India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: కాంగ్రెస్, BRS, BJP కార్యాలయాల్లో జరిగిన పంచాంగ శ్రవణంలో పండితులు భవిష్యత్ అంతా తమకే అనుకూలంగా ఉందని ప్రధాన పార్టీలకు వివరించారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, రేవంత్ పాలనకు ఇబ్బంది లేదని గాంధీభవన్లో తెలిపారు. ప్రజల్లో అసంతృప్తి పెరిగి విపక్షానికి బలం పెరుగుతుందని BRS ఆఫీస్లో చెప్పగా.. ఈ ఏడాదీ కలిసివచ్చి దేశం, రాష్ట్రంలో BJP హవా ఉంటుందన్నారు. కవితకు ప్రజల మద్దతు పెరుగుతుందని చెప్పారు.

కేరళం ఆలప్పుళకు చెందిన రెత్నమ్మ 2011లో నీటి కోసం బోరు తవ్వించారు. కానీ నీరు పడలేదు. బోరు పైపును క్లోజ్ చేసే సమయంలో ఓ వ్యక్తి అగ్గిపుల్ల వెలిగించగా పైపు నుంచి మంటలు వచ్చాయి. దీనిని గ్యాస్లా వాడుకోవచ్చని రెత్నమ్మ ఆ పైపును కిచెన్కు కనెక్ట్ చేసుకున్నారు. పదేళ్లు పైగా దానిని వాడుతూ ఏడాదికి రూ.10వేలు సేవ్ చేస్తున్నారు. బోరు నుంచి వచ్చేది మీథేన్ అని, కానీ అక్కడ భూగర్భ నిల్వలు లేవని అధికారులు తేల్చారు.

కేరళం సీఎం పినరయి విజయన్ ధర్మదమ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడోసారి పోటీ చేసేందుకు ఈరోజు నామినేషన్ వేశారు. తనకు ₹45లక్షల విలువైన బ్యాంక్ డిపాజిట్లు, కన్నూర్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ సహా పలు కంపెనీ షేర్లు ఉన్నాయని అఫిడవిట్లో వెల్లడించారు. ఓ రెసిడెన్షియల్ ప్లాట్, వ్యవసాయ భూమి కలిపి ₹56లక్షల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు తెలిపారు. అలాగే విజయన్పై ఆరు కేసులున్నట్లు అఫిడవిట్ పేర్కొంది. <<-se>>#Elections2026<<>>

భారత్లో ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్)ను మార్చి 21న జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలు సూచించారు. ఇవాళ ఆకాశంలో నెలవంక కనిపించలేదని పేర్కొన్నారు. రంజాన్ మాసం రేపటి (మార్చి 20)తో ముగియనుందని చెప్పారు. దేశ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుక్రవారం ప్రవేశపెట్టే బడ్జెట్లో 6 కొత్త పథకాలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా యంగ్ ఇండియా కిట్స్, విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్ల పంపిణీ, పాడి రైతులకు రాయితీపై పశువుల సరఫరాను ప్రకటించే అవకాశం ఉంది. మహిళలు, రైతులు, యువత, పిల్లల సంక్షేమానికి బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం.

టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన వ్యక్తిత్వ హక్కులకు రక్షణ కల్పించాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కొందరు తన పేరు, ఫొటోలు, ఐడెంటిటీని ఆయుధాలుగా వాడుకుంటున్నారని, ఏఐ సాయంతో డీప్ ఫేక్ వీడియోలు సృష్టించి పోస్టు చేస్తున్నారని పేర్కొన్నారు. వాటి వల్ల తన పరువుకు భంగం కలిగిందని పేర్కొన్నారు. తనపై పోస్టులు చేసిన ఖాతాలు, ఫేక్ కంటెంట్ను తొలగించాలని, రూ.2.5కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని కోరారు.

హార్ముజ్పై భారత్ డిపెండెన్సీ తగ్గిందని.. 70% క్రూడ్ ఇతర ప్రాంతాల నుంచి వస్తోందని కేంద్రం తెలిపింది. LPG సరఫరాను వికేంద్రీకరించేందుకు కృషి చేస్తున్నామంది. రెగ్యులర్గా దిగుమతి చేసుకునే ఖతర్తో పాటు ఇతర దేశాల నుంచి కూడా కొనుగోలు పెంచనున్నట్లు తెలిపింది. అవసరమైతే రష్యా నుంచి కూడా LPG కొంటామని పేర్కొంది. మరోవైపు హార్ముజ్ నుంచి వెళ్లే నౌకలకు టోల్ఛార్జ్ విధించే ప్రతిపాదనను ఇరాన్ పరిశీలిస్తోంది.

మనందరిలో ప్రధానంగా నాలుగు గ్రూపుల రక్తం ఉంటుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా 50 మందికి మాత్రమే ఉండే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్ ‘Rh-Null’ అనే విషయం మీకు తెలుసా? దీనినే ‘గోల్డెన్ బ్లడ్’ అని పిలుస్తారు. ఇందులో ఏ రకమైన యాంటిజెన్లు ఉండవు, అందుకే ఈ రక్తం ఎవరికైనా సెట్ అవుతుంది. కానీ వీరికి రక్తం కావాలంటే మాత్రం దొరకడం చాలా కష్టం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో

మహారాష్ట్రలో ‘ఎప్స్టీన్ ఫైల్స్’ లాంటి ఘటన సంచలనం రేపుతోంది. నాసిక్కు చెందిన జ్యోతిషుడు అశోక్ కారత్ తన వద్దకు వచ్చే మహిళలకు మత్తుమందు ఇచ్చి లైంగిక దాడి చేసేవాడని పోలీసులు గుర్తించారు. వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తూ దోపిడీ చేసేవాడన్నారు. అతడిని అరెస్టు చేసి 58 అసభ్యకర వీడియోలను సీజ్ చేశారు. అశోక్ గతంలో నేవీలో పని చేశాడు. ఇతడికి MH రాజకీయ నేతలు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలతో సంబంధాలున్నాయి.

దేశంలో LPG సిలిండర్ల సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదని.. డిస్ట్రిబ్యూషన్లోనే సమస్య ఉందని కేంద్రం వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే క్షేత్రస్థాయిలో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని పేర్కొంది. దీనిపై డిస్ట్రిక్ట్ లెవల్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే రాష్ట్రాలకు అప్పీల్ చేశామని తెలిపింది. నిన్న టోటల్ బుకింగ్స్ 56లక్షలుగా ఉండగా సప్లై సంఖ్య 54,91,000గా ఉన్నట్లు తెలిపింది.
Sorry, no posts matched your criteria.