India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
SRH బౌలర్ మహ్మద్ షమీ అరుదైన ఘనత సాధించారు. IPLలో అత్యధికసార్లు(4) ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్కే వికెట్ తీసిన బౌలర్గా చరిత్ర సృష్టించారు. 2014లో ఢిల్లీ తరఫున ఆడిన అతను జాక్వెస్ కల్లిస్(KKR)ను, 2022లో గుజరాత్ తరఫున కేఎల్ రాహుల్(LSG)ను, 2023లో ఫిల్ సాల్ట్(DC)ను, నిన్న రషీద్(CSK)ను ఇలా ఔట్ చేశారు. ఉమేశ్, బౌల్ట్, ప్రవీణ్ కుమార్, మలింగ, భువనేశ్వర్, అశోక్ దిండా గతంలో మూడుసార్లు తొలి బంతికే వికెట్ తీశారు.
హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఆగిపోయినట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ ఆగిపోలేదని, వచ్చే ఏడాది దీని కోసం పవన్ డేట్స్ కేటాయిస్తారని తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రానికి ఆయన రూ.170కోట్ల పారితోషికం అందుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై నిర్మాతల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
KKR రూ.23.75 కోట్లు పెట్టి కొన్న వెంకటేశ్ అయ్యర్ ఈ ఏడాది IPLలో 8 మ్యాచులాడి 135 పరుగులు చేశారు. ఆ వేలం ధరే అతడిపై ఒత్తిడిని పెంచుతుండొచ్చని మాజీ క్రికెటర్ RP సింగ్ అభిప్రాయపడ్డారు. ‘అంత ధర పెట్టి ఆటగాడిని కొన్నారంటే అతడే మెయిన్ ప్లేయర్ అనో లేక కాబోయే కెప్టెన్ అనో జట్టు నమ్ముతున్నట్లే. కానీ వెంకీ ఆ రెండూ కాలేకపోయారు. వేలంలో కేకేఆర్ ఘోరంగా విఫలమైందనుకుంటున్నా’ అని పేర్కొన్నారు.
పాకిస్థాన్తో భారత్ క్రికెట్ సంబంధాలు పూర్తిగా తెంచుకోవాలని BCCI మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సూచించారు. ఇటువంటి ఘటనలు ఏటా జరుగుతున్నాయి. ఇది జోక్ కాదు టెర్రరిజాన్ని సహించేది లేదని తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో గంగూలీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా 2013లో చివరిసారిగా పాక్తో ద్వైపాక్షిక సిరీస్ ఆడిన భారత్ ఐసీసీ టోర్నీల్లో హైబ్రిడ్ మోడల్లో తటస్థ వేదికలలో మ్యాచులు ఆడుతోంది.
భారత ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ INS విక్రాంత్ కరాచీ సమీపంలోకి చేరుకున్న నేపథ్యంలో పాక్ పరోక్ష హెచ్చరికలు చేసింది. అరేబియా సముద్రంలో ఈరోజు, రేపు తమ నౌకాదళం విన్యాసాలు చేయనుందని, వీటిలో క్షిపణి పరీక్షలు కూడా ఉంటాయని తేల్చిచెప్పింది. ఆ సమయంలో నౌకలు, విమానాలు ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని ఓ నోటిఫికేషన్లో తెలిపింది. అటు ఏ మిషన్కైనా నౌకలు సిద్ధంగా ఉన్నాయంటూ భారత నేవీ పోస్ట్ వేయడం గమనార్హం.
AP: వీకెండ్ కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు భారీగా పోటెత్తారు. అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద భారీ సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. గరుడ కూడలి వరకు నిలిచిపోయాయి. దర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతున్నట్లు సమాచారం. నిన్న 64,536 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.37 కోట్లు వచ్చింది.
బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల, 22 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధరలు రూ.30 చొప్పున తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రా. పసిడి ధర రూ.98,210 ఉండగా, 22 క్యారెట్ల 10గ్రా గోల్డ్ రేటు రూ.90,020గా ఉంది. అటు వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం కేజీ వెండి రేటు రూ.1,10,900గా ఉంది.
అమెరికా దర్యాప్తు సంస్థ FBI ఏకంగా ఓ న్యాయమూర్తినే తాజాగా అరెస్ట్ చేసింది. చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించిన వలసదారుడికి మిల్వాకీలోని సీనియర్ సిటింగ్ జడ్జి హన్నా దుగన్ అండగా నిలిచినట్లు ఆరోపణలున్నాయి. స్వయంగా కోర్టులోనే అధికారుల్ని ఆమె తప్పుదోవ పట్టించి వలసదారుడు తప్పించుకునేందుకు సహకరించడంతో FBI ఆమెను, వలసదారుడిని అరెస్ట్ చేసింది.
ఇండియన్ మిలిటరీ అకాడమీలో JAN 2026న ప్రారంభమయ్యే 142వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు(TGC)కు నోటిఫికేషన్ వెలువడింది. ఈ నెల 30 నుంచి మే 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. బీటెక్ పూర్తయిన వారు, ఫైనలియర్ చదువుతున్న వారు అర్హులు. అవివాహితులై, వయసు 20-27 ఏళ్ల మధ్య ఉండాలి. 2 టెస్టులు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్సైట్: www.joinindianarmy.nic.in
HYDలో జరుగుతున్న భారత్ సమ్మిట్లో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ ఇవాళ నగరానికి రానున్నారు. ఈ సందర్భంగా BRS MLC కవిత ఆయనపై సెటైరికల్ ట్వీట్ చేశారు. ‘దారితప్పి వస్తున్న ఎన్నికల గాంధీకి స్వాగతం. అబద్ధపు వాగ్దానాలతో ప్రజలను ముంచారు. మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీల పరిస్థితి ఏంటి? మీ సీఎం మానవ హక్కులను మంటకలుపుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? లాఠీ దెబ్బలు తిన్న HCU విద్యార్థులను పరామర్శించండి’ అని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.