India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పుణ్యక్షేత్రమైన గండిలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో బుధవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆలయ సహాయ కమిషనర్ వెంకటసుబ్బయ్య తెలిపారు. కడప దేవాదాయశాఖ సూపరింటెండెంట్ రమణమ్మ పర్యవేక్షణలో 55 రోజులుగా భక్తులు స్వామివారికి హుండీల ద్వారా సమర్పించిన కానుకలను లెక్కించినట్లు తెలిపారు. 7 శాశ్వత హుండీల ద్వారా రూ. 36,48,364, అన్నప్రసాద వితరణ హుండీ ద్వారా రూ. 62,317ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు.
కడప జిల్లా గువ్వల చెరువు ఘాటు రోడ్డులో బుధవారం ప్రమాదం చోటు చేసుకుంది. గువ్వల చెరువు ఘాటు మూడవ మలుపు వద్ద బీర్ బాటిళ్ల లారీ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. అటుగా వెళ్తున్న ప్రయాణికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షకు సంబంధించి దరఖాస్తు గడువును సెప్టెంబర్ 17వ తేదీ వరకు పొడిగించినట్లు డీఈవో అనురాధ తెలిపారు. డిసెంబర్ 8వ తేదీన నిర్వహించే ఈ పరీక్ష కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్లో అప్లికేషన్ ప్రభుత్వ పరీక్షల కార్యాలయ వెబ్సైట్ www.bse.ap.gov.inలో అందుబాటులో ఉందని తెలిపారు.
సోమవారం YSR వర్ధంతి సందర్భంగా జగన్ ఇడుపులపాయలో తన తండ్రికి నివాళులర్పించిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో గుంటూరు రేంజ్ వీఆర్లో పనిచేస్తున్న సీఐ వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. కృష్ణా గుంటూరు జిల్లాలో సీఎం, మంత్రులు, అధికారులు సహాయక చర్యల్లో ఉంటే ఈ సీఐ మాత్రం జగన్ వెంట ఉన్నారని విమర్శిస్తున్నాయి. ఒక YCP కార్యకర్తగా సీఐ ఉండటం సిగ్గుచేటని ఆగ్రహిస్తున్నాయి.
కడప జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికి నాణ్యమైన మధ్యాహ్నం భోజనం అందించాలని, కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ మంగళవారం అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో మధ్యాహ్న భోజనం ప్రభుత్వ పాఠశాలలో తీసుకోవాల్సిన చర్యలపై, విద్యాశాఖ అధికారులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వ్యాయామ ఉపాధ్యాయులతో ఆయన సమావేశం నిర్వహించారు.
పర్యావరణానికి ఎలాంటి అంతరాయం లేకుండా నిబంధనలకు లోబడి కడప ఏరోడ్రమ్ అభివృద్ధి పనులను చేపట్టేందుకు, చర్యలు తీసుకుంటున్నట్లు కడప జిల్లా కలెక్టర్ ఏరోడ్రమ్ కమిటీ చైర్మన్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. కడప విమానాశ్రయం టర్మినల్ బిల్డింగ్లో ఏరోడ్రమ్, ఎయిర్ ఫీల్డ్ ఇన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కమిటీల సమావేశం జరిగింది. దీంతో విమానాశ్రయ అభివృద్ధికి కృషి చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రెవెన్యూ సదస్సుల నిర్వహణ గ్రామాల్లో ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న భూసమస్యల పరిష్కారానికి ఓ చక్కటి అవకాశమని కలెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ పిజిఆర్ఎస్ హాలులో ప్రభుత్వం అమలు చేస్తున్న రెవెన్యూ సదస్సుల ప్రణాళిక, కార్యాచరణపై ఎంఎల్ఏ వరదరాజులు రెడ్డి, జేసీ అదితి సింగ్, డిఆర్వో గంగాధర్ గౌడ్తో కలిసి సమావేశం నిర్వహించారు.
కడప జిల్లా పోలీసు శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పని చేస్తున్న 261 పోలీసు సిబ్బందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 44 మంది ఏఎస్సైలు, 91 హెడ్ కానిస్టేబుల్, 124 మంది కానిస్టేబుల్స్ను బదిలీ చేశారు. వెంటనే సంబంధిత స్టేషన్లలో రిపోర్టు చేయాలని ఎస్పీ ఆదేశించారు.
కడప జిల్లా పోలీసు శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పని చేస్తున్న 261 పోలీసు సిబ్బందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 44 మంది ఏఎస్సైలు, 91 హెడ్ కానిస్టేబుల్, 124 మంది కానిస్టేబుల్స్ను బదిలీ చేశారు. వెంటనే సంబంధిత స్టేషన్లలో రిపోర్టు చేయాలని ఎస్పీ ఆదేశించారు.
కడప జిల్లా పోలీసు శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పని చేస్తున్న 261 పోలీసు సిబ్బందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 44 మంది ఏఎస్సైలు, 91 హెడ్ కానిస్టేబుల్, 124 మంది కానిస్టేబుల్స్ను బదిలీ చేశారు. వెంటనే సంబంధిత స్టేషన్లలో రిపోర్టు చేయాలని ఎస్పీ ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.