India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో INDIA కూటమి తరఫున ఢిల్లీ EX CM కేజ్రీవాల్ ప్రచారం చేయనున్నట్టు సమాచారం. ఈ విషయమై శివసేన UBT, NCP SP కేజ్రీవాల్ను సంప్రదించినట్టు తెలిసింది. MHలో ఆప్ క్యాడర్ ఉన్న స్థానాల్లో వివాదాస్పద నేపథ్యం లేని అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం చేస్తారని సమాచారం. హేమంత్ సోరెన్కు మద్దతుగా ఝార్ఖండ్లో ప్రచారం చేస్తారని ఆప్ వర్గాలు చెప్పాయి.
NDAలో కీలక భాగస్వాములైన ఏపీ, బిహార్లకు కేంద్రం ముఖ్యమైన రైల్వే ప్రాజెక్టులు మంజూరు చేసింది. ఏపీలో ₹2,245 కోట్ల విలువైన 57 KM అమరావతి లైన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు బిహార్కు ₹4,553 కోట్ల విలువైన 2 రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ 2 రాష్ట్రాలకే రూ.6,798 కోట్ల విలువైన ప్రాజెక్టులు కేటాయించడం దేశవ్యాప్తంగా రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇంట్లో కూర్చొని పైరసీ సినిమాలు చూడడం వల్ల గత ఏడాది వినోద పరిశ్రమకు ₹22,400 కోట్ల నష్టం వాటిల్లినట్టు నివేదికలు అంచనా వేశాయి. సగానికి పైగా భారతీయులు అక్రమంగా కంటెంట్ను యాక్సెస్ చేస్తున్నారని, అందులో 63% OTT కంటెంట్ను వీక్షిస్తున్నారని తేలింది. థియేటర్ల నుంచి ₹13,700 కోట్లు, OTTల నుంచి ₹8,700 కోట్ల విలువైన కంటెంట్ పైరసీ జరిగింది. ఇది కఠిన నిబంధనల అవసరాన్ని నొక్కిచెబుతోంది.
బంగ్లా EX PM షేక్ హసీనాకు భారత ప్రభుత్వం ఢిల్లీలోని ఓ లుటియన్స్ బంగ్లాలో వసతి కల్పించింది! అన్ని వసతులు, గార్డెన్ ఉండేలా లుటియన్స్ బంగ్లాలను 20వ శతాబ్దంలో బ్రిటిష్ ఆర్కిటెక్ట్ సర్ ఎడ్విన్ లుటియన్స్ రూపొందించారు. హసీనా గత హోదాను దృష్టిలో పెట్టుకొని కేంద్ర మంత్రులకు కేటాయించదగిన బంగ్లానే ఆమెకూ కేటాయించారు. భద్రత మధ్య లోధీ గార్డెన్స్కి తరచుగా ఆమె వాక్కి వెళ్తున్నట్టు తెలిసింది.
TG: జనవరి నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఒక్కో వ్యక్తికి 6 కిలోల చొప్పున బియ్యం అందజేస్తామని చెప్పారు. ప్రభుత్వం రూ.20 వేల కోట్లతో ధాన్యం సేకరిస్తోందని, ఈ సీజన్లో 150 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ప్రతి ఏటా 6 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు తీసుకొస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రధాని మోదీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. J&Kకు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని J&K క్యాబినెట్ చేసిన తీర్మాన పత్రాన్ని ప్రధానికి అందజేశారు. అంతకుముందు అబ్దుల్లా.. కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, రాజ్నాథ్ సింగ్లను కలిశారు. J&Kలో రహదారుల అనుసంధానాన్ని పెంచాలని కోరారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో ‘ఫౌజీ’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రేపు, ఎల్లుండి హైదరాబాద్ బీహెచ్ఈఎల్లో జరిగే షూటింగ్లో ప్రభాస్ పాల్గొంటారని తెలుస్తోంది. అలాగే వచ్చే నెల 3, 4 తేదీల్లో కూడా ఇదే సెట్లో ఆయన మళ్లీ షూట్లో పాల్గొంటారని సమాచారం. కాగా ఈ చిత్రంలో ఇమాన్వి హీరోయిన్గా నటిస్తున్నారు. మృణాల్ ఠాకూర్, జయప్రద కీలక పాత్రలు పోషిస్తున్నట్లు టాక్.
సీనియర్ హీరో బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తోన్న ‘అన్స్టాపబుల్ షో’ సీజన్ 4 రేపటి నుంచి ప్రసారం కానుంది. ఈ కార్యక్రమానికి గెస్ట్గా ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ క్రమంలో రేపు సెలవు ఇవ్వాలని ఐటీ ఉద్యోగులు ప్లకార్డులు ప్రదర్శించారు. అక్టోబర్ 25ను బాలయ్య పండుగగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి.
ఖలిస్థానీ ఉగ్రవాదులకు, మద్దతుదారులకు కెనడా ఓ అందమైన దేశమని, అక్కడి సున్నితమైన న్యాయ వ్యవస్థ వల్ల వారు ఆశ్రయం పొందుతున్నారని దౌత్యవేత్త సంజయ్ వర్మ వ్యాఖ్యానించారు. నిజ్జర్ హత్య కేసులో తనను అనుమానితుల జాబితాలో చేర్చడం షాక్కు గురి చేసిందని, ఇదోరకమైన వెన్నుపోటని పేర్కొన్నారు. తమ వేర్పాటువాదానికి మద్దతు ఇవ్వాలని ఖలిస్థానీలు ఇతర సిక్కులను బెదిరిస్తున్నారని అన్నారు.
బిగ్బాస్ హౌస్లో ఉన్న గంగవ్వను షో నిర్వాహకులు బయటికి పంపించనున్నట్లు టాక్ నడుస్తోంది. ఆమె మీద <<14433584>>కేసు<<>> నమోదైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. యూట్యూబ్ వీడియో కోసం రామచిలకను హింసించారంటూ గంగవ్వ, యూట్యూబర్ రాజుపై గౌతమ్ అనే జంతు సంరక్షకుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.