Y.S.R. Cuddapah

News July 4, 2024

రాయచోటి: GREAT.. ఏడాదికి రూ.32 లక్షల జీతం

image

రాయచోటిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన విజయ్‌ రూ.32 లక్షల వేతనంతో కొలువు సాధించాడు. ఆన్లైన్ విధానంలో బ్యాంకింగ్ వ్యవస్థకు చెందిన ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. జపాన్‌లో పేరు కలిగిన సాప్ట్ బ్యాంకు సంస్థలో ఏడాదికి రూ.32 లక్షల వేతనానికి విజయ్ ఎంపికయ్యారని తెలిపారు.

News July 4, 2024

కడప: తల్లితో మళ్లీ వస్తానని చెప్పి..

image

పెండ్లిమర్రిలో ఓ యువకుడు తన తల్లికి మళ్లీ వస్తానని చెప్పి శవమై తిరిగివచ్చాడు. పెండ్లిమర్రి మండలం పాత సంగటిపల్లెకు చెందిన <<13555648>>బి.మల్లికార్జున రెడ్డి<<>>(30) సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసేవాడు. ఐదు నెలల క్రితం ఉద్యోగం పోయింది. మళ్లీ ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. ఈ క్రమంలో సోమవారం తల్లికి మళ్లీ వస్తానని చెప్పి సూసైడ్ చేసుకున్నాడని తల్లి వాపోయింది. ఉద్యోగం రాకపోవడమే సూసైడ్‌‌కు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

News July 4, 2024

చక్రాయపేట: గొట్లమిట్ట సమీపంలో చిరుత సంచారం

image

వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల సరిహద్దులో ఉన్న మండలంలోని గొట్లమిట్ట సమీపంలో బుధవారం చిరుత కనిపించినట్లు గంగారపువాండ్లపల్లె సర్పంచ్ నాగరత్నమ్మ భర్త మల్రెడ్డి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. చక్రాయపేట వైపు నుంచి కొర్లకుంటకు వెళుతుండగా వారికి రోడ్డుకు అడ్డుగా వచ్చిందన్నారు. వారు హారన్ కొట్టడంతో దగ్గర్లో ఉన్న గుట్టల్లోకి వెళ్లిందని, దీనిపై ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించామన్నారు. 

News July 4, 2024

కడప: ‘మాజీ VC, రిజిస్ట్రార్ అవినీతిపై విచారణ జరపాలి’

image

యోగివేమన ఆర్కిటెక్చర్ యూనివర్సిటీలలో ఔట్ సోర్సింగ్ నియామకాలలో అక్రమాలకు పాల్పడిన మాజీ రిజిస్ట్రార్ ఈసీ సురేంద్రనాథ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు. పిడిఎస్‌యు ఆధ్వర్యంలో బుధవారం యోగివేమన విశ్వవిద్యాలయం ప్రధాన గేటు వద్ద ఆందోళన నిర్వహించారు. యూనివర్సిటి మాజీ వీసీ చింతా సుధాకర్‌పై ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

News July 3, 2024

కడప: YVUలో డిగ్రీ ఆనర్స్ కోర్సులు ప్రారంభం

image

వైవీయూలో 2024-25 విద్యా సంవత్సరం బీఎస్సీ (ఆనర్స్) ఫిజిక్స్, కెమిస్ట్రీ, బీకాం కంప్యూటర్స్ డిగ్రీ కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు రిజిస్ట్రార్, ప్రొఫెసర్ ఎస్.రఘునాథరెడ్డి వెల్లడించారు. ప్రొ. కృష్ణారెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జాతీయ విద్యా విధానం-2020ని అనుసరించి కోర్సులను తెచ్చామన్నారు. నిష్ణాతులైన అధ్యాపకులు, ప్రయోగశాలలు, ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థులు చదువుకోవచ్చన్నారు.

News July 3, 2024

తొండూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

పులివెందుల ముద్దనూరు ప్రధాన రహదారిలోని మడూరు బస్టాప్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసులు కథను మేరకు కొండాపురం మండలం లావనూరుకి చెందిన వేణుగోపాల్ నాయుడు(36) పులివెందులకు బైకులో వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా మడూరు సమీపంలోకి రాగానే సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. దీంతో ఎస్సై లక్ష్మీనారాయణ కేసు నమోదు చేశారు.

News July 3, 2024

కడప: రూ.1.90 కోట్ల ఎర్రచందనం స్వాధీనం

image

ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామం నందు దొరికిన రూ.1.90 కోట్లు విలువల గల 158 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. బుధవారం స్థానిక ఎస్పీ కార్యాలయానికి పట్టుబడిన ఎర్రచందనం దుంగలతో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పోట్లదుర్తి క్రాస్ రోడ్డు వద్ద మినీ లారీలో రవాణాకు సిద్ధంగా ఉన్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నమన్నారు.

News July 3, 2024

పులివెందుల: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

పులివెందుల-ముద్దనూరు ప్రధాన హైవేపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. సైదాపురం మడూరు మార్గమధ్యంలో పులివెందుల వైపు నుంచి ద్విచక్ర వాహనంలో వస్తుండగా ఎదురుగా ముద్దనూరు నుంచి బూడిద ట్యాంకరు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News July 3, 2024

కడప యువతిపై అత్యాచారయత్నం.. కేసు నమోదు

image

HYDలో అత్యాచార ఘటన కలకలం రేపింది. పోలీసుల వివరాల మేరకు.. కడపకు చెందిన ఓ యువతి HYD మియాపూర్‌లో రియల్ ఎస్టేట్ సేల్స్ ట్రైనీగా పనిచేస్తుంది. అదే కంపెనీలో పనిచేస్తున్న సంగారెడ్డి, జనార్దన్ సైట్ చూపిస్తామంటూ ఆమెను కారులో తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించారు. తప్పించుకున్న యువతి ఉప్పల్ PSలో ఫిర్యాదు చేయగా అక్కడి నుంచి మియాపూర్ PSకు కేసును బదిలీ చేశారు.

News July 3, 2024

వివేకా ఇంటి వాచ్‌మెన్ రంగయ్య పరిస్థితి విషమం

image

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి ఇంటికి వాచ్మెన్‌గా ఉన్న రంగయ్య పరిస్థితి బుధవారం విషమించింది. శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న రంగయ్యను పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడి డాక్టర్ల సూచన మేరకు ఆయన్ను కడప రిమ్స్‌కు తరలించారు. వివేకానంద హత్య కేసులో ఈయన్ను గతంలో సీబీఐ విచారించిన విషయం తెలిసిందే.