India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జగన్ మళ్లీ జైలుకు వెళ్లే సమయం ఆసన్నమైందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. 21 రోజుల్లోనే చంద్రబాబు ఏమీ చేయలేదని జగన్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ నేతలపై కక్ష సాధించే ఆలోచన టీడీపీకి లేదన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చరిత్ర అందరికీ తెలిసిందే, ఐదేళ్లలో మాచర్లలో నరమేధం సృష్టించారని ఆరోపించారు.
పుల్లంపేట మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామం చెరువుకోట వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. సుమోను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దెబ్బతిన్న వాహనాలను ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తొలగించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కమలాపురం పోలీసుస్టేషన్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న నాగార్జునరెడ్డి బుధవారం తాటిగొట్ల సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే చనిపోయే సమయంలో కూడా ఆయన తన ఖాకీ డ్రస్కు గౌరవాన్ని ఇచ్చారు. యూనిఫామ్ తీసి నీట్గా మడిచి పక్కనపెట్టి రైలు పట్టాల కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు.
యర్రగుంట్ల మండల పరిధిలోని ఆర్టీపీపీలో బొగ్గు వ్యాగన్లలో గుర్తుతెలియని మృతదేహం బయటపడింది. కార్మికుల వివరాల ప్రకారం.. బొగ్గును యూనిట్లకు సరఫరా చేస్తున్న సమయంలో మృతదేహం కనిపించింది. రెండు రోజుల క్రితం కృష్ణపట్నం పోర్టు నుంచి బయలుదేరి ఈ వ్యాగన్లు ఇవాళ ఆర్టీపీపీకి చేరుకున్నాయి. ఈ విషయం ఈ విషయం తెలుసుకున్న ఎస్పీఎఫ్ కలమల్ల పోలీసులు పరిశీలించి విచారణ చేపట్టారు.
కడప రిమ్స్ రోడ్డులోని స్పిరిట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఈ నెల 6వ తేదీ ఉదయం 9 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్లేస్మెంట్ అధికారి ఎస్ఎండీ మునీర్ తెలిపారు. ఏదైనా డిగ్రీ లేక పీజీ ఉత్తీర్ణులై 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఈ జాబ్ మేళాను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రాయచోటిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన విజయ్ రూ.32 లక్షల వేతనంతో కొలువు సాధించాడు. ఆన్లైన్ విధానంలో బ్యాంకింగ్ వ్యవస్థకు చెందిన ఇంటర్న్షిప్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. జపాన్లో పేరు కలిగిన సాప్ట్ బ్యాంకు సంస్థలో ఏడాదికి రూ.32 లక్షల వేతనానికి విజయ్ ఎంపికయ్యారని తెలిపారు.
పెండ్లిమర్రిలో ఓ యువకుడు తన తల్లికి మళ్లీ వస్తానని చెప్పి శవమై తిరిగివచ్చాడు. పెండ్లిమర్రి మండలం పాత సంగటిపల్లెకు చెందిన <<13555648>>బి.మల్లికార్జున రెడ్డి<<>>(30) సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడు. ఐదు నెలల క్రితం ఉద్యోగం పోయింది. మళ్లీ ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. ఈ క్రమంలో సోమవారం తల్లికి మళ్లీ వస్తానని చెప్పి సూసైడ్ చేసుకున్నాడని తల్లి వాపోయింది. ఉద్యోగం రాకపోవడమే సూసైడ్కు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల సరిహద్దులో ఉన్న మండలంలోని గొట్లమిట్ట సమీపంలో బుధవారం చిరుత కనిపించినట్లు గంగారపువాండ్లపల్లె సర్పంచ్ నాగరత్నమ్మ భర్త మల్రెడ్డి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. చక్రాయపేట వైపు నుంచి కొర్లకుంటకు వెళుతుండగా వారికి రోడ్డుకు అడ్డుగా వచ్చిందన్నారు. వారు హారన్ కొట్టడంతో దగ్గర్లో ఉన్న గుట్టల్లోకి వెళ్లిందని, దీనిపై ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించామన్నారు.
యోగివేమన ఆర్కిటెక్చర్ యూనివర్సిటీలలో ఔట్ సోర్సింగ్ నియామకాలలో అక్రమాలకు పాల్పడిన మాజీ రిజిస్ట్రార్ ఈసీ సురేంద్రనాథ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు. పిడిఎస్యు ఆధ్వర్యంలో బుధవారం యోగివేమన విశ్వవిద్యాలయం ప్రధాన గేటు వద్ద ఆందోళన నిర్వహించారు. యూనివర్సిటి మాజీ వీసీ చింతా సుధాకర్పై ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
వైవీయూలో 2024-25 విద్యా సంవత్సరం బీఎస్సీ (ఆనర్స్) ఫిజిక్స్, కెమిస్ట్రీ, బీకాం కంప్యూటర్స్ డిగ్రీ కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు రిజిస్ట్రార్, ప్రొఫెసర్ ఎస్.రఘునాథరెడ్డి వెల్లడించారు. ప్రొ. కృష్ణారెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జాతీయ విద్యా విధానం-2020ని అనుసరించి కోర్సులను తెచ్చామన్నారు. నిష్ణాతులైన అధ్యాపకులు, ప్రయోగశాలలు, ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థులు చదువుకోవచ్చన్నారు.
Sorry, no posts matched your criteria.