Y.S.R. Cuddapah

News September 29, 2024

కలసపాడు: రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి

image

మండలంలోని ఎగువ రామాపురానికి చెందిన బీటెక్ విద్యార్థి తమిళనాడు రాష్ట్రంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అన్నదమ్ములు ఇద్దరు బైక్‌పై వెళ్తుండగా లారీ ఢీకొనడంతో తమ్ముడు అర్జున్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. అన్న అరవింద రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థి మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 29, 2024

రాజంపేట: బంగారు నగలు చోరీ

image

రాజంపేట పట్టణంలోని శ్రీకృష్ణదేవ రాయలు నగర్‌లో నివాసం ఉండే రవి ఇంట్లో చోరీ జరిగిందని పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపులు బద్దలు కొట్టి 70 గ్రాములు బంగారు నగలు చోరీ చేసినట్లు బాధితుడు పేర్కొన్నారు. ఇంటి పరిసర ప్రాంతాలను సీఐ ఎల్లమ రాజు, ఎస్సై ప్రసాద్ రెడ్డి పరిశీలించారు. అయితే జిల్లాలో వారం రోజుల్లో వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

News September 29, 2024

ముద్దనూరు వద్ద అదుపుతప్పి లారీ బోల్తా

image

కడప జిల్లా ముద్దనూరు మండలంలోని నల్లబల్లె రహదారిపై ఆదివారం తెళ్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ముద్దనూరు నుంచి తాడిపత్రి బైపాస్ పనుల కొరకు కంకర లోడ్‌తో వెళ్తున్న ఓ టిప్పర్ ఉదయం 2.30 సమయంలో అదుపు తప్పి పంట పొలాల్లో బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. ఒకేసారి పదుల సంఖ్యలో టిప్పర్లు వెళ్తుండగా వెనక టిప్పర్​కు దారిచ్చే ప్రయత్నంలో ప్రమాదం జరిగిందన్నారు.

News September 29, 2024

చక్రాయపేటలో ఆరేళ్ల బాలికపై అత్యాచార యత్నం

image

కడప జిల్లా చక్రాయపేట మండలంలో నెరుసుపల్లె గ్రామం అప్పిరెడ్డిగారిపల్లెలో శివాజీ అనే యువకుడు, శనివారం ఆరేళ్ల బాలికకు చాక్లెట్ ఆశ చూపి అత్యాచారయత్నానికి ఒడిగట్టినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం ఆ బాలికను కడప రిమ్స్‌కు తరలించినట్లు తెలిసింది. పోలీసులు అత్యాచార యత్నానికి పాల్పడిన యువకుడు శివాజీని అరెస్టు చేసి ఫోక్సో కేసు నమోదు చేసినట్లు సమాచారం.

News September 29, 2024

వేంపల్లి: యూట్యూబర్‌పై కేసు నమోదు

image

వేంపల్లెలో ఓ యూట్యూబ్ ఛానెల్ అధినేతపై కేసు నమోదు చేశారు. తన ఛానెల్లో పని చేస్తున్న యువతిని వేధించిన కేసులో సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు CI సురేష్ రెడ్డి తెలిపారు. ‘అతడి ఛానెల్లో యాంకర్‌గా పనిచేసే సమయంలో అసభ్యంగా ప్రవర్తించాడు. అక్కడ మానేసినా వేధింపులు అపలేదు. తాను అతడి మాటలు వినలేదని తన ఆఫీసు నుంచి నా సర్టిఫికేట్లు తీసుకెళ్లానని అబద్దపు కేసు పెట్టారు’ అని ఫిర్యాదులో తెలిపింది.

News September 28, 2024

కడప జిల్లాలో టెట్ పరీక్షలు.. పరీక్షా కేంద్రాలు ఇవే

image

<<14220966>>కడప<<>> జిల్లాలో అక్టోబర్ 3 నుంచి జరిగే టెట్ పరీక్షా కేంద్రాల వివరాలు.
☛ శ్రీనివాస ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్సెస్ కడప
☛ అన్నమాచార్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్సెస్ కడప
☛ KORM కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కడప
☛ KSRM కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కడప
☛ శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ టెక్నాలజీ & సైన్సెస్ కడప
☛ KLM ఇంజినీరింగ్ ఫర్ ఉమెన్ కడప
☛ SRIT ప్రొద్దుటూరు
☛ CBIT ప్రొద్దుటూరు

News September 28, 2024

కడప జిల్లాలో టెట్ పరీక్షలు.. 8 కేంద్రాల ఏర్పాటు

image

అక్టోబర్ 03 నుంచి 21 వరకు రోజుకు రెండు సెషన్లలో APTET కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖ అధికారి అనురాధ తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారన్నారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను https://aptet.apcfss.in నందు పొంద గలరని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

News September 28, 2024

పెండ్లిమర్రి: గుంతలో పడి పశువుల కాపరి గల్లంతు

image

పెండ్లిమర్రి మండలంలోని బుడ్డాయ పల్లె సమీపంలోని మైన్స్ వద్ద ఉన్న గుంతల్లో పడి శనివారం ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. బుడ్డాయ పల్లెలోని బంధువుల ఇంటికి వచ్చిన శ్రీనివాసులు రెడ్డి పశువులను మేపుకుంటూ మైన్స్ సమీపంలోని గుంతల వద్దకు వెళ్లాడు. పశువులను బయటికి తోలే క్రమంలో అదుపుతప్పి గుంతలో పడి గల్లంతయ్యాడు. పెండ్లిమర్రి ఎస్సై మధుసూదన్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక శాఖ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.

News September 28, 2024

కడప అమ్మాయికి అవార్డు

image

కడప పట్టణానికి చెందిన ఇందిరా ప్రియదర్శిని ఉత్తమ సోషల్ మీడియా పురస్కారం అందుకున్నారు. శుక్రవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందుకున్నారు. ఇందిరా ప్రియదర్శిని ప్రస్తుతం తిరుపతిలో ఉంటూ దేవాలయాలు, పర్యాటక ప్రదేశాల మీద సామాజిక మీడియాను ఉపయోగించుకుంటూ ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు.

News September 28, 2024

హత్యాయత్నం కేసులో.. కడప జైలు వార్డెన్‌కు రిమాండ్

image

అత్తను హత్య చేసేందుకు ప్రయత్నించిన కడప సెంట్రల్ జైలు వార్డెన్ మహేశ్‌కు మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిందని తుళ్లూరు సీఐ వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. కాకినాడకు చెందిన హైకోర్టు ఉద్యోగి భువనేశ్వరికి మహేశ్‌తో ఏప్రిల్‌లో పెళ్లి కాగా.. వీరు గుంటూరు జిల్లా రాయపూడిలో అద్దెకుంటున్నారు. ఆగస్టు 22న మహశ్ తన అత్త సాయికుమారిపై దాడిచేసి, హత్య చేసేందుకు ప్రయత్నించాడన్నారు.