news

News March 10, 2025

ALERT: ఈ ప్రాంతాల్లో వడగాలులు

image

AP: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇవాళ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం, పార్వతీపురం, ఏలూరులోని పలు ప్రాంతాల్లో వడగాలులు తీవ్ర ప్రభావం చూపిస్తాయని APSDMA అధికారులు తెలిపారు. రేపు 39 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, కాటన్ దుస్తులు ఉపయోగించాలన్నారు.

News March 10, 2025

లలిత్ మోదీకి బిగ్ షాక్

image

IPL మాజీ ఛైర్మన్ లలిత్ మోదీకి <<15692963>>వనువాటు<<>> ప్రభుత్వం షాకిచ్చింది. ఆయనకు జారీ చేసిన పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని ఆ దేశ ప్రధాని జోతం నపట్ పౌరసత్వ కమిషన్‌ను ఆదేశించారు. కొన్ని వారాల క్రితం లలిత్ మోదీ వనువాటు పౌరసత్వాన్ని పొందిన సంగతి తెలిసిందే. మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన, భారత్‌లో దర్యాప్తును తప్పించుకునేందుకు అక్కడి పౌరసత్వాన్ని పొందారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.

News March 10, 2025

కూల్ డ్రింక్ మూత, పల్లి గింజకు చిన్నారులు బలి!

image

TG: చిన్నపిల్లలకు ఏది తినాలి, ఏది తినకూడదో తెలియదు. ఏది పడితే అది నోట్లో పెట్టుకుంటారు. అందుకే తల్లిదండ్రులు వారిని నిత్యం గమనిస్తూ ఉండాలి. తాజాగా బాటిల్ మూత మింగి ఓ చిన్నారి, గొంతులో పల్లీ ఇరుక్కొని మరో బాలుడు ప్రాణాలు కోల్పోయారు. మంచిర్యాల(D) ఊట్కూర్‌‌లో రుద్ర అయాన్ (9నెలలు) కూల్ డ్రింక్ మూత మింగి చనిపోగా, MHBD జిల్లా నాయకపల్లిలో అక్షయ్(18 నెలలు) గొంతులో పల్లీ ఇరుక్కుని ఊపిరాడక మృతిచెందాడు.

News March 10, 2025

భారత జట్టుకు, జనసేనకు ఒకే విధమైన పోలికలు: నాగబాబు

image

విజయానికి అదృష్టంతో సంబంధం లేదని మరోసారి నిరూపితమైందని జనసేన నేత నాగబాబు అన్నారు. జనసేనను భారత జట్టుతో పోల్చారు. ‘IND ఒక్క టాస్ గెలవకుండా అన్ని మ్యాచ్‌లు గెలిచి 12 ఏళ్లకు CT సాధించింది. ఒక్క MLA కూడా లేకుండా 12 ఏళ్లకు 100% స్ట్రైక్ రేట్‌తో గెలిచి JSP రాజ్యాధికారంలో భాగస్వామ్యమైంది. ఈ రెండింటికీ ఒకే విధమైన పోలికలు. ప్రణాళిక, ప్రాతినిధ్యం, కూర్పు, కసరత్తు, అంకితభావం, ఐకమత్యం’ అని ట్వీట్ చేశారు.

News March 10, 2025

కారును ఢీకొట్టిన ట్రక్కు.. ఏడుగురు మృతి

image

మధ్యప్రదేశ్‌లోని ఉప్ని సమీపంలో జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున బొలెరోను వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొనడంతో ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. 14 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులను రేవా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బల్కర్ సిద్ధి నుంచి బహ్రీకి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 10, 2025

CT 2025: భారత ప్లేయర్ల ప్రదర్శన ఇలా..

image

☛ బ్యాటర్లు(రన్స్): శ్రేయస్ అయ్యర్ 243, విరాట్ కోహ్లీ 218, శుభ్‌మన్‌ గిల్ 188, రోహిత్ శర్మ 180, KL రాహుల్ 140.

☛ ఆల్‌రౌండర్లు: అక్షర్ పటేల్ – 109 రన్స్+ 5 వికెట్స్, హార్దిక్ పాండ్య -99R + 4W, జడేజా- 27R + 5W

☛ బౌలర్లు (వికెట్లు): షమీ 9, వరుణ్ చక్రవర్తి 9, కుల్దీప్ 7, హర్షిత్ రాణా 4

News March 10, 2025

నేడు గ్రూప్-1 రిజల్ట్

image

TG: నేడు గ్రూప్-1 ఫలితాలను టీజీపీఎస్సీ ప్రకటించనుంది. ఈ మేరకు ప్రొవిజనల్ మార్కుల జాబితాను రిలీజ్ చేయనుంది. మొత్తం 563 పోస్టులకు‌గానూ గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన మెయిన్స్‌కు 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక రేపు గ్రూప్-2 అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, 14న గ్రూప్-3 పరీక్ష జనరల్ ర్యాంకింగ్ జాబితాను రిలీజ్ చేయనున్నారు.

News March 10, 2025

TDP సీనియర్లకు నిరాశ.. ముందుగానే ఫోన్లు

image

AP: MLA కోటా MLC సీటు ఆశించిన పలువురు TDP సీనియర్లకు నిరాశ ఎదురైంది. అయితే అభ్యర్థులను ప్రకటించక ముందే వారికి రాష్ట్ర TDP అధ్యక్షుడు పల్లా నుంచి ఫోన్లు వెళ్లాయి. ఏ కారణం వల్ల పరిగణనలోకి తీసుకోవట్లేదో వివరించి, భవిష్యత్తులో అవకాశం కల్పిస్తామని CM మాటగా వివరించారు. దేవినేని ఉమ, పిఠాపురం వర్మ, KS జవహర్, మాల్యాద్రి, వంగవీటి రాధా, టీడీ జనార్దన్, దువ్వారపు రామారావు, అశోక్ బాబు తదితరులకు నచ్చజెప్పారు.

News March 10, 2025

నేటి నుంచి ధర్మపురి నృసింహుని బ్రహ్మోత్సవాలు

image

TG: ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి ఈనెల 22 వరకు జరగనున్నాయి. నేడు పుట్ట బంగారంతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. రేపు సాయంత్రం స్వామివారి కళ్యాణ వేడుకలు జరగనున్నాయి. 14, 15, 16 తేదీల్లో తెప్పోత్సవం, డోలోత్సవం, 16, 17, 18 తేదీల్లో స్వామివార్ల దక్షిణ, ఉత్తర దిగ్యాత్ర కార్యక్రమాలు చేపడతారు. 19న రథోత్సవం, 20, 21, 22 తేదీల్లో ఉత్సవమూర్తుల ఏకాంతోత్సవాలను జరిపిస్తారు.

News March 10, 2025

40 డిగ్రీలు దాటనున్న పగటి ఉష్ణోగ్రతలు

image

TG: మరో వారం రోజుల్లో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే 5 రోజుల్లో సగటు ఉష్ణోగ్రతలు 36-40 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. నిన్న అత్యధికంగా నల్గొండ (D) చిట్యాలలో 39.8 డిగ్రీలు నమోదైంది. KNR, HNK, BHPL, KMR, ASF, NZB, మేడ్చల్, నారాయణ్ పేట్, నిర్మల్, PDPL, SDPT, వనపర్తి, MHBD జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 39.7డిగ్రీలుగా రికార్డ్ అయింది.