Y.S.R. Cuddapah

News October 23, 2024

నవంబర్ 18 నుంచి అయోధ్యలో విశ్వశాంతి మహాయాగం

image

అయోధ్యలో శ్రీ మహానారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వశాంతి మహా యాగాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ యాగాన్ని నవంబర్ 18 నుంచి జనవరి 1 వరకు 45 రోజుల పాటు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పాల్గొనే వారు తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు సెల్: 7780252277 సంప్రదించాలన్నారు.

News October 23, 2024

కడప: బిల్డింగ్ పైనుంచి పడి విద్యార్థి మృతి

image

బిల్డింగ్ పైనుంచి జారి పడి ఉమ్మడికడప జిల్లాకు చెందిన విద్యార్థి మృతి చెందిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు..HYD మాదాపూర్‌లోని నారాయణ కళాశాలలో ఇంటర్ చదువుతున్న శివకుమార్ రెడ్డి భవనం పైనుంచి కిందపడిపోయాడు. గమనించిన కళాశాల సిబ్బంది ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. విద్యార్థి స్వస్థలం రైల్వే కోడూర్‌గా పోలీసులు గుర్తించారు.

News October 23, 2024

బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన మున్సిపల్ ఛైర్మన్ 

image

పులివెందుల పట్టణ శివారులోని డంపింగ్ యార్డ్ వద్ద బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను బుధవారం ఉదయం మున్సిపల్ ఛైర్మన్ వర ప్రసాద్ పరామర్శించారు. ఇదే క్రమంలో బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని స్థానిక ప్రభుత్వ వైద్య సిబ్బందితో చర్చించారు. ఆయనతో పాటు పలువురు మున్సిపల్ కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.

News October 23, 2024

బద్వేల్‌లో మృతురాలి కుటుంబానికి రూ.5లక్షల ఆర్థిక సాయం

image

బద్వేల్ ఇంటర్ విద్యార్థి విఘ్నేష్ అనే ఉన్మాది చేతిలో మరణించిన విషయం తెలిసిందే. దీంతో వారి కుటుంబానికి సీఎం రూ.5లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించడంతో పాటు వారి కుమారుడికి ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో సీటు ప్రకటించారు. వారి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే నిందుడిని కఠిన శిక్షించాలని సీఎం కోరిన విషయం తెలిసిందే.

News October 23, 2024

వైఎస్ జగన్ నేటి పర్యటన వివరాలు

image

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11.50గంటలకు గుంటూరు నుంచి హెలికాప్టర్ ద్వారా 1 గంటలకు బద్వేల్ చేరుకుని ఉన్మాది చేతిలో బలైన దస్తగిరమ్మ కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2.10 గంటలకు హెలికాప్టర్ ద్వారా 2.55 గంటలకు పులివెందులలోని ఆయన నివాసానికి చేరుకుంటారు. అనంతరం వైసీపీ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని వైసీపీ నేతలు తెలిపారు.

News October 23, 2024

రాజంపేట: విద్యార్థుల మధ్య ఘర్షణ.. ఒకరికి గాయాలు

image

రాజంపేట మండలం బోయనపల్లె శ్రీ అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల మధ్య మంగళవారం ఘర్షణ జరిగినట్లు పోలీసులు తెలిపారు. బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి సూర్య పై దస్తగిరి రెడ్డి, అతడి సోదరుడు, కొంతమంది విద్యార్థులు దాడి చేశారని వెల్లడించారు. విద్యార్థి సూర్యకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మన్నూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News October 22, 2024

విద్యార్థుల ప్రయోజనమే లక్ష్యంగా ప్రాజెక్టులు: వైవీయూ వీసీ

image

విద్యార్థుల భవిష్యత్ ప్రయోజనమే లక్ష్యంగా ప్రాజెక్టుల రూపకల్పన చేశామని వైవీయూ వీసీ ఆచార్య కృష్ణారెడ్డి అన్నారు. ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మేరకు ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ’ కార్యక్రమంలో భాగంగా పలు ప్రాజెక్టుల ప్రతిపాదనల తయారుపై రిజిస్ట్రార్ ఆచార్య పద్మ, ఇతర అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు. వాటివల్ల విద్యార్థులకు ఇంటర్న్ షిప్ లభిస్తుందన్నారు.

News October 22, 2024

గండికోట లోగో ఎలా ఉంది?

image

గండికోటను పర్యాటకంగాను, దాని విశిష్ఠతను ప్రజలకు తెలిసేలా సోమవారం కడప జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ అదితి సింగ్ ఓ లోగోను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో గండికోట వైభవాన్ని చూపేలా లోగో ఉండాలి కాని అలా లేదని, సాదా సీదాగా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. గండికోట అంటే కడప జిల్లా పర్యాటకానికి తలమానికం. అలాంటి దానికి ఇటువంటి లోగా బాగాలేదని విమర్శలు వస్తున్నాయి. మరి మీకెలా ఉందో కామెంట్ చేయండి.

News October 22, 2024

కడప జిల్లాలో పర్యటించనున్న YS జగన్

image

కడప జిల్లాలో మూడు రోజుల పాటు మాజీ సీఎం జగన్ పర్యటన ఖరారైంది. బుధవారం తెనాలి నుంచి బద్వేలుకు చేరుకుంటారు. అక్కడ ఉన్మాది చేతిలో బలైన దస్తగిరమ్మ కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం బ్రహ్మంగారి మఠం చేరుకుని వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం పులివెందుల చేరుకుని గురువారం, శుక్రవారం కార్యకర్తలకు జగన్ అందుబాటులో ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

News October 22, 2024

గండికోట లోగో, ట్యాగ్ లైన్ అధికారిక ఆవిష్కరణ

image

జమ్మలమడుగు మండలం ప్రసిద్ధి పర్యాటక కేంద్రం గండికోట వారసత్వం, సంస్కృతి ప్రతిబింబించే విధంగా సృజనాత్మకమైన లోగో, ట్యాగ్ లైన్‌ను జిల్లా కలెక్టర్ అదితి సింగ్, జిల్లా పర్యాటక, సాంస్కృతిక అధికారి ఏ సురేశ్ కుమార్ సోమవారం అధికారికంగా ప్రకటన చేశారు. లోగో డిజైన్ పోటీల్లో గెలుపొందిన తుషార్ దివాన్కర్‌ను అభినందించారు. ఈ ప్రయత్నం గండికోటలో పర్యాటకం ప్రత్యేక అనుభవాలను హైలెట్ చేయడమే అన్నారు.