India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కడప జిల్లాలో పెండింగ్లో ఉన్న అన్ని రకాల నిర్మాణ పనులను ఈ ఆర్థిక సంవత్సరంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ డా. శ్రీధర్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లాలో జరుగుతున్న వివిధ రకాల అభివృద్ధి నిర్మాణ పనుల పురోగతిపై ఆయా శాఖల ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా మినరల్ ఫండ్ ద్వారా నిర్మిస్తున్న వివిధ రకాల పెండింగ్ పనులను ఈ ఆర్థిక సంవత్సరంలోగా పూర్తి చేయాలన్నారు.

కడప జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న గురునాథ్ను సస్పెండ్ చేస్తూ జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. కానిస్టేబుల్గా వున్న గురునాథ్ ఎస్ఐ అని చెప్పుకొంటూ ప్రజలను బెదిరించడం, సక్రమంగా విధులు నిర్వర్తించకుండా ఉండటంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. వారు అందించిన నివేదిక ప్రకారం అతనిపై ఎస్పీ వేటు వేశారు

రాష్ట్ర నూతన చీఫ్ సెక్రటరీగా నియమితులైన కె.విజయానంద్ మన జిల్లాకు చెందిన వారే. కడప జిల్లా రాజుపాలెం మండలం అయ్యవారిపల్లె ఆయన స్వస్థలం. 1965లో జన్మించారు. అనంతపురం జేఎన్టీయూ నుంచి ఎంటెక్ పూర్తి చేశారు. 1992 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన విజయానంద్ జనవరి 1వ తేదీన సీఎస్గా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక సీఎస్గా ఉన్నారు.

మదనపల్లె బైపాస్లోని రాయల్ ఉడ్ వద్ద ఆదివారం రాత్రి ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కారు టైర్ పంచర్ కావడంతో బైకు, బంకు, చెట్టును ఢీకొట్టింది. గాయాలపాలైన దంపతుల్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భర్త మృతి చెందాడు. భార్య కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. మృతుడు పలమనేరు దాసర్లపల్లికి చెందిన గంగాధర్గా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లాకు వచ్చి అప్పుల బాధతో ఆత్మహత్య పాల్పడిన రైతు కుటుంబాన్ని పరామర్శించకపోవడం బాధాకరమని వైసీపీ నేత, ఏపీఎస్ఆర్టీసీ మాజీ జోనల్ ఛైర్మన్ రెడ్డెం వెంకటసుబ్బారెడ్డి అన్నారు. ఖాజీపేట మండలం దుంపలగట్టు గ్రామంలో ఆదివారం రెడ్డెం విలేకరులతో మాట్లాడుతూ.. గాలివీడు ఎంపీడీవోను పరామర్శించేందుకు వచ్చిన డిప్యూటీ సీఎం రైతు కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు.

పోలీసు ఉద్యోగాల నియామకం విషయంలో అభ్యర్థులు దళారుల, మోసగాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని కడప జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఏ ప్రభుత్వ ఉద్యోగమైనా, రిక్రూట్మెంట్ పారదర్శకంగా నిర్వహిస్తారని తెలిపారు. పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

వాళ్లదో చిన్న కుటుంబం. భార్యాభర్త, ఇద్దరు పిల్లలు. ఉన్నంతలో సంతోషంగా జీవితం గడిపారు. ఇటీవలే ఇంట్లో అమ్మాయికి ఫంక్షన్ కూడా చేశారు. ఫ్యామిలీ అంతా కలిసి ముచ్చటగా ఫొటో దిగారు. ఆ సంతోషం ఎక్కువ రోజులు మిగల్లేదు. అన్ని మధ్య తరగతి కుటుంబాల్లో మాదిరిగానే ఆ ఇంటిని అప్పు పలకరించింది. అది తలకు మించిన భారంగా మారి చావు ఒక్కటే మార్గమనేలా చేసింది. అంతే ఆ పెద్దకు ఏమీ తోచలేదు. అందరికీ <<14999995>>ఉరి వేసి<<>> తానూ చనిపోయాడు.

సింహాద్రిపురం మండలం దిద్దేకుంట గ్రామంలో రైతు నాగేంద్ర కుటుంబం ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరమని జిల్లా కలెక్టర్ శ్రీధర్ అన్నారు. పులివెందుల జీజీహెచ్ మార్చురీలో రైతు కుటుంబ సభ్యుల మృత దేహాలను జిల్లా కలెక్టర్ పరిశీలించి అక్కడికి వచ్చిన రైతు కుటుంబ సమీప బంధువులతో మాట్లాడారు. రైతు కుటుంబ నేపథ్యం, వ్యవసాయంలో లాభనష్టాలు, ఆత్మహత్యకు దారితీసిన ఆర్థిక ఇబ్బందులు తదితర కారణాలను అడిగి తెలుసుకున్నారు.

కడప జిల్లా టీడీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య కుమారుడు విష్ణు స్వరూప్ గుండెపోటుతో మృతి చెందారు. మధ్యాహ్నం గుండె పోటుకు గురికాగా హైదరాబాదులోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనతో రామచంద్రయ్య ఇంట్లో విషాదం నెలకొంది.

YS జగన్ తన పార్టీ వర్గాలను నియంత్రించుకోవాలని పవన్ కళ్యాణ్ అన్నారు. 11 సీట్లు వచ్చినా ఇంకా దాడులు చేస్తుంటే మేము ఉపేక్షించమన్నారు. రాయలసీమ యువత ఇలాంటివి జరిగినప్పుడు ఎదుర్కోవాలని, మేము అండగా ఉంటామని నాయకులకు సైతం పవన్ భరోసానిచ్చారు. ఈరోజు మీరు భయపడటం వలనే జవహర్ బాబుపై దాడి జరిగిందన్నారు. పోలీసులే కాదు జనం కూడా ఇలాంటి వాటిపై స్పందించాలని, ఓట్లు వేసి పనైపోయిందని అనుకోకూడదన్నారు.
Sorry, no posts matched your criteria.