలు సందర్భంగా జరిగిన దోషాల పరిహారం కోసం ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 15న తొలి రోజున ఆదివారం అంకురార్పణ, పవిత్రాల ప్రతిష్ఠ, 16న సమర్పణ, 17న ముగింపు ఉత్సవాలు నిర్వహించనున్నారు.

News September 12, 2024

సైకో ఐడియాలు జగన్‌కే వస్తాయి: బీటెక్ రవి

image

గతంలో చంద్రబాబు నివాసాన్ని ముంచేందుకు ప్రకాశం బ్యారేజీ వద్ద బోటును అడ్డువేశారు. ఇప్పుడు ఏకంగా బ్యారేజీనే పగలకొట్టడానికి YS జగన్ ప్రయత్నించాడని బీటెక్ రవి X వేదికగా ఆరోపించారు. ఇటువంటి సైకో ఐడియాలు జగన్‌కే వస్తాయని విమర్శించారు. ‘బ్యారేజీని ఢీకొట్టిన మూడు పడవలు YCP నేతలవి కావడం ఒక రుజువు అయితే.. గతంలో చంద్రబాబు నివాసాన్ని ముంచేందుకు జగన్ ఇలాగే బోటును అడ్డు వేయించాడు.’ అని పోస్ట్ చేశారు.

News September 12, 2024

గణేశ్ మండపంలోకి చెప్పులతో మాజీ ఎమ్మెల్యే

image

మాజీ ఎమ్మెల్యే ఆంజాద్ బాషా చెప్పులు వేసుకుని గణేశ్ మండపంలో వినాయకుడి విగ్రహం ముందు ఫొటోలు దిగడం కడప నగరంలో కలకలం రేపింది. ఆయన కడప మేయర్ సురేశ్ బాబుతో కలిసి మంగళవారం 25వ డివిజన్ రాధాకృష్ణనగర్‌లోని గణేశ్ మండపానికి వచ్చారు. పూజల అనంతరం అక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్ సూర్యనారాయణ, వైసీపీ నాయకులతో కలిసి చెప్పులు వేసుకుని ఫొటోలు దిగారు. దీనిపై హిందూ సంఘాలు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

News September 12, 2024

కడప: వృత్తి ధర్మాన్ని బాధ్యతాయుతంగా నిర్వర్తించాలి

image

వృత్తి ధర్మాన్ని బాధ్యతాయుతంగా నిర్వర్తించడంతోపాటు మన ప్రాణాలకు ముప్పు రాకుండా విధి నిర్వహణను బాధ్యతను నిర్వర్తించాలని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జిల్లా అటవీ శాఖ అధికారి సందీప్ రెడ్డి సంయుక్తంగా పేర్కొన్నారు. జాతీయ అటవీశాఖ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా కడపలో కార్యక్రమం నిర్వహించారు. అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు.

News September 11, 2024

కడప: LLB తొలి సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలోని లా కళాశాలల్లో చదువుతున్న ఐదేళ్ల LLB మొదటి సెమిస్టర్, మూడేళ్ల LLB మొదటి సెమిస్టర్ ఫలితాలను ఉపకులపతి ఆచార్య కె. కృష్ణారెడ్డి, కుల సచివులు ఆచార్య ఎస్ రఘునాథ్ రెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య ఎన్. ఈశ్వర్ రెడ్డితో కలసి విడుదల చేశారు. తక్కువ కాలంలోనే ఫలితాలు విడుదలకు కృషి చేసిన పరీక్షల విభాగాన్ని వీసీ అభినందించారు.