India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

✒ తేది: డిసెంబర్ 28, శనివారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.27 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.45 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.18 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.15 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.51 గంటలకు
✒ ఇష: రాత్రి 7.08 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

✒ తిథి: బహుళ త్రయోదశి రా.2:23 వరకు
✒ నక్షత్రం: అనురాధ రా.9.59 వరకు
✒ శుభ సమయం: ఉ.11.00 నుంచి మ.1.00 వరకు
✒ రాహుకాలం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
✒ యమగండం: మ.1.30 నుంచి 3.00 వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.6.00 నుంచి 7.36 వరకు
✒ వర్జ్యం: తె.3.57 నుంచి 5.38 వరకు
✒ అమృత ఘడియలు: ఉ.10.46 నుంచి మ.12.28 వరకు

☛ మన్మోహన్కు ప్రముఖుల నివాళి
☛ మన్మోహన్ గొప్ప పార్లమెంటేరియన్: ప్రధాని మోదీ
☛ విద్యుత్ ఛార్జీల పెంపుపై ఏపీ వ్యాప్తంగా వైసీపీ శ్రేణుల పోరుబాట
☛ MPDOపై దాడిని ఖండించిన పవన్ కళ్యాణ్
☛ రిజర్వేషన్లు ప్రకటించాకే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి: కవిత
☛ మన్మోహన్ సహకారం మరువలేనిది: KCR
☛ బాక్సింగ్డే టెస్టు: 5 వికెట్లు కోల్పోయిన భారత్

దేశంలోనే క్రేజీయెస్ట్ ప్రాజెక్టుగా ఇప్పటికే హైప్ దక్కించుకున్న రాజమౌళి-SSMB29 చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్కు ప్రియాంకా చోప్రా ఎంపికైనట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని సినీ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. అలాగే మరో కీలక పాత్రలో మలయాళ విలక్షణ నటుడు పృథ్విరాజ్ నటించనున్నట్లు ఫిలిం నగర్ టాక్. రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు సంక్రాంతి తరువాత జరగొచ్చని సమాచారం.

ప్రొ కబడ్డీ సీజన్-11లో పట్నా పైరేట్స్ జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది. సెమీ ఫైనల్-2లో ఢిల్లీ దబాంగ్తో జరిగిన మ్యాచ్లో 32-28 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్లో హరియాణా, పట్నా జట్లు తలపడనున్నాయి. తొలి సెమీస్లో యూపీ యోధాస్పై 28-25 తేడాతో హరియాణా గెలిచింది.

లంచం కేసులో ED ఆఫీసుపై CBI రైడ్ చేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది. సిమ్లా ED ఆఫీసులో పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ విశాల్ దీప్ ఓ కేసులో ప్రైవేటు వ్యక్తి నుంచి ₹55 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో CBI రంగంలోకి దిగింది. విశాల్ తప్పించుకోగా అతని తమ్ముడు దొరికిపోయాడు. లంచం డబ్బు ₹55 లక్షలతోపాటు విశాల్ ఆఫీసులో మరో ₹56 లక్షల నగదును CBI సీజ్ చేసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది.

ESIC 608 ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్-2 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. MBBS అర్హత ఉన్న 35 ఏళ్లలోపు వారు దరఖాస్తుకు అర్హులు. ఎంపికైన వారికి రూ.56,100-రూ.1,77,500 జీతం చెల్లిస్తారు. జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. మరిన్ని వివరాలకు ఇక్కడ <

విక్టరీ వెంకటేశ్ కొత్త మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ నుంచి థర్డ్ సింగల్ రిలీజ్పై చిత్ర యూనిట్ అప్డేట్ ఇచ్చింది. పొంగల్ అంటూ సాగే ఈ పాటను డిసెంబర్ 30న రిలీజ్ చేస్తామని వెల్లడించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు ట్రెండింగ్లో ఉండగా, పొంగల్ సాంగ్ కూడా చాట్బస్టర్గా నిలుస్తుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా జనవరి 14న విడుదల కానుంది.

AP: అన్నమయ్య(D) గాలివీడు MPDO శ్రీ జవహర్ బాబుపై YCP నేత సుదర్శన్ చేసిన దాడిని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ ఖండించారు. ఈ దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నామని, కార్యాలయంలోకి చొరబడి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ దాడి అప్రజాస్వామిక చర్య అని, ఇలాంటి దౌర్జన్యాలకు, రౌడీ చర్యలకు తావు లేదని స్పష్టం చేశారు. అటు రేపు కడప రిమ్స్కు వెళ్లనున్న పవన్ బాధిత MPDOను పరామర్శిస్తారు.

ప్రస్తుతం ఎంతోమందిని నిద్రలేమి సమస్య వెంటాడుతోంది. అలాంటివారికి 10-3-2-1 నియమం ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంటే, పడుకునే పది గంటల ముందు టీ/కాఫీ తాగొద్దు. పడుకునే మూడు గంటలలోపే ఆహారం తినాలి. 2 గంటల ముందు పని చేయడం ఆపేయాలి. గంట ముందు మొబైల్/టీవీ ఆఫ్ చేయాలి. ఇవి పాటిస్తే ప్రశాంతమైన నిద్ర మీ సొంతం అవుతుంది. SHARE IT
Sorry, no posts matched your criteria.