India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పులివెందుల, ఒంటిమిట్టలో జరగనున్న ZPTC ఉప ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. సాయంత్రం 5 గంటల వరకు జెడ్పీటీసీ బైపోల్ ప్రచారం చేయనున్నారు. సా.5 గంటల తర్వాత స్థానికేతరులపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఇప్పటికే హోరాహోరీగా టీడీపీ, వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించగా ఒంటిమిట్టలో 11, పులివెందులలో 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పులివెందులలో అదనపు బలగాలతో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.

కడప జిల్లాలోని ఒంటిమిట్ట, పులివెందుల జడ్టీటీసీ ఉపఎన్నికలు త్వరలో జరగనున్నాయి. దీంతో సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న మీకోసం, ప్రజా సమస్యల పరిష్కారం కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. కావున అర్జీదారులు కలెక్టరేట్కు రావద్దని అధికారులు వెల్లడించారు.

పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక నేపథ్యంలో వైసీపీ కీలక నేతలు కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని పులివెందులలో కలిశారు. ఈనెల 12న జరగనున్న పోలింగ్కు సంబంధించిన ఏర్పాట్లు, పోలింగ్ రోజున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. పోలింగ్ శాతాన్ని పెంచేలా కార్యకర్తలు కృషి చేయాలని అవినాశ్ రెడ్డి సూచించారు.

సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అశోక్ కుమార్ శనివారం తెలిపారు. ఏపీకే ఫైల్స్ క్లిక్ చేస్తే వాట్సప్ కూడా హ్యాక్ కావొచ్చని, ఫోన్ హ్యాక్ అయితే మోసపోతామని చెప్పారు. ప్లే స్టోర్ తప్ప ఇతర వేదికల నుంచి యాప్స్ డౌన్లోడ్ చేసుకోవద్దని సూచించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

బద్వేల్కు చెందిన వ్యక్తి మర్రిపాడు వద్ద మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే.. బద్వేల్లోని సుమిత్రా నగర్లో ఉండే మహమ్మద్, ఆకాశ్ పిల్లలను స్కూల్లో చేర్పించేందుకు బద్వేల్ నుంచి నెల్లూరు వెళ్లారు. తిరిగి బద్వేల్ వస్తుండగా మర్రిపాడు వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో మహమ్మద్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆకాశ్కు స్వల్ప గాయాలయ్యాయి.

జిల్లాలో 10 వ్యవసాయ మార్కెట్ కమిటీలున్నాయి. ఇందులో కేవలం 4 మాత్రమే రైతులకు ఉపయోగంలో ఉన్నాయి. కడప యార్డులో సీజన్లో మాత్రమే ముడి పసుపు ట్రేడింగ్ జరుగుతుంది. మైదుకూరు యార్డులో మంగళవారం రోజు పశువుల సంత నిర్వహిస్తారు. పులివెందుల యార్డులో గురువారం పశువుల మార్కెట్ జరుగుతుంది. ఇక్కడ సీజన్లో బత్తాయి ట్రేడింగ్ జరుగుతుంది. ముద్దనూరు యార్డులో మాత్రమే రైతులు ప్రతిరోజూ ఆకుకూరలు కూరగాయలు అమ్ముకుంటారు.

జిల్లాలో పలు ప్రాంతాలలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ జిల్లాల దొంగలను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. తాళాలు వేసిన ఇల్లు, బంగారు దుకాణాలను వీళ్లు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతుండే వారని పోలీసులు తెలిపారు. ఈ నిందితులు మైదుకూరు డివిజన్లో ఎక్కువగా చోరీలు చేసినట్లు చెప్పారు. అర కేజీ బంగారం, 10 కేజీలు వెండి ఆభరణాలు, ఒక స్కూటర్ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.

కడప జిల్లాలో 3,334 మగ్గాలకు విద్యుత్ సర్వీసులు ఉన్నాయి. డివిజన్ల వారీగా..
కడపలో 929, మైదుకూరులో 935, ప్రొద్దుటూరులో 1,364, పులివెందులలో 106 సర్వీసులు ఉన్నాయి.
అలాగే జిల్లాలో 10 HPలో ఉన్న పవర్ లూమ్స్ సర్వీసులు 203 మాత్రమే ఉన్నాయి. అవి కూడా ప్రొద్దుటూరు డివిజన్లోనే ఉన్నాయి. నేటి నుంచి ఈ హ్యాండ్లూమ్స్కు 200, పవర్ లూమ్స్కు 500 యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. నల్లగొండవారిపల్లెలో ప్రచారానికి వెళ్లిన వైసీపీ ఎమ్మెల్సీ రమేశ్, రాముపై దాడి జరిగింది. ఈ ఘటనలో వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి. దీంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. వైసీపీ నేత రాము ఫిర్యాదుతో 25 మందిపై హత్యాయత్నం కేసు ఫైల్ చేశారు. బీటెక్ రవి తమ్ముడు భరత్ రెడ్డిపైనా కేసు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.

ఇటీవల కాలంలో సైబర్ మోసాలు అధికమయ్యాయని, వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. సైబర్ నేరగాళ్లు విభిన్న రకాలుగా ప్రజలను మోసగించడానికి ప్రయత్నిస్తుంటారన్నారు. వాట్సప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం వంటి సామాజిక మాధ్యమాల్లో తెలియని వ్యక్తులు పంపే లింకులు క్లిక్ చేయరాదని సూచించారు. ఎవరికీ ఓటీపీ చెప్పవద్దన్నారు.
Sorry, no posts matched your criteria.