India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహానటి, కల్కి 2898ఏడీ సినిమాలతో నాగ్ అశ్విన్ అగ్రదర్శకుల సరసన చేరారు. ఆ స్థాయికి చేరాక రూ. కోట్ల విలువైన కార్లు వాడతారని అనుకుంటాం. కానీ ఆయన వాడుతున్న కారు చాలా చిన్నది. ఈ విషయాన్ని ఆయన తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. మహీంద్రా E2O ప్లస్ విద్యుత్ కారునే మహానటి, జాతిరత్నాలు, కల్కి 2898ఏడీ సినిమాలకు వాడుకున్నట్లు తెలిపారు. తమ ఇంటిపై ఉన్న సోలార్ ప్యానెల్స్తో దాన్ని ఛార్జ్ చేస్తామని వివరించారు.
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘కంగువ’ నుంచి రేపు ‘యోలో’ అనే పాట విడుదల కానుంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో సూర్య స్టైలిష్గా కనిపిస్తున్నారు. ఈ మూవీలో ఆయన రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. నవంబర్ 14న ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది.
నందమూరి బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న Unstoppable సీజన్-4కి సీఎం చంద్రబాబు గెస్ట్గా వచ్చారు. ఇవాళ షూటింగ్ జరిగింది. అయితే ఈ ఎపిసోడ్ను ఈనెల 25న రాత్రి 8.30 గంటలకు స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా ప్రకటించింది. చంద్రబాబును బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడిగారనే విషయాలు తెలియాలంటే 25 వరకు ఆగాల్సిందే.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను రీషెడ్యూల్ చేయాలని కోరుతూ కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ సీఎం రేవంత్కు లేఖ రాశారు. SC, ST, BC రిజర్వేషన్లకు గొడ్డలిపెట్టులా ఉన్న GO.29ను రద్దు చేయాలని అందులో కోరారు. ఈనెల 21న నిర్వహించబోయే పరీక్షలపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన ఆందోళన నెలకొందని అన్నారు. GO.29 వల్ల 5,003 మంది అభ్యర్థులు నష్టపోయారన్నారు.
ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీమ్ 20 ఓవర్లలో 158/5 స్కోర్ చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో అమేలియా కెర్ 43, బ్రూక్ 38, బేట్స్ 32 రన్స్తో రాణించారు. ఈ మ్యాచులో గెలవాలంటే సౌతాఫ్రికా 20 ఓవర్లలో 159 రన్స్ చేయాలి.
విస్తారా, ఆకాశ ఎయిర్లైన్ కంపెనీలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. చెరో ఆరు విమానాల పేర్లతో సోషల్ మీడియా వేదికగా ఈ బెదిరింపులు వచ్చినట్లు ఆయా సంస్థలు ధ్రువీకరించాయి. వెంటనే అప్రమత్తమై ఎమర్జెన్సీ టీమ్ను యాక్టివేట్ చేసినట్లు తెలిపాయి. ఇటీవల కొందరు ఆకతాయిలు విమానాలకు బాంబు బెదిరింపులు చేస్తున్న ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. మరి ఇది కూడా అలాంటిదేనా? అనేది తెలియాల్సి ఉంది.
హైదరాబాద్ అశోక్ నగర్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. గ్రూప్-1 అభ్యర్థులు మరోసారి ధర్నా చేయనున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అక్కడ భారీగా మోహరించారు. ఎవరూ గుమిగూడకుండా చూస్తున్నారు. మరోవైపు రేపటి నుంచి జరిగే గ్రూప్-1 మెయిన్స్ కోసం ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటోంది. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తును పెంచింది.
AP: దిశ చట్టం లేకపోయినా YS జగన్ ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని మంత్రి లోకేశ్ అన్నారు. లా అండ్ ఆర్డర్పై జగన్ చేసిన <<14407431>>వ్యాఖ్యలపై<<>> స్పందిస్తూ ‘నీ పాలనలో ఎన్నో నేరాలు జరిగాయి. ఏనాడైనా స్పందించావా? దిశ చట్టంలో లోపాలున్నాయని కేంద్రం తిప్పి పంపితే, మళ్లీ దాని గురించి పట్టించుకోలేదు. లేని చట్టం పేరుతో పోలీస్ స్టేషన్లు పెట్టించారు. ఒక్కరికైనా ఉరిశిక్ష వేశారా? ఎందుకీ అబద్ధపు బతుకు?’ అని Xలో మండిపడ్డారు.
TG: గ్రూప్-1 అభ్యర్థులను విపక్షాలే తప్పుదోవ పట్టించి, రెచ్చగొడుతున్నాయని TPCC చీఫ్ మహేశ్ కుమార్ మండిపడ్డారు. GO 29తో రిజర్వేషన్ అభ్యర్థులకు ఎలాంటి నష్టం జరగట్లేదని, ఎంతోమంది నిపుణులతో చర్చించే ఆ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మెరిట్ ర్యాంక్ వచ్చిన రిజర్వ్డ్ అభ్యర్థులు ఓపెన్ కేటగిరీలోనే ఉంటారన్నారు. మెయిన్స్ రాస్తున్న వారిలో 70% మంది రిజర్వేషన్ అభ్యర్థులేనని మహేశ్ తెలిపారు.
AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, పల్నాడు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, శ్రీకాకుళం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, గోదావరి జిల్లాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది.
Sorry, no posts matched your criteria.