India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బంగారం ధర ఎఫెక్ట్ డిమాండ్పై పడింది. వివాహాల సీజన్ అయినా కొనుగోళ్లు పెరగకపోవడమే ఇందుకు ఉదాహరణ. గతేడాదితో పోలిస్తే ఈసారి డిమాండ్ తక్కువేనని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. 2024లో 802.8 టన్నుల అమ్మకాలు జరగ్గా 2025లో 11% తగ్గి 710.9 టన్నులకు చేరింది. ఈ ఏడాది అది 600-700 టన్నులే ఉండొచ్చని WGC అంచనా వేసింది. 2024లో కొనుగోళ్ల విలువ రూ.5.75లక్షల కోట్లు కాగా 2025లో అది రూ.7.51లక్షల కోట్లకు చేరింది.

☛ వైనతేయ గంగ: నాటిన 3-4 ఏళ్లలో కాపునకు వస్తుంది. ఏటా చెట్టుకు 125 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 69 శాతం.
☛ వశిష్ట గంగ: నాటిన 3-4 ఏళ్లలో కాపునకు వస్తుంది. సగటున చెట్టుకు 125 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 69 శాతం.
☛ అభయ గంగ: నాటిన 4 ఏళ్లకు కాపునకు వస్తుంది. సగటున చెట్టుకు 135 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 72 శాతం. కొబ్బరి నూనెకు ఇది అనుకూలం.

విశాఖపట్నంలోని DRDOకు చెందిన నావల్ సైన్స్& టెక్నలాజికల్ లాబోరేటరీ (<

నేడు ‘ఓం భూవరాహాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నో క్రోధః ప్రచోదయాత్’ అనే వరాహ గాయత్రీ మంత్రం పఠించాలని పండితులు సూచిస్తున్నారు. అలాగే ‘ఓం నమో భగవతే వరాహ రూపాయ భూః భువః స్వః పతయే భూపతిత్వ మే దేహి దాపయ స్వాహా’ అనే మంత్రాన్ని కూడా జపించవచ్చని అంటున్నారు. ‘ఓం వరాహాయ నమః’ అనే సరళ మంత్రాన్ని 108 సార్లు పఠించడం వల్ల సకల దోషాలు తొలగి, స్థిరాస్తి సమస్యలు తీరుతాయని చెబుతున్నారు.

మహారాష్ట్ర Dy.CM <<18990751>>అజిత్ పవార్<<>> విమాన ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆ ఫ్లైట్ నడిపిన కెప్టెన్ సుమిత్ కపూర్ వేరే పైలట్ స్థానంలో వచ్చినట్లు అతని ఫ్రెండ్స్ తెలిపారు. ‘కొన్ని రోజుల క్రితమే సుమిత్ హాంగ్కాంగ్ నుంచి వచ్చారు. పవార్ను బారామతి తీసుకెళ్లాల్సిన పైలట్ ట్రాఫిక్లో చిక్కుకోవడంతో కొన్ని గంటల ముందే సుమిత్కు ఆ బాధ్యత అప్పగించారు’ అని పేర్కొన్నారు. ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.

<

హిరణ్యాక్షుడు వేదాలను అపహరించి, భూమిని సముద్ర గర్భంలో దాచాడు. దీంతో సృష్టి కార్యానికి ఆటంకం కలిగింది. అప్పుడు బ్రహ్మదేవుని నాసిక నుంచి అతి చిన్న రూపంలో వరాహ స్వామి ఉద్భవించాడు. క్షణ కాలంలోనే ప్రచండ రూపం దాల్చాడు. లోకోద్ధరణ కోసం సముద్రంలోకి దూకి, హిరణ్యాక్షుడిని సంహరించి, కోరలపై భూమిని నిలిపి పైకి తెచ్చాడు. వేదాలను రక్షించి, భూమిని ఉద్ధరించడమే ఈ అవతార ప్రధాన లక్ష్యం. ఆ తర్వాత తిరుమలలో కొలువయ్యారు.

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల టమాటలో పచ్చదోమ, తామర పురుగు, సూది పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉంది. పచ్చదోమ నివారణకు లీటరు నీటికి ఫిప్రోనిల్ 2ML లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. తామర పురుగుల నివారణకు లీటరు నీటికి డైమిథోయెట్ 2ML లేదా మిథైల్ డెమటాన్ 2ML కలిపి పిచికారీ చేయాలి. సూది పురుగు నివారణకు లీటరు నీటికి నోవాల్యురాన్ 1.5ML లేదా ఫ్లూబెండమైడ్ 0.25ML పిచికారీ చేయాలి.

బాబీ డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి నటించబోయే సినిమాను వచ్చే నెలలో లాంచ్ చేయనున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ డైరెక్టర్&యాక్టర్ అనురాగ్ కశ్యప్ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. మాస్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో చిరంజీవి కూతురిగా కృతి శెట్టి లేదా అనస్వర రాజన్ నటిస్తారని టాక్. చిరు, బాబీ కాంబోలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే.

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను ఎర్రవల్లి ఫామ్హౌస్లోనే విచారించాలన్న KCR అభ్యర్థనను పరిశీలిస్తున్నామని సిట్ చీఫ్ సజ్జనార్ తెలిపారు. అయితే కేసు నమోదైన PS జ్యూరిడిక్షన్ పరిధిలోనే సాక్షి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉంటుందని, దీనిపై ఎలా ముందుకెళ్లాలనే విషయంలో న్యాయనిపుణుల సలహా తీసుకుంటామన్నారు. KCRకు మళ్లీ ఎప్పుడు నోటీసులు ఇవ్వాలి? ఎక్కడ విచారించాలనేదానిపై ఇవాళ నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.