news

News February 28, 2025

EPFO వడ్డీరేటు ఫిక్స్.. ఎంతంటే!

image

FY2024-25కి గాను EPFO వడ్డీరేటును 8.25% ఇవ్వాలని బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ నిర్ణయించినట్టు తెలిసింది. స్టాక్‌మార్కెట్ల పతనం, బాండు యీల్డులు తగ్గడంతో వడ్డీ తగ్గిస్తారని వార్తలు వచ్చినప్పటికీ బోర్డు యథాతథంగానే ఉంచినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.

News February 28, 2025

కిషన్ రెడ్డికి CM రేవంత్ బహిరంగ లేఖ

image

TG: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి CM రేవంత్ 9 పేజీల బహిరంగ <>లేఖ<<>> రాశారు. ప్రభుత్వ వినతులను పట్టించుకోవడం లేదని తేదీలతో సహా ఆయన ప్రస్తావించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2పై 2024, నవంబర్ 4న కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్ సమర్పించినా స్పందన లేదని మండిపడ్డారు. మూసీ పునరుజ్జీవంపైనా అదే తీరని పేర్కొన్నారు. ఇకనైనా TGకు సంబంధించి రూ.1,63,559.31కోట్ల ప్రాజెక్టుల అనుమతులు, నిధుల మంజూరుకు శ్రద్ధ వహించాలని లేఖలో రేవంత్ కోరారు.

News February 28, 2025

NEP వైపే యువత మెుగ్గు: తమిళనాడు గవర్నర్

image

హిందీపై వ్యతిరేకత పేరుతో ఇతర దక్షిణ భారత భాషల్లోనూ విద్యార్థులను చదువుకోనివ్వడం లేదని తమిళనాడు గవర్నర్ RN రవి అన్నారు. దీని వల్ల ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడి యువత అధికంగా ఉద్యోగావకాశాలను కోల్పోతోందన్నారు. రాష్ట్రంలో మెజార్టీ యువత NEPని అమలు చేయాలని కోరుతోందని తెలిపారు. కాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ NEPతో పాటు డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

News February 28, 2025

నితీశ్‌కుమార్ ఫిట్‌గా లేడు : ప్రశాంత్ కిషోర్ ‌

image

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ శారీరకంగా అలసిపోగా, మానసికంగా రిటైర్డ్ అయ్యారని జన్‌సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ అన్నారు. సరైన సంఖ్యాబలం లేకున్నా పొత్తులతోనే సీఎంగా కొనసాగుతున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో జేడీయూ ఒక్కసీటూ గెలవదని జోస్యం చెప్పారు. ఏప్రిల్‌లో జన్‌సూరజ్ పార్టీ పెద్దఎత్తున ర్యాలీ చేపట్టనుందని తెలిపారు. ఈఎన్నికల్లో తమ పార్టీ సంచలనం సృష్టించటం ఖాయమని పేర్కొన్నారు.

News February 28, 2025

మార్చి 30న ఉగాది అవార్డులు

image

AP: ఉగాది వేడుకల సందర్భంగా మార్చి 30న రాష్ట్ర సృజనాత్మక, సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో పురస్కారాలు అందజేయనున్నారు. వివిధ కళారంగాల్లో నిష్ణాతులు, కవులను కళారత్న, ఉగాది పురస్కారాలతో సత్కరించనున్నట్లు ఆ సమితి CEO మల్లికార్జునరావు తెలిపారు. దరఖాస్తులను MAR 15వ తేదీ లోపు విజయవాడలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత డాన్స్ కాలేజీలో నేరుగా లేదా apculture.ugadi2025@gmail.comకు పంపొచ్చు.

News February 28, 2025

ఏపీ వ్యవసాయ బడ్జెట్ ఎంతంటే?

image

AP: రూ.48,340కోట్లతో మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వ్యవసాయం లాభదాయకంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. వ్యవసాయ రంగంలో 15శాతం వృద్ధి మా టార్గెట్. కొత్త కౌలు చట్టం తీసుకొస్తాం. రైతులకు ప్రత్యేక గుర్తింపు సంఖ్యలు కేటాయించి పథకాలు అమలు చేస్తాం’ అని మంత్రి అన్నారు. ఇక్కడ <>క్లిక్<<>> చేసి పూర్తిస్థాయి వ్యవసాయ బడ్జెట్ గురించి తెలుసుకోండి.

News February 28, 2025

నేషనల్ సైన్స్ డే!

image

నేడు నేషనల్ సైన్స్ డే. 1928 FEB 28న శాస్త్రవేత్త సీవీ రామన్ భౌతిక శాస్త్ర పరిశోధనలను మలుపు తిప్పిన ‘రామన్​ ఎఫెక్ట్​’ను కనుగొన్నారు. ఈ పరిశోధనతో CVRను నోబెల్ అవార్డూ వరించింది. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం.. 1987 నుంచి ఏటా సైన్స్ డేను నిర్వహిస్తోంది. ఈ ఏడాది ‘ఎంపవరింగ్ ఇండియన్ యూత్ ఫర్ గ్లోబల్ లీడర్​షిప్ ఇన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ ఏ డెవలప్డ్ ఇండియా’ థీమ్‌తో సైన్స్ డే జరుపుకుంటున్నాం.

News February 28, 2025

3 నెలల్లో 17వేల కి.మీ. రోడ్లకు మరమ్మతులు: పయ్యావుల

image

AP: గత ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్వహణ లోపంతో రాష్ట్ర రహదారులు అధ్వానంగా తయారయ్యాయని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఆ రహదారుల పునరుద్ధరణ చేపట్టిందన్నారు. ‘మిషన్-గుంతలు లేని రహదారుల ఆంధ్ర’ కింద 3 నెలల్లోనే 17,605కి.మీ. రోడ్లకు మరమ్మతులు చేసిందని చెప్పారు. అలాగే జిల్లా కేంద్రాల నుంచి వాటికి ఆనుకొని ఉన్న మండల కేంద్రాలకు 2 వరుసల రహదారి అనుసంధాన పనులు చేపడుతున్నట్లు వివరించారు.

News February 28, 2025

లిరిసిస్ట్‌గా మారిన రామ్ పోతినేని

image

తమ సినిమాల కోసం హీరోలు పాటలు పాడటం చూశాం. కానీ, తొలిసారి ఉస్తాద్ రామ్ పోతినేని తన కొత్త సినిమా కోసం రైటర్‌గా మారిపోయారు. ‘RAPO22’లో ఆయన లవ్ సాంగ్‌కు లిరిక్స్ రాస్తున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. మొత్తం ఐదు సాంగ్స్ ఉండనుండగా ఇప్పటికే 4 సాంగ్స్ పూర్తయ్యాయని తెలుస్తోంది. ఈ చిత్రంలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్సే నటిస్తుండగా పి.మహేశ్ బాబు తెరకెక్కిస్తున్నారు.

News February 28, 2025

అమిత్ షా మీటింగ్: బంగ్లాదేశీయులు, రోహింగ్యాల ఏరివేతే అజెండా!

image

HM అమిత్ షా అధ్యక్షతన నేడు ఢిల్లీలో హై లెవల్ మీటింగ్ జరగనుంది. CM రేఖాగుప్తా, MoH అధికారులు హాజరవుతారు. శాంతి భద్రతలు, అక్రమ వలసదారుల ఏరివేతే అజెండా అని తెలిసింది. ఢిల్లీ సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో బంగ్లా దేశీయులు, రోహింగ్యాలు అక్రమంగా నివసిస్తున్నారు. వీరిని దేశం నుంచి తరిమేయడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తారని సమాచారం. ఇప్పటికే పార్లమెంటులో ఇమ్మిగ్రేషన్ బిల్లును ఆమోదించడం గమనార్హం.