India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పోలీసు అధికారులు, సిబ్బంది తమ విధుల్లో వినియోగిస్తున్న ఆయుధాల పనితీరుపై పరిజ్ఞానం పెంపొందించుకోవాలని కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కడప నగర శివార్లలోని ఫైరింగ్ రేంజ్లో ఎ.ఆర్ పోలీసు సిబ్బందికి మొబిలైజేషన్లో భాగంగా పైరింగ్ ప్రాక్టీస్లో ఎస్పీ పాల్గొని ఫైరింగ్ సాధన చేశారు. ‘వజ్ర’ వాహనం నుంచి గ్యాస్ షెల్స్ ఫైరింగ్ చేసి పరిశీలించారు.
పోలీసు అధికారులు, సిబ్బంది తమ విధుల్లో వినియోగిస్తున్న ఆయుధాల పనితీరుపై పరిజ్ఞానం పెంపొందించుకోవాలని కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కడప నగర శివార్లలోని ఫైరింగ్ రేంజ్లో ఎ.ఆర్ పోలీసు సిబ్బందికి మొబిలైజేషన్లో భాగంగా పైరింగ్ ప్రాక్టీస్లో ఎస్పీ పాల్గొని ఫైరింగ్ సాధన చేశారు. ‘వజ్ర’ వాహనం నుంచి గ్యాస్ షెల్స్ ఫైరింగ్ చేసి పరిశీలించారు.
తిరుమలకు తొలిగడప దేవుని కడప శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో అంకురార్పణ కార్యక్రమం మంగళవారం సాయంత్రం 6 గంటలకు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మృత్సం గ్రహణం, సేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం జరిగింది. రేపు ఉదయం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలకు నాంది పలకనున్నారు.
కమలాపురంలోని వెలుగు కార్యాలయంలో ఈనెల 30వ తేదీన మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఏ. సురేశ్ కుమార్ తెలిపారు. జిల్లా ఉపాధి కార్యాలయం, నైపుణ్య అభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మేళాలో ఎల్ఐసీలో బీమా సఖి, నవత ట్రాన్స్పోర్ట్లో క్లర్క్, డ్రైవర్, క్లీనర్ ఉద్యోగాలకు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్హత, అనుభవంను బట్టి వేతనాలు ఉంటాయని తెలిపారు.
అన్నను తమ్ముడు హత్య చేసిన ఘటన కేసులో తమ్ముడిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. వారి వివరాల మేరకు.. 2024 సెప్టెంబర్ 13న పులివెందుల(M) రాయలాపురం గ్రామానికి చెందిన మతిస్తిమితం లేని బాబయ్య, తమ్ముడు బాబా ఫక్రుద్దీన్తో గొడవపడి కోపంలో సమ్మెటతో బలంగా కొట్టి చంపాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అదే రోజు కేసు నమోదు చేశారు. విచారణ నిమిత్తం సోమవారం అరెస్టు చేయగా కోర్టు రిమాండ్ విధించింది.
కాశినాయన మండలం వరికుంట్ల గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ అల్లూరమ్మ భర్త చిన్న ఓబులేసు సోమవారం ఉదయం వరంగల్లో మరణించారు. వరంగల్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో కుర్చీలో కూర్చుని ఉండగా హార్ట్ అటాక్ వచ్చి మరణించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. తదనంతరం వరంగల్ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఓబులేసు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కడప జిల్లా దువ్వూరు మండలం గుడిపాడు వద్ద జాతీయ రహదారిపై ఓ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడినవారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికుల వివరాల ప్రకారం, డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాద స్థలానికి దువ్వూరు ఎస్ఐ వినోద్, పోలీసులు చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు గెలుపొందిన శకటాల వివరాలు. మొదటి బహుమతిగా డీపీవో, జడ్పీ, పీఆర్, ఆర్డబ్ల్యూఎస్, జిల్లా నీటి యాజమాన్య సంస్థలకు లభించింది. రెండవ బహుమతిగా వ్యవసాయం, మత్య్స శాఖ, పశు సంవర్థక శాఖలకు లభించింది. మూడవ బహుమతిగా కడప మున్సిపల్ కార్పోరేషన్కు లభించింది. 4వది ప్రోత్సహక బహుమతిగా సీపీవో, డీఆర్డీఏ, హౌసింగ్, ఎల్డీఎం, ఎస్బీఐలకు లభించింది.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కడప నగరానికి చెందిన ఓ యువకుడు తన ప్రతిభను చాటాడు. చాక్ పీస్పై జాతీయ జెండాను రూపొందించి తనలో ఉన్న ప్రతిభను చాటి చెప్పాడు. కడప నగరం చిన్నచౌక్ ప్రాంతానికి చెందిన సాయి చరణ్ క్యూబిక్లో ప్రతిభతో పాటు పెన్సిల్, చాక్ పీస్పై వివిధ రకాల ఆర్ట్ వేస్తూ అబ్బుర పరుస్తూ ఉంటాడు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా చాక్ పీస్పై ఆర్ట్ వేయడంతో పలువురు అభినందిస్తున్నారు.
కడపలో ఫ్లెక్సీ వార్ పెద్ద హాట్ టాపిక్గా మారింది. స్థానిక ఆర్ట్స్ కాలేజీ వద్ద వైసీపీ, జనసేన మధ్య ఫ్లెక్సీల పోరు ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా, ‘21తో గేమ్ ఛేంజర్ అవ్వలేము.. 50 తీసుకోవాలి’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దేశించి వచ్చిన ఫ్లెక్సీలు వైసీపీ కార్యకర్తల్లో ఆగ్రహానికి దారితీసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ‘జై జగన్, జోహార్ వైఎస్సార్’ అంటూ కింద నినాదాలు వేశారు.
Sorry, no posts matched your criteria.