Y.S.R. Cuddapah

News April 9, 2024

కడప: కదిలే రైలు ఎక్కుతుండగా ప్రమాదం

image

కడప రైల్వే స్టేషన్‌లో కేరళకు చెందిన అధిలా(22) అనే వైద్య విద్యార్థి గాయపడ్డాడు. నీటి కోసం రైలు దిగాడు. తిరిగి ఎక్కడానికి ప్రయత్నించగా అప్పటికే రైలు కదిలింది. ఈక్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడ్డాడు. గమనించిన తోటి ప్రయాణికులు అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి ఎడమ మోకాలు పూర్తిగా తెగిపోయిందని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 9, 2024

కడప: ప్రత్యేక రైలు గడువు పొడిగింపు

image

కడప మీదుగా రాజస్థాన్‌ రాష్ట్రంలోని భగత్‌కి కోటికి వెళ్లే ప్రత్యేక రైలు గడువును మే 1వ తేది వరకు పొడిగించినట్లు కడప రైల్వే సీనియర్‌ కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌ జనార్దన్‌ తెలిపారు. భగత్‌కి కోటి (04811) నుంచి ఈనెల 18, 27 తేదీల్లో బయలుదేరే రైలు కడప మీదుగా కోయంబత్తూరుకు వెళుతుందన్నారు. తిరుగు ప్రయాణంలో కోయంబత్తూరు (04812) నుంచి ఈనెల 22, మే 1 తేదీలలో బయలుదేరి భగత్‌కి కోటికి చేరుతుందన్నారు.

News April 9, 2024

ప్రొద్దుటూరులో దారుణం.. తండ్రి కొట్టడంతో బాలుడి మృతి 

image

ప్రొద్దుటూరులో కన్న తండ్రి కొడుకును కొట్టి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్ట్స్ కాలేజీ రోడ్డులోని ఇమ్రాన్ అలీకి కూతురు రబీనా, కొడుకు ముస్తఖీం (4) ఉన్నారు. కొడుకు పుట్టిన 4 రోజులకే భార్య షాబిరున్ అనారోగ్యంతో మృతిచెందారు. ఇమ్రాన్ ఏడాదిన్నర క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆదివారం రాత్రి ముస్తఖీంను ఇమ్రాన్ కొట్టడంతో బాలుడు చనిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేశామని సీఐ శ్రీకాంత్ తెలిపారు.

News April 9, 2024

జమ్మలమడుగులో ఆ రికార్డ్ బద్దలయ్యేనా..

image

జమ్మలమడుగులో ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 1985లో టీడీపీ నుంచి పి.శివారెడ్డి 55,170 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇప్పటి వరకు ఇదే అత్యధికం. కాగా 1999లో టీడీపీ నుంచి బరిలో నిలిచిన పి.రామసుబ్బారెడ్డి కేవలం 357 ఓట్లతో గెలిచారు. తాజా ఎన్నికల్లో వైసీపీ నుంచి సుధీర్ రెడ్డి, కూటమి నుంచి ఆదినారాయణ రెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో ఎవరు ఆ రికార్డ్‌ను బ్రేక్ చేస్తారనుకుంటున్నారు.

News April 9, 2024

ప్రొద్దుటూరులో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

image

ప్రొద్దుటూరులోని పవర్ హౌస్ రోడ్లో మల్లీ అనే వ్యక్తి సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని ఒకటో పట్టణ ఎస్సై మంజునాథ్ తెలిపారు. స్థానిక మిట్టమడి వీధిలో బాడుగ ఇంట్లో మల్లీ, ఆయన భార్య, ఇద్దరు పిల్లలుతో నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా దంపతులు మధ్య మనస్పర్ధలు వచ్చాయి. ఈ క్రమంలో నాలుగు రోజుల కిందట భార్యాభర్తల మధ్య గొడవ జరగింది. మనస్తాపంతో మల్లీ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.

News April 9, 2024

కడప జిల్లాలో YCP కీలక నేత రాజీనామా

image

కడప జిల్లాలో వైసీపీ మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్ ఖాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు రాజీనామా పత్రాన్ని పంపించారు. ఎమ్మెల్యే సీటు ఇస్తానన్న హామీని ముఖ్యమంత్రి మరిచారని అందుకే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. కనీసం కలవడానికి కూడా తనకు జిల్లా నాయకులు అపాయింట్మెంట్ ఇప్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

News April 9, 2024

రాజుపాలెం: 46 మంది వాలంటీర్లు రాజీనామా

image

రాజుపాలెం మండలంలోని టంగుటూరు, వెలవలి, వెంగళయపల్లి, కుమ్మరపల్లె, పర్లపాడు, గోపల్లె గ్రామాల్లోని సచివాలయాలకు చెందిన 46 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. సోమవారం వారు ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులకు రాజీనామా పత్రాలను అందించారు. వారు మాట్లాడుతూ.. తమను పింఛన్లను పంపిణీ చేయకుండా కొందరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారన్నారు. తామంతా రాజీనామా చేసి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయానికి కృషి చేస్తామన్నారు.

News April 8, 2024

రాజుపాలెం: 46 మంది వాలంటీర్లు రాజీనామా

image

రాజుపాలెం మండలంలోని టంగుటూరు, వెలవలి, వెంగళయపల్లి, కుమ్మరపల్లె, పర్లపాడు, గోపల్లె గ్రామాల్లోని సచివాలయాలకు చెందిన 46 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. సోమవారం వారు ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులకు రాజీనామా పత్రాలను అందించారు. వారు మాట్లాడుతూ.. తమను పింఛన్లను పంపిణీ చేయకుండా కొందరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారన్నారు. తామంతా రాజీనామా చేసి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయానికి కృషి చేస్తామన్నారు.

News April 8, 2024

షర్మిలను చూస్తుంటే జాలి, బాధేస్తుంది: కడప మేయర్

image

కడప జిల్లాలో వైఎస్ షర్మిల బస్సు యాత్రను చూస్తుంటే తమకు జాలి, బాధ వేస్తోందని కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మేయర్ సురేశ్ బాబు ఎద్దేవా చేశారు. మైదుకూరులో ఎమ్మెల్యే రఘురామిరెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. గతంలో జగనన్న సోదరిగా ప్రచారానికి వచ్చినప్పుడు జిల్లా ప్రజలు ఆమెకు ఇచ్చిన గౌరవం, పట్టిన బ్రహ్మరథం చూసి ఈరోజు జరుగుతున్న బస్సు యాత్రను చూస్తుంటే జాలేస్తుందన్నారు. ఇప్పటికైనా షర్మిలమ్మ తెలుసుకోవాలన్నారు.

News April 8, 2024

కడప దర్గాలో ఏఆర్ రెహమాన్ ప్రార్థనలు

image

కడపలో ప్రసిద్ధి చెందిన పెద్ద దర్గాలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సోమవారం దర్గాలోని హజరత్ ఖ్వాజా సయ్యద్ షా యద్దుల హుసైని చిస్టివుల్ ఖాద్రీ ఉరుసులో భాగంగా నిన్న రాత్రి గంధ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. మంత్రి అంజాద్ బాషాతో కలిసి రెహమాన్ దర్గాలో ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో పీఠాధిపతి ఆరిఫుల్లా హుస్సేని పాల్గొన్నారు.