Y.S.R. Cuddapah

News October 22, 2024

కడప జిల్లాలో పర్యటించనున్న YS జగన్

image

కడప జిల్లాలో మూడు రోజుల పాటు మాజీ సీఎం జగన్ పర్యటన ఖరారైంది. బుధవారం తెనాలి నుంచి బద్వేలుకు చేరుకుంటారు. అక్కడ ఉన్మాది చేతిలో బలైన దస్తగిరమ్మ కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం బ్రహ్మంగారి మఠం చేరుకుని వీర జావాన్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం పులివెందుల చేరుకుని గురువారం, శుక్రవారం కార్యకర్తలకు జగన్ అందుబాటులో ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

News October 21, 2024

పెండ్లిమర్రి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

image

పెండ్లిమర్రి మండలంలోని పుణ్యక్షేత్రమైన పొలతలకు దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. అదే మండలంలోని కొత్తపేటకు చెందిన మిథున్ రెడ్డి సోమవారం దైవదర్శనం కోసం పొలతలకు వెళ్ళాడు. అనంతరం బైకులో తిరిగి బయలుదేరాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ను దాటి ముందుకు వెళుతూ అదుపుతప్పి కిందపడ్డాడు. కింద పడ్డ అతనిపై ట్రాక్టర్ ఎక్కడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

News October 21, 2024

టెన్త్‌లో టాపర్.. ఇంటర్‌లో ఇలా..!

image

బద్వేల్ ఘటనలో మృతిచెందిన యువతి గురించి అనేక విషయాలు వెలుగు చూశాయి. ఆమెకు తల్లి, తండ్రి, సోదరుడు ఉన్నాడు. యువతి తండ్రి రైస్ మిల్లులో కూలీగా పనిచేస్తూ చదివించారు. యువతి బద్వేల్ జడ్పీ పాఠశాలలో 10వ తరగతి చదవగా.. 556 మార్కులతో టాపర్‌గా నిలిచింది. ఇంటర్‌లో కూడా యువతి ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా కాలేజీకి వచ్చేదని.. మంచి భవిష్యత్తు ఉన్న యువతికి ఇలా జరగడం బాధాకరమని ఇంటర్ కాలేజీ లెక్చరర్ పేర్కొన్నారు.

News October 21, 2024

కడప: 100,112 నంబర్ల సేవలను వినియోగించుకోవాలి

image

కడప జిల్లాలో పోలీస్ హెల్ప్ లైన్ 100,112 నంబర్ల సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా SP హర్షవర్ధన్ రాజు తెలిపారు. సోషల్ మీడియాలో పై నంబర్లు పనిచేయడం లేదంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని, 2 పోలీస్ హెల్ప్ లైన్ నంబర్లు యథావిధిగా పనిచేస్తున్నాయని SP తెలిపారు. అవాస్తవాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటామని హెచ్చరించారు.

News October 21, 2024

జవాన్ మృతదేహానికి నివాళులర్పించిన కడప MP

image

బ్రహ్మంగారి మఠం మండలం పాపిరెడ్డిపల్లెలో జవాన్ మృతదేహానికి సోమవారం ఎంపీ అవినాశ్ రెడ్డి, మైదుకూరు మాజీ MLA శెట్టిపల్లి రఘురామిరెడ్డి నివాళులర్పించారు. వీరమరణం పొందిన జవాన్ రాజేశ్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ వీర నారాయణరెడ్డి, తోట్లపల్లి సర్పంచ్ లక్ష్మీదేవి, సోమిరెడ్డిపల్లి సర్పంచ్ ఎత్తపు సుదర్శన్ రెడ్డి వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

News October 21, 2024

YVUలో నేటి నుంచి డిగ్రీ ఒకేషనల్ పరీక్షలు

image

యోగి వేమన విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ కళాశాలలో నాలుగేళ్ల యూజీ ఆనర్స్ ఒకేషనల్ 2వ సెమిస్టర్ పరీక్షలు, నేటినుంచి నిర్వహించనున్నట్లు YVU పరీక్షల నిర్వహణ అధికారి ఆచార్య ఎన్ ఈశ్వరరెడ్డి తెలిపారు. MLT, డైరీ సైన్స్ చదివే విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాలన్నారు. ఈనెల 28వ తేదీ వరకు ప్రతిరోజు (27వ తేదీ మినహ) ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు.

News October 21, 2024

21 నుంచి వైవీయూ డిగ్రీ ఒకేషనల్ పరీక్షలు

image

వైవీయూ పరిధిలోని డిగ్రీ కళాశాలలో నాలుగేళ్ల యూజీ ఆనర్స్ ఒకేషనల్ రెండవ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 21వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు వైవీయూ పరీక్షల నిర్వహణ అధికారి ఆచార్య ఎన్. ఈశ్వరరెడ్డి తెలిపారు. ఎం.ఎల్.టి, డైరీ సైన్స్ చదివే విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాలన్నారు. హాల్ టికెట్లను చదువుతున్న కళాశాల నుంచి పొందాలన్నారు. పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించనున్నామని తెలిపారు.

News October 20, 2024

కడప జిల్లా SP నేటి సాయంత్రం కీలక ప్రెస్‌మీట్

image

కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు నేటి<<14403526>> సాయంత్రం కీలక ప్రెస్మీట్ <<>>నిర్వహించనున్నారు. నిన్న బద్వేలులో ఉన్మాది చేతిలో దారుణంగా హతమైన విద్యార్థిని కేసుకు సంబంధించిన ఘటనను, రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడంతో ఇప్పటికే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం మీడియా ముందు ప్రవేశపెట్టడంతోపాటు, ఘటనకు సంబంధించిన వివరాలను ఎస్పీ వెల్లడించనున్నట్లుగా తెలుస్తుంది.

News October 20, 2024

కడప: గొర్రెల కాపరి ఆచూకీ లభ్యం.!

image

బద్వేలు పరిధిలోని అట్లూరు మండలానికి చెందిన <<14386467>>గొర్రెల కాపరి..<<>> గంగిరెడ్డి 6 రోజుల క్రితం అడవిలో మేకలకు వెళ్లి మిస్ అయ్యాడు. అతనికోసం ఓ పక్క డ్రోన్‌లతో మరో పక్క గ్రామస్థులు అడవిలో గాలించారు. కాగా శనివారం ఇతని ఆచూకీ లభ్యమైంది. అయితే లంకమల అభయారణ్యంలోని గుబ్బకోన వద్ద తిరుగుతుండగా వరికుంట గ్రామస్థులు గుర్తించారు. మేకల ఇంటికి రాలేదని వాటిని వెతుకుతూ అడవితో దారి మరచి తప్పిపోయినట్లు అతను తెలిపాడు.

News October 20, 2024

వీర మరణం పొందిన కడప జిల్లా జవాన్‌ ఇతనే.!

image

కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన కొడవటికంటి రాజేశ్ ఛత్తీస్‌గఢ్‌లోని మిజాపూర్‌ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP)లో జవాన్‌గా పనిచేస్తున్నాడు. కాగా శనివారం నక్సల్స్ అమర్చిన ల్యాండ్ మైన్ పేలి మృతి చెందాడు. ఈ విషయం తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా మృతి చెందిన జవాన్‌కు ముగ్గురు పిల్లలు, భార్య ఉన్నట్లు గ్రామస్థులు తెలిపారు.