India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పుష్కర్-గాయత్రి డైరెక్షన్లో తెరకెక్కిన ‘సుడల్: ది వర్టెక్స్’ వెబ్ సిరీస్ సీక్వెల్ ఇవాళ అర్ధరాత్రి నుంచి OTTలోకి రానుంది. అమెజాన్ ప్రైమ్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఐశ్వర్యా రాజేశ్, కథిర్, శ్రియా రెడ్డి కీలక పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ఫస్ట్ పార్ట్ 2022లో విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. IMDb రేటింగ్ 8.1 సాధించడంతో పాటు 30 భాషల్లో స్ట్రీమింగ్ అయ్యింది.

క్యాన్సర్ వచ్చిన ఐదుగురిలో ముగ్గురు చనిపోతున్నారని ఇండియన్ మెడికల్ ప్యానెల్ వెల్లడించింది. ది లాన్సెట్లో ప్రచురితమైన ICMR తాజా నివేదిక ప్రకారం గత దశాబ్దంలో పురుషుల కంటే మహిళల్లో క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. రాబోయే 2 దశాబ్దాల్లో ఇది పెరుగుతూనే ఉంటుందని పరిశోధకులు అంచనా వేశారు. క్యాన్సర్ మరణాలు పురుషుల కంటే స్త్రీలలోనే ఎక్కువగా ఉన్నాయి. కాగా, 2012- 2022 మధ్య క్యాన్సర్ కేసులు 36% పెరిగాయి.

AP: అసెంబ్లీలో రేపు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. ₹3L Crతో పద్దు ఉండొచ్చని అంచనా. ఉ.9గంటలకు CM CBN అధ్యక్షతన క్యాబినెట్ సమావేశమై బడ్జెట్కు ఆమోదం తెలపనుంది. దీన్ని శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల, మండలిలో కొల్లు రవీంద్ర, వ్యవసాయ బడ్జెట్ను అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రవేశపెడతారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ లాంటి పథకాలతో పాటు కీలక ప్రాజెక్టులకు కేటాయింపులు ఉండనున్నాయి.

హాలీవుడ్ యాక్టర్, రెండుసార్లు ఆస్కార్ విజేత జీన్ హ్యాక్మ్యాన్ (95) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. న్యూమెక్సికోలోని ఇంట్లో జీన్, ఆయన భార్య, పెంపుడు కుక్క చనిపోయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ‘The French Connection’, ‘Bonnie and Clyde’, ‘The Royal Tenenbaums’ లాంటి ఎన్నో సినిమాల్లో నటించారు. 2 ఆస్కార్, 3 గోల్డెన్ గ్లోబ్ అవార్డులు సాధించారు.

AP: రాష్ట్రంలో ఎన్ని సమస్యలున్నా కూటమి ప్రభుత్వం ఎంతో మంచి పాలన అందిస్తోందని మంత్రి సత్యకుమార్ చెప్పారు. విజయవాడలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఏపీకి రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం వెనుక ప్రధాని మోదీ సహకారం ఉందన్నారు. అప్పుల్లో ఉన్న రాష్ట్రం సీఎం చంద్రబాబు వల్ల ఆర్థికంగా పుంజుకుందని కొనియాడారు. యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయని తెలిపారు.

లెజెండరీ సింగర్ KJ యేసుదాస్ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరినట్లు వస్తున్న వార్తలను ఆయన కుమారుడు విజయ్ ఖండించారు. ప్రస్తుతం ఆయన USలో ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. తప్పుడు వార్తల వల్ల కోట్లాది మంది అభిమానుల్లో ఆందోళన నెలకొంటుందని, అలాంటి ప్రచారం చేయొద్దని కోరారు. యేసుదాస్ అన్ని భాషల్లో దాదాపు 50K పాటలు పాడారు. 8 నేషనల్ అవార్డులు పొందారు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలను అందుకున్నారు.

మనం డాక్టర్ వద్దకు వెళ్లినప్పుడు డాక్టర్లు నాలుకని చూపించమంటారు. ఎందుకంటే అది మన ఆరోగ్యపరిస్థితిని సూచిస్తుంది. శరీరం డీహైడ్రేట్గా ఉంటే నాలుక పొడిగా మారుతుంది. అనీమియా సమస్య ఉంటే రక్తహీనతను సూచిస్తుంది. ఇన్ఫెక్షన్లు ఉంటే నాలుకపై తెల్లని పొరలు ఏర్పడతాయి. థైరాయిడ్ సమస్య ఉంటే నాలుక పెద్దదిగా మారుతుంది. కిడ్నీ, లివర్ సమస్యలుంటే రంగుమారుతూ ఉంటుందని పరిశోధనల ద్వారా తేలింది.

AP: పోసాని కృష్ణమురళి సహా తప్పు చేసినవారెవరూ చట్టం నుంచి తప్పించుకోలేరని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అధికారం ఉందని అడ్డగోలుగా వ్యవహరిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ‘వైసీపీ హయాంలో పోసాని పేట్రేగిపోయారు. చంద్రబాబు, లోకేశ్, పవన్లను అసభ్యంగా దూషించారు. నంది అవార్డులపై కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విచ్చలవిడిగా ప్రవర్తించినవారికి ఇదే గతి పడుతుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తోన్న ‘ది పారడైజ్’ నుంచి మార్చి 3న గ్లింప్స్ వీడియో విడుదల కానుంది. దీనిని మొత్తం 8 భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సినీవర్గాలు పేర్కొన్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీతో పాటు ఇంగ్లిష్ & స్పానిష్లో గ్లింప్స్ రిలీజ్ అవుతుందని సమాచారం. ఇందులో నాని బోల్డ్గా, వైల్డ్గా కనిపించనున్నారు.

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబసభ్యుల గురించి సినీనటుడు పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు సహించలేకే ఆయనపై ఫిర్యాదు చేశానని జనసేన నేత జోగిమణి తెలిపారు. వైసీపీ హయాంలోనే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పారు. ‘పవన్పై పోసాని వ్యాఖ్యలతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా. ఇష్టానుసారం మాట్లాడవద్దని, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించాం. అయినా పోసాని ప్రవర్తన మారలేదు’ అని ఆయన పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.