India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఓబులవారిపల్లి మండలం మంగంపేట 10వ వీధికి చెందిన గట్టు ఆంజనేయులు(57) హత్య కేసులో నిందితుడు అయ్యలరాజుపల్లికి చెందిన అంజనేయ ప్రసాద్కు సహకరించిన చంద్రకళ, సింహాద్రిని కూడా అరెస్టు చేశామని రాజంపేట డీఎస్పీ సుధాకర్ తెలిపారు. శుక్రవారం కోడూరు స్టేషన్లో మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టి, వివరాలు వెల్లడించారు. యూట్యూబర్ అయిన నిందితుడు సానుభూతి పొందడానికి వీడియో రిలీజ్ చేశారని తెలిపారు.
కోటి సభ్యత్వాలే లక్ష్యంగా టీడీపీ ముందుకెళ్తోంది. రూ.100 కడితే రూ.5 లక్షల బీమా ఉండటంతో పలువురు టీడీపీ సభ్యత్వాలు తీసుకుంటున్నారు. ఈక్రమంలో నిన్నటి వరకు మొత్తం సభ్యత్వాల సంఖ్య 71 లక్షలు దాటింది. ఇందులో రాజంపేట టాప్లో ఉంది. ఆ తర్వాతే సీఎం సొంత నియోజకవర్గం కుప్పం ఉండటం గమనార్హం.
కడప జిల్లా వేముల మండల కేంద్రంలో నీటి సంఘాల ఎన్నికల్లో అధికార టీడీపీ నేతల దారుణాలను ప్రపంచానికి చూపిస్తున్న జర్నలిస్ట్లపై దాడి హేయమైన చర్యని YS జగన్ అభిప్రాయపడ్డారు. X వేదికగా ఈ దాడిని ఆయన శుక్రవారం తీవ్రంగా ఖండించారు. మీడియాపై జరిగిన దాడిని ప్రజాస్వామ్యంపై దాడిగా ఆయన అభివర్ణించారు. నిజాలు నిర్భయంగా వెలికితీస్తున్న మీడియా గొంతు నొక్కేయాలనుకోవడం కూటమి ప్రభుత్వం దుర్మార్గపు చర్య అన్నారు.
సీఎం చంద్రబాబుతో జరిగిన సమావేశంలో కడప కలెక్టర్ శ్రీధర్ కీలక విషయాలు బయటపెట్టారు. ‘వేరే జిల్లాలో ఇచ్చిన సదరం సర్టిఫికెట్తో మా జిల్లాలో 3,600 మంది పింఛన్ తీసుకుంటున్నారు. వీరిపై అనుమానంతో తనిఖీలు చేయగా కేవలం 127 మందే అర్హులని తేలింది. మిగిలిన వాళ్లు ఫేక్ సర్టిఫికెట్లతో పింఛన్ తీసుకున్నారు’ అని CMకు చెప్పారు. వెంటనే వారి నుంచి పెన్షన్ డబ్బులు రికవరీ చేసి.. అవసరమైతే కేసు పెట్టాలని CM ఆదేశించారు.
రాజంపేట మండలం ఆకేపాడు నవోదయ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ రాజశేఖర్ (37) కుటుంబ కలహాలతో గడ్డి మందు తాగి ఆత్మహత్యయత్నం చేశాడు. మద్యానికి బానిసైనా రాజశేఖర్ ఇంట్లో తన భార్య డ్వాక్రా కోసం ఉంచుకున్న డబ్బులు, కొంత నగలు అమ్మి మద్యానికి ఖర్చు చేశాడు. దీంతో భార్యాభర్తల ఇరువురి మధ్య గొడవ జరిగింది. మనస్థాపానికి గురైన రాజశేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కడప : పలు కారణాలరీత్యా వాయిదా పడిన యోగివేమన విశ్వవిద్యాలయ అనుబంధ డిగ్రీ కళాశాలల సెమిస్టర్ల పరీక్షల కోసం కొత్త తేదీలను వైవీయూ సీఈ ఆచార్య కె.కృష్ణారావు వెల్లడించారు. ఈనెల 2 తేదీన జరగాల్సిన పరీక్షలు ఇదేనెలలో 23వ తేదీన నిర్వహిస్తామన్నారు. ఈ నెల 3 తేదీన జరగాల్సిన పరీక్ష 21వ తేదీ ఉంటుందని సీఈ తెలిపారు. విద్యార్థులు సంబంధిత తేదీలలో పరీక్షలకు హాజరుకావాలని సూచించారు.
డిసెంబర్ రెండో శనివారం అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి బుధవారం ప్రకటించారు. నీటి సంఘం ఎన్నికల దృష్ట్యా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో సెలవు దినంగా ప్రకటించామని ఆయన తెలిపారు. గతంలో వర్షాల కారణంగా సెలవులు ఇచ్చినందుకు శనివారం వర్కింగ్డేగా ఉంటుందని ముందుగా ప్రకటించామని గుర్తుచేశారు. ఆదివారం పొట్టి శ్రీరాములు వర్ధంతి జరపాలని ఆదేశించారు.
రైతులు ఈనెల 15వ తేదీ లోపు పంటల బీమా ప్రీమియం చెల్లించాలని జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఐతా నాగేశ్వరరావు అన్నారు. చింతకొమ్మదిన్నె మండలం బుగ్గలపల్లె, బోడెద్దులపల్లెలో బుధవారం నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వరికి ఈ నెల 31వ తేదీ వరకు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించుటకు అవకాశం ఉందని, మిగిలిన పంటలకు 15వ తేదీ లోపు చెల్లించాలని తెలిపారు. కార్యక్రమంలో ఏవో ఈశ్వర రెడ్డి పాల్గొన్నారు.
ప్రొద్దుటూరులో భూమికి సంబంధించిన వ్యాఖ్యలతో పొలిటికల్ హీట్ పెరిగింది. తాను ఒక్క ఎకరా భూమిని ఆక్రమించినట్లు నిరూపిస్తే ఎన్నికల్లో పోటీ చేయనని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు. రాచమల్లు భూ బాధితులు ఎవరైనా ఉంటే తమకు ఫిర్యాదు చేయొచ్చు. అలా చేస్తే రాచమల్లుపై చర్యలు తీసుకుంటామని టీడీపీ నాయకులు ఈవీ సుధాకర్, నల్లబోతుల నాగరాజు ప్రజలకు పిలుపునిచ్చారు.
లింగాల మండలం వెలిగండ్ల గ్రామ సమీపంలో ఉన్న దేవరకోన వరదరాజుల స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి దుండగులు ఆలయ హుండీ అపహరణకు విఫలయత్నం చేశారు. ఆలయంలో హుండీని కాంక్రీటుతో పూడ్చి ఉండగా, కాంక్రీటును తొలగించి ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. అయితే హుండీని బలమైన ఇనుపతో తయారు చేయడంతో అది పగలకపోవడంతో పారిపోయారు. గతంలో కూడా హుండీని ఎత్తుకెళ్లి పగలగొట్టే ప్రయత్నం చేశారని ఆలయ అర్చకులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.