Y.S.R. Cuddapah

News August 11, 2024

కడప: 28 మంది MPDOలకు పోస్టింగ్

image

సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈసీఐ నిబంధనల మేరకు ఇతర జిల్లాలకు బదిలీ అయిన ఉమ్మడి వైఎస్సార్ జిల్లాకు చెందిన ఎంపీడీఓలు తిరిగి సొంత జిల్లాకు చేరుకున్నారు. ఇంతకుముందు పనిచేసిన మండలాల్లోనే వీరికి తిరిగి పోస్టింగ్ ఇస్తూ జెడ్పీ సీఈఓ సుధాకర్ రెడ్డి ప్రొసీడింగ్స్ జారీ చేశారు. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 28 మంది ఎంపీడీవోలు బదిలీపై రానున్నట్లు ఆయన తెలిపారు.

News August 11, 2024

కడప: 28 మంది MPDOలకు పోస్టింగ్

image

సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈసీఐ నిబంధనల మేరకు ఇతర జిల్లాలకు బదిలీ అయిన ఉమ్మడి వైఎస్సార్ జిల్లాకు చెందిన ఎంపీడీఓలు తిరిగి సొంత జిల్లాకు చేరుకున్నారు. ఇంతకుముందు పనిచేసిన మండలాల్లోనే వీరికి తిరిగి పోస్టింగ్ ఇస్తూ జెడ్పీ సీఈఓ సుధాకర్ రెడ్డి ప్రొసీడింగ్స్ జారీ చేశారు. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 28 మంది ఎంపీడీవోలు బదిలీపై రానున్నట్లు ఆయన తెలిపారు.

News August 11, 2024

రాయచోటిలో పిచ్చికుక్కల దాడి.. 34 మందికి గాయాలు

image

జిల్లా కేంద్రమైన రాయచోటిలో శనివారం పిచ్చికుక్కలు స్వైర విహారం చేశాయి. కొత్తపేట, గాలివీడు రోడ్డు, బస్టాండ్ రోడ్డు, మాసాపేట ప్రాంతాలకు చెందిన 34 మందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. బాధితులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన అహమదుల్లాను కడప రిమ్స్‌కు తరలించగా, వెంకటరమణ, పిచ్చమ్మ, ఇర్ఫాన్, రంగయ్య నాయుడు, కుళ్లాయప్ప, మనోహర్, ఆనంద్, బాబ్జి, ఖదీర్ బాష, అమృత, నాగేశ్వరమ్మ పలువురు గాయపడ్డారు.

News August 11, 2024

కళా కీర్తి కిరీటం పల్లేటి ఇకలేరు

image

నాటకం ఆయన ఊపిరి.. నాటక రంగ కళకు కీర్తి తెచ్చి 88 నంది అవార్డులు సొంతం చేసుకున్న రచయిత. తెలుగు నాట సుప్రసిద్ధ నాటక కర్త కడప జిల్లాకు చెందిన పల్లేటి లక్ష్మీ కులశేఖర్ (70) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. ఉమ్మడి వైఎస్సార్ జిల్లా రైల్వేకో డూరులో నివాసముంటున్న ఆయన గుంటూరు నుంచి వస్తుండగా.. మార్గమధ్యంలో గుండెపోటుతో మరణించారు. క్రైస్తవుడైనా శ్రీరామ పట్టాభిషేకం పేరిట నాటకాలు రాసి రామాయణ ప్రదర్శనలిచ్చాడు.

News August 11, 2024

కడప మీదుగా కాచిగూడ- తిరుపతికి ప్రత్యేక రైళ్లు

image

వరుస సెలవుల కారణంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కడప మీదుగా కాచిగూడ నుంచి తిరుపతి వరకు ఆగస్టు 14 నుంచి 16 తేదీలలో, తిరుపతి నుంచి కాచిగూడకి 15 నుంచి 17 తేదీలలో ప్రత్యేక రైళ్ళను నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శ్రీధర్ తెలిపారు. ఈ రైళ్లు జడ్చర్ల, మహబూబ్ నగర్, కర్నూల్, గుత్తి, ఎర్రగుంట్ల, కడప, రేణిగుంట మీదుగా ప్రయాణిస్తాయి.

News August 11, 2024

జల వనరులను కాపాడుకోవాలి: కడప కలెక్టర్

image

కడప జిల్లాలో అందుబాటులో ఉన్న జల వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. శనివారం దువ్వూరులోని చల్లబసాయపల్లి గ్రామ సమీపంలో తెలుగుగంగా ఉప జలాశయం-1 నుంచి ఉప జలాశయం-2కు జలహారతి ఇచ్చి, నీటిని విడుదల చేసే కార్యక్రమాన్ని మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. తాగు, సాగు నీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగిందని తెలిపారు.

News August 10, 2024

కడప జిల్లాలో TODAY TOP NEWS

image

*అంబేడ్కర్‌ను అవమానించారు: ఆంజాద్ బాషా
*మైదుకూరులో పర్యటించిన కలెక్టర్
* రాజంపేట అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన
*అవుకు నుంచి గండికోటకు నీటి విడుదల
* కడపలో ప్రారంభం కానున్న డీమార్ట్
*పులివెందులలో బండలాగుడు పోటీలు
*కడప జిల్లాలో మరో నెలపాటు వేట నిషేధం
*సుండుపల్లెలో 8 మంది అరెస్ట్
*ముద్దనూరులో మహిళ సూసైడ్

News August 10, 2024

కడప జిల్లాలో TODAY TOP NEWS

image

*అంబేడ్కర్‌ను అవమానించారు: ఆంజాద్ బాషా
*మైదుకూరులో పర్యటించిన కలెక్టర్
* రాజంపేట అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన
*అవుకు నుంచి గండికోటకు నీటి విడుదల
* కడపలో ప్రారంభం కానున్న డీమార్ట్
*పులివెందులలో బండలాగుడు పోటీలు
*కడప జిల్లాలో మరో నెలపాటు వేట నిషేధం
*సుండుపల్లెలో 8 మంది అరెస్ట్
*ముద్దనూరులో మహిళ సూసైడ్

News August 10, 2024

మైదుకూరు ప్రభుత్వ కార్యాలయాలను పరిశీలించిన కలెక్టర్

image

మైదుకూరులోని మండల రెవెన్యూ, మున్సిపల్, ఎంపీడీఓ కార్యాలయాలను శనివారం జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ పరిశీలించారు. కలెక్టర్‌కు తహశీల్దార్ రాజసింహ నరేంద్ర, కమిషనర్ జబ్బార్ మియా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తహశీల్దార్ కార్యాలయం దూరంగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్‌కు తెలిపారు. గతంలో మాదిరి ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలోనే తహసిల్దార్ కార్యాలయం ఏర్పాటు చేయాలన్నారు.

News August 10, 2024

జగన్ వస్తే అవకాశం ఇస్తాం: స్పీకర్ 

image

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి కాదని ఎమ్మెల్యే మాత్రమేనని అసెంబ్లీకి రావాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి పోతుంటాయని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి వస్తే మాట్లాడే అవకాశం ఇస్తానని తెలిపారు. సమావేశాలలో అసెంబ్లీకి హాజరవ్వటం శాసనసభ్యుడిగా ఆయన బాధ్యత అన్నారు.