India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
యోగి వేమన విశ్వవిద్యాలయంలో బుధవారం ఉదయం విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. విద్యార్థుల ఘర్షణకు లవ్ లెటర్ కారణమని తెలుస్తోంది. వివరాలలోకి వెళితే.. కళాశాలలో ఇంటిగ్రేటెడ్ కోర్స్ విద్యార్థిని మైక్రో బయాలజీ విద్యార్థులు తీవ్రంగా కొట్టినట్లు తెలుస్తోంది. దెబ్బలు తిన్న విద్యార్థి బంధువులను పిలిపించి గాయపరిచిన వారిపై దాడి చేసే సందర్భంలో వారు యూనివర్సిటీ గెస్ట్ హౌస్లో తల దాచుకున్నారని సమాచారం.
కడప నగరంలోని కలెక్టరేట్ ముందు సోమవారం గ్రీవెన్స్ సమయంలో ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన స్టాఫ్ నర్స్ బి.చిన్నమ్మపై మంగళవారం కడప వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నమ్మ తనను డాక్టర్ చెన్నకృష్ణ ప్రేమ పెళ్లి చేసుకుని మోసం చేశాడని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. ఈ క్రమంలోనే బలవన్మరణానికి ప్రయత్నం చేసినందుకు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సింహాద్రిపురం ఒంటి కన్నుతో మేక పిల్ల పుట్టడంతో స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి తిలకిస్తున్నారు. మంగళవారం మండలంలోని గురజాల గ్రామానికి చెందిన కొమ్మెర శ్రీనివాసులుకు సంబంధించిన ఓ మేక రెండు పిల్లలకు జన్మనిచ్చింది. ఇందులో ఒక పిల్లకు నుదుటన ఒకే కన్ను ఉంది. మరో పిల్ల రెండు కళ్లతో సాధారణంగా జన్మించింది. రెండు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయని చెప్పారు. జన్యుపరమైన లోపంతో ఒక కన్నుతో పుట్టిందని తెలిపారు.
వల్లూరు ఏపీ మోడల్ స్కూల్ కం జూనియర్ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినిలు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ సురేశ్ బాబు తెలిపారు. ఎస్జీఎఫ్ అండర్-19 జిల్లా స్థాయి పోటీల్లో భాగంగా పులివెందులలో మంగళవారం నిర్వహించిన బాలికల విభాగం ఖోఖో పోటీల్లో కళాశాలకు చెందిన ఇంటర్ సెకండీయర్ ఎంపీసీ విద్యార్థిని మమత, ఇంటర్ సెకండీయర్ బైపీసీ విద్యార్థిని ముబీన ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
కోనసీమలో ఈ నెల 14,15వ తేదీలలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు కడప జిల్లా తరఫున ఇడుపులపాయ IIIT విద్యార్థులు ఎంపికయ్యారు. మొత్తం 7 మంది అమ్మాయిలు, 5 మంది అబ్బాయిలు ఎంపికైన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వారిని ట్రిపుల్ఐటీ సంచాలకులు డా. కుమారస్వామి గుప్తా అభినందించారు. కార్యక్రమంలో పవర్ లిఫ్టింగ్ కోచ్ డా.బాల్ గోవింద్ తివారి తదితరులు పాల్గొన్నారు.
కామర్స్ కోర్సు చదివిన వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని, అయితే ప్రభావంతంగా కోర్సు పూర్తి చేయాలని యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె. కృష్ణారెడ్డి తెలిపారు. బీకాం ఆనర్స్ కోర్సును ఆచార్య కె.కృష్ణారెడ్డి, కులసచివులు ఆచార్య ఎస్.రఘునాథ్రెడ్డితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. సమావేశంలో వైస్ ప్రిన్సిపల్ ఆచార్య పద్మ, విభాగ అధిపతి ఆచార్య విజయభారతి పాల్గొన్నారు.
అల్పపీడనం కారణంగా జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. కమలపురం, మైదుకూరులలో అత్యధికంగా 8.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గోపవరంలో 7.8, వేములలో 7, బద్వేల్ 6.8, పొద్దుటూరు, జమ్మలమడుగు, మీ.మీలో 6.2, ఖాజీపేట, చాపాడులలో 6, కడపలో 5.4, చక్రాయపేటలో 5, దువ్వూరులో 4.8, బి.మఠంలో 3.6, బి.కోడూరులో 3.4, వల్లూరులో 3.2, సిద్దవటం3, ఆట్లూరు 2, సీకేదిన్నె1.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది
కడప రూరల్ సబ్ రిజిస్టర్గా విధులు నిర్వహిస్తున్న సుందరేశన్ను ఉన్నతాధికారులు సస్పండ్ చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సీనియర్ అసిస్టెంట్గా పంపారు. ఇటీవల కడపకు బదిలీ చేశారు. గతంలో ఇక్కడ జరిగిన కొన్ని రిజిస్ట్రేషన్లపై తీవ్ర స్థాయిలో ఆరరోపణలు రావడంతో చర్యలు తీసుకున్నారు. దీనిపై జిల్లా రిజిస్ట్రార్ మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్లలో తప్పిదాలకు కారణమైనందున సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి విశేష స్పందన, సత్వర పరిష్కారం లభించింది. సోమవారం ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు కలెక్టర్ శివశంకర్ లోతేటి నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం ఏడుగురు మంది ఫోన్ ద్వారా తమ సమస్యలను విన్నవించారు. ఫిర్యాదులకు సంబంధించిన శాఖల అధికారులతో వెంటనే మాట్లాడి తక్షణమే చర్యలు తీసుకోవాలని కడప ఇన్ఛార్జ్ ఆర్డీఓ వెంకటపతి ఆదేశించారు.
కడప రిమ్స్లో పనిచేసే మహిళను వైద్యశాఖలో పనిచేస్తున్న కృష్ణ 11ఏళ్ల క్రితం పెళ్లి కాలేదని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత మొదటి భార్య దగ్గరకు వెళ్లిపోయాడు. బాధితురాలు సోమవారం కలెక్టరేట్ ముందు విషద్రావకం తాగడంతో పోలీసులు ఆసుప్రతికి తరలించారు. కృష్ణ గతంలో దాడి చేశారని చిన్న చౌక్ పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆమె ఆరోపించింది. కాగా కృష్ణ అన్నమయ్యలో డిప్యూటీ డీఎంహెచ్వోగా పని చేస్తున్నాడు.
Sorry, no posts matched your criteria.