India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సీనియర్ హీరో బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తోన్న ‘అన్స్టాపబుల్ షో’ సీజన్ 4 రేపటి నుంచి ప్రసారం కానుంది. ఈ కార్యక్రమానికి గెస్ట్గా ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ క్రమంలో రేపు సెలవు ఇవ్వాలని ఐటీ ఉద్యోగులు ప్లకార్డులు ప్రదర్శించారు. అక్టోబర్ 25ను బాలయ్య పండుగగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి.
ఖలిస్థానీ ఉగ్రవాదులకు, మద్దతుదారులకు కెనడా ఓ అందమైన దేశమని, అక్కడి సున్నితమైన న్యాయ వ్యవస్థ వల్ల వారు ఆశ్రయం పొందుతున్నారని దౌత్యవేత్త సంజయ్ వర్మ వ్యాఖ్యానించారు. నిజ్జర్ హత్య కేసులో తనను అనుమానితుల జాబితాలో చేర్చడం షాక్కు గురి చేసిందని, ఇదోరకమైన వెన్నుపోటని పేర్కొన్నారు. తమ వేర్పాటువాదానికి మద్దతు ఇవ్వాలని ఖలిస్థానీలు ఇతర సిక్కులను బెదిరిస్తున్నారని అన్నారు.
బిగ్బాస్ హౌస్లో ఉన్న గంగవ్వను షో నిర్వాహకులు బయటికి పంపించనున్నట్లు టాక్ నడుస్తోంది. ఆమె మీద <<14433584>>కేసు<<>> నమోదైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. యూట్యూబ్ వీడియో కోసం రామచిలకను హింసించారంటూ గంగవ్వ, యూట్యూబర్ రాజుపై గౌతమ్ అనే జంతు సంరక్షకుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తుందన్న నమ్మకం ఉందని రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ తెలిపింది. బదిలీలు, సర్వీసు అంశాలను సీఎంతో సమావేశంలో చర్చించినట్లు పేర్కొంది. డీఏపై డిప్యూటీ సీఎంతో మాట్లాడి ప్రకటన చేస్తానని సీఎం చెప్పారని వెల్లడించింది. తమ సమస్యల పరిష్కారానికి రేవంత్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపింది.
గిరిజన ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల బిని ముదులి యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఒడిశా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సత్తాచాటారు. నెట్వర్క్ లేకపోవడంతో ఇతర ప్రాంతానికి వెళ్లి యూట్యూబ్ వీడియోలు, ఆన్లైన్ మాక్ టెస్ట్ల ద్వారా ప్రిపేర్ అయి 596వ ర్యాంకు సాధించారు. దీంతో OCSలో ఉద్యోగం పొందిన తొలి బోండా జాతి యువతిగా ఆమె చరిత్ర సృష్టించారు. పేరెంట్స్ కోచింగ్ ఫీజు చెల్లించలేరని, సొంతంగా ప్రిపేర్ అయినట్లు ఆమె తెలిపారు.
భారత్ లక్ష్యం ప్రపంచాన్ని ప్రభావితం చేయడమే కానీ ఆధిపత్యం చెలాయించడం కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. నేడు భారత్ ఉన్న స్థాయిని అటు US, ఇటు చైనా రెండూ విస్మరించలేవని గుర్తుచేశారు. ‘మనది అతి పెద్ద ప్రజాస్వామ్యం. అతి పెద్ద జనాభా కలిగిన దేశం. భూమ్మీద ఉన్న ప్రతి ఆరుగురిలో ఒకరు భారతీయుడే. మన ఆర్థిక వ్యవస్థను పట్టించుకోకుండా ఉండటం ఎవరికైనా అసాధ్యం’ అని స్పష్టం చేశారు.
BJP జాతీయ అధ్యక్ష ఎన్నికపై ఆసక్తి నెలకొంది. ఈ సారి దక్షిణాది నేతకు ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉంది. అదే గనక జరిగితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రేసులో ముందున్నట్టు తెలుస్తోంది. కర్ణాటక, తెలంగాణ, AP, కేరళలో పార్టీ బలోపేతానికి ఇది దోహదపడుతుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు! ఉత్తరాది విషయానికొస్తే రాజ్నాథ్ సింగ్, శివరాజ్సింగ్ చౌహాన్, వినోద్ తావ్డే, సునీల్ బన్సల్ రేసులో ఉన్నారు.
AP: జగన్ తనకు షేర్లు బదిలీ చేశారనేది పచ్చి అబద్ధమని షర్మిల మండిపడ్డారు. ‘ఆస్తులపై ప్రేమతో కుటుంబ విషయాలను రోడ్డు మీదకు తెచ్చారు. సరస్వతి కంపెనీ షేర్లను ఈడీ అటాచ్ చేయలేదు. వాటిని బదిలీ చేసుకోవచ్చు. షేర్లు బదిలీ చేస్తే బెయిల్ రద్దవుతుందని జగన్ వాదిస్తున్నారు. 2019లో వంద శాతం వాటాలు బదలాయిస్తానని ఎంవోయూపై సంతకం ఎలా చేశారు? అప్పుడు మీ బెయిల్ సంగతి గుర్తుకు రాలేదా?’ అని ప్రశ్నించారు.
ఇంట్లో ఆహార పొట్లాలకు చిల్లులు పెట్టి చిత్తడి చేసే ఎలుక కాదిది. ల్యాండ్మైన్లు, క్షయవ్యాధిని గుర్తించగలిగేలా శిక్షణ పొందిన ర్యాట్ ఇది. దీని పేరు మగావా. బెల్జియం ఛారిటీ సంస్థ APOPOలో మగావా శిక్షణ పొందింది. ఐదేళ్ల కెరీర్లో ఈ చిట్టెలుక కంబోడియాలో 100కి పైగా ల్యాండ్మైన్లు, పేలుడు పదార్థాలను పసిగట్టింది. దీని వీరత్వానికి బంగారు పతకం కూడా లభించింది. ఇది జనవరి 2022లో చనిపోయింది.
రెండో టెస్టులో తమిళ తంబీలు వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్ దెబ్బకు న్యూజిలాండ్ జట్టు కుప్పకూలిపోయింది. అనూహ్యంగా జట్టులో చోటు దక్కించుకున్న సుందర్ సంచలన ప్రదర్శన చేశారు. గింగిరాలు తిరిగే బంతులతో కివీస్ ఆటగాళ్లను ముప్పతిప్పలు పెట్టారు. మొత్తం ఏడుగురు కివీస్ బ్యాటర్లను పెవిలియన్కు పంపారు. మరోవైపు అశ్విన్ కూడా 3 వికెట్లతో చెలరేగడంతో పర్యాటక జట్టు ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది.
Sorry, no posts matched your criteria.