India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP డిప్యూటీ CM పవన్ కళ్యాణ్పై తమిళనాడులోని మదురైలో వంచినాథన్ అనే అడ్వకేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారని టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనంలో తెలిపింది. తమ డిప్యూటీ CM ఉదయనిధిపై, మైనారిటీలపై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించినట్లు పేర్కొంది. మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా పవన్ మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు వివరించింది. ఉదయనిధి వ్యాఖ్యల్ని పవన్ ఖండించడాన్ని అడ్వకేట్ తప్పుబట్టారని తెలిపింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘OG’ సినిమా అప్డేట్స్ గురించి తనను అందరూ అడుగుతున్నారని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ట్వీట్ చేశారు. డైరెక్టర్ సుజిత్ అద్భుతంగా మూవీని రూపొందిస్తున్నారని, కచ్చితంగా ఇండస్ట్రీ హిట్ అవుతుందని తెలిపారు. త్వరలోనే మూవీ టీమ్ నుంచి అప్డేట్స్ వస్తాయన్నారు. అలాగే ‘గేమ్ ఛేంజర్’ నుంచి నెక్స్ట్ విడుదలయ్యే మెలోడీ పాట కూడా అద్భుతంగా వచ్చిందని చెప్పారు.
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అవకాశం కల్పిస్తూ ధర్మాసనం ఇచ్చిన తీర్పును సమీక్షించాలని దాఖలైన 32 పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. కోర్టు గతంలో ఇచ్చిన తీర్పులో ఎలాంటి దోషాలు కనిపించడం లేదని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు నిబంధనలు-2013లోని 47 రూల్ 1 కింద వీటిని సమీక్షించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. గత నెల 24నే ఈ ఉత్తర్వులు వెలువడగా తాజాగా బహిర్గతమయ్యాయి.
AP: రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ‘పల్లె పండుగ’ పేరుతో ఈ నెల 14 నుంచి 21 వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించనుంది. ఇటీవల జరిగిన గ్రామసభల్లో ఆమోదం తీసుకున్న 19,500 రకాల పనులను దశలవారీగా పూర్తి చేయనుంది.
AP: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజైన ఇవాళ ఉదయం వేంకటేశ్వరస్వామి చిన్నశేష వాహనంపై ఊరేగనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7 నుంచి 9 వరకు హంస వాహన సేవ ఉంటుంది.
దసరా పండుగకు ముందు రైతులకు శుభవార్త. పీఎం కిసాన్ 18వ విడత నిధులను ప్రధాని మోదీ నేడు రైతుల అకౌంట్లలో జమ చేయనున్నారు. మొత్తం రూ.20వేల కోట్లను దేశవ్యాప్తంగా ఉన్న 9.4 కోట్ల మంది రైతుల ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో జమ చేయనున్నారు. ఈ స్కీం కింద ప్రతి 4 నెలలకు ఓసారి రూ.2వేల చొప్పున మొత్తం 3 విడతల్లో రూ.6వేలను అన్నదాతల అకౌంట్లలో డిపాజిట్ చేస్తారు.
ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హెజ్బొల్లా లీడర్ హషీమ్ సఫీద్దీన్ హతమైనట్లు తెలుస్తోంది. ఇటీవల హెజ్బొల్లా చీఫ్ నస్రల్లా హతమయ్యాక అతడి దగ్గరి బంధువు అయిన హషీమ్ వారం క్రితమే బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం అతడు హెజ్బొల్లా సెక్రటరీ జనరల్గా ఉన్నారు. లెబనాన్ రాజధాని బీరుట్లో హషీమ్ తన అనుచరులతో సమావేశమయ్యారనే సమాచారంతో ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసి అతడిని మట్టుబెట్టినట్లు సమాచారం.
నటుడు రాజేంద్రప్రసాద్ కూతురు గద్దె గాయత్రి(38) గుండెపోటుతో మరణించారు. నిన్న కార్డియాక్ అరెస్టుకు గురికావడంతో HYDలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. రాజేంద్ర ప్రసాద్కు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. గాయత్రి మరణంతో రాజేంద్రప్రసాద్ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. దంతెవాడ, నారాయణపూర్ జిల్లాల సరిహద్దుల్లో నిన్న జరిగిన ఎన్కౌంటర్లో 36 మంది మావోయిస్టులు హతమయ్యారు. CRPF, BSF, కోబ్రా, STF విభాగాలకు చెందిన 1500 మంది జవాన్లు ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్లో ఇదే అతిపెద్ద ఎన్కౌంటర్ అని బస్తర్ IG పేర్కొన్నారు. 2026 కల్లా మావోయిస్టులను పూర్తిగా అంతం చేస్తామని కేంద్రమంత్రి అమిత్ షా ఇటీవలే స్పష్టంచేశారు.
AP: ధాన్యం సేకరణ ప్రక్రియలో రైస్ మిల్లుల ర్యాండమైజేషన్ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. రైతులు తమకు ఇష్టమైన మిల్లులకు ధాన్యాన్ని రవాణా చేసుకునే వెసులుబాటు కల్పించాలని అధికారులను CM చంద్రబాబు ఆదేశించారు. ఇందుకోసం రవాణా వాహనాలు, గోనె సంచులు సమకూర్చాలని, లేబర్ ఛార్జీలను చెల్లించాలని అధికారులకు సూచించారు. బయోమెట్రిక్ ఆధారంగా ధాన్యాన్ని సేకరించాలని, రవాణా వాహనాలను జీపీఎస్ ద్వారా ట్రాక్ చేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.