Y.S.R. Cuddapah

News December 7, 2024

నేడు కడపకు పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఇదే.!

image

నేడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కడపకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఉయదం 9:5కి బేగంపేట ఎయిర్ పోర్ట్‌లో బయలుదేరి 10:15కి కడప ఎయిర్‌కి వస్తారు. అక్కడినుంచి నగరంలోని అన్నమయ్య సర్కిల్ సమీపంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం ముగిశాక 1:25కి కడప ఎయిర్ పోర్టుకు చేరుకుని 2:15కి బేగంపేటలో దిగుతారు.

News December 6, 2024

కడప: ఎంతో మంది ప్రాణాలను కాపాడాడు.. కానీ.!

image

రోడ్డు ప్రమాదం జరిగితే 108 వాహనం రయ్ రయ్ మంటూ వచ్చి వారిని త్వరగా ఆసుపత్రికి తరలించి ప్రాణాలను కాపాడుతుంటారు. కానీ.. గురువారం గువ్వలచెరువు ఘాట్‌లో బ్రహ్మంగారి మఠానికి చెందిన 108 డ్రైవర్ రమేశ్ మృతి చెందాడు. ఆయన మృతిని చూసిన వారు రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మందిని రక్షించిన వ్యక్తి ఇవాళ అదే రోడ్డు ప్రమాదానికి గురై మరణించడం బాధాకరమని పేర్కొంటున్నారు. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నారు.

News December 6, 2024

పుష్ప-2 రీసెర్చర్‌గా కడప జిల్లా వాసి

image

పుష్ప-2లో కడప జిల్లా వాసి కీలక పాత్ర పోషించారు. జిల్లాకు చెందిన వీరా కోగటం జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించారు. ఈక్రమంలో సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తూ డైరెక్టర్‌ సుకుమార్‌ను కలిశారు. ఆ పరిచయంతో పుష్ప-2 ప్రాజెక్టులో చేరారు. ఈ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేశారు. స్ర్కిప్ట్ కల్చర్, రీసెర్చర్‌గానూ వ్యవహరించారు. ఆయన భవిష్యత్తులో మంచి స్థాయికి రావాలని జిల్లా వాసులు అభినందిస్తున్నారు.

News December 6, 2024

కడప: ‘రెవెన్యూ సదస్సులు విజయవంతం చేయాలి’

image

జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో రెవెన్యూ సదస్సుల నిర్వహణపై ప్రజాప్రతినిధులతో గురువారం కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ప్రజలు, రైతుల భూ సమస్యలు, రెవెన్యూ వివాదాలు అన్నింటికీ పరిష్కార మార్గం చూపడానికి ఈనెల 6వ తేదీ నుంచి వచ్చేనెల జనవరి 8వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు జరుగుతాయన్నారు.

News December 5, 2024

7న కడపకు రానున్న డిప్యూటీ CM పవన్ కళ్యాణ్

image

ఈనెల 7వ తేదీన కడపకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రానున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. హైదరాబాదు నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకొని ఆయన నగరంలోని అన్నమయ్య సర్కిల్ సమీపంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న అధికారిక కార్యక్రమంలో ఆయన పాల్గొని తిరిగి హైదరాబాదుకు చేరుకుంటారని కలెక్టర్ పేర్కొన్నారు.

News December 5, 2024

కడప: ‘పవన్ కళ్యాణ్ పర్యటన విజయవంతం చేయాలి’

image

ఈనెల 7న మెగా పేరెంట్స్- టీచర్స్ సమావేశాల్లో పాల్గొనేందుకు కడప జిల్లాకు రానున్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పర్యటనను విజయవంతం చేయాలని, కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. కడపలోని పవన్ కళ్యాణ్ పర్యటించే మునిసిపల్‌ స్కూలులో ఏర్పాట్లను అధికారులతో కలిసి కలెక్టర్ గురువారం పరిశీలించారు.

News December 5, 2024

కడప ఎస్పీగా రాహుల్ మీనా?

image

కడప నూతన SPగా రాహుల్ మీనా వస్తున్నారనే కథనాలు జిల్లాలో వైరల్‌ అవుతున్నాయి. ఇటీవల YCP సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డి కేసులో SP హర్షవర్ధన్ రాజు అలసత్వం వహించాడని ఆయన్ను తప్పించారు. ఆ తర్వాత అన్నమయ్య జిల్లా SP విద్యాసాగర్ నాయుడును అదనపు SPగా ఉన్నతాధికారులు నియమించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం గుంతకల్ రైల్వే SPగా పనిచేస్తున్న రాహుల్ మీనా వస్తారని సమాచారం. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

News December 5, 2024

గండికోట పర్యాటక అభివృద్ధికి అడుగులు: కలెక్టర్

image

ప్రపంచ పర్యాటక మ్యాపులు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న గండికోట పర్యాటక ప్రాంత అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గండికోట పర్యాటక అభివృద్ధిపై బుధవారం సమీక్షించారు. జిల్లాలో అత్యంత ప్రాచీన చారిత్రక ప్రాచుర్యం పొందిన పర్యాటక ప్రాంతమైన “గండికోట పర్యాటక కేంద్రం” భవిష్యత్తులో ప్రపంచ పర్యాటక రంగాన్ని శాసిస్తుందన్నారు.

News December 4, 2024

కడప జిల్లాపై లేని భూప్రకంపనల ప్రభావం

image

తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం భూ ప్రకంపనలు రావడం సంచలనంగా మారింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఎక్కడ ప్రమాదాలు జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా ఉమ్మడి కడప జిల్లాలో ఎటువంటి ప్రకంపనలు రాకపోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. మన జిల్లాలో ఎక్కడైనా భూప్రకంపనల ప్రభావం ఉంటే కామెంట్ చేయండి.

News December 4, 2024

కడప జిల్లాలో 829 మంది ప్రధానోపాధ్యాయులకు నోటీసులు

image

కడప జిల్లాలో పెద్ద ఎత్తున ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ అధికారి షోకాజ్ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. పాఠశాలల్లో పిల్లల అపార్ నమోదు పూర్తి చేయలేదని 829 మంది ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వకపోతే ప్రధానోపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారి నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో ప్రధానోపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.