Y.S.R. Cuddapah

News August 27, 2024

తెలుగు భాషా దినోత్సవ వేడుకలను జయప్రదం చేయాలి: కలెక్టర్

image

ఈనెల 29న కలమల్లలో తెలుగు భాషా దినోత్సవ జిల్లాస్థాయి వేడుకలు జయప్రదం చేయాలని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి పిలుపునిచ్చారు. కడప కలెక్టర్ కార్యాలయంలో ఈ వేడుకలకు సంబంధించి సమావేశం నిర్వహించారు. జిల్లాలో తొలి తెలుగు శాసనాలు అభ్యమైన కలమల్ల గ్రామంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించున్న, తెలుగు భాషా దినోత్సవ వేడుకలను ఎలాంటి కొరత లేకుండా జయప్రదం చేయాలన్నారు.

News August 27, 2024

రాజంపేట: తేలుకాటుకు పది సంవత్సరాల విద్యార్థి మృతి

image

రాజంపేట మండలం తొగురుపేటకు చెందిన పత్తూరు హేమంత్ అనే పది సంవత్సరాల విద్యార్థి తేలుకాటుతో మృతి చెందారు. రాజంపేట మన్నూరులో ఒక ప్రైవేట్ స్కూల్లో మూడవ తరగతి చదువుతున్న విద్యార్థికి తన ఇంటిలో తేలు కుట్టడంతో హుటాహుటిన రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. వారు కడప రిమ్స్‌కు రెఫర్ చేశారు. రిమ్స్‌లో వైద్యం తీసుకుంటూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు.

News August 27, 2024

ఒక న్యూస్ చదివాను.. చాలా బాధేసింది: వాసు

image

ఒక న్యూస్ చదివాను, చాలా బాధేసింది అంటూ TDP పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి(వాసు) ‘X’లో పోస్ట్ చేశారు. ‘తునిలో గంజాయి మత్తులో ఒక యువకుడు రోడ్డుపై బీభత్సం సృష్టించాడు. అయ్యా జగన్ నువ్వు ఏదో ఉద్ధరిస్తావని నీకు సీఎంగా ఈ రాష్ట్ర ప్రజలు అధికారాన్ని ఇస్తే, నువ్వు రాష్ట్రాన్ని గంజాయి మత్తులో ముంచినావు.’ అని పేర్కొన్నారు. కడప ప్రజలకు గంజాయి మహమ్మారి నుంచి విముక్తి కలిగేలా ఆయన కృషి చేస్తారనన్నారు.

News August 26, 2024

కడప: రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతి

image

కడప జిల్లాలో ఇవాళ రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. దువ్వూరు మండలం చింతకుంట సమీపంలో కారు బోల్తా పడగా.. గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో కారు, లారీ ఢీకొన్నాయి. ఈ రెండు ఘటనలో చనిపోయిన వారి పేర్లు..
* నాగలక్ష్మి(70)
* భగత్ సింగ్(35)
* కియాన్ సింగ్(9 నెలలు)
* గుజ్జుగారి నాగయ్య(46)
* వల్లేపు చిన్న వెంకటమ్మ (50)
* వల్లెపు నాగలక్ష్మి దేవి (35)
* ఖాడమియ్య గారి షరీఫ్ (38)
* లారీ డ్రైవర్ పేరు తెలియాల్సి ఉంది.

News August 26, 2024

దువ్వూరు: చికిత్స పొందుతూ చిన్నారి మృతి

image

దువ్వూరు మండలం చింతకుంట గ్రామం వద్ద జాతీయ రహదారిపై సోమవారం కారు బోల్తా పడిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. కర్నూలు కొత్తపేటకు చెందిన భగత్ సింగ్ తన కూతురు కియాన్ సింగ్ పుట్టు వెంట్రుకలకు తిరుమలకు కారులో 9 మంది బయలుదేరారు. చింతకుంట వద్ద కారు అదుపుతప్పి బోల్తా పడటంతో గాయపడ్డారు. మైదుకూరు ఆసుపత్రిలో నాగలక్ష్మి(70), భగత్ సింగ్(35), ప్రొద్దుటూరు ఆస్పత్రిలో కియాన్ సింగ్(9 నెలలు) చికిత్స పొందుతూ చనిపోయారు.

News August 26, 2024

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి మండిపల్లి

image

గువ్వలచెరువులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ ప్రమాదాల నివారణ కొరకు త్వరలో శాశ్వత పరిష్కారం చూపుతామని మంత్రి తెలిపారు. వాహనదారులు రోడ్ల పైన ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా రోడ్డు నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్ చేయాలని సూచించారు.

News August 26, 2024

కడప జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం

image

దువ్వూరు మండలం చింతకుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు నుంచి తిరుపతికి వెళుతున్న కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నాగలక్ష్మి (55), భగత్ సింగ్ (48) ఇద్దరు మృతి చెందారు. అలాగే నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం వారిని ప్రొద్దుటూరుకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.

News August 26, 2024

పెండ్లిమర్రి: యువకునికి దేహశుద్ధి మహిళ బంధువులు

image

పెండ్లిమర్రి మండలం నల్లయ్యగారి పల్లెకు చెందిన ప్రసాద్ రెడ్డికి సోమవారం మధ్యాహ్నం మహిళా బంధువులు దేహశుద్ధి చేశారు. స్థానికుల కథనం ప్రకారం.. ప్రసాద్ రెడ్డి గత కొంతకాలంగా ఓ వివాహితకు ఫోన్ కాల్స్ చేసి బెదిరిస్తుండేవారు. దీంతో ఆమె బంధువులు ప్రసాద్ రెడ్డికి దేహ శుద్ధి చేశారు. అనంతరం ప్రసాద్ రెడ్డిని పోలీసులకు అప్పగించారు.

News August 26, 2024

కడప: ప్రియుడి మోజులో భర్తను హతమార్చిన భార్య

image

ప్రియుడి మోజులో పడి భర్తను భార్య హతమార్చిన ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సిద్ధవటం మండలం లింగంపల్లికి చెందిన గంగయ్య సంధ్యకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. గంగయ్య లింగంపల్లి వాటర్ పంప్ వద్ద ఉద్యోగం చేస్తుంటారు. అయితే డ్యూటీ నుంచి ఇంటికి రాగా.. భార్య ప్రియుడితో ఉండటం చూసి ఆమెను మందలించాడు. కక్ష్య పెంచుకున్న భార్య ప్రియుడితో కలిసి గంగయ్యను హతమార్చి ఘాట్ రోడ్‌లో పడేశారు.

News August 26, 2024

కడప: ప్రియుడి మోజులో భర్తను హతమార్చిన భార్య

image

ప్రియుడి మోజులో పడి భర్తను భార్య హతమార్చిన ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సిద్ధవటం మండలం లింగంపల్లికి చెందిన గంగయ్య సంధ్యకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. గంగయ్య లింగంపల్లి వాటర్ పంప్ వద్ద ఉద్యోగం చేస్తుంటారు. అయితే డ్యూటీ నుంచి ఇంటికి రాగా.. భార్య ప్రియుడితో ఉండటం చూసి ఆమెను మందలించాడు. కక్ష్య పెంచుకున్న భార్య ప్రియుడితో కలిసి గంగయ్యను హతమార్చి ఘాట్ రోడ్‌లో పడేశారు.