Y.S.R. Cuddapah

News October 4, 2025

కడప: కన్ఫ్యూజన్‌లో ఆ 2 నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు

image

కడప జిల్లాలోని ఆ 2 నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు కన్ఫ్యూజన్‌లో ఉన్నారు. జమ్మలమడుగు, బద్వేల్‌లో ఇద్దరిద్దరు నేతలు సమన్వయకర్తలుగా ఉండటంతో ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియక కార్యకర్తలు సందిగ్ధంలో పడుతున్నారు. జమ్మలమడుగులో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిల మధ్య, బద్వేల్‌లో ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి, విశ్వనాథ్ రెడ్డిల మధ్య ఇన్‌ఛార్జ్ పదవి కోసం పోరు సాగుతోంది.

News October 4, 2025

రేపు కడప జిల్లాకు రానున్న మంత్రి సవిత

image

కడప జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సవిత శనివారం కమలాపురం రానున్నట్టు టీడీపీ వర్గాలు శుక్రవారం తెలిపాయి. కూటమి ప్రభుత్వం శనివారం ఆటో డ్రైవర్లకు 15 వేల రూపాయల ఆర్థిక సాయం అందచేయనుంది. కమలాపురం నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఆమె రానున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్రీధర్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి. ఎమ్మెల్యే చైతన్య రెడ్డి పాల్గొననున్నారు.

News October 3, 2025

ప్రొద్దుటూరు డిపోలో రూ.64.84 కోట్ల మద్యం అమ్మకాలు

image

ప్రొద్దుటూరు మద్యం డిపోలో గత నెలలో రూ.64,84,23,961 మద్యాన్ని విక్రయించారు. 90,917 కేసుల మద్యం(IML), 41,051 కేసుల బీర్లను విక్రయించారు. ప్రొద్దుటూరులో రూ.17,38,10,481, బద్వేల్‌లో రూ.10,19,74,024లు, జమ్మలమడుగులో రూ.6,44,49,207, ముద్దనూరులో రూ.3,65,34,335లు, మైదుకూరులో రూ.8,69,16,893, పులివెందులలో రూ.11,27,65, 246, ఎర్రగుంట్లలో రూ.7,19,73,773 మద్యం కొనుగోలు జరిగింది.

News October 2, 2025

మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పీఏకు బెయిల్

image

మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పీఏ ఖాజాకు కడప కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై సోషల్ మీడియాలో ఓ వీడియోను వైరల్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో కడప పోలీసులు ఆయనను <<17897036>>అరెస్ట్<<>> చేశారు. ఈ క్రమంలో కోర్టులో ప్రవేశపెట్టగా ఖాజాకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు న్యాయస్థానం తీర్పునిచ్చింది.

News October 2, 2025

వేముల : పెరిగిన చామంతి పూల ధరలు

image

ప్రస్తుతం మార్కెట్‌లో చామంతి ధరలు పెరిగాయి. బయట మార్కెట్లో కిలో చామంతి పూలు రూ. 70ల నుంచి రూ.80లు పలుకుతున్నాయి. చామంతి పూలను ఎక్కువగా చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల మార్కెట్లకు తరలిస్తున్నారు. వారం రోజుల క్రితం చామంతి ధరలు పడిపోయాయి. దసరా, దీపావళి పండుగలతోపాటు కార్తీకమాసం నేపథ్యంలో చామంతి ధరలు పెరిగాయి. దీంతో రైతులు తోటల వద్ద చామంతి పూలను కోసి మార్కెట్లకు తరలిస్తున్నారు.

News October 2, 2025

మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాష పీఏ అరెస్ట్

image

మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాష వ్యక్తిగత సహాయకుడు షేక్ ఖాజాను కడప వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఫిర్యాదు మేరకు తనపై సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా దూషణలతో ఉన్న వీడియోను వైరల్ చేశారన్న ఆరోపణలతో ఆయనను హైదరాబాదులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ తెల్లవారుజామున కడప నగర శివారులోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రానికి తీసుకుని వచ్చారు. కాసేపట్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

News October 2, 2025

సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నెంబర్‌గా ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి

image

వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బద్వేల్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డిని సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (CEC) మెంబర్”గా నియమించారు. ఈ సందర్భంగా బద్వేలు నియోజకవర్గ వైసీపీ నేతలు ఎమ్మెల్సీకి హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.

News October 1, 2025

కలివి కోడి పేరు వెనక చరిత్ర ఇదీ..!

image

కడప జిల్లాలో కలివి కోడి అన్వేషణకు రూ.50 కోట్ల వరకు ఖర్చు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల సిద్ధవటం అటవీ ప్రాంతంలో దీనిని గుర్తించారు. పరిగెత్తడమే కానీ ఎగరటంరాని ఈ కోడికి పొదల్లో తప్ప, విడిగా రక్షణ ఉండదు. కలివి పొదల్లో ఎక్కువగా దాగి ఉండటంతో కలివి కోడి అని పిలుస్తుంటారు. పెన్నా నదీ తీరంలో కనిపించే ఈ కోడిపై మరిన్ని అధ్యయనాలు జరుగుతన్నాయి. ఇదే కోడి కోసం ఏకంగా తెలుగు గంగ ప్రాజెక్ట్ అలైన్‌మెంట్ మార్చారు.

News October 1, 2025

3న గండిక్షేత్రంలో బహిరంగ వేలం

image

గండిక్షేత్రంలో టెంకాయలు విక్రయాలకు సంబంధించి అక్టోబర్ 3వ తేదీన బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ సహాయ కమిషనర్ వెంకటసుబ్బయ్య, ఛైర్మన్ కావలి కృష్ణతేజ వెల్లడించారు. ఆసక్తి ఉన్నవారు రూ.10 లక్షల డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొనాలని కోరారు. ఆరోజు ఉదయం 10 గంటలకు వేలం పాట ప్రారంభమవుతుందన్నారు.

News October 1, 2025

కడప: 11 ఏళ్లు అయినా నల్లధనం ఏదీ?

image

భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా యాత్ర చేపట్టిందని తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు. కడప ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. మోదీ పీఎంగా అధికారం చేపట్టి 11 ఏళ్లు అవుతున్నా నేటికీ నల్లధనాన్ని వెలికి తీయలేదన్నారు. ప్రజలకు ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదని చెప్పారు. సీఎం చంద్రబాబు ఏ మాత్రం అభివృద్ధి చేయలేదన్నారు.