Y.S.R. Cuddapah

News August 11, 2025

కడప జిల్లాలో AMCల వసూళ్లు రూ.11.99 కోట్లు

image

కడప జిల్లాలోని 10 AMCలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.11.99 కోట్లు ఆదాయాన్ని ఆర్జించాయి. కడప AMC నుంచి రూ.1.61 కోట్లు, ప్రొద్దుటూరు రూ.1.74 కోట్లు, బద్వేల్ రూ.2.05 కోట్లు, జమ్మలమడుగు రూ.1.04 కోట్లు, పులివెందుల రూ.98 లక్షలు ఆదాయం వచ్చింది. మైదుకూరు రూ.2.26 కోట్లు, కమలాపురం రూ.86.80 లక్షలు, సిద్దవటం రూ.28.20 లక్షలు, ఎర్రగుంట్ల రూ.71.83 లక్షలు, సింహాద్రిపురం రూ.16.78 లక్షలు ఆదాయాన్ని ఆర్జించాయి.

News August 11, 2025

కోడ్ ఉల్లంఘించారా.. తాట తీస్తాం: ఎస్పీ

image

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రచారం ముగియడంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే తాట తీస్తామని ఎస్పీ అశోక్ కుమార్ హెచ్చరించారు. నాయకులు ఎవరూ గ్రామాల్లో తిరగరాదని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. 12వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు.

News August 11, 2025

జిల్లాలో కళకళలాడుతున్న జలాశయాలు

image

భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని జలాశయాలు నీటినిల్వతో కళకళ లాడుతున్నాయి. శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను కడప జిల్లాకు వదులుతున్నారు. దీంతో ప్రస్తుతం గండికోటలో 18.57 TMCలు, మైలవరంలో 5.48, బ్రహ్మసాగర్‌లో 6.32, బద్వేల్ ట్యాంక్‌లో 0.01, CBCలో 4.41, పైడిపాలెం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో 4.46, సర్వరాజ సాగర్లో 1, వామికొండ సాగర్లో 0.79, బుగ్గవంకలో 0.04 TMCల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

News August 10, 2025

ZPTC ఉప ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

ఆగస్టు 12న పులివెందుల, ఒంటిమిట్టలో ZPTC ఉప ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఆదివారం కడపలో వారు మాట్లాడారు. క్రిటికల్ స్టేషన్లలో సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్లు ఏర్పాటు చేశామన్నారు. 13 చెక్‌పోస్టులు, డ్రోన్లు, వజ్రా వెహికల్స్‌తో భద్రత కల్పించామన్నారు. హింసాత్మక చర్యలపై చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.

News August 10, 2025

కడప: నేటితో ఉప ఎన్నికల ప్రచారం క్లోజ్.!

image

పులివెందుల, ఒంటిమిట్టలో జరగనున్న ZPTC ఉప ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. సాయంత్రం 5 గంటల వరకు జెడ్పీటీసీ బైపోల్‌ ప్రచారం చేయనున్నారు. సా.5 గంటల తర్వాత స్థానికేతరులపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఇప్పటికే హోరాహోరీగా టీడీపీ, వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించగా ఒంటిమిట్టలో 11, పులివెందులలో 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పులివెందులలో అదనపు బలగాలతో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.

News August 10, 2025

కడప: రేపు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యలు రద్దు.!

image

కడప జిల్లాలోని ఒంటిమిట్ట, పులివెందుల జడ్టీటీసీ ఉపఎన్నికలు త్వరలో జరగనున్నాయి. దీంతో సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న మీకోసం, ప్రజా సమస్యల పరిష్కారం కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. కావున అర్జీదారులు కలెక్టరేట్‌కు రావద్దని అధికారులు వెల్లడించారు.

News August 10, 2025

పులివెందుల ఉపఎన్నికపై వైసీపీ నేతల భేటీ

image

పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక నేపథ్యంలో వైసీపీ కీలక నేతలు కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని పులివెందులలో కలిశారు. ఈనెల 12న జరగనున్న పోలింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు, పోలింగ్ రోజున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. పోలింగ్ శాతాన్ని పెంచేలా కార్యకర్తలు కృషి చేయాలని అవినాశ్ రెడ్డి సూచించారు.

News August 9, 2025

ప్రజలకు కడప ఎస్పీ హెచ్చరిక

image

సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అశోక్ కుమార్ శనివారం తెలిపారు. ఏపీకే ఫైల్స్ క్లిక్ చేస్తే వాట్సప్ కూడా హ్యాక్ కావొచ్చని, ఫోన్ హ్యాక్ అయితే మోసపోతామని చెప్పారు. ప్లే స్టోర్‌ తప్ప ఇతర వేదికల నుంచి యాప్స్ డౌన్లోడ్ చేసుకోవద్దని సూచించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

News August 8, 2025

మర్రిపాడు వద్ద ప్రమాదం.. యువకుడి మృతి

image

బద్వేల్‌కు చెందిన వ్యక్తి మర్రిపాడు వద్ద మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే.. బద్వేల్‌లోని సుమిత్రా నగర్‌లో ఉండే మహమ్మద్, ఆకాశ్ పిల్లలను స్కూల్‌లో చేర్పించేందుకు బద్వేల్ నుంచి నెల్లూరు వెళ్లారు. తిరిగి బద్వేల్ వస్తుండగా మర్రిపాడు వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో మహమ్మద్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆకాశ్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

News August 8, 2025

కడప జిల్లాలో 10 AMCల్లో.. రైతులకు ఉపయోగంలో ఉండేవి నాలుగే.!

image

జిల్లాలో 10 వ్యవసాయ మార్కెట్ కమిటీలున్నాయి. ఇందులో కేవలం 4 మాత్రమే రైతులకు ఉపయోగంలో ఉన్నాయి. కడప యార్డులో సీజన్లో మాత్రమే ముడి పసుపు ట్రేడింగ్ జరుగుతుంది. మైదుకూరు యార్డులో మంగళవారం రోజు పశువుల సంత నిర్వహిస్తారు. పులివెందుల యార్డులో గురువారం పశువుల మార్కెట్ జరుగుతుంది. ఇక్కడ సీజన్లో బత్తాయి ట్రేడింగ్ జరుగుతుంది. ముద్దనూరు యార్డులో మాత్రమే రైతులు ప్రతిరోజూ ఆకుకూరలు కూరగాయలు అమ్ముకుంటారు.