India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమెన్ వరల్డ్ కప్: ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచులో భారత బ్యాటర్లు నిలకడగా రాణిస్తున్నారు. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (70) రన్స్ చేసి ఔటయ్యారు. ఓపెనర్ స్మృతి మంధాన (63*) క్రీజులో ఉన్నారు. కౌర్, స్మృతి 120కి పైగా భాగస్వామ్యం నమోదు చేశారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 31 ఓవర్లలో 170/3గా ఉంది. టీమ్ ఇండియా విజయానికి 114 బంతుల్లో 119 రన్స్ అవసరం. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.
UP మీర్జాపూర్కు చెందిన ఐదేళ్ల బాలిక సమయస్ఫూర్తితో తల్లి ప్రాణాలు కాపాడుకుంది. నిన్న తన తల్లి విషం తాగడంతో శివాణి ఉమెన్ హెల్ప్ లైన్ నంబర్ 1090కు కాల్ చేసింది. వెంటనే సమీపంలోని పోలీసులు అక్కడికి చేరుకుని బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ఇప్పుడు ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. ఎమర్జెన్సీ సమయంలో హెల్ప్ లైన్ నంబర్కు కాల్ చేయాలని స్కూల్లో చెప్పారని ఆ బాలిక చెప్పడంతో ప్రశంసలు కురుస్తున్నాయి.
*లైసెన్స్ పొందిన షాప్స్ నుంచే బాణసంచా కొనాలి.
*టపాకాయలు కాల్చేటప్పుడు కాటన్ వస్త్రాలు ధరించాలి. సింథటిక్ లేదా లూజ్ వస్త్రాలు ధరించవద్దు.
*పని చేయని పటాకులను మళ్లీ వెలిగించేందుకు ట్రై చేయవద్దు.
*క్రాకర్స్ వల్ల గాయమైతే ఐస్, వెన్న, ఆయింట్మెంట్ రాయవద్దు. 10-15 ని. పాటు శుభ్రమైన నీటితో చల్లగా ఉంచాలి.
*అత్యవసర సమయాల్లో 101 లేదా 112కి కాల్ చేయాలి.
దీపావళి సందర్భంగా తాబేలును ఇంటికి తీసుకురావడం శుభప్రదంగా భావిస్తారు. తాబేలు అనేది విష్ణుమూర్తి కూర్మావతారానికి ప్రతీక. అందుకే అనేక ఆలయ కోనేట్లలో తాబేళ్లను వదులుతారు. దీపావళి రోజున దీన్ని ఇంటికి తేవడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. దీర్ఘాయుష్షుకు సంకేతమైన ఇది ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఫలితంగా కుటుంబం సుఖ సంతోషాలతో వెలుగొందుతుందని భావిస్తారు.
అన్ని ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టీ20) కెప్టెన్సీ చేసిన తొలి మ్యాచులోనే ఓటమి చవిచూసిన కెప్టెన్ల జాబితాలో శుభ్మన్ గిల్ చేరారు. భారత్ నుంచి ఈ లిస్టులో అతనితో పాటు కోహ్లీ ఉన్నారు. గిల్ గత ఏడాది జింబాబ్వే చేతిలో టీ20 మ్యాచ్ ఓడగా, ఈ ఏడాది టెస్ట్ (vsENG), ODI(vsAUS)లో పరాజయం పాలయ్యారు. కాగా ఈ ఏడాది వన్డేల్లో టీమ్ ఇండియాకు ఇదే తొలి ఓటమి. వరుసగా 8 విజయాలు సాధించిన తర్వాత ఇవాళ AUSతో మ్యాచులో ఓడింది.
AP: చీకట్లను పారద్రోలి వెలుగుల్ని తీసుకువచ్చే పండుగ దీపావళి అని CM CBN అన్నారు. రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ‘లోకాన్ని పీడిస్తున్న నరకాసురుడిని శ్రీ కృష్ణ, సత్యభామ కలిసి వధించిన రోజు ఇది. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలి. రాష్ట్రం ప్రగతితో ప్రకాశించాలి’ అని ట్వీట్ చేశారు. అటు దీపావళి తెలుగువారి జీవితాల్లో వేల కాంతులు నింపాలని YS జగన్ ఆకాంక్షించారు.
పవర్ ప్లేలో మూడు వికెట్లు కోల్పోవడం తమను దెబ్బతీసిందని టీమ్ ఇండియా కెప్టెన్ గిల్ అన్నారు. ఆస్ట్రేలియాతో ఓటమి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఓటమితో చాలా పాఠాలు నేర్చుకున్నామని, ఇదో పాజిటివ్ విషయమని చెప్పారు. 131 పరుగుల లక్ష్యఛేదనను చాలా డీప్గా తీసుకెళ్లామని, తమకు సంతృప్తిగా ఉందని పేర్కొన్నారు. ఈ మ్యాచులో రోహిత్ (8), కోహ్లీ (0), గిల్ (10) పవర్ ప్లేలోనే వెనుదిరిగారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU) 52 పోస్టులకు దరఖాస్తు గడువును పొడిగించింది. ఈ నెల 24 అప్లైకి చివరితేదీ కాగా.. NOV 8 వరకు పొడిగించింది. మొత్తం పోస్టుల్లో Asst లైబ్రేరియన్, Asst రిజిస్ట్రార్, Sr అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్, Jr ఆఫీస్ అసిస్టెంట్, Lab అసిస్టెంట్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి ఇంటర్, డిగ్రీ, PG, బీటెక్, ఎంటెక్తో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్సైట్: https://uohyd.ac.in/
AP: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని APSDMA తెలిపింది. ఆ తర్వాత 48 గంటల్లో అది వాయుగుండంగా బలపడే అవకాశముందని పేర్కొంది. దీని ప్రభావంతో రాబోయే 4 రోజులు భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. రేపు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని వెల్లడించింది.
TG: కొంత మంది రాజకీయ నాయకులు మావోయిస్టులకు సపోర్ట్ చేస్తున్నారన్న బీజేపీ నేతలు బండి సంజయ్, రాంచందర్ రావు కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. మావోయిస్టుల సాయుధ నెట్వర్క్లకు మద్దతు ఇస్తున్నారని, వెంటనే తమ సంబంధాలను తెంచుకోవాలని కేంద్రమంత్రి బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. మావోయిస్టులతో సంబంధాల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపాలని బీజేపీ చీఫ్ డిమాండ్ చేశారు. దీంతో ఆ నేతలెవరనే చర్చ మొదలైంది.
Sorry, no posts matched your criteria.