Y.S.R. Cuddapah

News December 9, 2024

రాయచోటిలో టీచర్‌ మృతి.. విద్యార్థుల అరెస్ట్

image

రాయచోటిలోని కొత్తపల్లి ఉర్దూ ZPHSలో ఉపాధ్యాయుడు అహ్మద్‌(42) మృతి కేసులో ఇద్దరు విద్యార్థులను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మైనర్లు కావడంతో శనివారం వారిని కోర్టులో హాజరుపరిచి జువైనల్ హోమ్‌కు తరలించారు. 9వ తరగతి విద్యార్థులకు పాఠం చెబుతుండగా అల్లరి చేస్తుండడంతో టీచర్ వారిని మందలించారని, దీంతో విద్యార్థులు కోపోద్రిక్తులై  టీచర్‌పై దాడి చేసినట్లు సమాచారం. 

News December 9, 2024

పులివెందుల యువతిని పొడిచిన వ్యక్తి అరెస్ట్?

image

కడప జిల్లా వేముల మండలం వి కొత్తపల్లికి చెందిన షర్మిల అనే యువతిపై అదే గ్రామానికి చెందిన కుల్లాయప్ప శనివారం కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో యువతికి తీవ్ర గాయాలు కాగా తిరుపతి రుయాకు తరలించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల వివరాలతో SI ప్రవీణ్ కేసు నమోదు చేశారు. నిందితుడు పరారై ఓ ఇంట్లో ఉండగా పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. కాగా ఈ విషయంపై జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సవిత సీరియస్ అయిన విషయం తెలిసిందే.

News December 9, 2024

కడప: ఉత్సాహంగా హ్యాండ్ బాల్ కడప జిల్లా జట్టు ఎంపికలు

image

అనంతపురం జిల్లాలో ఈనెల 14, 15వ తేదీలలో రాష్ట్రస్థాయి సీనియర్ మెన్ హ్యాండ్ బాల్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కడపలోని స్థానిక డీఎస్ఏ క్రీడా మైదానంలో కడప జిల్లా జట్టు ఎంపికలు నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేశారు. కార్యక్రమంలో హ్యాండ్ బాల్ కడప జిల్లా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు చిన్నపరెడ్డి, సింధూరి, కోచ్‌లు మునాఫ్, శివ తదితరులు పాల్గొన్నారు.

News December 8, 2024

వైఎస్ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవ రెడ్డికి 41ఏ నోటీసు

image

వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ రవీంద్రారెడ్డి కేసుకు సంబంధించి ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డికి మరోసారి పులివెందుల పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులలో సోమవారం ఉదయం 10 గంటలకు కడప సైబర్ సెల్ కార్యాలయానికి హాజరుకావాలని పేర్కొన్నారు. గతంలో కూడా పులివెందుల పోలీసులు రాఘవరెడ్డికి నోటీసులు అందించారు. అయితే రాఘవరెడ్డి విచారణకు హాజరు కాలేదు.

News December 8, 2024

మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాలతో ఒరిగిందేమీ లేదు: రాచమల్లు

image

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాలతో విద్యార్థులకు ఒరిగిందేమీ లేదని మాజీ MLA రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వం విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలను ఈ ప్రభుత్వం అటకెక్కించిందన్నారు. అమ్మబడి, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదని, నాడు-నేడు పనులను నిలిపేశారన్నారు. రాష్ట్రంలో అక్షరాస్యత శాతం తగ్గిపోతోందని పేర్కొన్నారు.

News December 8, 2024

రాయచోటి ప్రశాంతంగా ఉండేందుకు సహకరించాలి: మంత్రి

image

రాయచోటి పట్టణం ప్రశాంతంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ముస్లిం, హిందూ సోదరులు సోదర భావంతో ముందుకు వెళ్లాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచించారు. రాయచోటిలో జరిగిన పీస్ కమిటీ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. పట్టణంలో ఎవరైనా ప్రజలను రెచ్చగొట్టిన అల్లర్లకు పాల్పడినా, ప్రేరేపించినా ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తి లేదని, వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News December 7, 2024

కడపలో Pic Of The Day

image

పేరెంట్- టీచర్స్ మీటింగ్‌లో పాల్గొనేందుకు కడప మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు పోలీస్ సెక్యూరిటీ స్నిఫర్ డాగ్ ‘లూసి’ గౌరవ వందనం చేసింది. ఆయన దానికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఆకట్టుకుంటోంది. కాగా ఈ జాగిలం పేలుడు పదార్థాలను గుర్తించడంలో ప్రావీణ్యం పొందింది.

News December 7, 2024

కడప జిల్లాలో వరుస హత్యలు

image

కడప జిల్లాలో వారం వ్యవధిలో 4 హత్యలు జరిగాయి. నవంబర్ 30వతేదీన పులివెందులలో కొడుకును తండ్రి హత మార్చాడు. డిసెంబర్ 2న ప్రొద్దుటూరులో రౌడీషీటర్, అదే రోజు దువ్వూరులో మద్యానికి బానిసై వేధిస్తున్న కుమారుడిని తండ్రి రోకలిబండతో చంపాడు. నిన్న చక్రాయపేట మండలంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగి ఒకరు కన్నుమూశారు. ఈ వరస ఘటనలతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

News December 7, 2024

పెండ్లిమర్రి: గోపరాజుపల్లిలో ఇరువర్గాల దాడి

image

ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకోవడంతో ఒకరికి తీవ్ర గాయాలైన ఘటన పెండ్లిమర్రి మండలంలోని గోపరాజుపల్లెలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే ఇరువర్గాల మధ్య గొడవ జరిగి నంద్యాల సుబ్బయ్య అనే యువకుడి మీద దాడి చేసుకోవడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన అంబులెన్స్ ద్వారా రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గొడవకు పాతకక్షలే కారణమని వారు తెలిపారు.

News December 7, 2024

కడప: ఆకతాయిలకు ఎస్పీ హెచ్చరికలు

image

సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు. 5వ తేదీ గురువారం రోజు రాత్రి రాయచోటి పట్టణంలో రెండు వర్గాల మధ్య జరిగిన వివాదాన్ని కొందరు ఆకతాయిలు వాట్సాప్ గ్రూప్‌లలో, సోషల్ మీడియాలో అవాస్తవాలు, అసత్య ప్రచారాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.