India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కేంద్ర ప్రభుత్వ శాఖలలో నూతనంగా నియమితులైన 51వేల మంది యువతకు ప్రధానమంత్రి నేడు నియామక పత్రాలు అందజేయనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా నూతన ఉద్యోగులనుద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. 15వ ‘రోజ్ గార్ మేళా’ దేశవ్యాప్తంగా 47 ప్రాంతాలలో జరగనుంది.
IPL: ఓటములు(7), నెట్ రన్ రేటు(-1.302) ప్రకారం CSK ప్లేఆఫ్స్కు వెళ్లడం అసాధ్యం. ఏదైనా మిరాకిల్ జరిగితే గ్రూప్ స్టేజ్ దాటొచ్చు. చెన్నై తర్వాతి 5 మ్యాచ్లనూ(vsPBKS, RCB, KKR, RR, GT) భారీ మార్జిన్లతో గెలవాలి. అప్పుడు 14 పాయింట్లు వస్తాయి. 3 టీమ్లు మినహా మరే జట్టుకూ 14 పాయింట్లు రాకపోతే ఛాన్స్ ఉంటుంది. 2024లో 4 టీమ్స్(CSK, DC, LSG, RCB)కు 14 పాయింట్లు రాగా NRRను బట్టి RCB ప్లేఆఫ్స్కు వెళ్లింది.
TG: కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లో కీలకపాత్ర పోషించిన ఇరిగేషన్ మాజీ ENC హరి రామ్ ఇంటిపై ఏసీబీ దాడులు చేస్తోంది. ఏకకాలంలో 14 ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) రిపోర్ట్ ఆధారంగా ఏసీబీ ఈ తనిఖీలు చేపట్టింది. కాగా మేడిగడ్డ బ్యారేజీ డిజైన్లో లోపాలు ఉన్నాయని నిన్న NDSA ఫైనల్ రిపోర్టులో వెల్లడించిన విషయం తెలిసిందే.
భారత్- పాక్ మధ్య హైటెన్షన్ వాతావరణం నెలకొన్న తరుణంలో పాకిస్థాన్ ఆర్మీ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. జమ్మూకశ్మీర్ లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి అన్నీ పోస్టుల వద్ద పాక్ సైన్యం కాల్పులకు తెగబడినట్లు సమాచారం. నిన్న రాత్రి సమయంలో పాక్ కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు. పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు ఇండియన్ ఆర్మీ దీటుగా సమాధానమిచ్చిందట. ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
‘మిషన్ ఇంపాజిబుల్- ది ఫైనల్ రెకనింగ్’ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మూవీ టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే నెల 23న విడుదల కావాల్సిన మూవీని భారత్లో 17నే రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. టామ్ క్రూజ్ గూఢచారి పాత్రలో కనిపించే మిషన్ ఇంపాజిబుల్ సిరీస్కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఈ సిరీస్లో ‘ది ఫైనల్ రెకనింగ్’ ఆఖరిది కావడంతో మూవీపై భారీ అంచనాలున్నాయి.
పొరపాటున <<16202708>>సరిహద్దు దాటిన BSF జవాన్<<>> పూర్ణం సాహును పాకిస్థాన్ బంధించింది. దీంతో అతని కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. నాన్నకు ఏమైందని ఏడేళ్ల కొడుకు అడుగుతున్నాడని, ఏం చెప్పాలో అర్థం కావట్లేదని భార్య రజని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలియట్లేదని తండ్రి భోల్నాథ్ రోదిస్తున్నారు. బతికున్నాడా? లేదా? ఎప్పుడు తిరిగొస్తాడు? అని అధికారులను ప్రశ్నిస్తున్నారు.
కస్టమర్లకు LIC శుభవార్త చెప్పింది. హౌసింగ్ లోన్ రేటును 25 బేసిస్ పాయింట్లను తగ్గించింది. దీంతో గృహ రుణ రేటు ఈ నెల 28 నుంచి 8 శాతం వద్ద ప్రారంభమవుతుంది. కొత్తగా రుణం తీసుకున్న, తీసుకోబోతున్న వారికీ ఈ లబ్ధి చేకూరుతుందని సంస్థ వెల్లడించింది. ఇటీవల ఆర్బీఐ రెపో రేటును 0.25 శాతం తగ్గించడంతో ఆ మేర కుదించేందుకు బ్యాంకులు ముందుకొస్తున్నాయి.
TG: ఇంటర్ ఫస్టియర్ పాఠ్యాంశాల్లో మార్పులు చేయాలన్న ఇంటర్ బోర్డు ప్రతిపాదనలను ప్రభుత్వం తిరస్కరించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వార్షిక పరీక్షను 80 మార్కులకు కుదించి, 20 ఇంటర్నల్ మార్కులను ఇవ్వాలని బోర్డు భావించింది. ఇందుకోసం పాఠ్యాంశాలనూ సవరించింది. దీనిని అమలు చేసేందుకు అనుమతి కోరగా ప్రభుత్వం రిజెక్ట్ చేసింది.
పహల్గామ్లో ఉగ్రదాడి నేపథ్యంలో బెంగాల్కు చెందిన స్కూల్ టీచర్ సబీర్ హుస్సేన్ ఓ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇస్లాంను వదిలేసి మనిషిగా గుర్తింపు పొందేందుకు కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. ‘కశ్మీర్లో హింసకు మతాన్ని సాధనంగా ఉపయోగించడాన్ని అంగీకరించలేను. మతం పేరుతో ప్రాణాలు తీయడం బాధను కలిగిస్తోంది. అందుకే ఇస్లాంను త్యజిస్తున్నా. నా భార్య, పిల్లలకు ఈ విషయంలో స్వేచ్ఛ ఉంటుంది’ అని తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో 40-44 డిగ్రీల ఎండలు, వడగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వడదెబ్బకు పిట్టల్లా రాలిపోతున్నారు. TGలో 2 రోజులు సాధారణం కంటే 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని IMD వెల్లడించింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఏపీలో 4 మండలాల్లో తీవ్ర వడగాలులు, 17 మండలాల్లో <
* మధ్యాహ్నం వేళ్లలో బయటికి వెళ్లకపోవడం మంచిది.
Sorry, no posts matched your criteria.