India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: హైదరాబాద్ జలసౌధలో ఇవాళ కొనసాగిన KRMB (కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్) సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి తమకు మే నెల వరకు 55 టీఎంసీల నీరు కావాలని ఏపీ, 63 టీఎంసీలు కావాలని తెలంగాణ బోర్డుకు తెలిపాయి. ఏపీ జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, టీజీ నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శితో బోర్డు ఛైర్మన్ అతుల్ జైన్ సమావేశమయ్యారు.

ఇంగ్లండ్తో మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 325/7 స్కోర్ చేసింది. ఇబ్రహీం జద్రాన్ (177) భారీ ఇన్నింగ్స్తో ENG బౌలర్లకు చెమటలు పట్టించారు. నబీ(40), హస్మతుల్లా (40), అజ్మతుల్లా (41) రన్స్తో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్ 3, లివింగ్స్టోన్ 2 వికెట్లు, ఓవర్టన్, రషీద్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచులో గెలవాలంటే ENG 50 ఓవర్లలో 326 రన్స్ చేయాలి. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.

ఐదేళ్ల తర్వాత నార్త్ కొరియా తమ దేశంలోకి విదేశీ పర్యాటకులను ఆహ్వానిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురిస్తున్నాయి. పర్యాటకం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విదేశీ మారక నిల్వలపై దృష్టి పెడుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. కొవిడ్-19 సంక్షోభం సమయంలో ఆ దేశం విదేశీ పర్యాటకులపై నిషేధం విధించింది. ఇప్పుడు మళ్లీ పర్యాటకులను ఆహ్వానిస్తోంది.

అఫ్గానిస్థాన్ క్రికెటర్ ఇబ్రహీం జద్రాన్ చరిత్ర సృష్టించారు. వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీలు చేసిన ఏకైక అఫ్గాన్ ఆటగాడిగా ఆయన నిలిచారు. WCలో ఆస్ట్రేలియాపై, CTలో ఇంగ్లండ్పై శతకాలు బాదారు. మరే అఫ్గాన్ ప్లేయర్ ఈ రెండు మెగా టోర్నీల్లో శతకాలు బాదలేదు. కాగా ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచులో జద్రాన్ (177) సెంచరీతో మెరిశారు. 146 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో శతకం పూర్తి చేసుకున్నారు.

TG: ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని 66,240 కూలీల ఖాతాల్లో ప్రభుత్వం రూ.6000 చొప్పున జమ చేసింది. ఇప్పటివరకు మొత్తం 83,420 మందికి రూ.50.65 కోట్లు జమ చేశామంది. ఎన్నికల కోడ్ ముగియగానే మిగతా లబ్ధిదారులకు ఆత్మీయ భరోసా నిధులను చెల్లిస్తామంది. అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో 18,231 మందికి జమ చేసినట్లు వెల్లడించింది. మీ ఖాతాలో డబ్బులు జమ అయ్యాయా? కామెంట్ చేయండి.

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ నిర్మాణ సంస్థపై ఫైరయ్యారు. ‘కబీర్ సింగ్ సినిమాలో నటించినందుకు ఒక నటుడిని ఓ నిర్మాణ సంస్థ తిరస్కరించిందని తెలిసి ఆశ్చర్యపోయా. అతను ఒక చిన్న పాత్ర పోషించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆడిషన్ ఇచ్చినందుకు నా సినిమాలో పనిచేసినందుకు తీసుకోవట్లేదని చెప్పడం ఏంటి? వారికి ధైర్యం ఉంటే ఇదే మాట రణ్బీర్ కపూర్, త్రిప్తి దిమ్రీ, రష్మికతో చెప్పగలరా?’ అని ప్రశ్నించారు.

హ్యాకర్ల నుంచి డేటాను కాపాడుకునేందుకు స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవాలి. 11 నంబర్స్ లేదా 8 స్మాల్ క్యారెక్టర్స్తో ఉన్న పాస్వర్డ్ను వెంటనే హ్యాక్ చేయొచ్చు. అదే 17 నంబర్స్, 12 స్మాల్ క్యారెక్టర్స్ లేదా 9 నంబర్స్తో పాటు స్మాల్ & క్యాపిటల్తో సహా చిహ్నాలుంటే రెండ్రోజులు పట్టొచ్చు. 18 సంఖ్యల్లో స్మాల్, క్యాపిటల్ లెటర్స్తో పాటు సింబల్స్ ఉంటే దానిని హ్యాక్ చేసేందుకు 4 కోట్ల సంవత్సరాలు పడుతుంది.

రాహుల్ గాంధీ, ఉద్ధవ్ ఠాక్రేను హిందూ ఓటర్లు బాయ్ కాట్ చేయాలని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే అన్నారు. వాళ్లిద్దరూ కుంభమేళాకు వెళ్లకుండా హిందూ కమ్యూనిటీని అవమానించారని పేర్కొన్నారు. ‘వారికి హిందువుల ఓట్లు కావాలి. కానీ మహాకుంభమేళాకు మాత్రం రారు. అందుకే హిందూ ఓటర్లు వారిని బహిష్కరించాలి’ అని పేర్కొన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వారికి హిందూ ఓటర్లు ఇప్పటికే గుణపాఠం చెప్పారని అన్నారు.

నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ విషయంలో తమిళనాడుకు, కేంద్రానికి మధ్య వివాదం చిన్నపిల్లల కొట్లాటలా ఉందని టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ఎద్దేవా చేశారు. పాలసీ అమలు చేయకపోతే రాష్ట్రానికి రావాల్సిన రూ.2,400 కోట్లు నిలిపివేస్తామనటం అన్యాయమన్నారు. TVK పార్టీ వార్షికోత్సవ సభలో విజయ్ ప్రసంగించారు. BJP, DMK పార్టీలను ‘గెట్ఔట్’ హ్యష్ట్యాగ్ పెట్టి సాగనంపాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి నెల 1వ తేదీకి రూ.22,500 కోట్లు అవసరమని, ఆదాయం రూ.18,500 కోట్లు మాత్రమే వస్తుందని చెప్పారు. జీతాలకు రూ.6500 కోట్లు, వడ్డీలకు రూ.6800 కోట్లు అవసరమని, ఆదాయం రూ.22 వేల కోట్లకు పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. అటు SLBCలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు తాము కృషి చేస్తున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.