Y.S.R. Cuddapah

News December 18, 2024

జీజీహెచ్ అభివృద్ధి అందరి బాధ్యత: కలెక్టర్

image

కడప జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న జిల్లా సర్వజన ఆసుపత్రిని మరింత అభివృద్ధి పథంలో నడిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సూచించారు. రిమ్స్ ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రిమ్స్ వైద్య విభాగాధిపతులతో బుధవారం సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రజలకు మాత్రమే కాకుండా రాయలసీమ స్థాయిలోనూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ అత్యుత్తమ టీచింగ్ హాస్పిటల్‌గా పేరు గడించిందన్నారు.

News December 18, 2024

జమిలి ఎన్నికల నిర్ణయం మార్పు చేసుకోవాలి: తులసిరెడ్డి

image

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న జమిలి ఎన్నికల నిర్ణయం సరైనది కాదని పీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ తులసిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. జమిలీ ఎన్నికలు అవసరం లేదని, ఆచరణ కూడా సాధ్యం కాదని అన్నారు. జమిలి ఎన్నికలు బీజేపీ ప్రభుత్వం తీసుకురావాలి అనుకోవడం మూర్ఖత్వం అని మండిపడ్డారు. ఇలాంటి నిర్ణయాలు మార్చుకోవాలని హితువు పలికారు.

News December 18, 2024

నేడు కలికిరి రెవెన్యూ సదస్సుకు అన్నమయ్య కలెక్టర్

image

కలికిరిలో జరగబోయే రెవెన్యూ సదస్సుకు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి బుధవారం హాజరు కానున్నారు. ఈనెల 6 నుంచి అన్నమయ్య జిల్లాలో రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. భవిష్యత్తులో భూ సమస్యలు లేకుండా చేసేందుకు, రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. కలికిరి మండలానికి సంబంధించిన ప్రజలు సమస్యలను తెలపాలన్నారు.

News December 17, 2024

అన్నమయ్య: రోడ్డు ప్రమాదంలో యువ డాక్టర్ మృతి

image

రైల్వే కోడూరు మండలం లక్ష్మిగారిపల్లి వద్ద అనంతపురానికి చెందిన అనస్థీషియా ట్రైనీ డాక్టర్ మహేంద్ర (21) సోమవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందారు. తిరుపతిలో డాక్టర్ కోర్సు చేస్తూ.. సోమవారం అనంతపురం నుంచి బుల్లెట్ బైక్‌పై తిరుపతి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News December 17, 2024

అన్నమయ్య: రోడ్డు ప్రమాదంలో యువ డాక్టర్ మృతి

image

రైల్వే కోడూరు మండలం లక్ష్మిగారిపల్లి వద్ద అనంతపురానికి చెందిన అనస్థీషియా ట్రైనీ డాక్టర్ మహేంద్ర (21) సోమవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందారు. తిరుపతిలో డాక్టర్ కోర్సు చేస్తూ.. సోమవారం అనంతపురం నుంచి బుల్లెట్ బైక్‌పై తిరుపతి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News December 17, 2024

అన్నమయ్య: రూ.3.5 కోట్ల ఎర్రచందనం సీజ్

image

గుజరాత్‌లోని ఎర్రచందనం గోడౌన్‌పై తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసులు ఆకస్మిక దాడులు జరిపి ముగ్గురు అంతర్రాష్ట్ర ప్రధాన స్మగ్లర్లను మంగళవారం అరెస్ట్ చేశారు. సుమారు రూ.3.5 కోట్ల విలువ గల 155 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా సానిపాయ ప్రాంతంలో ఇద్దరు ఎర్రచందనం ముద్దాయిలను అరెస్టు చేసి విచారించగా.. వారి ద్వారా గుజరాత్ గోడౌన్ గురించి సమాచారం తెలిసిందని వారు తెలిపారు.

News December 17, 2024

అన్నమయ్య: మద్యం మత్తులో ఇంట్లోకి దూరిన యువకులు

image

మద్యం మత్తులో ఇంట్లోకి చొరబడ్డ యువకులకు స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారని అన్నమయ్య జిల్లా మదనపల్లె తాలూకా సీఐ కళావెంకటరమణ తెలిపారు. స్థానిక కొత్తఇండ్లకు చెందిన ముగ్గురు యువకులు మద్యం తాగారన్నారు. ఆ మత్తులో బైకును నడపలేక పక్కనే ఉన్న కొత్తపల్లి శాంతిపురం కాలనీలోని ఓ ఇంట్లోకి చొరబడ్డారన్నారు. స్థానికులు యువకులను తాళ్లతో బంధించి, దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించినట్లు చెప్పారు.

News December 17, 2024

కడప: ఏడుగురు వైసీపీ కార్పొరేటర్లు సస్పెండ్

image

కడప నగరపాలక సంస్థలో <<14900085>>ఏడుగురు కార్పొరేటర్లు<<>>, నలుగురు పార్టీ నాయకులను సస్పెండ్ చేసినట్లు కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. టీడీపీలో చేరిన వారందరినీ సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. త్వరలోనే ఆయా డివిజన్లకు కొత్త ఇన్‌ఛార్జులను నియమిస్తామని ఆయన వెల్లడించారు.

News December 17, 2024

టీడీపీలో చేరిన కడప వైసీపీ కార్పొరేటర్లు 8మంది వీరే.!

image

కడప YCP కార్పొరేటర్లు సోమవారం 7 మంది చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. అలాగే కొద్ది రోజుల క్రితం ఒకరు చేరారు. వారి వివరాలివే.
➤2వ డివిజన్ – సుబ్బారెడ్డి
➤3వ డివిజన్ – మానసా
➤6వ డివిజన్ – నాగేంద్ర
➤8వ డివిజన్ – లక్ష్మీ దేవి
➤36వ డివిజన్ – జఫ్రుల్లా
➤42వ డివిజన్ – చల్లా స్వప్న
➤50వ డివిజన్ – అరుణ ప్రభ
➤25వ డివిజన్ – సూర్య నారాయణ
ఏడుగురు కార్పొరేటర్లు సహా పలువురు అనుచరులు టీడీపీలో చేరారు.

News December 17, 2024

సమస్యలను త్వరగా పరిష్కారించాలి: కడప JC

image

సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలకు త్వరగా పరిష్కారం అందించాలని కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింఘ్ అధికారులను ఆదేశించారు. కడప జిల్లా కలెక్టరేట్‌లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాల ద్వారా, సోమవారం ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులకు బదిలీ చేస్తూ ప్రజలకు సంబంధించిన ఫిర్యాదులను సత్వరమే విచారించి న్యాయం చేయాలన్నారు.