news

News December 29, 2024

ALERT.. రేపు, ఎల్లుండి జాగ్రత్త

image

తెలంగాణలో రానున్న 5 రోజులు ఉదయం వేళ పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని వెల్లడించింది. రేపు 17-30 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. రేపు, ఎల్లుండి సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాల్లో 11-15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఎల్లో అలర్ట్ ఇచ్చింది.

News December 29, 2024

మాతృభాష తల్లి పాలలాంటిది: కందుల దుర్గేశ్

image

AP: మాతృ భాష తల్లిపాలలాంటిదని, పరాయి భాష పోతపాలలాంటిదని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో ఆయన మాట్లాడారు. ‘విద్యార్థులకు మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి. గత ప్రభుత్వం తెలుగు భాషకు తూట్లు పొడిచింది. ఇంగ్లిష్ మీడియం పేరుతో తెలుగుకు ద్రోహం చేసింది. తెలుగు భాష పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. యువత పుస్తకాలు చదివేలా చర్యలు తీసుకోవాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News December 29, 2024

సీఎం చంద్రబాబు పల్నాడు పర్యటన ఖరారు

image

AP: సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లా పర్యటన ఖరారైంది. నర్సరావుపేట నియోజకవర్గంలోని యల్లమంద గ్రామంలో ఈ నెల 31న ఉదయం 11 గంటలకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. పెన్షన్ల పంపిణీ అనంతరం లబ్ధిదారులతో ముచ్చటిస్తారు. మ.12.40 తర్వాత పల్నాడు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో భేటీ అవుతారు. అనంతరం కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని దర్శించుకుంటారు.

News December 29, 2024

ORR లీజులోనూ అవకతవకలు: కోమటిరెడ్డి

image

TG: హైదరాబాద్ ORR లీజుకు ఇవ్వడంపై విచారణ జరుగుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. హరీశ్‌రావు కోరడంతోనే దీనిపై SIT విచారణకు ఆదేశించామని, దీనిలోనూ అవకతవకలు బయటపడతాయన్నారు. ఫార్ములా-ఈ కార్ రేసులో దొంగలు దొరికారని పరోక్షంగా KTRపై మండిపడ్డారు. అటు 2017లో ఆగిపోయిన RRR ప్రాజెక్టుపై తమ కృషి వల్లే ముందడుగు పడిందని, ఇందుకు సహకరించిన ప్రధాని మోదీ, గడ్కరీకి కోమటిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

News December 29, 2024

నిన్న సమంత.. ఇవాళ కీర్తి సురేశ్.. ఇవి ఆగేదెలా?

image

సరికొత్త ఆవిష్కరణలకు అండగా ఉండాల్సిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)ను కొందరు విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్నారు. నిన్న హీరోయిన్ <<15004135>>సమంత <<>>బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయగా, తాజాగా మరో నటి కీర్తి సురేశ్ ఫొటోలనూ గర్భంతో ఉన్నట్లు క్రియేట్ చేశారు. దీంతో ఇలాంటివి క్రియేట్ చేసే వారికి AIని దూరంగా ఉంచాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

News December 29, 2024

క్రెడిట్ స్కోర్ ఎలా లెక్కిస్తారంటే..!

image

ప్రస్తుతం రుణం కావాలంటే ఏ సంస్థ అయినా క్రెడిట్ స్కోరు చూస్తుంది. లోన్లు, క్రెడిట్ కార్డులు కావాలంటే ఇది తప్పనిసరి. క్రెడిట్ స్కోర్‌ను కొన్ని ఆర్బీఐ అనుమతి పొందిన ఆర్థిక సంస్థలు నిర్వహిస్తుంటాయి. తొలుత ఈఎంఐలు, లోన్లు, క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపుల ప్రకారం లెక్కిస్తారు. అలాగే రేషియో క్రెడిట్ స్కోర్ ఆధారంగా దీనిని నిర్వహిస్తారు. మీ పాత బ్యాంకులు, క్రెడిట్ కార్డుల హిస్టరీ ఆధారంగానూ లెక్కిస్తారు.

News December 29, 2024

రష్యా వల్లే విమానం కూలింది: అజర్ బైజాన్ Prez

image

క‌జ‌కిస్థాన్‌లో త‌మ దేశ విమానం కూలిపోయిన‌ ఘ‌ట‌న వెనుక ర‌ష్యా హ‌స్తం ఉంద‌ని అజ‌ర్ బైజాన్ అధ్య‌క్షుడు ఇల్హామ్ అలియేవ్ ఆరోపించారు. భూత‌ల కాల్పుల వ‌ల్లే దెబ్బతిన్న తమ విమానం కూలిపోయిందన్నారు. రష్యాలోని కొన్ని వర్గాలు ఈ ఘ‌ట‌న వెనకున్న వాస్త‌వాల్ని దాచిపెట్టి త‌ప్పుడు క‌థ‌నాల్ని వ్యాప్తిలోకి తెచ్చాయ‌ని అలియేవ్ పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్న పుతిన్‌, బాధ్య‌త వ‌హించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

News December 29, 2024

రోహిత్ రిటైర్ కావడం మంచిది: ఆసీస్ మాజీ కెప్టెన్

image

టెస్టుల్లో విఫలమవుతున్న టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇక రిటైర్ కావడం మంచిదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మార్క్ వా అన్నారు. తాను కనుక సెలక్టర్ అయితే మెల్‌బోర్న్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో విఫలమైతే రోహిత్‌కు ఉద్వాసన పలుకుతానని చెప్పారు. ‘రోహిత్ చివరి 14 ఇన్నింగ్సుల్లో యావరేజ్ 11 మాత్రమే. ఇది ఆయన వైఫల్యానికి నిదర్శనం. ఎవరైనా ఏదో ఒకదశలో కెరీర్ చరమాంకానికి చేరుకోక తప్పదు’ అని వ్యాఖ్యానించారు.

News December 29, 2024

విచారణకు పవన్ ఆదేశం.. రంగంలోకి అధికారులు

image

AP: కాకినాడ వాకలపూడి తీరంలో ఆలివ్ రిడ్లే తాబేళ్లు మరణిస్తుండటంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని అధికారులకు సూచించారు. తాబేళ్ల మృతికి గల కారణాలను తెలుసుకోవాలని, కారకులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే కాకినాడ తీరంలో దుర్గంధం వెదజల్లుతున్న పరిశ్రమల్లో తనిఖీలు చేయాలని PCB అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు రంగంలోకి దిగారు.

News December 29, 2024

6 విమాన ప్ర‌మాదాలు.. 234 మంది మృతి

image

ప్ర‌పంచ ఏవియేష‌న్ రంగానికి డిసెంబర్ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ నెల‌లో పలు దేశాల్లో జరిగిన ప్రమాదాల్లో 234 మంది ప్ర‌యాణికులు మృతి చెందారు. అదివారం ద‌క్షిణ కొరియాలో జ‌రిగిన ఒక్క ఘటనలోనే 177 మంది మృతి చెందారు. అంత‌కుముందు అజర్ బైజాన్ విమానం కజకిస్థాన్‌లో అనుమానాస్ప‌ద రీతిలో ప్ర‌మాదానికి గురైన ఉదంతంలో 38 మంది అసువులు బాశారు. మ‌రో 4 చోట్ల 19 మంది మృతి చెందడం సాంకేతిక సమస్యలపై ఆందోళన కలిగిస్తోంది.