Y.S.R. Cuddapah

News August 14, 2024

రూ.10 నాణేలు అన్నీ చెల్లుబాటు అవుతాయి: కలెక్టర్

image

రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన 14 రకాల ₹10 నాణేలన్నీ చెల్లుబాటు అవుతాయని జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి బుధవారం తెలిపారు. రూ.10 నాణేముల అవగాహన కొరకు, DCC మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయం మేరకు కెనరా బ్యాంక్ రీజినల్ హెడ్ కె మురళీ మోహన్‌తో కలసి 7 రోడ్ల కూడలి వద్ద ఈనెల 16వ తేదీన పెద్ద ఎత్తున పది రూపాయల నాణేలను చలామణి జరుపుతామని కలెక్టర్ తెలిపారు. రూ.10 నాణెం చెల్లుబాటుపై క్లారిటీ ఇచ్చారు.

News August 14, 2024

కడపకు చేరుకున్న మంత్రి ఫరూక్

image

రాష్ట్ర మైనారిటీ న్యాయశాఖ మంత్రి పర్యటనలో భాగంగా కడపకు చేరుకున్నారు. కడప ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో జిల్లా కలెక్టర్ శివశంకర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఇతర అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. రేపు కడప పోలీస్ మైదానంలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని జండా వందనం చేస్తారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై ప్రజలకు తన సందేశంలో వినిపిస్తారు.

News August 14, 2024

బాగా చదివి అత్యున్నత స్థానాలకు ఎదగాలి: ఎస్పీ

image

పోలీస్ కుటుంబాల పిల్లలు బాగా చదివి అత్యున్నత స్థాయికి ఎదగాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆకాంక్షించారు. బుధవారం స్థానిక పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని పోలీసుల, హోమ్ గార్డ్స్ కుటుంబాలకు చెందిన 59 మంది పిల్లలకు విద్యలో ప్రతిభ కనబరచి టెన్త్, ఇంటర్‌లో 90 శాతం పైబడి మార్కులు సాధించిన వారికి మెరిట్ స్కాలర్ షిప్‌లను, ప్రశంసా పత్రాలను అందచేసి అందరినీ ప్రత్యేకంగా అభినందించారు.

News August 14, 2024

రైల్వే కోడూరు: బైకు, లారీ ఢీ.. ఇద్దరు స్పాట్ డెడ్

image

రైల్వే కోడూరు మండలం అనంతరాజు పేట క్రాస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌‌పై కోడూరు నుంచి మంగంపేటకు వెళ్తున్న ఇద్దరిని వెనుకవైపు నుంచి లారీ ఢీకొట్టింది. దీంతో సిద్దేశ్వర (35), పుల్లగుంట సుబ్బయ్య (42) ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News August 14, 2024

రైల్వే కోడూరు: బైకు, లారీ ఢీ.. ఇద్దరు స్పాట్ డెడ్

image

రైల్వే కోడూరు మండలం అనంతరాజు పేట క్రాస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌‌పై కోడూరు నుంచి మంగంపేటకు వెళ్తున్న ఇద్దరిని వెనుకవైపు నుంచి లారీ ఢీకొట్టింది. దీంతో సిద్దేశ్వర (35), పుల్లగుంట సుబ్బయ్య (42) ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News August 14, 2024

జనంపై జగన్ కక్ష కట్టాడు: బీటెక్ రవి

image

కర్నూల్ జిల్లాలో జరిగిన TDP మాజీ సర్పంచ్ శ్రీనివాసులు హత్యపై పులివెందుల TDP ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి X (ట్విటర్) వేదికగా స్పందించారు. ‘ఐదేళ్ల నరకాసుర పాలనకు చరమగీతం పాడారని జనంపై కక్ష కట్టాడు జగన్. ప్రజా తీర్పును భరించలేక హోసూరు మాజీ సర్పంచ్ శ్రీనివాసులును YCP కిరాయి మూకలు మట్టుపెట్టాయి.’ అని పేర్కొన్నారు. ‘వైకాపోన్మాదం ప్రజాతీర్పును భరించలేకపోతోంది’ అంటూ ఓ పోస్టర్‌ను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

News August 14, 2024

కడప: ఆగస్టు 15న ఖైదీల విడుదల ప్రశ్నార్థకం

image

ఈ ఏడాది ఆగస్టు 15న ఖైదీల విడుదల ప్రశ్నార్థకంగా మారింది. కడప కేంద్రకారాగారం నుంచి ఖైదీల విడుదలకు గానూ 3 విడతలుగా వివిధ కేటగిరీలకు చెందిన 20 మంది జాబితాను హోంశాఖ వారికి జైళ్ల శాఖ ప్రతిపాదనలు పంపింది. అయితే స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఖైదీల విడుదల ఉండదని, గాంధీ జయంతి రోజున విడుదల చేస్తామని ఇటీవల ఓ సమావేశంలో హోం మంత్రి అనిత పేర్కొన్న నేపథ్యంలో ఆగస్టు 15న ఖైదీల విడుదల లేనట్లేనని తెలుస్తోంది.

News August 14, 2024

కడప: గెస్ట్ లెక్చరర్ పోస్టుకు వాక్-ఇన్ ఇంటర్వ్యూ

image

కడప నగరంలోని ఎస్కేఆర్ అండ్ ఎస్కేఆర్ ప్రభుత్వం మహిళా డిగ్రీ కళాశాలలో జంతు శాస్త్ర విభాగంలో గెస్ట్ లెక్చరర్‌గా పనిచేసేందుకు ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులకు ఈ నెల 19న ఇంటర్వ్యూ, డెమో నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా. వి సలీం బాషా తెలిపారు. ఇంగ్లిష్ మీడియంలో బోధించేందుకు ఎంఎస్సీ జువాలజీలో 60% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలని, ఏపీసెట్, నెట్, PHD ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు.

News August 14, 2024

వైవీయూ బీటెక్ ఆరో సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల

image

వైఎస్సార్ ఇంజినీరింగ్ కళాశాల బీటెక్ ఆరో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను వీసీ ప్రొ. కృష్ణారెడ్డి, కులసచివులు ప్రొ. రఘునాథరెడ్డి, సీఈ ప్రొ. ఈశ్వర్ రెడ్డి, ప్రిన్సిపల్ ప్రొ. జయరాంరెడ్డితో కలిసి విడుదల చేశారు. సివిల్ ఇంజినీరింగ్(86.36శాతం), కంప్యూటర్ సైన్స్(100శాతం), ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ (88.89శాతం), ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ (100శాతం), మెకానికల్ విద్యార్థులు 75శాతం మంది పాసయ్యారు.

News August 14, 2024

మొదటి విడతలో కడపకు దక్కని ఛాన్స్

image

రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవాలలో కడప జిల్లాకు స్థానం దక్కలేదు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అన్న క్యాంటీన్లు ప్రారంభం చేసే జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో కడప జిల్లాలో ఒక్క నియోజకవర్గంలో కూడా ప్రారంభానికి చోటు దక్కలేదు. దీంతో జిల్లాలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. రెండో విడత జాబితాలో జిల్లాకు స్థానం దక్కుతుందా లేదా అనేది తెలియాల్సిఉంది.