Y.S.R. Cuddapah

News August 27, 2025

కడప: 27 బార్లకు 7 బార్లకే దరఖాస్తులు

image

కడప జిల్లాలో జనరల్ కేటగిరిలో 27 బార్ల ఏర్పాటుకు అధికారులు ఈనెల 18న దరఖాస్తులు ఆహ్వానించారు. ఇందుకు ఇవాళ్టితో ముగియగా ఈ నెల 29 వరకు పొడగించారు. ఈ రోజుకి 27కు గాను 7బార్లకు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. ప్రొద్దుటూరులో 4 బార్లకు, కడపలో 2 బార్లకు, బద్వేల్‌లో 1 బార్‌కు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. పులివెందుల, మైదుకూరు, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, కమలాపురంలో బార్లకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు.

News August 26, 2025

కడప: ‘బార్ల దరఖాస్తుకు గడువు పొడిగింపు’

image

కడప జిల్లాలో బార్ల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవడానికి గడువును ఈనెల 29వ తేది వరకు పొడిగించినట్లు జిల్లా ప్రాహిబిషన్ & ఎక్సైజ్ అధికారి రవికుమార్ మంగళవారం తెలిపారు. జిల్లాలో జనరల్ కేటగిరిలో 27, గీత కులాల కేటగిరీలో 2లో కలిపి మొత్తం 29 బార్ల ఏర్పాటుకు అధికారులు గతంలో నోటిఫికేషన్ ఇచ్చారు.

News August 26, 2025

DJ.. సందిగ్ధంలో కడప జిల్లా వాసులు

image

వినాయక పండుగ సందర్భంగా కడప జిల్లా వాసులు DJ విషయంలో సందిగ్ధంలో పడ్డారు. DJలకు ఎటువంటి పర్మిషన్ లేదని ఇప్పటికే ఎస్పీ కార్యాలయం తెలిపింది. అయితే ఇవాళ కడప జిల్లా TDP అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ.. DJలకు పోలీసులు పర్మిషన్ ఇవ్వాలని, నిబంధనలు ఎక్కువగా లేకుండా పర్మిషన్లు ఇవ్వాలన్నారు. దీనిపై పోలీసులు అధికారికంగా ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో వినాయక మండపాల నిర్వాహకులు అయోమయంలో పడ్డారు.

News August 26, 2025

కడప జిల్లాలో సీఐల బదిలీ ఇలా

image

➤తిమ్మారెడ్డి: అన్నమయ్య TO ప్రొద్దుటూరు 1టౌన్
➤రామకృష్ణారెడ్డి: ప్రొద్దుటూరు 1టౌన్ TO కడప రిమ్స్
➤సీతారామిరెడ్డి: కడప రిమ్స్ TO పులివెందుల అర్బన్
➤చాంద్ బాషా: పులివెందుల TO నంద్యాల సైబర్ క్రైం
➤వంశీధర్: నంద్యాల సైబర్ TO ఖాజీపేట
➤మోహన్: ఖాజీపేట TO కడప వీఆర్
➤నాగభూషణం: సీకేదిన్నెTO ప్రొద్దుటూరు రూరల్
➤బాల మద్దిలేటి: ప్రొద్దుటూరు రూరల్ TO సీకేదిన్నె

News August 26, 2025

కడప జిల్లాలో మూడు పార్టీల రద్దు

image

కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన మూడు రాజకీయ పార్టీలను ఎన్నికల జాబితా నుంచి తొలగించినట్లు సహాయ ఎన్నికల నమోదు అధికారి గంగయ్య వెల్లడించారు. రాయలసీమ రాష్ట్ర సమితి, వైఎస్సార్ బహుజన, సధర్మ సంస్థాపన పార్టీలు 2019నుంచి 6 ఏళ్లుగా ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదని చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951క్రింద ఈ మూడు పార్టీలను రద్దు చేశామన్నారు.

News August 26, 2025

MRPకే యూరియా ఇవ్వాలి: కడప జిల్లా ASP

image

కడప జిల్లాలో యూరియా కొరత లేదని రీజినల్ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ASP శ్రీనివాసరావు స్పష్టం చేశారు. దువ్వూరులో ఎరువుల షాపులను తనిఖీ చేశారు. జిల్లాలో 3,350 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందన్నారు. RSKల్లో, ప్రైవేట్ డీలర్ల వద్ద యూరియా పొందవచ్చని సూచించారు. MRP ధరకే విక్రయించాలని డీలర్లకు సూచించారు. జిల్లాలో చాలాచోట్ల యూరియా పక్కదారి పడుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. మీ ఏరియాలో MRPకే ఇస్తున్నారా?

News August 26, 2025

కడప: శక్తి యాప్ ఉపయోగంపై విద్యార్థులకు అవగాహన

image

శక్తి యాప్ ఉపయోగంపై సోమవారం ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ బాలస్వామి రెడ్డి అవగాహన కల్పించారు. ప్రస్తుత చట్టాలు, రోడ్డు భద్రత, మహిళల పట్ల జరిగే నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం వల్ల జరిగే నష్టాల గురించి ఆయన విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనేలా మహిళలు సిద్ధంగా ఉండాలని ప్రిన్సిపల్ సుదర్శన్ రెడ్డి సూచించారు.

News August 26, 2025

కడప: 190 మంది కానిస్టేబుల్ అభ్యర్థుల ధృవీకరణ పత్రాల వెరిఫికేషన్

image

కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం 190 మంది కానిస్టేబుల్ అభ్యర్థుల ధ్రువపత్రాలను అధికారులు పరిశీలించారు. ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో వెరిఫికేషన్ జరిగింది. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సరియైన సర్టిఫికెట్లు ఉన్నవారికి ఉద్యోగం వస్తుందని స్పష్టం చేశారు. తప్పుడు సర్టిఫికెట్ల ఎవరైనా తీసుకొస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News August 25, 2025

జిల్లాలో 3350 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ: విజిలెన్స్ ఎస్పీ

image

జిల్లాలో యూరియా కొరత లేదని రీజినల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ SP శ్రీనివాసరావు స్పష్టం చేశారు. దువ్వూరులో ఎరువుల షాపులను తనికి చేసిన అనంతరం మాట్లాడారు. జిల్లాలో 3350 మెట్రిక్ టన్నుల నిల్వ ఉందన్నారు. దువ్వూరు మండలంలోని RSKల్లో 20 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్ల వద్ద 72 మెట్రిక్ టన్నులు నిల్వలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. కచ్చితంగా MRP ధరకే విక్రయించాలని డీలర్లకు సూచించారు.

News August 25, 2025

మహిళలకు రక్షణ లేదు: రాచమల్లు

image

కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారిపై అత్యాచారాలు, హత్యలు ఎక్కువయ్యాయన్నారు. కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులే వీటిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. వీరిపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వానికి పాలించే అర్హత లేదని విమర్శించారు.