Y.S.R. Cuddapah

News January 27, 2026

తెరపైకి ప్రొద్దుటూరు CI.. 18ఏళ్ల సర్వీస్‌లో 30 ట్రాన్స్ఫర్లు

image

ప్రొద్దుటూరు 1-టౌన్ CI శ్రీరామ్‌ను ఇప్పటివరకు <<18970205>>30 సార్లు ట్రాన్స్ఫర్<<>> చేశారు. 2007లో ముదిగుబ్బ ట్రైనీ SIగా చేరి కందుకూరు, పుట్టపర్తి, రాయదుర్గం, కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం, కదిరి, కంబదూరు, కనగానిపల్లె, బెలుగుప్ప, ధర్మవరం, పెద్దవడగూరు, అనంతపురం SIగా పనిచేశారు. సీఐగా అనంతపురం, హిందూపురం, మడకశిర, ఆదోని, కర్నూల్, కాళహస్తి, ఆదోని, ప్రొద్దుటూరులో పనిచేశారు.

News January 27, 2026

కమలాపురంలో BJP ఓటు బ్యాంకు ఎంత..?

image

కమలాపురం నియోజకవర్గంలో బీజేపీ ఓటు బ్యాంకు ఎంతనే దానిపై చర్చ జరుగుతోంది. జనతాపార్టీ (JP) నుంచి 1978 ఎన్నికల్లో రామిరెడ్డి పోటీ చేయగా 24,101(32.9%) ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత 1994లో బీజేపీ తరపున కుమార్‌రెడ్డి పోటీ చేయగా 726(0.71%) ఓట్లు పడ్డాయి. 2009లో రాంమోహన్‌రెడ్డికి 648(0.48%) ఓట్లు, 2019లో పాలెం సురేశ్ కుమార్‌రెడ్డికి 1,005(0.63%) ఓట్లు వచ్చాయి. మిగతా ఎన్నికల్లో అలయెన్స్‌లో బీజేపీ పోటీ చేయలేదు.

News January 27, 2026

కమలాపురంలో BJP ఓటు బ్యాంకు ఎంత..?

image

కమలాపురం నియోజకవర్గంలో బీజేపీ ఓటు బ్యాంకు ఎంతనే దానిపై చర్చ జరుగుతోంది. జనతాపార్టీ (JP) నుంచి 1978 ఎన్నికల్లో రామిరెడ్డి పోటీ చేయగా 24,101(32.9%) ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత 1994లో బీజేపీ తరపున కుమార్‌రెడ్డి పోటీ చేయగా 726(0.71%) ఓట్లు పడ్డాయి. 2009లో రాంమోహన్‌రెడ్డికి 648(0.48%) ఓట్లు, 2019లో పాలెం సురేశ్ కుమార్‌రెడ్డికి 1,005(0.63%) ఓట్లు వచ్చాయి. మిగతా ఎన్నికల్లో అలయెన్స్‌లో బీజేపీ పోటీ చేయలేదు.

News January 27, 2026

కమలాపురంలో BJP ఓటు బ్యాంకు ఎంత..?

image

కమలాపురం నియోజకవర్గంలో బీజేపీ ఓటు బ్యాంకు ఎంతనే దానిపై చర్చ జరుగుతోంది. జనతాపార్టీ (JP) నుంచి 1978 ఎన్నికల్లో రామిరెడ్డి పోటీ చేయగా 24,101(32.9%) ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత 1994లో బీజేపీ తరపున కుమార్‌రెడ్డి పోటీ చేయగా 726(0.71%) ఓట్లు పడ్డాయి. 2009లో రాంమోహన్‌రెడ్డికి 648(0.48%) ఓట్లు, 2019లో పాలెం సురేశ్ కుమార్‌రెడ్డికి 1,005(0.63%) ఓట్లు వచ్చాయి. మిగతా ఎన్నికల్లో అలయెన్స్‌లో బీజేపీ పోటీ చేయలేదు.

News January 26, 2026

ఉత్తమ జీఎస్టీ అధికారిగా జ్ఞానానంద రెడ్డి

image

ప్రొద్దుటూరు స్టేట్ జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ (CTO) జ్ఞానానంద రెడ్డి సోమవారం కడపలో కలెక్టర్ శ్రీధర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. పన్నుల ఆడిట్, వసూళ్లలో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు ఆయనను అభినందిస్తూ ప్రశంసా పత్రం ఇచ్చారు. పులివెందుల కార్యాలయానికి ఇన్‌ఛార్జ్‌గా కూడా ఉన్నారు. ప్రశంసా పత్రం అందుకున్న జ్ఞానానంద రెడ్డిని ప్రొద్దుటూరు, పులివెందుల కార్యాలయాల అధికారులు అభినందించారు.

News January 26, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు

image

ప్రొద్దుటూరులో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు.
* బంగారం 24 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.16,550
* బంగారం 22 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.15,226
* వెండి 10 గ్రాముల ధర: రూ.3,560.

News January 26, 2026

కడప: ఇన్‌స్టాతో పరిచయం.. లాడ్జిలో యువతిపై అత్యాచారం

image

తిరుపతిలో దారుణం వెలుగుచూసింది. అలిపిరి CI రామ్ కిశోర్ వివరాల మేరకు.. కడప(D) బద్వేల్‌కు చెందిన యశ్వంత్ చిత్తూరులో బీటెక్ చదువుతున్నాడు. ఇన్‌స్టా ద్వారా తిరుపతి గ్రామీణ మండలానికి చెందిన అమ్మాయి పరిచయమైంది. ఆమెను మాయమాటలతో హోమ్‌స్టేకు పిలిపించిన విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆధారాలు సేకరించి నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు CI తెలిపారు.

News January 26, 2026

కమలాపురంలో BJP ఓటు బ్యాంకు ఎంత..?

image

కమలాపురం నియోజకవర్గంలో బీజేపీ ఓటు బ్యాంకు ఎంతనే దానిపై చర్చ జరుగుతోంది. జనతాపార్టీ (JP) నుంచి 1978 ఎన్నికల్లో రామిరెడ్డి పోటీ చేయగా 24,101(32.9%) ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత 1994లో బీజేపీ తరపున కుమార్‌రెడ్డి పోటీ చేయగా 726(0.71%) ఓట్లు పడ్డాయి. 2009లో రాంమోహన్‌రెడ్డికి 648(0.48%) ఓట్లు, 2019లో పాలెం సురేశ్ కుమార్‌రెడ్డికి 1,005(0.63%) ఓట్లు వచ్చాయి. మిగతా ఎన్నికల్లో అలయెన్స్‌లో బీజేపీ పోటీ చేయలేదు.

News January 26, 2026

YVU ఫైన్ఆర్ట్స్ శాఖలో వాక్-ఇన్ ఇంటర్వ్యూ.!

image

కడప YVU పీజీ కళాశాల ఫైన్‌ఆర్ట్స్ శాఖ కూచిపూడి నృత్యంలో మహిళా బోధకురాలి నియామకం కోసం ఈనెల 29వ తేదీ మధ్యాహ్నం వాక్‌ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. అభ్యర్థులు డిప్లొమా ఇన్ కూచిపూడి డ్యాన్స్/ పీజీ ఇన్ కూచిపూడి డ్యాన్స్ అర్హత కలిగి ఉండాలన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు. వివరాలకు www.yvu.edu.inని సంప్రదించాలని సూచించారు.

News January 26, 2026

కడప జిల్లాలో నేటి PGRS రద్దు: SP.!

image

ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కారం వేదిక ఈనెల 26వ తేదీన రద్దు చేస్తున్నట్లు ఎస్పీ నచికేత్ తెలిపారు. 26వ తేదీన రిపబ్లిక్ డే వేడుకలు జరగనున్నందున ఈ కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు చెప్పారు. కావున జిల్లా ప్రజలు గమనించి, దూర ప్రాంతాల నుంచి రాకూడదని ఆయన కోరారు. తమ ఫిర్యాదులు ఏమైనా ఉంటే ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని సూచించారు.