India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆధునిక ప్రపంచంలో మొబైల్ మన జీవితంలో ఓ భాగమైంది. అలాంటి మొబైల్ త్వరగా ఛార్జ్ అవ్వాలంటే కొన్ని ట్రిక్స్ పాటిస్తే చాలు. అవేంటంటే.. ఛార్జింగ్లో ఉన్నప్పుడు మొబైల్ను షేక్ చేయొద్దు. ఛార్జ్ చేసే ముందు రన్నింగ్ యాప్స్, ఇంటర్నెట్ ఆఫ్ చేయాలి. 40శాతం కన్నా తక్కువ ఛార్జింగ్ ఉన్నప్పుడే ఛార్జ్ చేయడం ఉత్తమం. బ్రైట్నెస్ తగ్గించుకొని ఉపయోగించుకోవాలి. స్విచాఫ్ చేసి ఛార్జ్ చేస్తే త్వరగా ఎక్కుతుంది.
ఐపీఎల్ 2025 కోసం సంజూ శాంసన్ను రాజస్థాన్ రాయల్స్ రిటైన్ చేసుకున్నట్లు క్రిక్ట్రాకర్ తెలిపింది. సంజూకు రిటెన్షన్ కింద రూ.18 కోట్లు ఇవ్వనున్నట్లు సమాచారం. మిగతా ఆటగాళ్ల రిటెన్షన్లపై తీవ్ర కసరత్తు చేస్తోంది. యశస్వీ జైస్వాల్, రియాన్ పరాగ్, యుజ్వేంద్ర చాహల్ను అట్టిపెట్టుకోవాలని భావిస్తున్నట్లు టాక్. ఇక జోస్ బట్లర్, ట్రెంట్ బౌల్ట్లలో ఒకరిని రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
నందమూరి తారకరత్న అకాల మరణానికి గురై ఏడాదిన్నర దాటింది. తారకరత్న మరణం తర్వాత పలుమార్లు ఆయనను గుర్తు చేస్తూ భార్య అలేఖ్య రెడ్డి ఎమోషనల్ పోస్టులు చేశారు. తాజాగా వారి కూతురు నిష్క హాఫ్ శారీ ఫంక్షన్ ఫొటోలను అలేఖ్య పంచుకున్నారు. ‘పిల్లలే నా సంతోషం, జీవితం. మాకు ఇష్టమైన స్థలంలో హాఫ్ శారీ వేడుకలు’ అని రాసుకొచ్చారు.
పోలాండ్లోని క్రాకౌ నగరంలోని OFF Radio స్టేషన్ పలువురు జర్నలిస్టుల్ని ఉద్యోగాల నుంచి తొలగించి వారికి బదులు కృత్రిమ మేథ(AI) ప్రజెంటర్లను ఏర్పాటు చేసింది. మూడు ఏఐ వాయిస్లు పెట్టామని, ఆడియన్స్ను అవి ఆకట్టుకుంటాయని తెలిపింది. ఈ నిర్ణయంపై స్థానిక జర్నలిస్టులు మండిపడ్డారు. మున్ముందు ఇది చాలా ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేస్తూ యాజమాన్యానికి వారు లేఖ రాశారు.
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సార్లు డకౌటైన ఆరో భారత ప్లేయర్గా ఆయన నిలిచారు. ఇప్పటివరకు హిట్మ్యాన్ 34 సార్లు డకౌటయ్యారు. కివీస్తో జరిగిన రెండో టెస్టులో ఆయన ఈ ఫీట్ నెలకొల్పారు. ఈ క్రమంలో సచిన్ (34) రికార్డును సమం చేశారు. ఈ జాబితాలో జహీర్ ఖాన్ (43), ఇషాంత్ శర్మ (40), విరాట్ కోహ్లీ (38), హర్భజన్ (37), అనిల్ కుంబ్లే (35) ఉన్నారు.
విడాకుల ప్రకటన తర్వాత సింగర్తో రిలేషన్లో ఉన్నారని జరిగిన ప్రచారంపై తమిళ నటుడు జయం రవి స్పందించారు. పబ్లిక్లో ఉన్న సమయంలో ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తారని, వాటన్నింటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కొందరు ప్రైవసీకి భంగం కలిగిస్తారన్నారు. అయితే అంతా ఆలోచించే తాను విడాకుల నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కాగా భార్య ఆర్తి నుంచి విడాకులు తీసుకుంటున్నానని జయం రవి SEPలో ప్రకటించారు.
మహిళల భద్రత, స్వయం ఉపాధి కోసం తమిళనాడు ప్రభుత్వం ‘పింక్ ఆటోరిక్షాల’ స్కీం తీసుకొచ్చింది. CNG లేదా హైబ్రిడ్ ఆటోలు కొనుగోలు చేసేందుకు 250 మంది ఒంటరి, నిరుపేద మహిళలకు రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తుంది. మిగతా మొత్తం తక్కువ వడ్డీకి లోన్ రూపంలో అందిస్తుంది. అందులో జీపీఎస్ ఉండటం వల్ల డ్రైవర్లకు, ప్రయాణికులకు భద్రత ఉంటుంది. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ పథకం తీసుకొస్తే బాగుంటుంది కదూ..!
పుష్ప-2 కు అల్లు అర్జున్ భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రూ.100 కోట్లు తీసుకున్నారని కొన్ని కథనాలు పేర్కొన్నాయి. అయితే మూడేళ్ల కాలాన్ని ఈ సినిమాకే వెచ్చించడంతో రూ.200 కోట్లకుపైగా తీసుకుంటారని మరికొన్ని తెలిపాయి. లేదంటే సినిమా కలెక్షన్లలో 27శాతం ప్రాఫిట్ తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారని సమాచారం. కాగా ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది.
విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు అధికమవ్వడంతో వీటి కట్టడిలో సహకరించాలని X, Meta సంస్థలను కేంద్రం కోరింది. ఈ వేదికల మీద వస్తున్న బెదిరింపు కాల్స్, సందేశాల వెనుక ఉన్నవారిని గుర్తించేందుకు అవసరమైన డేటాను తమతో పంచుకోవాలని కోరింది. దేశ ప్రజల శ్రేయస్సుతో ముడిపడిన అంశం కారణంగా 2 సంస్థలు సహకరించాల్సి ఉందని ఓ అధికారి తెలిపారు. 9 రోజుల్లో 170 విమానాలకు బెదిరింపులు వచ్చాయి.
KKR కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మెగా వేలంలోకి వస్తున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ కింగ్స్ నుంచి ఆయనకు భారీ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. కాగా అయ్యర్తోపాటు ఢిల్లీ, లక్నో కెప్టెన్లు రిషభ్ పంత్, KL రాహుల్ కూడా ఆక్షన్లోకి వస్తున్నట్లు టాక్. మరోవైపు ఈ నెల 31తో రిటెన్షన్లకు గడువు ముగియనుంది. కానీ ఇంతవరకూ ఒక్క ఫ్రాంచైజీ కూడా తమ రిటెన్షన్ల లిస్టును సమర్పించలేదు. చివరిరోజున సమర్పించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.