India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎస్వీ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 1990 నుంచి 2015 వరకు చదివి ఒక సబ్జెక్టు, రెండు సబ్జెక్టులు, అంతకంటే ఎక్కువ సబ్జెక్టులు ఫెయిల్ అయిన విద్యార్థులకు యూనివర్సిటీ మరొక్కసారి ఎగ్జామ్ రాసి పాస్ అవ్వడానికి అవకాశం కల్పించింది. ఈ మేరకు పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
వరుస సెలవులు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తిరుపతి నుంచి కడప మీదుగా కాచిగూడకు, రేపు ట్రైన్ నెంబర్ 07456 ప్రత్యేక సర్వీస్ నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ తెలిపారు. తిరుపతిలో సాయంత్రం 7.50కి బయలుదేరి రేణిగుంట, కడప, ఎర్రగుంట్ల, గుత్తి, కర్నూల్, గద్వాల్, మహబూబ్ నగర్, జడ్చర్ల మీదుగా.. మరుసటి రోజు ఉదయం 9.30కి కాచిగూడ చేరుకుంటుందన్నారు .
అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం హస్తవరం గ్రామానికి చెందిన రత్నమ్మ (38) డెంగ్యూ జ్వరంతో శుక్రవారం మృతి చెందింది. మూడు రోజుల క్రితం ఆమెకు జ్వరం రావడంతో రాజంపేట, తిరుపతి లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందినప్పటికీ జ్వరం తగ్గలేదని, శుక్రవారం తెల్లవారుజామున ఆమె మృతి చెందిందని వారు తెలిపారు. రాజంపేట ప్రాంతంలో ఇటీవల డెంగ్యూ జ్వరం భారీన పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని పలువురు అన్నారు.
ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో కూటమి ప్రభుత్వం రెండు నెలల్లోనే ప్రజల విశ్వాసం కోల్పోయిందని మాజీ సీఎం జగన్ మేనమామ, కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా వి.కోటలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఇలాగే పరిపాలిస్తే రెండేళ్లలో ప్రభుత్వం పడిపోవడం ఖాయమని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తున్నారని.. ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని విమర్షించారు.
ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో కూటమి ప్రభుత్వం రెండు నెలల్లోనే ప్రజల విశ్వాసం కోల్పోయిందని మాజీ సీఎం జగన్ మేనమామ, కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా వి.కోటలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఇలాగే పరిపాలిస్తే రెండేళ్లలో ప్రభుత్వం పడిపోవడం ఖాయమని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తున్నారని.. ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని విమర్షించారు.
మదనపల్లె ట్రాఫిక్ ఏఎస్ఐగా పనిచేస్తున్న జేఎన్ఏ బాషా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా గురువారం ఇండియన్ పోలీస్ మెడల్ను అందుకున్నారు. ఈ సందర్భంగా జేఎన్ఏ బాషా మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇండియన్ పోలీస్ మెడల్ అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పలువురు పోలీసు సిబ్బంది ఆయన్ను అభినందించారు.
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం భద్రత పెంచింది. ఇటీవల మిథున్ రెడ్డి పుంగనూరు వెళ్లినప్పుడు అల్లర్లు జరిగాయి. ఈక్రమంలో ఆయనకు అపాయం పొంచి ఉందని నిఘా వర్గాలు కేంద్ర హోంశాఖకు నివేదిక ఇచ్చాయి. దీంతో ఆయనకు 8 మంది CRPF బలగాలతో బందోబస్తు కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సదరు సిబ్బంది గురువారం మిథున్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు.
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కడప కలెక్టర్ లోతేటి శివశంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎట్ హోం కార్యక్రమంలో MLA పుట్టా సుధాకర్ యాదవ్, పలువురు నాయకుడు పాల్గొన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ప్రజాప్రతినిధులకు, అధికారులకు విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ కార్యక్రమంలో గురువారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు, డిఆర్ఓ గంగాధర్ గౌడ్ పాల్గొన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కడప కలెక్టర్ లోతేటి శివశంకర్ ఆధ్వర్యంలో, ఏర్పాటు చేసిన ఎట్ హోం కార్యక్రమంలో శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ పాల్గొన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ప్రజాప్రతినిధులకు, అధికారులకు విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. కార్యక్రమంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు, డిఆర్ఓ గంగాధర్ గౌడ్ పాల్గొన్నారు.
జిల్లాలో పోలీస్ శాఖలో విశిష్ట సేవలందించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సేవా పతకాలను రాష్ట్ర న్యాయ, మైనారిటీ శాఖ మంత్రి ఫరూక్ అందజేశారు.
1)SSSV కృష్ణారావు, అడిషనల్ SP ఏఆర్ కడప
2. ఎం అరుణాచలం, ఏఎస్ఐ, కడప ట్రాఫిక్ పిఎస్
3. కె ఆనంద్, హెచ్సి 2008, సిద్దవటం పిఎస్
4. సి శ్రీనివాసులు, పీసీ 1233, ప్రొద్దుటూరు ట్రాఫిక్ పిఎస్
5. కె విజయలక్ష్మి, డిసిఆర్బి, కడప
Sorry, no posts matched your criteria.