news

News September 25, 2024

ఆర్టీసీ ఐటీఐ కాలేజీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

TG: HYD హాకీంపేటలోని ఆర్టీసీ ఐటీఐ కాలేజీలో వివిధ ట్రేడ్‌లలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ ట్రేడ్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఆర్టీసీ డిపోల్లో అప్రెంటిస్​షిప్​ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు ఈ నెల 28వ తేదీలోపు <>https://iti.telangana.gov.in<<>> లో అప్లై చేసుకోవాలని సూచించారు.

News September 25, 2024

కాలుష్య నివారణకు ఢిల్లీలో కృత్రిమ వర్షాలు!

image

న‌వంబ‌ర్ నెల‌లో తీవ్ర స్థాయిలో ఉండే కాలుష్యాన్ని త‌గ్గించ‌డానికి కృత్రిమ‌ వ‌ర్షాల సృష్టికి ఢిల్లీ ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతోంది. న‌వంబ‌ర్ 1 నుంచి 15 తేదీల మ‌ధ్య వర్షాల సృష్టికి అనుమ‌తుల కోసం కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ శాఖ‌కు లేఖ రాసిన‌ట్టు మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. 21 పాయింట్ల అజెండాతో కాలుష్య నివార‌ణ‌కు యాక్ష‌న్ ప్లాన్ సిద్ధం చేశామ‌ని, ప్ర‌త్యేక బృందాలు, యంత్రాల‌ను మోహ‌రించ‌నున్న‌ట్టు వివరించారు.

News September 25, 2024

HYD ఆంత్రప్రెన్యూర్ వ్యాఖ్యలపై దుమారం

image

భారత్‌లో నిరంతరం తప్పులను కనుగొనే వారు దేశంలో నివసించాలనే తమ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని HYD ఆంత్రప్రెన్యూర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ‘భారతదేశంలో నిరంతరం లోపాలను కనుగొనే వ్యక్తులకి ఒక ప్రశ్న. మీరు ఇంకా ఇక్కడ ఎందుకున్నారు’ అంటూ నీరజ్ దుగర్ వ్యాఖ్యానించారు. దీంతో మార్పు కోసం తప్పుల్ని వెతకడం మంచిదే అని కొందరు, శరీరంలో లోపాలు ఉంటే దాన్ని వదిలేస్తారా? అంటూ మరికొందరు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు.

News September 25, 2024

తిరుమల నెయ్యి కల్తీపై ఒవైసీ కామెంట్స్

image

తిరుమల లడ్డూ అంశంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ‘లడ్డూలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని అంటున్నారు. ప్రసాదంలో అలా జరగడం బాధాకరం. మరోవైపు కాశీ బోర్డులో అందరూ హిందువులే ఉన్నప్పుడు వక్ఫ్ బోర్డు సవరణ చట్టం తీసుకొచ్చి ముస్లిం సంస్థల్లో హిందువులను ఎలా పెడతారు?’ అని ప్రశ్నించారు.

News September 25, 2024

AIతో భయం వద్దు: OpenAI CEO ఆల్ట్‌మాన్

image

జాబ్ మార్కెట్‌పై AI ప్రభావం చూపుతుందని న‌మ్ముతున్నట్టు OpenAI CEO సామ్ ఆల్ట్‌మాన్ పేర్కొన్నారు. అయితే కొంతమంది భయపడినంత త్వరగా లేదా తీవ్రంగా ప్ర‌భావం చూప‌బోద‌న్నారు. ఆకస్మికంగా ఉద్యోగాలేమీ పోవన్నారు. AI కార్మిక మార్కెట్లను సానుకూలంగా, ప్రతికూలంగా మార్చగలదని ఓ బ్లాగ్ పోస్ట్‌లో పంచుకున్నారు. అనుకున్నదానికంటే నెమ్మదిగా ఉద్యోగాల తీరు మారుతుందని, మనం చేయాల్సిన పనులు అయిపోతాయనే భయం లేదని పేర్కొన్నారు.

News September 25, 2024

టాప్-5లో ఉన్న ఏకైక బ్యాటర్ ఇతడే..

image

టీమ్ ఇండియా యువ సంచలనం యశస్వీ జైస్వాల్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అదరగొడుతున్నారు. ప్రస్తుతం టెస్టులు, టీ20ల్లో టాప్-5లో ఉన్న ఏకైక ఇంటర్నేషనల్ బ్యాటర్ ఇతడే. జైస్వాల్ టీ20ల్లో 4, టెస్టుల్లో 5వ స్థానంలో కొనసాగుతున్నారు. వన్డేల్లోనూ అవకాశాలు లభిస్తే అందులోనూ తన మార్క్ చూపించే అవకాశాలు ఉన్నాయి.

News September 25, 2024

30 కాదు 59 ముక్కలు.. మహిళ హత్య కేసులో కీలక విషయాలు

image

బెంగళూరులో 29 ఏళ్ల మహాలక్ష్మి అనే మహిళను 30 ముక్కలుగా <<14164043>>నరికిన<<>> కేసులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. వైద్య నివేదికల ప్రకారం 59 ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. గతేడాది భర్తతో విడిపోయిన మహాలక్ష్మి తాను పనిచేస్తున్న మాల్‌లో టీమ్ లీడర్‌గా ఉన్న రంజన్‌తో రిలేషన్‌లో ఉందని పోలీసులు తెలిపారు. అయితే మహాలక్ష్మి వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండటం తెలిసి రంజన్ హత్య చేసి ఉండొచ్చని పేర్కొన్నారు.

News September 25, 2024

కనిష్ఠ స్థాయికి ఆర్కిటిక్ సముద్రపు మంచు

image

పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఆర్కిటిక్ సముద్రపు మంచు Sep నెలలో వార్షిక కనిష్ఠ స్థాయికి చేరుకుంది. ఏటా ఉత్తరార్ధగోళంలో మంచు గ‌ణ‌నీయ స్థాయిలో క్షీణిస్తోంది. నాసా, NSIDC డేటా సెంటర్ పరిశోధకుల ప్రకారం ఈ ఏడాది కనిష్ఠ పరిధి 4.28 మిలియన్ చదరపు కిలోమీటర్లుగా న‌మోదైంది. సముద్రపు మంచు నష్టం ఏడాదికి 77,800 Sq.KM చొప్పున సంభవిస్తోంది. ఈ క్షీణత విస్తీర్ణంలో మాత్రమే కాకుండా మంచు నాణ్యతలో కూడా ఉంది.

News September 25, 2024

అల్పపీడనం.. భారీ వర్షాలు

image

AP: బంగాళాఖాతాన్ని ఆనుకుని అల్పపీడనం కొనసాగుతుందని వాతావరణశాఖ పేర్కొంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా నిన్నటి నుంచి APలో పలుచోట్ల వర్షాలు దంచికొట్టాయి. అనకాపల్లి జిల్లాల్లో 13 CM వర్షపాతం నమోదైంది. అటు తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, NZB, MBNR, HYD, నల్గొండ జిల్లాల్లో కాసేపట్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

News September 25, 2024

పూజలకు పిలుపునిచ్చిన జగన్.. టీడీపీ కౌంటర్

image

AP: సీఎం చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు YCP నేతలంతా ఈ నెల 28న పూజల్లో పాల్గొనాలన్న జగన్ పిలుపునకు TDP కౌంటర్ ఇచ్చింది. ‘నీ కుటుంబం విగ్రహారాధన చేయదు. ఒక్కసారి కూడా భార్యను తీసుకుని పట్టు వస్త్రాలు ఇవ్వలేదు. భార్య గుడికి రాదని ఇంట్లోనే స్వామి వారి ఆలయం సెట్టింగ్ వేశావ్. లడ్డూలో జంతు కొవ్వు కలిపావ్. స్వామి వారంటే నమ్మకం, భక్తి లేని నీ లాంటి వాడా ఈ పిలుపు ఇచ్చేది?’ అని మండిపడింది.

error: Content is protected !!