India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చాపాడు పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ ఈ.జి అశోక్ కుమార్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారులతో జిల్లా ఎస్పీ మాట్లాడి సమస్య అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని SI చిన్న పెద్దయ్యను ఆదేశించారు. ఉమెన్ హెల్ప్ డెస్క్ను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో ప్రణాళికాబద్ధంగా వృద్ధి సాధించాలని కడప జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ఆదేశించారు. స్వర్ణాంధ్ర విజన్-2047పై కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ.. లక్ష్యాలను చేరుకునేందుకు, జిల్లా వృద్ధి రేటు 15 శాతానికి పెంచేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. రానున్న ఐదేళ్లలో లక్ష్యాలను సంపూర్ణం చేయాలని సూచించారు.

చాపాడు పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ ఈ.జి అశోక్ కుమార్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారులతో జిల్లా ఎస్పీ మాట్లాడి సమస్య అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని SI చిన్న పెద్దయ్యను ఆదేశించారు. ఉమెన్ హెల్ప్ డెస్క్ను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో ప్రణాళికాబద్ధంగా వృద్ధి సాధించాలని కడప జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ఆదేశించారు. స్వర్ణాంధ్ర విజన్-2047పై కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ.. లక్ష్యాలను చేరుకునేందుకు, జిల్లా వృద్ధి రేటు 15 శాతానికి పెంచేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. రానున్న ఐదేళ్లలో లక్ష్యాలను సంపూర్ణం చేయాలని సూచించారు.

వర్షాలు అధికంగా కురుస్తున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న జలవనరులను సంరక్షించుకునే చర్యలను చేపట్టాలని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నింపాలన్నారు. వర్షా కాలంలో నీటి నిల్వ కారణంగా ఇసుక సేకరణ సాధ్యం కాదని.. ఇప్పటి నుంచే అవసరమైన మేర ఇసుక నిల్వలను పెంచుకోవాలని సూచించారు.

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ అక్రమాలు చేసిందని 4వ వార్డు కౌన్సిలర్ పార్లపల్లి కిషోర్ ఆరోపించారు. ఈ మేరకు ఢిల్లీలో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ను అరకు ఎంపీతో కలిసి ఫిర్యాదు చేశారు. ఆ ఎన్నికల్లో ఓటర్లను అడ్డుకున్నారని చెప్పారు. ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీలు ఓటు వేయనీయకుండా టీడీపీ నాయకులు దౌర్జన్యాలు చేశారని. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ ఘటన ప్రొద్దుటూరు మండలంలో వెలుగు చూసింది. పోలీసుల వివరాల మేరకు.. ఇడమడకకు చెందిన వినోద్ కుమార్(26) ప్రొద్దుటూరుకు చెందిన యువతిని ప్రేమించాడు. వీళ్ల పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. ఈక్రమంలో యువతి ఆగస్ట్ 15వ తేదీని ఉరేసుకుని చనిపోయింది. ఇది తట్టుకోలేని వినోద్ బుధవారం రాత్రి విషం తాగాడు. చికిత్స కోసం కర్నూలుకు తీసుకెళ్తుండగా మధ్యలోనే చనిపోయాడు.

కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు డాక్యుమెంట్ల పరిశీలనకు ఈనెల 25, 26 తేదీల్లో జిల్లా పోలీస్ కార్యాలయంలో హాజరు కావాలని కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గురువారం ఒక ప్రకటన తెలిపారు. అభ్యర్థులు సెలక్షన్ సమయంలో జతపరిచిన ఒరిజినల్ డాక్యుమెంట్లను, గజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించిన మూడు సెట్ల జిరాక్స్ కాపీలను, ఇటీవల తీసుకున్న 6 పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫొటోలను తీసుకురావాలని సూచించారు.

సహజ రంగులతో తయారు చేసిన మట్టి గణేష్ విగ్రహాలను వాడి వాటిని ప్రోత్సహించాలని, పర్యావరణ పరిరక్షణకు మన వంతు బాధ్యతగా చేయూతను అందిద్దామని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. వినాయక చవితి విశిష్ట తను కాపాడేందుకు మనమందరం సమిష్ఠిగా కృషిచేయడం వల్ల ఒక గొప్ప మార్పును సాధించవచ్చన్నారు. సహజ రంగులతో మట్టి విగ్రహాలను తయారు చేయడం స్వచ్ఛతకు చిహ్నమన్నారు.

పర్యావరణం పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ అన్నారు. DYFI ఆధ్వర్యంలో ‘మట్టి గణపతి విగ్రహాలను ప్రతిష్ఠిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం’ అనే పోస్టర్ను గురువారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు.
Sorry, no posts matched your criteria.