India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: మాజీ మంత్రి పుష్పశ్రీవాణి ST కులానికి చెందిన వారేనని హైకోర్టు తీర్పునిచ్చినట్లు ఆమె ఓ ప్రకటనలో తెలిపారు. DLSC కమిటీ రిపోర్ట్, స్టేట్ స్క్రూటినీ కమిటీ ఇచ్చిన జీవో 6ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. పిటిషనర్ వద్ద ఆధారాలు లేవంటూ కేసు కొట్టివేసింది. కాగా ఆమె ST కాదంటూ ఇద్దరు వ్యక్తులు 2019లో పిటిషన్ వేశారు. ఓ వర్గం కావాలనే తప్పుడు ప్రచారం చేసిందని, చివరకు న్యాయమే గెలిచిందని పుష్పశ్రీవాణి అన్నారు.
న్యూజిలాండ్తో తొలి టెస్టులో 150 పరుగులతో రాణించిన సర్ఫరాజ్ ఖాన్పై మాజీ ప్లేయర్ అనిల్ కుంబ్లే ప్రశంసలు కురిపించారు. కివీస్ స్పిన్నర్లపై సర్ఫరాజ్ ఆధిపత్యం చెలాయించారని, పేస్ బౌలింగ్లోనూ నిలకడగా ఆడారని కొనియాడారు. బౌలర్లపై ఎలా ప్రెజర్ తీసుకురావాలో అతనికి బాగా తెలుసన్నారు. అతను ఎక్కువగా క్రీజులో నుంచి కదలకుండా గేమ్ ప్లాన్ అమలు చేస్తారని అన్నారు. కాగా రెండో ఇన్నింగ్సులో భారత్ 462 రన్స్ చేసింది.
TG: గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష వాయిదా వేస్తే వచ్చే నష్టమేంటని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. అభ్యర్థుల్ని నిర్బంధిస్తూ పరీక్షలు నిర్వహించడం అవసరమా? అని ప్రశ్నించారు. వారికి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. కేంద్రమంత్రి బండి సంజయ్ పొలిటికల్ జోకర్గా మారారని విమర్శించారు. మోదీకి ముగ్గురు తమ్ముళ్లని.. పెద్దోడు రేవంత్, నడిపోడు బండి, చిన్నోడు అరవింద్ అని ఎద్దేవా చేశారు.
AP: భూగర్భ జలాల కలుషితం వల్లే విజయనగరం జిల్లా గుర్లలో అతిసారం వ్యాప్తి చెందిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం గుర్లలో అతిసారం తగ్గుముఖం పట్టిందని చెప్పారు. 41 మంది చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. క్లోరినేషన్ పనులు చేపట్టామని, ట్యాంకర్ల ద్వారా మంచినీరు అందిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం తాగునీటి వ్యవస్థను నిర్లక్ష్యం చేసిందని దుయ్యబట్టారు.
తైవాన్ విషయంలో బీజింగ్ దూకుడు పెంచింది. యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తమ సైన్యానికి పిలుపునిచ్చారు. ఆర్మీ రాకెట్ ఫోర్స్ను పరిశీలించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు సీసీటీవీ తెలిపింది. ‘సైనిక శిక్షణ మరింత పెరగాలి. బలగాలన్నింటికీ పోరాట, వ్యూహాత్మక సామర్థ్యం అలవడాలి’ అని జిన్పింగ్ పేర్కొన్నారని స్పష్టం చేసింది. తైవాన్ తమదేనంటూ చైనా చెప్పుకొంటున్న సంగతి తెలిసిందే.
మద్యం తాగే ముందు రెండుమూడు చుక్కలను నేలపై చల్లడం చూస్తుంటాం. దిష్టి తలగకుండా అని, పెద్దలకోసం అని కొందరు చెబుతుంటారు. అయితే, గతంలో ఇంట్లోనే మద్యం తయారుచేసుకునేవారని, దీన్ని పరీక్షించేందుకు ఇలా చేసేవారని మరికొందరు అంటున్నారు. నేలపై లిక్కర్ చుక్కలు వేసినప్పుడు బుడగలు ఏర్పడితే స్ట్రాంగ్ ఉందని అర్థమని చెప్పారు. రాజులపై విష ప్రయోగం జరిగిందో లేదో తెలుసుకోడానికి గతంలో ఇలా చేసేవారని మరికొందరి మాట.
ఆ మహిళకు 12 ఏళ్ల క్రితం 24 గంటల నొప్పి రావడంతో వైద్యులు ఆపరేషన్ చేశారు. అప్పటి నుంచి తరచూ పొట్టలో నొప్పితో ఇబ్బంది పడుతోంది. ఇటీవల ఆ నొప్పి మరీ ఎక్కువ కావడంతో మళ్లీ అదే ఆస్పత్రిని సంప్రదించింది. ఎక్స్రే పరీక్షలో ఆమె పొట్టలో కత్తెర ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే సర్జరీ చేసి 12 ఏళ్ల నాటి ఆ కత్తెరను తొలగించారు. ఈ ఆసక్తికర ఘటన సిక్కింలో చోటుచేసుకుంది.
బంగ్లాదేశ్లో 2025లో సాధారణ ఎన్నికలు జరగొచ్చని అక్కడి తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ అంచనా వేశారు. ఎన్నికలు నిర్వహించడానికి ముందు చాలా అంశాలను పరిష్కరించాల్సి ఉందన్నారు. రాజకీయ సంస్కరణలు, సెర్చ్, ఎన్నికల కమిటీల ఏర్పాటు, ఓటరు జాబితా తయారీ పూర్తి చేయాలని పేర్కొన్నారు. రిజర్వేషన్లపై చెలరేగిన అల్లర్లతో PMగా షేక్ హసీనా తప్పుకుని దేశం వీడారు. అప్పటి నుంచి బంగ్లాలో రాజకీయ అనిశ్చితి నెలకొంది.
1937: హాస్యనటుడు రాజబాబు జననం
1978: భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ జననం
1990: ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కోన ప్రభాకర్ రావు మరణం
2008: దర్శకుడు సి.వి. శ్రీధర్ మరణం
2011: నటుడు, గాయకుడు అమరపు సత్యనారాయణ మరణం
➢ప్రపంచ గణాంక దినోత్సవం
AP: ఎన్నికల హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని CM చంద్రబాబుని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. చంద్రబాబు తమ నేతలకు జమిలీ ఎన్నికలకు సిద్ధం కావాలని సూచిస్తున్నారని అన్నారు. ‘ఈ ప్రభుత్వ కాలం మరో రెండున్నరేళ్లే అని CBN వ్యాఖ్యలతో అర్థమవుతోంది. మద్యం, ఇసుకలో అక్రమాలు జరుగుతుంటే పట్టించుకోవడం లేదు. ఎరువులు, విత్తనాలు మార్కెట్లో కొనుక్కునే దుస్థితిలో రైతులున్నారు’ అని విమర్శించారు.
Sorry, no posts matched your criteria.