India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుజరాత్ తీరంలో 300KGల డ్రగ్స్ను నార్కోటిక్స్ అధికారులు సీజ్ చేశారు. దీని విలువ ₹1,800Cr ఉంటుందని అంచనా. ఈ నెల 12-13న రాత్రి అనుమానాస్పద బోట్ కనిపించడంతో అధికారులు అక్కడికెళ్లారు. దీంతో దుండగులు డ్రగ్స్ మూటలను సముద్రంలో పడేసి ఇంటర్నేషనల్ బోర్డర్ వైపు వెళ్లిపోయారు. వెంటనే సిబ్బంది నీళ్లలో మునిగిన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ ATS, నేవీ దళం సంయుక్త ఆపరేషన్ చేసినట్లు అధికారులు తెలిపారు.
రాకెట్ స్పీడ్తో దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలు 5 రోజుల తర్వాత స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.150 తగ్గి రూ.87,550కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.160 తగ్గి రూ.95,510 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.100 తగ్గి రూ.1,09,900గా ఉంది.
ఐటీ కంపెనీలు, కొన్ని కార్పొరేట్ స్కూళ్లకు మరోసారి వరుసగా సెలవులు రానున్నాయి. ఈ శుక్రవారం గుడ్ఫ్రైడే హాలిడే కాగా శని, ఆదివారాలు రెగ్యులర్ వీకెండ్ సెలవులు. ఇప్పటికే గత శనివారం మొదలుకుని ఇవాళ్టి వరకు పలు సంస్థలకు సెలవులున్నాయి. మరో మూడు రోజులు పనిచేస్తే తర్వాత మళ్లీ లాంగ్ వీకెండ్ బ్రేక్ అన్నమాట.
TG: సంబంధాలు కుదరక పెళ్లి కావట్లేదని మహిళా కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నారు. జనగామ (D) కొడకండ్ల (M) నీలిబండతండాకు చెందిన గగులోత్ నీల(26)కు 2020లో AR కానిస్టేబుల్ ఉద్యోగం రాగా వరంగల్లో పని చేస్తున్నారు. శనివారం విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన ఆమె ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని చనిపోయారు. పెళ్లి కావట్లేదనే మనస్తాపంతో తమ కూతురు సూసైడ్ చేసుకున్నట్లు నీల తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
TG: అంబేడ్కర్ జయంతి సందర్భంగా CM రేవంత్ నివాళులర్పించారు. అంబేడ్కర్ ఆశయ సాధనలో తమ ప్రభుత్వం ఎన్నో అడుగులు వేసిందని ట్వీట్ చేశారు. SC వర్గీకరణ, బడుగు- బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టరూపం, యంగ్ ఇండియా స్కూళ్ల ద్వారా నాణ్యమైన విద్య, ఇందిరమ్మ భరోసా పథకం, సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతికి శ్రీకారం వంటివి ఉదాహరణగా చెప్పారు.
US విస్కాన్సిన్లో కసాప్(17) అనే కుర్రాడు డొనాల్డ్ ట్రంప్ను హత్య చేసేందుకు డబ్బు కోసం కన్నతల్లి, సవతి తండ్రిని కాల్చి చంపినట్లు FBI వెల్లడించింది. FEB 11న హత్యలు చేయగా.. తాజాగా ఈ కుట్రకోణం వెలుగు చూసింది. మారణకాండ సృష్టించేందుకు డ్రోన్, పేలుడు పదార్థాలు కొనే ప్రయత్నాలూ చేశాడట. రష్యాలోని ఓ వ్యక్తితో టచ్లో ఉన్నాడని.. అతని ఫోన్లో హిట్లర్ ఫొటోలు, జాతి విద్వేష భావజాలాన్ని గుర్తించినట్లు తెలిపింది.
AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. కంపార్ట్మెంట్లన్నీ నిండి ఏటీజీహెచ్ వరకు క్యూలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న ఏడుకొండలవాడిని 79,100 మంది దర్శించుకున్నారు. 32,791 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.52 కోట్లు లభించింది.
అమెరికా అలబామాలో టోవానా లూనీ అనే మహిళ పంది కిడ్నీతో 130 రోజులు జీవించి రికార్డు సృష్టించారు. ఓ జంతువు కిడ్నీతో మనిషి ఇప్పటి వరకు 2 నెలలకు మించి బతకలేదు. గతేడాది NOV 25న లూనీకి పంది కిడ్నీని అమర్చగా, ఇటీవల ఆమెలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయి. దీంతో వైద్యులు ఆ కిడ్నీని విజయవంతంగా తొలగించారు. ఇకపై ఆమె మళ్లీ డయాలసిస్ చేయించుకోనున్నారు. ఆమెకు సరిపోయే మనిషి కిడ్నీ దొరికాక అమర్చుతామని వైద్యులు తెలిపారు.
రాజ్యాంగ నిర్మాత బీఆర్.అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఇవాళ దేశవ్యాప్తంగా సెలవు ఉంది. స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు బ్యాంకులు పని చేయవు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పబ్లిక్ హాలిడేగా ప్రకటించారు.
ఇటీవల బెంగళూరులో రోడ్డుపై వెళ్తున్న మహిళను <<16013655>>లైంగికంగా<<>> వేధించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక, TN, కేరళలో 700 CCTVలను పరిశీలించి నిందితుడు సంతోష్ను కోజికోడ్లో ట్రేస్ చేశారు. ఇతను BNGLలోని ఓ షోరూమ్లో పనిచేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. కాగా ఆ ఘటన తర్వాత నగరాల్లో లైంగిక వేధింపులు సాధారణమే అని మంత్రి పరమేశ్వర కామెంట్స్ చేసి తర్వాత క్షమాపణ కోరిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.