Y.S.R. Cuddapah

News July 16, 2024

ప్రొద్దుటూరులో దారుణ హత్య.. కారణం

image

పట్టణంలోని నేతాజీ నగర్ 3లో గడ్డమీది బాలనాగమ్మ (63) అనే వృద్ధురాలు సోమవారం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల మేరకు.. కడపకు చెందిన నాగ ఉష 4 నెలల కిందట ప్రొద్దుటూరు చెందిన సురేశ్‌ను పెళ్లి చేసుకుంది. సురేశ్ తల్లి బాలనాగమ్మ పెళ్లికి పెద్దగా ఉండింది. ఈ పెళ్లి నాగ ఉష తండ్రికి ఇష్టం లేదు. దీంతో అల్లుడి ఇంటికి వచ్చిన ఉష తండ్రి బాత్రూంలో ఉన్న బాలనాగమ్మపై పెట్రోల్ పోసి హత్య చేశాడన్నారు.

News July 16, 2024

కడప: 22న డిగ్రీ విద్యార్థులకు వైవా-వోస్ పరీక్ష

image

యోగివేమన విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు ఈనెల 22వ తేదీ ఉదయం 10 గంటలకు వైవా- వోస్ నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ప్రొ. ఎన్. ఈశ్వరరెడ్డి తెలిపారు. లాంగ్ టర్మ్ ఇంటర్న్‌షిప్ ప్రాజెక్ట్ ఫీజు చెల్లించిన విద్యార్థులు వైవావోస్‌కు కడపలోని నాగార్జున మహిళా డిగ్రీ కళాశాలలో హాజరు కావాలని సూచించారు. విద్యార్థులు ప్రాజెక్ట్ రికార్డు హార్డ్ కాపీని సమర్పించాలన్నారు.

News July 15, 2024

కడప: పోస్టాఫీసులో 58 ఉద్యోగాలు

image

పదవ తరగతి అర్హతతో బీపీఎం/ఏబీపీఎం ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. కడప డివిజన్‌లో 28, ప్రొద్దుటూరు డివిజన్‌లో 30 పోస్టులను పోస్టల్ డిపార్ట్‌‌మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి బీపీఎం అయితే రూ.12 వేలు+అలవెన్సులు, ఏబీపీఎం అయితే రూ.10 వేలు+అలవెన్సులు జీతంగా ఇవ్వనున్నారు. పూర్తి వివరాలకు www.appost.gdsonline వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

News July 15, 2024

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

image

రామాపురం మండలం పాలన్న గారి పల్లె దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. పాలన్న గారి పల్లెకు చెందిన నాగభాస్కర్ రోడ్డు దాటుతుండగా.. గుర్తు తెలియని స్కూటర్ ఢీ కొనడంతో కిందపడ్డాడు. వెంటనే వేగంగా వచ్చిన కారు అతడిని ఢీ కొట్టడంతో తల నుజ్జునుజ్జయి మృతి చెందాడు. వెంటనే పోలీసులకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థాలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News July 15, 2024

స్టేట్ 29వ ర్యాంక్ సాధించిన కడప జిల్లా విద్యార్థిని

image

2023-2024 ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (APRCET)లో కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం కొత్తూరుకు చెందిన మునగల కల్పన స్టేట్ 29వ ర్యాంక్ సాధించారు. కల్పన 112 మార్కులు సాధించి APRCETలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు ఆమెకు అభినందనలు తెలిపారు.

News July 14, 2024

నందలూరు: ఆర్టీసీ కండక్టర్‌ను వెంటాడిన మృత్యువు

image

నందలూరు మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అందరూ ప్రాణాలతో బయటపడగా కండక్టర్ రాముడు(40) మాత్రం మృతి చెందారు. ప్రమాద సమయంలో కండక్టర్ బస్సులో నుంచి బయటికి ఎగిరిపడ్డారు. తిరిగి లేచి అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో లారీలో ఉన్న ఐరన్ కాయిల్ మీద పడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు బస్సులో ఉన్న ప్రయాణికులు తెలిపారు.

News July 14, 2024

సీఎం చంద్రబాబు చెప్పేదొకటి.. చేసేదొకటి: సాయి దత్త

image

ఓడలో ఉన్నంత సేపు ఓడ మల్లన్న, ఓడ దిగాక బోడిమల్లన్న, అన్న చందంగా చంద్రబాబు పనితీరు ఉందని కడప జిల్లా YCP విద్యార్థి విభాగం అధ్యక్షుడు సాయిదత్త విమర్శించారు. ఎన్నికలలో ఓటర్లను ఆకర్షించేందుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలో తొక్కడం చంద్రబాబుకు పరిపాటే అని అన్నారు. 2014లో కూడా రైతురుణ మాఫీ వాగ్దానాన్ని అమలు చేయని చరిత్ర ఆయనకుందని ఇప్పుడు అదే కోవలో తల్లికి వందనం నిలిచిందన్నారు.

News July 14, 2024

ఆధారాలు లేకుండా జగన్‌పై అక్రమ కేసు పెట్టడం సరికాదు: రెడ్యం

image

మాజీ సీఎం వైఎస్ జగన్‌పై ఎటువంటి ఆధారాలు, సాక్ష్యాలు లేకుండా అక్రమ కేసు పెట్టడం సరికాదని వైసీపీ నాయకుడు, ఏపీఎస్ ఆర్టీసీ మాజీ జోనల్ ఛైర్మన్ రెడ్యం వెంకట సుబ్బారెడ్డి అన్నారు. ఖాజీపేట మండలం దుంపలగట్టులోని తన కార్యాలయంలో ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ ఎమ్మెల్యే రఘురామక్రిష్ణమరాజుపై పోలీసుల దాడి వాస్తవం కాదని వైద్యపరీక్షల నివేదిక నిగ్గు తేల్చినా అక్రమ కేసు పెట్టడం సరికాదన్నారు.

News July 14, 2024

రాయచోటి: వెలుగులోకి భారీ మోసం

image

రాయచోటిలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల మేరకు.. కె.రామాపురంలో ఓ మహిళ 20 ఏళ్లుగా చీటీలు నడిపింది. ఈ క్రమంలో 70 మందికి పైగా రూ. 2.75 కోట్లు చీటీలు కట్టారు. గడువు తీరినా డబ్బులు చెల్లించకపోవడంతో బాధితులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు సీఐ చంద్రశేఖర్ తెలిపారు.

News July 14, 2024

ఒంటిమిట్ట: అరుగుపై కూర్చున్నందుకు దళితుడిపై దాడి

image

ఒంటిమిట్ట మండలంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. పెన్న పేరూరులో కదిరి ప్రభాకర్ (52) అదే గ్రామానికి చెందిన వెంకట సుబ్బారెడ్డి నిర్వహిస్తున్న దుకాణం వద్ద శనివారం అరుగుపై కూర్చున్నాడు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని వెంకటసుబ్బారెడ్డి చెప్పాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి పెనంలోని వేడి నూనె ప్రభాకర్ పై పోసి, కులం పేరుతో దూషించాడు. దీనిపై కేసు నమోదైందని పోలీసులు తెలిపారు.