India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గండికోటకు వచ్చే పర్యాటకుల నుంచి టోల్ ఫీజు వసూలు చేయడం దారుణమని DYFI జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్ అన్నారు. కడప DYFI జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. గండికోట అభివృద్ధికి దాదాపు రూ.70 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారన్నారు. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంటే మరోవైపు పర్యాటకుల నుంచి డబ్బులు వసూలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.
కోడి కోసం వెళ్లిన వ్యక్తి చనిపోయిన ఘటన కడప జిల్లాలో జరిగింది. కొండాపురంలోని వడ్డెవాళ్ల కాలనీకి చెందిన కుడుమల నాగేశ్(52) ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో కోళ్ల కోసం మిద్దె పైకి ఎక్కారు. ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడ్డారు. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
భర్త చనిపోయిన మూడు రోజులకే భార్య చనిపోయిన విషాద ఘటన ఇది. కడప జిల్లా లింగాల మండలం పార్నపల్లెకు చెందిన సాకే నాగరాజు నవంబర్ 26న చనిపోయారు. ఈక్రమంలో ఆయన భార్య నాగసుధ(36) భర్త సమాధి చూడటానికి బైకుపై బయల్దేరారు. మార్గమధ్యలో స్పీడ్ బ్రేకర్ వద్ద కిందపడి గాయపడ్డారు. కడపలోని ఓ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె చనిపోయారు.
ప్రజలకు పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్న స్మగ్లర్లపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ‘కొంతమంది అక్రమార్కులకు రూ.కోట్ల రూపాయలను సంపాదించే ఆదాయ వనరుగా రేషన్ బియ్యం మారింది. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ఈ దందా కొనసాగుతోంది. చాలా మంది రేషన్ డీలర్లకే బియ్యాన్ని రూ.10కి ఇచ్చేస్తున్నారు’ అని చెప్పారు.
కడప జిల్లాలో శనివారం దారుణ హత్య జరిగింది. పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లి గ్రామ సమీపంలోని సుగాలి తండాలో ఈ ఘటన వెలుగు చూసింది. గ్రామానికి చెందిన కుళ్లాయప్ప నాయక్ తన కుమారుడు రాజ్ కుమార్ నాయక్ను దారుణంగా కొట్టి హతమార్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కడప నగరంలో వార్డు సచివాలయ సెక్రటరీలు పెడదారి పడుతున్నారు. లంచాలు, కమీషన్లకు అలవాటు పడి ప్రజలను వేధిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అలాంటి వారిపై కడప నగరపాలక సంస్థ కొరడా ఝళిపించింది. వేయాల్సిన పన్ను కంటే తక్కువ పన్ను వేసినందుకు ఇద్దరు అడ్మిన్ సెక్రటరీలను, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఇన్ఛార్జ్ ఆర్ఐ నరేంద్రను నగరపాలక కమిషనర్ మనోజ్ రెడ్డి శుక్రవారం సస్పెండ్ చేశారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందే సమస్యల పరిష్కారానికి తహశీల్దార్లు ప్రత్యేక చొరవ చూపి క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారాని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక హాలులో రెవెన్యూ సంబంధిత అంశాలపై జిల్లా రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా రీ సర్వే, వెబ్ ల్యాండ్ కరెక్షన్స్ మ్యుటేషన్లకు సంబంధించి రావడం జరుగుతున్నదని తెలిపారు.
కడప జిల్లాలో భారీ మోసం వెలుగు చూసింది. కడపలో పనిచేసే ప్రభుత్వ టీచర్ శోభారాణికి అపర్ణ (బెంగళూరు) పరిచయమయ్యారు. బియ్యాన్ని ఆకర్షించే పాత్ర ఉంటే జీవితం మారిపోతుందని దువ్వూరుకు చెందిన మూలే వెంకట రమణారెడ్డిని వారిద్దరూ నమ్మించారు. వాళ్లకు ఆయన విడతల వారీగా రూ.1.37 కోట్లు చెల్లించి మోసపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు అపర్ణతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశామని ప్రొద్దుటూరు సీఐ యుగంధర్ తెలిపారు.
అసభ్యకర పోస్టుల కేసులో కడప జైలుకు వెళ్లిన వర్రా రవీంద్రరెడ్డిపై ఉమ్మడి గుంటూరు జిల్లా పెదనందిపాడులో మరో కేసు నమోదైంది. ఈ దర్యాప్తులో భాగంగా రవీంద్రను PT వారెంట్పై కడప జైలు నుంచి బాపట్ల పోలీసులు బయటకు తీసుకు వచ్చారు. ఇవాళ ఆయనను బాపట్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచనున్నట్లు సమాచారం.
వైవీయూ అనుబంధ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు శుక్రవారం నుంచి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కేఎస్వీ కృష్ణారావు వెల్లడించారు. జిల్లాలోని 54 కేంద్రాలలో 1,3,5 సెమిస్టర్లకు సంబంధించి 20,819 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. ఫస్ట్ సెమిస్టర్కు 8,407 మంది, 3వ సెమిస్టర్ 6,903 మంది, 5వ సెమిస్టర్ 5509 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు.
Sorry, no posts matched your criteria.