India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో ప్రీమార్కెట్ సెషన్లో దూకుడు ప్రదర్శించిన బెంచ్మార్క్ సూచీలు ప్రస్తుతం నష్టాల బాట పట్టాయి. కీలక సపోర్ట్ లెవల్స్ బ్రేక్ అవ్వడంతో భారీ పతనం దిశగా సాగుతున్నాయి. నిఫ్టీ 24,837 (-133), సెన్సెక్స్ 81,233 (-267) వద్ద ట్రేడవుతున్నాయి. NSEలో 1812 స్టాక్స్ పతనమవ్వగా 628 మాత్రమే పెరిగాయి. ఆటో షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. ఐటీ స్టాక్స్ జోరు మీదున్నాయి.
ఐపీఎల్-2025కు ముందు సన్రైజర్స్ హైదరాబాద్కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ టీమ్ బౌలింగ్ కోచ్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు సౌతాఫ్రికా లెజెండ్ డేల్ స్టెయిన్ సోషల్ మీడియాలో ప్రకటించారు. కొన్నేళ్లుగా తనకు అవకాశం కల్పించిన మేనేజ్మెంట్కు ధన్యవాదాలు తెలిపారు. SA20లో సన్రైజర్స్ ఈస్ట్రన్ కేప్తో కలిసి పనిచేస్తానని చెప్పారు. వరుసగా మూడోసారి ట్రోఫీ సాధించేందుకు కృషి చేస్తానన్నారు.
IIT మద్రాస్ టెలికమ్యూనికేషన్ ల్యాండ్స్కేప్లో విప్లవాత్మక మార్పులు చేసే దిశగా అడుగులు వేస్తోంది. 6G ట్రయల్స్ కోసం టెస్ట్ బెడ్ యూనిట్ను ప్రారంభించింది. ఇందులో 6397MBPS ఇంటర్నెట్ స్పీడ్తో టెస్టింగ్ దశలో ఉన్న ఓ ఫొటో వైరలవుతోంది. 2030 నాటికి 6G టెక్నాలజీలో భారతదేశాన్ని అగ్రగామిగా మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. భారత్ 6G విజన్ స్తోమత, సుస్థిరత, సర్వవ్యాప్తి అనే మూడు సూత్రాలతో పనిచేస్తోంది.
మావోయిస్టు కీలక నేత సుజాతను పోలీసులు పట్టుకున్నారు. చికిత్స కోసం కొత్తగూడెంలోని ఆస్పత్రికి వెళ్తుండగా తెలంగాణ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. మావోయిస్టుల ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించిన సుజాతపై MH, ఏపీ, TG, ఛత్తీస్గఢ్లో రూ.కోటికిపైగా రివార్డు ఉంది. ప్రస్తుతం ఆమె బస్తర్ డివిజనల్ కమిటీకి ఇన్ఛార్జ్గా ఉన్నారు. కాగా ఇటీవల జరిగిన భారీ ఎన్కౌంటర్లో 31 మంది మావోలు మృతి చెందిన సంగతి తెలిసిందే.
TG: కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లుగా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. పాల పొడి, ఎసిడిక్ యాసిడ్, గ్లూకోజ్, వనస్పతి, ఇతర రసాయనాలతో నకిలీ పాలను తయారుచేస్తున్నారు. HYD శివారు పీర్జాదిగూడలో ఈ ఉదంతం బయటపడింది. కోహినూర్, శ్రీకృష్ణ బ్రాండ్ల పేరిట కల్తీ పాలు, పెరుగు, ఐస్క్రీంలను స్వచ్ఛ భారత్, మేకిన్ ఇండియా లోగోలు వేసి విక్రయిస్తున్నారు. వీటిని ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు.
USలో దోమకాటుతో ఈస్టర్న్ ఈక్విన్ ఎన్సెఫాలిటిస్(EEE) అనే వ్యాధి బారిన పడి రిచర్డ్(49) అనే వ్యక్తి మరణించాడు. 2019లో ఈ కాటుకు గురవగా ఆస్పత్రిలో ఐదేళ్ల పోరాటం తర్వాత చనిపోయాడు. EEE సోకిన దోమ కుట్టడం వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. జ్వరం, మైగ్రేన్, వాంతులు, విరేచనాలు, మూర్ఛ దీని లక్షణాలు. ఇది సోకిన వారిలో 30% మంది మరణిస్తారు. మిగిలిన వారు నాడీ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడతారు.
AP: కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. నవంబరులో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో అనర్హుల ఏరివేత కార్యక్రమం చేపట్టనుంది. అనర్హులకు నోటీసులిచ్చి తొలగించేందుకు 45 రోజుల సమయం తీసుకుంటారు. ఈ ప్రక్రియ విధివిధానాల కోసం 8 మంది మంత్రులతో కమిటీ ఏర్పాటు కానుంది. జనవరిలో నిర్వహించే జన్మభూమి-2 ద్వారా కొత్తవారికి మంజూరు పత్రాలు అందించేలా ప్లాన్ చేస్తున్నారు.
TG: విదేశీ విద్యానిధి పథకం ఆన్లైన్ దరఖాస్తుల గడువు తేదీని పెంచినట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు పెరిక యాదయ్య తెలిపారు. ఈ నెల 29 వరకు గడువు పొడిగించినట్లు వెల్లడించారు. అర్హులైన ఎస్సీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. మరిన్ని వివరాలకు https://telanganaepass.cgg.gov.in వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.
కొద్ది రోజులుగా విమానాలకు వస్తున్న బాంబు బెదిరింపులు కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన ముంబై పోలీసులు ఛత్తీస్గఢ్కు చెందిన ఓ మైనర్(17)ను అదుపులోకి తీసుకున్నారు. తన స్నేహితుడిని ఇబ్బంది పెట్టేందుకే ఇలా చేసినట్లు చెప్పడంతో అధికారులు విస్తుపోయారు. డబ్బు విషయంలో ఫ్రెండ్తో గొడవ కావడంతో అతని పేరుతో Xలో అకౌంట్ క్రియేట్ చేసి బాంబు బెదిరింపు పోస్టులు చేశాడని పోలీసులు తెలిపారు.
TG: సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలపై కేటీఆర్ Xలో సెటైర్లు వేశారు. ‘10 నెలల్లో 25 సార్లు హస్తిన పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేశావ్. పైసా పనిలేదు.. రాష్ట్రానికి రూపాయి లాభం లేదు. అన్నదాతల అరిగోసలు, గాల్లో దీపాల్లా గురుకులాలు, కుంటుపడ్డ వైద్యం, గాడితప్పిన విద్యా వ్యవస్థ, ఆడబిడ్డలకు అందని చీరలు, స్కూటీలు, కుట్టు మెషీన్లు లేవు, అవ్వాతాతలకు పెరగని పింఛన్.. అయినా పోయి రావాలె హస్తినకు’ అని ఎద్దేవా చేశారు.
Sorry, no posts matched your criteria.