Y.S.R. Cuddapah

News January 21, 2025

సిద్దవటం: కిడ్నీ వ్యాధితో ఏడేళ్ల బాలుడి మృతి

image

కడప జిల్లా సిద్దవటం మండలంలోని రామక్రిష్ణాపురం గ్రామానికి చెందిన రాజు, రామతులసి దంపతుల కుమారుడు మహేంద్రవర్మ(7) మంగళవారం మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. రామక్రిష్ణాపురానికి చెందిన మహేంద్ర అనే బాలుడు ఎంపీపీ స్కూల్‌లో 1వ తరగతి చదువుతున్నాడు. అయితే ఎప్పటి నుంచో కిడ్నీ వ్యాధితో బాధపడుతూ నేటి ఉదయం మృతి చెందాడు. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

News January 21, 2025

కడప: నేటి నుంచి YVU పీజీ పరీక్షలు

image

కడప యోగి వేమన యూనివర్సిటీ పీజీ అనుబంధ కళాశాలల MA, M.Com, M.Sc& M.P.Ed. మొదటి సెమిస్టర్ పీజీ పరీక్షలు మంగళవారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని పరీక్షల నిర్వహణ అధికారి ఆచార్య కృష్ణారావు తెలిపారు. ఈ పరీక్షలు 21, 23, 25, 27, 29, 31 తేదీలలో ఉంటాయన్నారు. పరీక్షలకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు.

News January 21, 2025

కడప: హత్యాయత్నం కేసులో 12 మందికి జైలు శిక్ష

image

వీరపునాయునిపల్లె మండలంలో 2014లో గుమ్మిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, రామకృష్ణారెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో 12 మందిపై నేరం రుజువైంది. దీంతో ప్రొద్దుటూరు కోర్టు ముద్దాయిలకు మూడేళ్ల సాధారణ జైలు శిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ.35వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు ఎస్ఐ మంజునాథ్ తెలిపారు. అప్పటి ఎస్ఐ రోషన్ కేసు నమోదు చేయగా.. నేరం రుజువు కావడంతో సోమవారం కోర్టు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

News January 21, 2025

కడప కోటిరెడ్డి కాలేజీ అమ్మాయికి అరుదైన గౌరవం

image

ఈనెల 26వ తేదీ దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు కడపకు చెందిన ఎన్సీసీ క్యాడెట్ ఎస్.సుమియా ఎంపికైంది. కడప కోటిరెడ్డి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీకాం సెకండ్ ఇయర్ చదువుతున్న ఈమె బెటాలియన్ స్థాయి, తిరుపతి గ్రూప్ స్థాయిలతో పాటు ప్రీ రిపబ్లిక్‌డే వేడుకల్లో చక్కటి ప్రదర్శన కనబరిచింది. దీంతో ఢిల్లీలో నిర్వహించే పరేడ్ వేడుకల్లో పాల్గొనే అవకాశం ఈమెకు లభించింది.

News January 21, 2025

కడప: 23న జిల్లా స్థాయి హాకీ ఎంపికలు

image

కడప నగరంలోని డాక్టర్ వైయస్సార్ క్రీడా పాఠశాలలో ఈనెల 23వ తేదీన జిల్లా స్థాయి హాకీ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి ఎం.శేఖర్ తెలిపారు. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ మహిళల విభాగాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సబ్ జూనియర్ విభాగంలో పాల్గొనే క్రీడాకారులు 01-01-2009 తర్వాత పుట్టినవారు అర్హులన్నారు. జూనియర్ విభాగంలో పాల్గొనే వారు 01-01-2006 తర్వాత పుట్టినవారు అర్హులన్నారు.

News January 21, 2025

కడప జిల్లాలో పశు వైద్య శిబిరాలు: జేసీ

image

కడప జిల్లాలో ఈనెల 20వ తేదీ నుంచి పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ పేర్కొన్నారు. కడప కలెక్టర్‌లో పశు వైద్య శిబిరాలకు సంబంధించిన పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఈ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని రైతులు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News January 20, 2025

BREAKING: కడప జిల్లా ఎస్పీగా ఈజీ అశోక్ కుమార్

image

కడప జిల్లా నూతన ఎస్పీగా ఈజీ అశోక్ కుమార్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆదేశాలు ఇవ్వగా ఇందులో భాగంగా కడపకు అశోక్ కుమార్‌ను నియమించారు. ఇక్కడ ఉన్న పూర్వపు ఎస్పీ హర్షవర్ధన్ రాజును నవంబర్‌లో అధికారులు బదిలీ చేయడంతో అప్పటినుంచి ఇంఛార్జి ఎస్పీగా అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కొనసాగుతూ వచ్చారు.

News January 20, 2025

ప్రొద్దుటూరు: ‘ప్రభుత్వం అప్పులు, ఖర్చులను తెలపాలి’

image

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులను, ఖర్చులను మీడియా ద్వారా ప్రజలకు తెలపాలని ప్రజాపక్షం పార్టీ అధ్యక్షుడు పుత్తా లక్ష్మిరెడ్డి తెలిపారు. సోమవారం ప్రొద్దుటూరు తహశీల్దార్ గంగయ్యకు ఆయన వినతిపత్రం అందించారు. లక్ష్మిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు వివిధ రకాల పన్నుల ద్వారా చెల్లించిన సొమ్మును ప్రభుత్వం అప్పులకు చెల్లిస్తోందన్నారు. ప్రతినెల ప్రభుత్వం చేస్తున్న ఖర్చులను, అప్పులను ప్రజలకు వివరించాలన్నారు.

News January 20, 2025

కడప జిల్లా డీఈవోగా షంషుద్దీన్

image

కడప జిల్లా నూతన జిల్లా విద్యాశాఖ అధికారిగా కర్నూలు జిల్లా తాండ్రపాడు డైట్ సీనియర్ లెక్చరర్ ఎస్. షంషుద్దీన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు జిల్లా విద్యాశాఖ అధికారిగా వ్యవహరించిన మీనాక్షిపై ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు ఆరోపణలు, ఉద్యమాలు చేసిన నేపథ్యంలో ఆమె స్థానంలో ఈయనను పాఠశాల విద్య ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు.

News January 20, 2025

కడప: క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో ఏఈ మృతి

image

కడప ఇరిగేషన్ శాఖలో ఏఈగా పనిచేస్తున్న నాగరాజు(42) ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. KSRM ఇంజినీరింగ్ కాలేజీలో క్రికెట్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలాడు. తోటి ఆటగాళ్లు ఆయన్ను హుటాహుటిన కడపలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈయనకు త్వరలో డీఈగా ప్రమోషన్ రానున్నట్లు తెలిసింది. దీంతో ఆయన కుటుంబీకులు శోకసంద్రంలో మిగిలారు.