India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో పలు ప్రాంతాలలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ జిల్లాల దొంగలను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. తాళాలు వేసిన ఇల్లు, బంగారు దుకాణాలను వీళ్లు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతుండే వారని పోలీసులు తెలిపారు. ఈ నిందితులు మైదుకూరు డివిజన్లో ఎక్కువగా చోరీలు చేసినట్లు చెప్పారు. అర కేజీ బంగారం, 10 కేజీలు వెండి ఆభరణాలు, ఒక స్కూటర్ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.
కడప జిల్లాలో 3,334 మగ్గాలకు విద్యుత్ సర్వీసులు ఉన్నాయి. డివిజన్ల వారీగా..
కడపలో 929, మైదుకూరులో 935, ప్రొద్దుటూరులో 1,364, పులివెందులలో 106 సర్వీసులు ఉన్నాయి.
అలాగే జిల్లాలో 10 HPలో ఉన్న పవర్ లూమ్స్ సర్వీసులు 203 మాత్రమే ఉన్నాయి. అవి కూడా ప్రొద్దుటూరు డివిజన్లోనే ఉన్నాయి. నేటి నుంచి ఈ హ్యాండ్లూమ్స్కు 200, పవర్ లూమ్స్కు 500 యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. నల్లగొండవారిపల్లెలో ప్రచారానికి వెళ్లిన వైసీపీ ఎమ్మెల్సీ రమేశ్, రాముపై దాడి జరిగింది. ఈ ఘటనలో వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి. దీంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. వైసీపీ నేత రాము ఫిర్యాదుతో 25 మందిపై హత్యాయత్నం కేసు ఫైల్ చేశారు. బీటెక్ రవి తమ్ముడు భరత్ రెడ్డిపైనా కేసు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.
ఇటీవల కాలంలో సైబర్ మోసాలు అధికమయ్యాయని, వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. సైబర్ నేరగాళ్లు విభిన్న రకాలుగా ప్రజలను మోసగించడానికి ప్రయత్నిస్తుంటారన్నారు. వాట్సప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం వంటి సామాజిక మాధ్యమాల్లో తెలియని వ్యక్తులు పంపే లింకులు క్లిక్ చేయరాదని సూచించారు. ఎవరికీ ఓటీపీ చెప్పవద్దన్నారు.
పులివెందుల ZPTC ఉపఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ప్రచారంలో TDP, YCP నాయకులు పరస్పర దాడులు చేసుకున్నారు. కావాలనే వైసీపీ కవ్విస్తోందని TDP ఆరోపిస్తోంది. ఓటర్లను భయపెట్టడానికే టీడీపీ దాడులు చేస్తోందని YCP అంటోంది. నిన్న ఆ పార్టీ నాయకులు ర్యాలీగా వెళ్లి పులివెందుల DSPకి ఫిర్యాదు చేశారు. ‘దయచేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపండి’ అంటూ కడప MP అవినాశ్ రెడ్డి పోలీసులకు దండం పెట్టగా.. ఈ ఫొటో వైరలవుతోంది.
ప్రొద్దుటూరు డివిజన్ పరిధిలోని విద్యుత్ కేంద్రాలు గత నెలలో 136.95MU విద్యుత్ ఉత్పత్తి చేశాయి. విండ్ పవర్ 79.298 MU, సోలార్ పవర్ 57.64 MU విద్యుత్ ఉత్పత్తి చేశాయి. హెట్రో విండ్ 41.88 MU, అనిమెల విండ్ 37.41 MU, అదానీ సోలార్ 37.41 MU, సోలైరెప్రో సోలార్ 18.118 MU, యశ్వంత్ సోలార్ 0.089 MU విద్యుత్ను ఉత్పత్తి చేశాయి. ప్రభుత్వ రంగంలోని RTPPలో 658.14MU విద్యుత్ ఉత్పత్తి జరిగింది.
కడప జిల్లాలో CIలను బదిలీ చేస్తూ కర్నూల్ DIG కోయ ప్రవీణ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొద్దుటూరు ట్రాఫిక్కు రాజగోపాల్, కడప VRకు సుబ్బారావు, కృష్ణయ్యలను బదిలీ చేశారు. జమ్మలమడుగు అర్బన్కు నరేష్ బాబు, రూరల్కు భాస్కరరెడ్డి, బద్వేల్కు లింగప్ప, ఎర్రగుంట్లకు విశ్వనాథరెడ్డి, కొండాపురానికి రాజు, కడప సైబర్ సెల్కు సురేష్ రెడ్డిలను బదిలీ చేశారు. తక్షణమే ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.
కడప జిల్లాలో ఈ నెల 12న పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంపై ఎస్పీ అశోక్ కుమార్ అత్యాధునిక డ్రోన్ కెమెరా ద్వారా నిఘా పెంచారు. పులివెందుల మండలంలోని ఆర్.తుమ్మలపల్లి, నల్లపురెడ్డి పల్లి, రాగిమాని పల్లి, రాయలాపురం ప్రాంతాల్లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంపై డ్రోన్ కెమెరా ద్వారా పర్యవేక్షించారు. అభ్యర్థులు చేస్తున్న ప్రచారం ప్రశాంత వాతావరణంలో జరగాలన్నారు.
కానిస్టేబుల్ ఉద్యోగాల ఫలితాల్లో కడప పరిధిలోని అరుందతి నగర్కు చెందిన అన్నాచెల్లెళ్లు మధుమోహన్, లలితాదేవిలు సత్తా చాటారు. వారధి ఓబులేసు, రామలక్షుమ్మల ఇద్దరు సంతానం కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఒకే కుటుంబంలోని అన్నాచెల్లెళ్లకు పోలీస్ జాబ్స్ రావడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. కాగా కడప ఆకాశవాణిలో మధు మోహన్ క్యాజువల్ అనౌన్సర్గా, లలితాదేవి యువవాణి కాంపియర్గా పనిచేస్తూ ప్రిపేర్ అయ్యారు.
మైదుకూరు ప్రాంతంలో పండించే కృష్ణాపురం ఉల్లికి అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉంది. KP ఉల్లిలో ఔషధ గుణాలు ఉండడంతో వాటి తయారీ కంపెనీలు మాత్రమే వీటిని కొనుగోలు చేస్తున్నాయి. అయితే కొనుగోళ్లు లేనప్పుడు, ధరలు తగ్గినప్పుడు KPఉల్లిని నిల్వ ఉంచే NAFED గోడౌన్లు ఇక్కడ లేవు. దీంతో రైతులు నష్టపోతున్నారు. ఇక్కడ గోడౌన్ల నిర్మాణానికి NAFED ముందుకు రావడంతో KPఉల్లి రైతులకు మేలు కలుగుతుందని ఆశిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.