Y.S.R. Cuddapah

News July 5, 2024

కడప: ఉద్యోగం రాలేదని యువకుడు సూసైడ్

image

కడప ఎర్రముక్కపల్లిలోని ఓ లాడ్జిలో ఉరి వేసుకొని చీర రంజిత్(25) సూసైడ్ చేసుకున్నట్లు 1టౌన్ సీఐ భాస్కర్ రెడ్డి తెలిపారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేటకు చెందిన రంజిత్ 2 రోజుల కిందట కడపలోని స్నేహితుడు ప్రశాంత్ రెడ్డి అక్క పెళ్లికి వచ్చాడు. లాడ్జిలో స్నేహితులతో కలిసి బసచేశాడు. పలుపోటీ పరీక్షలు రాసినా ఉద్యోగం రాలేదు. తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చలేదని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాని పోలీసులు తెలిపారు.

News July 5, 2024

కడప: ఎంపికైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి

image

జిల్లా వ్యాప్తంగా 2023 డిసెంబర్లో జరిగిన నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్షలో ఎంపికైన విద్యార్థులు ఆగస్టు 31వ తేదీ లోపు నేషనల్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించాలని డీఈఓ అనురాధ తెలిపారు. 2020, 2021, 2022 సంవత్సరాల్లో ఎంపికైన విద్యార్థులు తప్పకుండా రెన్యువల్ చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు. 2024 -25 సంవత్సరం విద్యార్థులు తాజా పునరుద్ధరణ దరఖాస్తులను ఆగస్టు 30 లోపు సమర్పించాలన్నారు.

News July 5, 2024

కడప: దొంగగా మారిన ఇంజినీరింగ్ విద్యార్థి

image

ముద్దనూరు మండలం పెనికలపాడు గ్రామానికి చెందిన ఇల్లూరు హరినాథరెడ్డి ఎరోనాటికల్ ఇంజినీరింగ్ చదువుకుని ఉద్యోగం లేక ఖాళీగా తిరుగుతున్నాడు. చెడు వ్యసనాలు, జల్సాలకు అలవాటు పడ్డాడు. రైళ్లలో తిరుగుతూ ఆదమరిచి నిద్రించే వారి వద్ద నుంచి సెల్ ఫోన్లు దొంగిలించి వాటిని బెంగళూరు, గోవాలో విక్రయిస్తున్నాడు. సెల్ ఫోన్లు చోరీ చేస్తూ చీరాల పోలీసులకు దొరికిపోయాడు. రైల్వే డిప్యూటీ సూపరింటెండెంట్ వివరాలు తెలిపారు.

News July 5, 2024

ప్రొద్దుటూరులో APEAPCET కౌన్సిలింగ్ హెల్ప్ లైన్ సెంటర్

image

ప్రొద్దుటూరు వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో APEAPCET-2024 కౌన్సిలింగ్ హెల్ప్ లైన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ కౌన్సిలింగ్ సెంటర్‌కు కోఆర్డినేటర్‌గా ప్రొఫెసర్ కేవీ రమణయ్యను అధికారులు నియమించారు. ఆయన మాట్లాడుతూ..నేటి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నామన్నారు. ఈ ప్రక్రియ ఈనెల 10వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. సందేహాలుంటే హెల్ప్ లైన్ సెంటర్‌ను సంప్రదించాలన్నారు.

News July 4, 2024

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం

image

వేంపల్లె(M) ఇడుపాలపాయలోని ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం రేగింది. బుధవారం రాత్రి ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు గంజాయి లోనికి తీసుకెళుతుండగా మెుయిన్ గేటు వద్ద సెక్యూరిటీకి పట్టుబడ్డారు.అధికారులు గురువారం కోర్ కమిటీ సమావేశం నిర్వహించి ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ప్రొపెసర్ ఏవీఎస్ కుమారసవామి వారికి టీసీ ఇచ్చినట్లు తెలుస్తుంది. గంజాయి ఎక్కడ నుంచి తీసుకొచ్చారనే కోణంలో విచారణ చేపట్టినట్లు సమాచారం.

News July 4, 2024

జగన్ మళ్లీ జైలుకు వెళ్లే సమయం ఆసన్నమైంది: రాంప్రసాద్ రెడ్డి

image

జగన్ మళ్లీ జైలుకు వెళ్లే సమయం ఆసన్నమైందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. 21 రోజుల్లోనే చంద్రబాబు ఏమీ చేయలేదని జగన్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ నేతలపై కక్ష సాధించే ఆలోచన టీడీపీకి లేదన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చరిత్ర అందరికీ తెలిసిందే, ఐదేళ్లలో మాచర్లలో నరమేధం సృష్టించారని ఆరోపించారు.

News July 4, 2024

కడప: సుమోను ఢీకొన్న లారీ.. ఇద్దరు దుర్మరణం

image

పుల్లంపేట మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామం చెరువుకోట వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. సుమోను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దెబ్బతిన్న వాహనాలను ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తొలగించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 4, 2024

కడప: మరణిస్తూ కూడా.. ఖాకీ డ్రస్‌కు గౌరవం

image

కమలాపురం పోలీసుస్టేషన్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న నాగార్జునరెడ్డి బుధవారం తాటిగొట్ల సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే చనిపోయే సమయంలో కూడా ఆయన తన ఖాకీ డ్రస్‌కు గౌరవాన్ని ఇచ్చారు. యూనిఫామ్ తీసి నీట్‌గా మడిచి పక్కనపెట్టి రైలు పట్టాల కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు.

News July 4, 2024

యర్రగుంట్ల: బొగ్గు వ్యాగన్లలో మృతదేహం

image

యర్రగుంట్ల మండల పరిధిలోని ఆర్టీపీపీలో బొగ్గు వ్యాగన్లలో గుర్తుతెలియని మృతదేహం బయటపడింది. కార్మికుల వివరాల ప్రకారం.. బొగ్గును యూనిట్లకు సరఫరా చేస్తున్న సమయంలో మృతదేహం కనిపించింది. రెండు రోజుల క్రితం కృష్ణపట్నం పోర్టు నుంచి బయలుదేరి ఈ వ్యాగన్లు ఇవాళ ఆర్టీపీపీకి చేరుకున్నాయి. ఈ విషయం ఈ విషయం తెలుసుకున్న ఎస్పీఎఫ్ కలమల్ల పోలీసులు పరిశీలించి విచారణ చేపట్టారు.

News July 4, 2024

కడప: 6న డిగ్రీ అర్హతతో జాబ్ మేళా

image

కడప రిమ్స్ రోడ్డులోని స్పిరిట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఈ నెల 6వ తేదీ ఉదయం 9 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్లేస్మెంట్ అధికారి ఎస్ఎండీ మునీర్ తెలిపారు. ఏదైనా డిగ్రీ లేక పీజీ ఉత్తీర్ణులై 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఈ జాబ్ మేళాను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.