Y.S.R. Cuddapah

News August 7, 2025

పోలీసులకు దండం పెట్టిన కడప MP

image

పులివెందుల ZPTC ఉపఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ప్రచారంలో TDP, YCP నాయకులు పరస్పర దాడులు చేసుకున్నారు. కావాలనే వైసీపీ కవ్విస్తోందని TDP ఆరోపిస్తోంది. ఓటర్లను భయపెట్టడానికే టీడీపీ దాడులు చేస్తోందని YCP అంటోంది. నిన్న ఆ పార్టీ నాయకులు ర్యాలీగా వెళ్లి పులివెందుల DSPకి ఫిర్యాదు చేశారు. ‘దయచేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపండి’ అంటూ కడప MP అవినాశ్ రెడ్డి పోలీసులకు దండం పెట్టగా.. ఈ ఫొటో వైరలవుతోంది.

News August 6, 2025

ప్రొద్దుటూరు: గత నెలలో 136.95MU విద్యుత్ ఉత్పత్తి

image

ప్రొద్దుటూరు డివిజన్ పరిధిలోని విద్యుత్ కేంద్రాలు గత నెలలో 136.95MU విద్యుత్ ఉత్పత్తి చేశాయి. విండ్ పవర్ 79.298 MU, సోలార్ పవర్ 57.64 MU విద్యుత్ ఉత్పత్తి చేశాయి. హెట్రో విండ్ 41.88 MU, అనిమెల విండ్ 37.41 MU, అదానీ సోలార్ 37.41 MU, సోలైరెప్రో సోలార్ 18.118 MU, యశ్వంత్ సోలార్ 0.089 MU విద్యుత్‌ను ఉత్పత్తి చేశాయి. ప్రభుత్వ రంగంలోని RTPPలో 658.14MU విద్యుత్ ఉత్పత్తి జరిగింది.

News August 6, 2025

కడప జిల్లాలో పలువురు CIల బదిలీ

image

కడప జిల్లాలో CIలను బదిలీ చేస్తూ కర్నూల్ DIG కోయ ప్రవీణ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొద్దుటూరు ట్రాఫిక్‌కు రాజగోపాల్, కడప VRకు సుబ్బారావు, కృష్ణయ్యలను బదిలీ చేశారు. జమ్మలమడుగు అర్బన్‌కు నరేష్ బాబు, రూరల్‌కు భాస్కరరెడ్డి, బద్వేల్‌కు లింగప్ప, ఎర్రగుంట్లకు విశ్వనాథరెడ్డి, కొండాపురానికి రాజు, కడప సైబర్ సెల్‌కు సురేష్ రెడ్డిలను బదిలీ చేశారు. తక్షణమే ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.

News August 5, 2025

కడప: ‘డ్రోన్’ నిఘాలో జడ్పీటీసీ ఎన్నికల ప్రచారాలు

image

కడప జిల్లాలో ఈ నెల 12న పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంపై ఎస్పీ అశోక్ కుమార్ అత్యాధునిక డ్రోన్ కెమెరా ద్వారా నిఘా పెంచారు. పులివెందుల మండలంలోని ఆర్.తుమ్మలపల్లి, నల్లపురెడ్డి పల్లి, రాగిమాని పల్లి, రాయలాపురం ప్రాంతాల్లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంపై డ్రోన్ కెమెరా ద్వారా పర్యవేక్షించారు. అభ్యర్థులు చేస్తున్న ప్రచారం ప్రశాంత వాతావరణంలో జరగాలన్నారు.

News August 5, 2025

కడప: అన్నాచెల్లెళ్లకు కానిస్టేబుల్ జాబ్స్

image

కానిస్టేబుల్ ఉద్యోగాల ఫలితాల్లో కడప పరిధిలోని అరుందతి నగర్‌కు చెందిన అన్నాచెల్లెళ్లు మధుమోహన్, లలితాదేవిలు సత్తా చాటారు. వారధి ఓబులేసు, రామలక్షుమ్మల ఇద్దరు సంతానం కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఒకే కుటుంబంలోని అన్నాచెల్లెళ్లకు పోలీస్ జాబ్స్ రావడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. కాగా కడప ఆకాశవాణిలో మధు మోహన్ క్యాజువల్ అనౌన్సర్‌గా, లలితాదేవి యువవాణి కాంపియర్‌గా పనిచేస్తూ ప్రిపేర్ అయ్యారు.

News August 5, 2025

మైదుకూరు: NAFED గోడౌన్లతో ఉల్లి రైతుల సమస్యలు తీరేనా?

image

మైదుకూరు ప్రాంతంలో పండించే కృష్ణాపురం ఉల్లికి అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉంది. KP ఉల్లిలో ఔషధ గుణాలు ఉండడంతో వాటి తయారీ కంపెనీలు మాత్రమే వీటిని కొనుగోలు చేస్తున్నాయి. అయితే కొనుగోళ్లు లేనప్పుడు, ధరలు తగ్గినప్పుడు KPఉల్లిని నిల్వ ఉంచే NAFED గోడౌన్లు ఇక్కడ లేవు. దీంతో రైతులు నష్టపోతున్నారు. ఇక్కడ గోడౌన్ల నిర్మాణానికి NAFED ముందుకు రావడంతో KPఉల్లి రైతులకు మేలు కలుగుతుందని ఆశిస్తున్నారు.

News August 4, 2025

కడప: ఫలితాలు విడుదల

image

కడప డా.వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ విభాగానికి సంబంధించిన 6వ సెమిస్టర్ సప్లిమెంటరీ ఫలితాలను వర్సిటీ ఉపకులపతి ఆచార్య జి. విశ్వనాథ కుమార్ సోమవారం విడుదల చేశారు. వర్సిటీ అదనపు పరీక్షల నియంత్రనాధికారి డా. జి. ఫణీంద్ర రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమార్థం త్వరితగతిన పరీక్షా ఫలితాలను విడుదల చేయడం జరిగిందన్నారు.

News July 11, 2025

ప్రొద్దుటూరు: రూ.కోట్లతో రామేశ్వరం బ్రిడ్జి నిర్మాణం.. అటవీ శాఖ అభ్యంతరం

image

రామేశ్వరం బ్రిడ్జి నిర్మాణానికి అటవీశాఖ నుంచి బ్రేక్ పడింది. అప్రోచ్ రోడ్లు RFలోకి వస్తున్నాయంటూ అభ్యంతరం తెలిపింది. స్థానిక రామేశ్వరం పెన్నా నదిపై రూ.53కోట్లతో హైలెవల్ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. MDR గ్రాంట్ స్కీమ్ నిధులతో ప్రొద్దుటూరు- RTPP మార్గంలో R&B బ్రిడ్జి నిర్మాణం చేపట్టింది. ఇప్పటికే సుమారు 65% పనులు పూర్తయ్యాయి. ఇంకా అప్రోచ్ రోడ్లు నిర్మించాల్సి ఉంది. కాగా ప్రస్తుతం పనికి బ్రేక్ పడింది.

News July 11, 2025

కడప: ట్రాఫిక్ నియంత్రణకు పకడ్బందీ చర్యలు

image

కడప జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టిసారించాలని ఎస్పీ అశోక్ కుమార్ సిబ్బందికి సూచించారు. ఆధ్యాధునిక సాంకేతికతతో రూపొందించిన బైకులను ఎస్పీ శుక్రవారం ప్రారంభించారు. సైరన్, బ్లింకర్స్, పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టం, క్రౌడ్ కంట్రోల్ చేసే సదుపాయాలు ఈ వాహనాల్లో ఉన్నాయి. కడపకు 7, ప్రొద్దుటూరుకు 4, పులివెందులకు 2, జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేలుకు ఒకొక్కటి చొప్పున నూతన వాహనాలు కేటాయించారు.

News July 11, 2025

ప్రొద్దుటూరు: 159 మంది విద్యార్థులకు ఇద్దరే టీచర్లు

image

ప్రొద్దుటూరులోని రామేశ్వరం పురపాలక ప్రాథమిక ఆదర్శ పాఠశాలలో 159 మంది విద్యార్థులకు ఇద్దరే టీచర్లు ఉన్నారు. ఇక్కడ ఐదు తరగతులు ఉన్నాయి. నెల కిందట ఇక్కడ HM, ఆరుగురు టీచర్లు ఉండేవారు. బదిలీల తర్వాత ఇక్కడ ఇప్పుడు HM ఇద్దరు టీచర్లు మాత్రమే ఉన్నారు. టీచర్ల కొరతపై MEO దృష్టికి తీసుకెళ్లామని HM వెంకట సుబ్బారెడ్డి తెలిపారు. టీచర్ల సర్దుబాటు తన పరిధిలో లేదని MEO సావిత్రమ్మ తెలిపారు.