news

News March 1, 2025

నోటికొచ్చినట్లు మాట్లాడితే కుదరదు: హోంమంత్రి

image

AP: కూటమి ప్రభుత్వంలో ఎటువంటి అంతర్యుద్ధం లేదని, YCPలో రాకుండా చూసుకోవాలని హోంమంత్రి అనిత అన్నారు. తప్పు చేసిన వారిని వదలబోమని చెప్పారు. నోటికొచ్చినట్లు మాట్లాడతామంటే కుదరదని హెచ్చరించారు. పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులున్నాయని, ఆయన వ్యాఖ్యలను ఎవరూ క్షమించరని చెప్పారు. తాము రెడ్‌బుక్ ప్రకారం ముందుకెళ్తే YCP నేతలు రోడ్లపై తిరగలేరన్నారు. కక్షపూరిత రాజకీయాలు చేయడం లేదని స్పష్టం చేశారు.

News March 1, 2025

ప్రియుడితో దాడి చేయించిన భార్య.. మృత్యువుతో పోరాడి భర్త మృతి

image

TG: వరంగల్‌లో 8 రోజులుగా మృత్యువుతో పోరాడి వైద్యుడు సుమంత్ రెడ్డి నేడు చనిపోయారు. FEB 20న ఇతనిపై భార్య మరియా ప్రియుడితో దాడి చేయించింది. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిమ్‌లో శామ్యూల్‌తో మరియాకు పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారితీసింది. దీంతో సుమంత్ కాపురాన్ని WGLకు మార్చారు. భర్త అడ్డు తొలగించుకోవాలని ఆమె ప్లాన్ వేయగా వీరికి కానిస్టేబుల్ రాజ్ హెల్ప్ చేశాడు. ప్రస్తుతం ముగ్గురూ అరెస్ట్ అయ్యారు.

News March 1, 2025

పచ్చబొట్లతో HIV, హెపటైటిస్ ముప్పు!

image

పచ్చబొట్లు వేసేందుకు వాడుతున్న ఇంక్, అపరిశుభ్రత విధానాలతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని కర్ణాటక ప్రభుత్వం గుర్తించింది. నాసిరకం రసాయనాలు వాడి వేస్తున్న టాటూలలో చర్మ క్యాన్సర్ వస్తున్నట్లు నిర్ధారించింది. అలాగే రోడ్డు పక్కన శుభ్రత లేకుండా, సూది మార్చకుండా పచ్చబొట్టు వేస్తుండటంతో HIV, హెపటైటిస్ సోకుతున్నట్లు వైద్యశాఖ తెలిపింది. పచ్చబొట్లపై కేంద్రం మార్గదర్శకాలు జారీ చేయాలని ఆ ప్రభుత్వం కోరింది.

News March 1, 2025

తగ్గేదే లే అంటోన్న ‘లక్కీ భాస్కర్’

image

థియేటర్ ఆడియన్స్‌ను మెప్పించిన దుల్కర్ సల్మాన్ మూవీ ‘లక్కీ భాస్కర్’.. ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. మూవీలోని భాస్కర్ పాత్రకు ఫ్యామిలీ ఆడియన్స్ ముగ్ధులయ్యారు. గతేడాది నవంబర్ 28న ‘నెట్‌ఫ్లిక్స్’లో రిలీజ్ కాగా.. అత్యధిక వ్యూస్(19.4M) సాధించిన తెలుగు సినిమాగా నిలిచింది. ఆ తర్వాత హాయ్ నాన్న (17.3M), గుంటూరుకారం (16.6M), సలార్ (15.4M), దేవర (12M), కల్కి(10.3M), సరిపోదా శనివారం (9.5M) ఉన్నాయి.

News March 1, 2025

80% పెన్షన్ల పంపిణీ పూర్తి: TDP

image

AP: రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పెన్షన్ల పంపిణీ వేగంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పెన్షన్ నగదు పంపిణీ కార్యక్రమం మూడు గంటల్లోనే 80 శాతం పూర్తైనట్లు టీడీపీ ట్వీట్ చేసింది. గత నెల వరకు తెల్లవారుజామున 5 గంటల నుంచే పెన్షన్లు పంపిణీ చేయగా.. ఉద్యోగులు, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పంపిణీ ప్రారంభ సమయాన్ని ప్రభుత్వం 7 గంటలకు మార్చిన విషయం తెలిసిందే.

News March 1, 2025

4 ఎమ్మెల్సీ స్థానాలు.. కాంగ్రెస్‌లో గట్టి పోటీ

image

TG: తెలంగాణలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు గాను కాంగ్రెస్‌కు 4 దక్కే ఛాన్స్ ఉంది. ఇందుకోసం 40 మంది వరకు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. వేం నరేందర్ రెడ్డి, జీవన్ రెడ్డి, జగ్గా రెడ్డి, మధుయాష్కీ, సామ రామ్మోహన్ రెడ్డి, అద్దంకి దయాకర్, సంపత్ కుమార్, రాములు నాయక్, అంజన్ కుమార్ యాదవ్, సరితా యాదవ్ తదితరులు పోటీలో ఉన్నట్లు సమాచారం. యువ నాయకులకు ఛాన్స్ ఇవ్వాలని క్యాడర్ కోరుతోంది.

News March 1, 2025

మూడు రోజుల్లో రూ.1200 తగ్గిన బంగారం ధర

image

భారీగా పెరిగిన బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత మూడు రోజుల్లోనే తులం బంగారం ధర రూ.1200 తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.200 తగ్గి రూ.79,400లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.220 తగ్గడంతో రూ.86,620కు చేరింది. అటు వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. కేజీ సిల్వర్ రేటు రూ.1,05,000గా ఉంది.

News March 1, 2025

మహిళలను ప్రభుత్వం మోసం చేసింది: వైసీపీ

image

AP: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు మెుండి చెయ్యి చూపిందని వైసీపీ ఆరోపించింది. ఉగాది నుంచి ఉచిత బస్సు పథకం అమలు చేస్తామని ఆశ చూపించి బడ్జెట్‌లో దాని ఊసే ఎత్తలేదంది. ఆర్టీసీకి కేటాయించిన నిధులు ఉద్యోగుల జీతాలకే సరిపోతాయని పేర్కొంది. పథకం అమలు కావాలంటే అదనంగా రూ.3,182 కోట్లు కావాల్సిఉండగా ఒక్కపైసా కేటాయించలేదని తెలిపింది. అధికారంలోకి రాగానే పథకం అమలు చేస్తామని మహిళలను మోసం చేసిందని వైసీపీ ఆరోపించింది.

News March 1, 2025

అక్కా.. అని పిలిచి అత్యాచారం

image

పుణే రేప్ కేసు <<15605696>>నిందితుడు<<>> దత్తాత్రేయ గడేను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అయితే ఘటన జరిగిన రోజు తె.జామున యువతి స్వార్గేట్ బస్టాండ్‌లో నిల్చొని ఉండగా గడే ఇన్‌షర్ట్ వేసుకొని వచ్చాడు. ‘దీదీ(అక్కా) మీ బస్సు పక్కన నిలిపి ఉంది’ అని తీసుకెళ్లాడు. బస్సులో లైట్లు ఆన్ చేయలేదేంటని ఆమె ప్రశ్నించగా ప్రయాణికులు నిద్రపోతున్నట్లు చెప్పాడు. ఆమె అందులోకి ఎక్కగానే డోర్ లాక్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు.

News March 1, 2025

ఆఫీసులో ఎన్ని గంటలు ఉన్నారన్నది ముఖ్యమే కాదు: ఆకాశ్ అంబానీ

image

ఆఫీసులో రోజూ ఎన్ని గంటలు గడిపామన్నది కాదు ఎంత క్వాలిటీ వర్క్ చేశామన్నదే ముఖ్యమని రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ అన్నారు. ముంబై టెక్ వీక్‌ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. ‘ఎన్ని గంటలు, ఎంత టైమ్ ఉన్నారని నేను ఆలోచించను. రోజూ ఎంత క్వాలిటీ వర్క్ చేశారన్నదే ముఖ్యం. Growth is Life అన్నదే రిలయన్స్ మోటో. ఇది వ్యక్తిగత జీవితానికీ వర్తిస్తుంది. అంటే మనం ప్రతిరోజూ ఎదుగుతూనే ఉండాలి’ అని పేర్కొన్నారు.