India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భార్య కాపురానికి రాలేదని వ్యక్తి ఆత్మహ్యతకు పాల్పడిన ఘటన జమ్మలమడుగు మండలంలో చోటు చేసుకుంది. జమ్మలమడుగు సీఐ లింగప్ప తెలిపిన వివరాల మేరకు.. గూడెంచెరువు గ్రామానికి చెందిన చెన్నప్ప, వరలక్ష్మి దంపతులు. సంక్రాంతి పండగకు సత్యసాయి జిల్లా ముదిగుబ్బ(M) పాలెం గ్రామానికి వెళ్లిన భార్య తిరిగి ఇంటికి రాలేదు. కాగా బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చెన్నప్ప ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.
జిల్లాలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కడప ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశించారు. ఎస్పీ కార్యాలయంలో సీఐలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి కేసుపై వారానికి ఒకసారి సమీక్ష చేయడం జరుగుతుందన్నారు. కేసుల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయరాదని స్పష్టం చేశారు. పోలీసులు వృత్తి పట్ల నిబద్ధతతో పనిచేయాలన్నారు.
జిల్లాలో వివిధ కార్పొరేషన్ల ద్వారా మొత్తం 4998 యూనిట్లకు రూ.80.15 కోట్ల లక్ష్యంతో స్వయం ఉపాధి అవకాశాలను అందించనున్నట్లు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. బుధవారం కడప కలెక్టరేట్లో వివిధ కార్పొరేషన్ల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు స్వయం ఉపాధి, రుణ సహాయ సంక్షేమ పథకాల అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. స్వయం ఉపాధి అవకాశాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలంలోని బలపనూరు గ్రామంలో కలకలం రేగింది. మంగళవారం గ్రామంలో పులి పిల్లలు కనిపించాయని గ్రామస్థులు తెలిపారు. రెండు పులి పిల్లలు నెమళ్లను వేటాడుతూ కనిపించాయని గ్రామస్థుడు కిషోర్ అన్నారు. మరికొందరు కూడా పొదల్లో పులి పిల్లలు కనిపించాయని తెలిపారు. దీంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
మే లో కడప వేదికగా నిర్వహించే టీడీపీ మహానాడు ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి సవిత జిల్లా నాయకులతో కలిసి పరిశీలించారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే చైతన్యతో పాటు పలువురు నాయకులతో కలిసి మహానాడు నిర్వహించే స్థలాన్ని పరిశీలించి ఎంతమంది వస్తారు వారికి తగ్గ ఏర్పాట్ల చేసేలా చూడాలని మంత్రి నాయకులకు సూచించారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు వస్తారన్నారు.
నేటి విద్యార్థులే రేపటి భవిభారత పౌరులని, విద్యతోపాటు క్రీడలలో కూడా రాణించి తల్లిదండ్రులకు, పాఠశాలకు, జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు ప్రతిష్ఠలు తేవాలని జిల్లా ఇంఛార్జి మంత్రి సవిత అన్నారు. మంగళవారం స్థానిక ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూలులో 37వ క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సవిత ముఖ్య అతిథిగా వచ్చి విద్యార్థుల నుద్దేశించి మాట్లాడారు.
జిల్లాలో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది, వారి కుటుంబాలకు ఎటువంటి ఆపద కలిగినా తాను అండగా ఉండి వారి సంక్షేమానికి కృషి చేస్తానని ఎస్పీ ఈ.జి అశోక్ కుమార్ భరోసా ఇచ్చారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏపీ పోలీస్ అధికారుల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో పోలీస్ డైరీ -2025ను ఎస్పీ ఆవిష్కరించారు. ఏఎస్పీ ప్రకాశ్ బాబు, పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
హైదరాబాద్లో భవనం పైనుంచి పడి కడపకు చెందిన సైట్ ఇంజినీర్ మిథున్ కుమార్ రెడ్డి మృతి చెందారు. ఈ ఘటన హైదరాబాద్లోని కొల్లూరు పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. అఫ్తా గ్రీన్ హోమ్లో నిర్మాణంలో ఉన్న భవనం 13వ అంతస్తు నుంచి మిథున్ కుమార్ రెడ్డి కింద పడ్డారు. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. అక్కడి సిబ్బంది హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. కేసు నమోదైంది.
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి, కడప జిల్లా ఇంఛార్జి మంత్రి సావిత్రమ్మ నేడు కడపకు వస్తున్నట్లు కలెక్టర్ కార్యాలయ అధికారులు వెల్లడించారు. మంగళవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో జరిగే జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశానికి హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. ఇందులో మంత్రితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.
తిరుమలకు తొలిగడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఈరోజు సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని గజవాహనంపై అలంకరించి నాలుగు మాడవీధుల్లో విహారం చేశారు. నేడు స్వామివారి కల్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రేపు రథంపై శ్రీవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
Sorry, no posts matched your criteria.