India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: సీఎం చంద్రబాబు తిరుమల పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆయన పాల్గొననున్నారు. ప్రభుత్వం తరఫున సీఎం దంపతులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఇవాళ రాత్రికి ఆయన కొండపైనే బస చేయనున్నారు. రేపు పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారు.
AP: వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మార్చాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ CM చంద్రబాబుకు లేఖ రాశారు. జిల్లాకు కడప అని పేరు పెట్టడం వెనుక చారిత్రక నేపథ్యం ఉందన్నారు. తిరుమలకు వెళ్లే భక్తులు ముందుగా కడపలోని వెంకటేశ్వరుడిని దర్శించుకుంటారన్నారు. అవగాహనా రాహిత్యంతో వైసీపీ ప్రభుత్వం జిల్లా పేరును మార్చిందని ఆరోపించారు. ఇదే విషయాన్ని గత అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రస్తావించినట్లు పేర్కొన్నారు.
AP: తిరుమలలో బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణం సందర్భంగా గరుడ ధ్వజ పటాన్ని ఎగురవేసే తాలూకు కొక్కి విరిగిందనే ప్రచారాన్ని నమ్మొద్దని TTD ట్వీట్ చేసింది. బ్రహ్మోత్సవాలలో ప్రతీదీ తనిఖీ చేయడం ఆనవాయితీ అని, దీనిలో భాగంగా భిన్నమైన వాటిని తొలగించి కొత్త వాటిని అమర్చడం సంప్రదాయమని తెలిపింది. ఈ క్రమంలో పాడైన కొక్కిని తొలగించి కొత్త దాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. తిరుమలలో ఎలాంటి అపచారం జరగలేదని పేర్కొంది.
TG: యూట్యూబర్ హర్షసాయి లైంగిక వేధింపుల కేసులో ఆయన తండ్రి రాధాకృష్ణ, యూట్యూబర్ ఇమ్రాన్ ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. కేసులో నిందితులుగా చేర్చకముందే బెయిల్ ఎలా ఇస్తారని పిటిషనర్లను ప్రశ్నించింది. కాగా ఇప్పటికే హర్షసాయితోపాటు రాధాకృష్ణ, ఇమ్రాన్లపై కూడా అత్యాచార బాధితురాలు ఫిర్యాదు చేశారు. హర్షతో తనకు పెళ్లి జరిపిస్తానని మాట ఇచ్చి మోసం చేశారని ఆమె పేర్కొన్నారు.
2024 సార్వత్రిక ఎన్నికల తరువాత మరోసారి దేశంలో ఎగ్జిట్ పోల్స్ సందడి నెలకొంది. జమ్మూకశ్మీర్, హరియాణ ఎన్నికలకు సంబంధించి శనివారం సాయంత్రం 6 గంటల తరువాత పలు సంస్థలు తమ అంచనాలను వెల్లడించనున్నాయి. ఇప్పటికే JK ఎన్నికలు ముగిశాయి. శనివారం హరియాణా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు పోలింగ్ సమయం ముగిసిన తరువాత ఫలితాల అంచనాలు వెలువడనున్నాయి.
AP: ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీకి రాష్ట్రంలోని హోటళ్లు, రెస్టారెంట్ల అసోసియేషన్ బిగ్ షాక్ ఇచ్చింది. ఈ నెల 14 నుంచి అమ్మకాలు నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. స్విగ్గీ, జొమాటో వల్ల తమకు తీవ్ర నష్టం కలుగుతోందని పేర్కొంది. తమ అభ్యంతరాలకు జొమాటో ఒప్పుకోగా, స్విగ్గీ అంగీకరించలేదని తెలిపింది. నగదు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నందుకే స్విగ్గీని బహిష్కరిస్తున్నట్లు అసోసియేషన్ వెల్లడించింది.
TG: గ్రూప్-1 పిటిషన్లపై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. విచారణ సందర్భంగా ప్రిలిమ్స్లో తప్పుడు ప్రశ్నలు తొలగించి, మెరిట్ జాబితా మరోసారి విడుదల చేయాలని పిటిషనర్లు కోరారు. అయితే 7వేలకు పైగా అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలించిన తర్వాతే రిజల్ట్స్ ఇచ్చామని TGPSC కోర్టుకు తెలిపింది. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఈనెల 21న మెయిన్స్ ఉండటంతో తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలకు ఇచ్చినంత ప్రాధాన్యం తమకు ఇవ్వరని హీరోయిన్ మాళవిక మోహన్ అన్నారు. హీరోయిన్ల కష్టాన్ని ఏమాత్రం గుర్తించరని చెప్పారు. ‘ఓ సినిమా ఫ్లాప్ అయితే హీరోయిన్ అన్ లక్కీ అంటారు. ఆమె వల్లే పరాజయం పాలైందన్నట్లు చూస్తారు. సినిమా హిట్ అయితే మాత్రం హీరోలకు భారీ కానుకలు ఇస్తారు. హీరోయిన్లకు ఏమీ ఇవ్వరు’ అని చెప్పుకొచ్చారు. ప్రియాంక ఇటీవల బాలీవుడ్లో హిట్ ఐన ‘యుధ్రా’ సినిమాలో నటించారు.
హరియాణా అసెంబ్లీ ఎన్నికలు శనివారం జరగనున్నాయి. 73 జనరల్ స్థానాలు, 17 ఎస్సీ రిజర్వ్ స్థానాలు కలిపి మొత్తం 90 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2.1 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 14 లక్షల మంది మొదటిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వాస్తవానికి హరియాణా ఎన్నికలు అక్టోబర్ 1న జరగాల్సి ఉన్నా కొన్ని పార్టీల విజ్ఞప్తితో EC 5కు వాయిదా వేసింది.
ప్రజాస్వామ్య ప్రక్రియలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యాన్ని SC ఆక్షేపించింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ సభ్యుడి ఎన్నికకు అదేశాలు సహా ప్రిసైడింగ్ అధికారిని నియమించడాన్ని తప్పుబట్టింది. ‘కమిటీ మీటింగ్కి మేయర్ అధ్యక్షత వహించాలి. మీకు అధికారం ఎక్కడిది? 487 కిందనా?. అది కార్యనిర్వాహక శక్తి. మీరు ఇలా జోక్యం చేసుకుంటే ప్రజాస్వామ్యం ఏమవ్వాలి?’ అని ప్రశ్నించింది.
Sorry, no posts matched your criteria.