Y.S.R. Cuddapah

News April 4, 2024

కడప: వడదెబ్బతో లారీ డ్రైవర్ మృతి

image

వడదెబ్బతో తెలంగాణకు చెందిన లారీ డ్రైవర్ మృతి చెందిన ఘటన బుధవారం బద్వేల్‌లో జరిగింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి చెందిన లారీ డ్రైవర్ అశోక్ మంగళవారం ఉదయం లారీ మరమ్మతులకు గురి కావడంతో బద్వేలులో నిలిచిపోయాడు. బుధవారం మధ్యాహ్నం అతడు మృతి చెందడాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News April 4, 2024

అధికారులపై చర్యలు తీసుకోవాలి: వాసు

image

కడప జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న అధికార వైసీపీకి తొత్తుగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా TDP అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు అమరావతిలోని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. జిల్లాలో కొంతమంది అధికారులు వైసీపీ నాయకులకు వత్తాసు పలుకుతూ టీడీపీ నాయకులను వేధింపులకు గురి చేస్తున్నారని వినతి పత్రంలో తెలిపారు.

News April 3, 2024

ప్రొద్దుటూరు: 18 మంది వాలంటీర్లు రాజీనామా

image

ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామ సచివాలయానికి చెందిన 18 మంది వాలంటీర్లు బుధవారం రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలు సచివాలయ అడ్మిన్ కార్యదర్శికి వారు అందించారు. వాలంటీర్లు మాట్లాడుతూ.. ప్రజలకు సేవలు అందించకుండా టీడీపీ నాయకుల ఫిర్యాదుతో ఎన్నికల సంఘం తమను అడ్డుకుందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని, ఎంపీగా వైఎస్ అవినాశ్‌రెడ్డిని గెలిపించేందుకు కృషి చేస్తామన్నారు.

News April 3, 2024

అవినాశ్ తప్పు చేశాడని తేలితే రాజకీయాలు వదిలేస్తా: రాచమల్లు

image

MP వైఎస్ అవినాశ్ రెడ్డి తప్పు చేశాడని తేలితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. బుధవారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ.. అవినాశ్ రెడ్డి హత్య చేశాడా లేదా అనేది న్యాయ స్థానం నిర్ణయిస్తుందన్నారు. అవినాశ్ తప్పు చేశాడని తేలితే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.

News April 3, 2024

5 నుంచి కడప జిల్లాలో వైఎస్ షర్మిల బస్సు యాత్ర

image

ఈ నెల 5 నుంచి కడప జిల్లాలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల బస్సు యాత్రను నిర్వహిస్తున్నట్లు ఆ
పార్టీ నాయకులు తెలిపారు. 5 నుంచి 12 వరకు 8 రోజుల పాటు అన్ని నియోజకవర్గాల్లో పర్యటించేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. 5, 6 తేదీలలో బద్వేలు, కడప, 7న మైదుకూరు, 8న కమలాపురం, 10, 11న పులివెందుల, 12న జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో బస్ యాత్ర చేపట్టనున్నారు.

News April 3, 2024

కడప: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

చక్రాయపేట మండల పరిధిలోని సురభి గ్రామం నాగుల గుట్టపల్లెలో బుధవారం ఉదయం అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. గ్రామంలోని జవహర్ రోజ్ గార్ భవనం వద్ద వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

News April 3, 2024

కడప: రైలు కిందపడి యువకుడి మృతి

image

జిల్లాలోని కమలాపురం పట్టణ సమీపంలో చెరువు కట్ట వద్ద రైలు కిందపడి ఓ యువకుడు మృతిచెందాడు. నంద్యాల నుంచి రేణిగుంట వెళుతున్న డెమో రైలు కింద యువకుడు బుధవారం ఉదయం పడిపోయాడు. అతని శరీరం రెండు ముక్కలైపోయింది. స్థానికులు గుర్తించి రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 3, 2024

కడప: ఉరి వేసుకుని విద్యార్థిని ఆత్మహత్య

image

చాపాడు మండల పరిధిలోని పల్లవోలు గ్రామానికి చెందిన విద్యార్థిని నాగేశ్వరి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గత కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్న ఆమె మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి సుబ్బరాయుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 3, 2024

కడప: YSR 5 వేలు.. YS జగన్ 5 లక్షలతో గెలుపు

image

కడప MP ఎన్నికల్లో అరుదైన రికార్డు ఉంది. అక్కడ రాజ శేఖర్ రెడ్డి 4 సార్లు పోటీ చేయగా.. YS జగన్ 2 సార్లు పోటీ చేశారు. YSR 1996లో మొదటిసారి MPగా పోటీ చేసినప్పుడు TDP అభ్యర్థి కందుల రాజమోహన్ రెడ్డిపై 5445 ఓట్లతో గెలిచారు. అలాగే జగన్ 2011 ఉప ఎన్నికల్లో 5,45,671 ఓట్ల తేడాతో డి.ఎల్ రవీంద్రారెడ్డిపై గెలిచారు. ఇప్పటి వరకు జరిగిన కడప ఎంపీ ఎన్నికల్లో YSRకు అత్యల్ప ఓట్లు రాగా.. జగన్‌కు అత్యధిక ఓట్లు వచ్చాయి.

News April 3, 2024

YVU కాన్వకేషన్ దరఖాస్తు గడువు మరోమారు పెంపు

image

YVU స్నాతకోత్సవంలో డిగ్రీ, పీజీ, పీహెచ్.డీ పట్టాలు పొందడానికి దరఖాస్తు స్వీకరణ గడువును ఏప్రిల్ 4వ తేదీ వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య చింతా సుధాకర్ వెల్లడించారు. ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల 8 తేదీ వరకు కొనసాగుతుందన్నారు. ఇప్పటిదాకా 11,725 మంది దరఖాస్తులు చేసుకున్నట్లు ఆయన తెలిపారు.