news

News December 31, 2024

బీఎల్వోలకు త్వరలో గౌరవ వేతనాలు

image

AP: రాష్ట్రంలోని 4,638మంది బూత్ లెవల్ ఆఫీసర్ల(BLO)కు త్వరలో గౌరవ వేతనాలు అందనున్నాయి. 2021-22 నుంచి వేతనాలందక 26 జిల్లాల్లోని BLOలు ఇబ్బంది పడుతున్నట్లు రాష్ట్ర లోకాయుక్తకు ఫిర్యాదు అందింది. దీనిపై స్పందించాలని SEPలో ఉన్నతాధికారులను లోకాయుక్త ఆదేశించింది. విచారణ జరిపిన అధికారులు రూ.58.62కోట్లు విడుదల చేయాలని జిల్లా ట్రెజరీ అధికారులను తాజాగా ఆదేశించారు. దీంతో త్వరలో BLOలకు వేతనాలు అందనున్నాయి.

News December 31, 2024

చైనా మాపై సైబర్ దాడి చేసింది: అమెరికా

image

చైనా తమపై సైబర్ దాడికి పాల్పడిందని అమెరికా ట్రెజరీ శాఖ చట్టసభకు రాతపూర్వకంగా తెలిపింది. ఈ నెల మొదటివారంలో తమ వర్క్ స్టేషన్లను, కొన్ని డాక్యుమెంట్లను సైబర్ నేరగాళ్లు యాక్సెస్ చేశారని పేర్కొంది. ‘మా సైబర్ భద్రత నిపుణులతో సంప్రదించి పరిస్థితిని చక్కదిద్దాం. దుండగులకు యాక్సెస్‌ను కట్ చేయగలిగాం. ఆధారాల్ని బట్టి ఈ పని చేసింది చైనా ప్రభుత్వ మద్దతున్న సైబర్ హ్యాకింగ్ బృందమే’ అని స్పష్టం చేసింది.

News December 31, 2024

మారుతీ సుజుకీ డిజైర్ మరో ఘనత

image

మారుతీ సుజుకీ సెడాన్ కారు డిజైర్ సరికొత్త ఘనత అందుకుంది. 2008లో మార్కెట్‌లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 30 లక్షల కార్ల అమ్మకాల మార్కును దాటింది. 2015లో 10 లక్షలు, 2019లో 20 లక్షల అమ్మకాల మైలురాళ్లను దాటింది. మార్కెట్లో ఎస్‌యూవీ తరహా వాహనాలకు డిమాండ్ పెరిగినా డిజైర్ అమ్మకాలు మాత్రం స్థిరంగా కొనసాగుతుండటం విశేషం.

News December 31, 2024

తెలంగాణకు కాంగ్రెస్ శనిలా పట్టింది: ఎమ్మెల్సీ కవిత

image

TG: కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలకు శనిలా పట్టిందంటూ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. CM రేవంత్ దుష్టపాలన సాగిస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. ‘కల్లబొల్లి మాటలతో ప్రజల్ని మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో ప్రతి 3 గంటలకోసారి మహిళలపై లైంగిక దాడి జరుగుతోంది. హామీలను గాలికొదిలేసిన కాంగ్రెస్ నేతల్ని ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలి. కేసీఆర్ ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకున్నారు’ అని పేర్కొన్నారు.

News December 31, 2024

కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై నేడు విచారణ

image

TG: ఫార్ములా-ఈ రేస్‌ విషయంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని KTRదాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు నేడు విచారించనుంది. ఇక ఆయనకు ఊరటనిస్తూ అరెస్టు చేయొద్దని ఇచ్చిన గడువు సైతం నేటితో ముగుస్తున్న నేపథ్యంలో ఆ ఆదేశాలను పొడిగిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. కోర్టు తీర్పును అనుసరించి కేటీఆర్ అరెస్ట్ ఆధారపడి ఉన్న నేపథ్యంలో నేటి విచారణ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

News December 31, 2024

నాగబాబు స్థానంలో ఎవరున్నా పదవి ఇచ్చేవాడిని: పవన్ కళ్యాణ్

image

AP: తన సోదరుడు నాగబాబుకు మంత్రిపదవి ఇవ్వడంపై డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ మీడియాతో చిట్‌చాట్‌లో వివరణ ఇచ్చారు. ‘క్యాబినెట్‌లో అవకాశం నా సోదరుడని ఇవ్వలేదు. నాతో సమానంగా ఆయన పనిచేశారు. ఒకవేళ ఆ స్థానంలో నా సోదరుడి కాని వ్యక్తి, వేరే సామాజిక వర్గానికి వారైనా అదే అవకాశం ఇచ్చేవాడిని. కందుల దుర్గేశ్ కులమేంటో నాకు ఇప్పటికీ తెలీదు. కలిసి అభివృద్ధి కోసం పనిచేసేవారిని వారసత్వంగా చూడలేం’ అని స్పష్టం చేశారు.

News December 31, 2024

సోషల్ మీడియాకు దూరంగా ఉండండి: పూరీ జగన్నాధ్

image

సోషల్ మీడియా కారణంగా నెగటివిటీ తీవ్రమవుతుందని దర్శకుడు పూరీ జగన్నాధ్ తన పాడ్‌కాస్ట్‌లో తెలిపారు. ‘మీరు ఏ పోస్టు పెట్టినా నెగెటివిటీని ఆకర్షిస్తున్నట్లే. పనీపాటా లేనివారు దేశంలో కోట్లలో ఉన్నారు. మీ విషయాల్ని రహస్యంగా ఉంచండి. ముఖ్యంగా అమ్మాయిలకు చెబుతున్నా. భర్తే మీ ప్రపంచం అనుకున్నప్పుడు మిగిలిన ప్రపంచం మీ అన్యోన్యతను చూడాల్సిన అవసరం లేదు. జీవితాన్ని సోషల్ మీడియాలో పెట్టొద్దు’ అని పేర్కొన్నారు.

News December 31, 2024

పంత్‌ ఆటను తప్పుబట్టలేం: రోహిత్ శర్మ

image

మెల్‌బోర్న్‌లో టీమ్ ఇండియా ఓటమిపై కెప్టెన్ రోహిత్ ప్రెస్‌మీట్‌లో స్పందించారు. ‘ఎంసీజీలో ఆఖరి ఇన్నింగ్స్ ఆడటం అంత ఈజీ కాదు. ఓటమి కచ్చితంగా నిరాశకు గురిచేసింది. పంత్ ఔట్ అయ్యాక ఓటమి తప్పదని అర్థమైంది. అతడి ఆటను తప్పుబట్టలేం. ఎన్నోసార్లు ఈ ఆటతోనే భారత్‌ను గెలిపించారు. ఏదేమైనా.. ఈ ఓటమిని పక్కన పెట్టి సిడ్నీలో గెలవడంపై దృష్టి సారిస్తాం’ అని స్పష్టం చేశారు.

News December 31, 2024

బొర్రా గుహల్లో మహేశ్ బాబు సినిమా షూటింగ్?

image

మహేశ్ బాబుతో తాను తెరకెక్కించే సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాలను APలోని బొర్రా గుహల్లో తీయాలని దర్శకుడు రాజమౌళి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జక్కన్న తన టీమ్‌తో గుహల్ని సందర్శించారు. అధికశాతం టాకీ పార్ట్‌ను ఆఫ్రికా అడవుల్లోనే షూట్ చేయొచ్చని సమాచారం. SSMB29గా వ్యవహరిస్తున్న ఈ మూవీ షూట్ వచ్చే ఏడాది వేసవి నుంచి ప్రారంభం కానుంది. ప్రియాంక చోప్రాను హీరోయిన్‌గా తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది.

News December 31, 2024

గాజాపై దాడి పర్యవసానాలను ఇజ్రాయెల్ ఎదుర్కోవాల్సిందే: నిపుణులు

image

గాజాపై చేసిన యుద్ధం తాలూకు పర్యవసానాలను ఇజ్రాయెల్ కచ్చితంగా ఎదుర్కోవాల్సిందేనని UN నిపుణులు తాజాగా తేల్చిచెప్పారు. ‘గాజాలోని పౌరుల్ని ఇజ్రాయెల్ చంపింది. దానికి మిత్రదేశాలు అండగా నిలిచాయి. ఘర్షణల్లో అమాయక పౌరులకు హాని కలగకూడదని చట్టాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఇజ్రాయెల్ ఏ చట్టాన్నీ పట్టించుకోలేదు. అన్నింటినీ ఉల్లంఘించింది. గాజా యుద్ధంలో ఇప్పటివరకు 45,500మంది చనిపోయారు’ అని పేర్కొన్నారు.