India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వైఎస్సార్ ఇంజినీరింగ్ కళాశాల బీటెక్ ఆరో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను వీసీ ప్రొ. కృష్ణారెడ్డి, కులసచివులు ప్రొ. రఘునాథరెడ్డి, సీఈ ప్రొ. ఈశ్వర్ రెడ్డి, ప్రిన్సిపల్ ప్రొ. జయరాంరెడ్డితో కలిసి విడుదల చేశారు. సివిల్ ఇంజినీరింగ్(86.36శాతం), కంప్యూటర్ సైన్స్(100శాతం), ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ (88.89శాతం), ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ (100శాతం), మెకానికల్ విద్యార్థులు 75శాతం మంది పాసయ్యారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవాలలో కడప జిల్లాకు స్థానం దక్కలేదు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అన్న క్యాంటీన్లు ప్రారంభం చేసే జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో కడప జిల్లాలో ఒక్క నియోజకవర్గంలో కూడా ప్రారంభానికి చోటు దక్కలేదు. దీంతో జిల్లాలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. రెండో విడత జాబితాలో జిల్లాకు స్థానం దక్కుతుందా లేదా అనేది తెలియాల్సిఉంది.
వైవీయూ కడప రోటరీ క్లబ్ సహకారంతో ఈ నెల 14వ తేదీన డా ఏపీజే అబ్దుల్ కలాం సెంట్రల్ లైబ్రరీ ఆవరణలో ‘మెగా మెడికల్ క్యాంప్’ నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ ప్రొ ఎస్ రఘునాథరెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటలకు మొదలయ్యే ఈ క్యాంపులో ప్రముఖ వైద్యులు వారణాసి ప్రతాప్ రెడ్డి (డయాబెటిస్), డా. ఏ. వంశీధర్ (కార్డియాలజిస్ట్), డా. ఏ. విద్యాధర (నేత్ర వైద్యుడు), డా. ఎం.డి. ఫర్హానుద్దీన్ (డెంటిస్ట్) సేవలందిస్తారన్నారు.
కడప జిల్లాలో సీఐలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆదేశాలు జారీ చేశారు. కర్నూలు రేంజ్ పరిధిలో దాదాపు 62 మంది సీఐలకు స్థానచలనం కల్పించారు. ఉమ్మడి అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలకు సంబంధించిన సీఐలను బదిలీ చేస్తూ.. వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లలో రిపోర్ట్ చేసుకోవాలని ఆదేశించారు. పోస్టింగ్ ఇవ్వగా, పలువురిని వీఆర్లో రిపోర్ట్ చేసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
జీతం అడిగినందుకు రూంలో వేసి ఓ మహిళను చితకబాది గాయపరిచిన ఘటన సోమవారం ఒక రైల్వే కోడూరులో జరిగింది. బాధితురాలి కథనం మేరకు రైల్వేకోడూరు మండలంలోని అనంతరాజుపేటలో ఒక హోటల్లో పావని పనిచేస్తోంది. మూడు నెలల నుంచి హోటల్ యజమాని జీతం ఇవ్వలేదని నిలదీసింది. దీంతో యజమాని హోటల్లోని ఒక గదిలో వేసి తలుపులు మూసివేసి విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దువ్వూరు వద్ద కేసీ కెనాల్లో నిన్న ఓ ఎండ్ల బడి పడి ఓ <<13835710>>ఎద్దు<<>> చనిపోయిన విషయం తెలిసిందే. సంబంధిత ఫొటోలు అందరినీ కలచివేస్తున్నాయి. రైతులు భూమిని, తమ పాడి పశువులను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. వాటికి ఏ మాత్రం నష్టం వచ్చినా తట్టుకోలేరు. అలాంటిది అన్ని రోజులు తమకు అండగా ఉన్న ఓ ఎద్దు కళ్ల ముందు చనిపోవడంతో విషాదంలో మునిగిపోయారు. ఎద్దు కళేబరం వద్ద బోరున ఏడ్చారు. సంబంధిత ఫొటో వైరల్ అవుతోంది.
లింగాల మండలం పార్నపల్లె వద్ద మినీ బస్సు, బైకు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. మృతుడు కసునూరికి చెందిన ఫొటోగ్రాఫర్ బోనాల హరిగా స్థానికులు గుర్తించారు. భార్యాభర్తలు ఇద్దరు బైక్పై అనంతపురానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. క్షతగాత్రుడిని 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కడప జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈ నెల 14న కడప కలెక్టరేట్లో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేష్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టరేట్లోని జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయ ఆవరణలో ఉదయం పది గంటలకు మొదలయ్యే ఈ ఉద్యోగ మేళాకు పదో తరగతి, అంతకు పైన విద్యార్హత కలిగిన యువతీ-యువకులు తమ ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు.
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులకు స్వస్తి పలకాలని ప్రయాణికులు కోరుతున్నారు. పొద్దుటూరు నుంచి తాడిపత్రికి వెళ్లే బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్ళడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. డ్రైవర్ చాకచక్యంతో బస్సును ప్రమాదం జరగకుండా సోమవారం అదుపు చేశారు. వెంటనే క్రేన్ సహాయంతో బస్సును రహదారి పైకి తీసుకువచ్చారు. ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కడప జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈ నెల 14న కడప కలెక్టరేట్లో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేష్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టరేట్లోని జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయ ఆవరణలో ఉదయం పది గంటలకు మొదలయ్యే ఈ ఉద్యోగ మేళాకు పదో తరగతి, అంతకు పైన విద్యార్హత కలిగిన యువతీ-యువకులు తమ ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.