news

News December 30, 2024

APలో మరో ఘోరం

image

AP: అల్లూరి జిల్లా జి.మాడుగుల మండలంలో దారుణం జరిగింది. ఈ నెల 25న ఆశ్రమ పాఠశాల నుంచి అదృశ్యమైన ఓ బాలికపై ముగ్గురు దుండగులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 28న ఆమె ఆచూకీని పోలీసులు గుర్తించారు. తనకు మాయమాటలు చెప్పి ముగ్గురు అఘాయిత్యం చేశారని ఆమె పోలీసులకు చెప్పింది. ఆమెను తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

News December 30, 2024

దేశంలో 100 స్ట్రీట్ ఫుడ్ హబ్స్.. APలో నాలుగు

image

AP: తిరుపతి, కడప, విజయవాడ, విశాఖ జిల్లాల్లో స్ట్రీ ఫుడ్ హబ్స్ తీసుకొస్తున్నట్లు కేంద్రమంత్రి ప్రతాప్‌రావ్ జాదవ్ వెల్లడించారు. ప్రజలకు క్వాలిటీ ఆహారం అందించేలా దేశంలో 100 హబ్స్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ ఆన్‌లైన్‌లో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తోందన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News December 30, 2024

బనకచర్లకు గోదావరి నీళ్లు.. భారీ ప్రాజెక్టుకు రూపకల్పన

image

AP: గోదావరి-బనకచర్ల(కర్నూలు) ప్రాజెక్టును పట్టాలెక్కించాలని నిర్ణయించిన ప్రభుత్వం టెండర్లు పిలిచేందుకు సిద్ధమైంది. దాదాపు రూ.70- 80వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనుండగా కేంద్రం ఆమోదం కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. పోలవరంతో పాటు ఈ ప్రాజెక్టూ APకి కీలకంగా మారనుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీని నిర్మాణంతో రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ప్రయోజనం చేకూరనుంది.

News December 30, 2024

‘పుష్ప-2’ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

image

మహేశ్ బాబు ‘1-నేనొక్కడినే’ మూవీ ఫలితంతో సినిమాలు ఆపేద్దామనుకున్నానని దర్శకుడు సుకుమార్ అన్నారు. యూఎస్‌లో ఆ సినిమాకు కలెక్షన్లు రాకపోయి ఉంటే సినిమాలు మానేసేవాడినని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘గేమ్ ఛేంజర్’ గ్లోబల్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. US ఆడియన్స్ వల్ల ఇలా ఉన్నానంటూ వారికి థాంక్స్ చెప్పారు. ఆ సినిమా తర్వాత లెక్కల మాస్టారు తీసిన రంగస్థలం, పుష్ప, పుష్ప-2 సినిమాలు ఆయనను టాక్ ఆఫ్ ది నేషన్‌గా మార్చాయి.

News December 30, 2024

కాసులకు కక్కుర్తి పడొద్దు.. ఇన్‌ఫ్లూయెన్సర్లకు సజ్జనార్ సూచన

image

TG: డబ్బుల కోసం కక్కుర్తి పడి ఎంతోమందిని బలి తీసుకుంటున్న బెట్టింగ్ యాప్స్‌ను ప్రచారం చేయొద్దని సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు RTC MD సజ్జనార్ సూచించారు. రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావొచ్చని యువత ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసలై జీవితాలు నాశనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. సొంత లాభం కోసం ప్రజా శ్రేయస్సును విస్మరించడం సమంజసమేనా అని ప్రశ్నించారు. సంఘ విద్రోహశక్తులకు దూరంగా ఉండాలని హితవు పలికారు.

News December 30, 2024

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

image

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. నిన్న శ్రీవారిని 84,950 మంది భక్తులు దర్శించుకోగా, 21,098 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.8 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.

News December 30, 2024

వచ్చే నెలలో కీలక ప్రకటనలు!

image

TG ప్రభుత్వం నూతన ఏడాదిలో కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. జనవరిలో రైతు భరోసా అమలు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. వీటికి సంబంధించి త్వరలోనే క్యాబినెట్ భేటీ నిర్ణయం తీసుకోనుంది. ఉద్యోగ నోటిఫికేషన్లపైనా ప్రకటన చేసే అవకాశముంది. దీంతో పాటు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

News December 30, 2024

నేటి నుంచి శబరిమలలో అయ్యప్ప దర్శనం

image

మండల పూజ అనంతరం DEC 26న మూసివేసిన శబరిమల ఆలయం నేడు తిరిగి తెరుచుకోనుంది. సాయంత్రం 4 గంటలకు సంప్రదాయ పూజలు నిర్వహించిన తర్వాత స్వామి దర్శనం కల్పించనున్నారు. సంక్రాంతి సందర్భంగా ఏటా జనవరి 14న భక్తులు మకర జ్యోతిని దర్శించుకుంటారు. నవంబర్ 15న ప్రారంభమైన మండల పూజల్లో డిసెంబర్ 26 వరకు దాదాపు 32 లక్షల మందికి పైగా దర్శించుకున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం తెలిపింది.

News December 30, 2024

APPLY NOW.. 14,344 ఉద్యోగాలు

image

SBIలో 14,344 జూనియర్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. JAN 7 చివరి తేది. తొలుత 13,735 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వగా, 609 బ్యాక్‌లాగ్ జాబ్‌లనూ యాడ్ చేశారు. డిగ్రీ పూర్తైన 20-28 ఏళ్లలోపు వారు అర్హులు. SC, ST, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు ఫీజు లేదు. మిగతా వారు రూ.750 చెల్లించాలి. FEBలో ప్రిలిమ్స్, మార్చి/ఏప్రిల్‌లో మెయిన్స్ నిర్వహిస్తారు. వివరాలకు <>క్లిక్ <<>>చేయండి.

News December 30, 2024

భారత్ vs ఆసీస్ మ్యాచ్‌లో రికార్డ్

image

MCGలో భారత్ vs ఆసీస్ మ్యాచ్‌‌ను 5రోజుల్లో 3,50,534 మంది వీక్షించి రికార్డ్ సృష్టించారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఓ టెస్ట్ మ్యాచుకు ఇంతమంది రావడం ఇదే తొలిసారి. 1936/37‌లో ఆసీస్, ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ అటెండెన్స్‌ను 4వ టెస్ట్ దాటేసిందని MCG ప్రకటించింది. T20 మేనియాలో టెస్ట్ క్రికెట్ అంతరించిపోతుందన్న వాదన నిజం కాదని, ఈ మ్యాచ్ నిరూపించిందని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు.