news

News December 27, 2024

తెలంగాణ వాసుల కోరిక నెరవేర్చిన మన్మోహన్

image

తెలంగాణ ప్రజల ఎన్నో దశాబ్దాల ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను నెరవేర్చింది మన్మోహనే. నాడు ప్రధానిగా ఉన్న ఆయన ఎంతో రాజనీతితో వ్యవహరించారు. విభజనకు అనుకూల, అననుకూల నేతలతో ఎన్నో చర్చలు చేశారు. సామరస్యంగా విభజన చేయడానికి ఎంతో కృషి చేశారు. రాష్ట్ర విభజన ఆవశ్యకతను గుర్తిస్తూనే ఆ తర్వాత వచ్చే సమస్యలను ప్రస్తావించారు. విభజిత APకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తొలుత చెప్పింది ఈయనే. అయితే తర్వాత NDA పట్టించుకోలేదు.

News December 27, 2024

మన్మోహన్ చారిత్రక ఆర్థిక సంస్కరణలివే(1/2)

image

1991 నాటికి దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. విదేశీ నిల్వలు అడుగంటిపోయాయి. అప్పులు పెరిగి రూపాయి విలువ తగ్గింది. ఆ సమయంలో ప్రధాని పీవీ నరసింహారావుతో కలిసి ఆర్థిక మంత్రిగా మన్మోహన్ జట్టుకట్టారు. లిబరలైజేషన్(వ్యాపారాలకు నియంత్రణల తొలగింపు), గ్లోబలైజేషన్(విదేశీ పెట్టుబడుల కోసం మల్టీనేషనల్ కంపెనీలకు అనుమతి), ప్రైవేటీకరణ(ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేట్ భాగస్వామ్యం) ప్రోత్సహించారు.

News December 27, 2024

మన్మోహన్ చారిత్రక ఆర్థిక సంస్కరణలివే(2/2)

image

1991లో ఎగుమతులను ప్రోత్సహించడానికి పరిమితులను కుదించారు. రూపాయి విలువను తగ్గించి విదేశీ మార్కెట్లో IND ఉత్పత్తులకు డిమాండ్ పెంచారు. పారిశ్రామిక వృద్ధికి అడ్డుకట్ట వేసే లైసెన్స్ రాజ్‌ను రద్దు చేశారు. కార్పొరేట్ పన్నులను పెంచారు. వంటగ్యాస్, చక్కెరపై సబ్సిడీలు తగ్గించారు. IMF సాయం పొందటం బంగారాన్ని తాకట్టు పెట్టారు. ఎగుమతి-దిగుమతి నిబంధనలను సరళీకరించారు. ఇలా ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.

News December 27, 2024

మన్మోహన్ ఆర్థిక సంస్కరణల ఫలితమిదే(2/2)

image

1991 ఆర్థిక సంస్కరణ కారణంగా IT, మాన్యుఫాక్చరింగ్, టెలికమ్యూనికేషన్ రంగాల్లో యువతకు భారీగా ఉపాధి దొరికింది. ప్రస్తుతం ఉన్న ఐటీ రంగ వృద్ధికి అప్పటి నిర్ణయాలే పునాదులు. భారత్‌లో పోటీ పెరిగి, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు తక్కువ ధరలకు అందుబాటులోకి వచ్చాయి. మధ్యతరగతి ఆదాయం పెరిగి, వినియోగం పెరిగింది. FDIలు భారీగా వచ్చాయి. ఆయన సంస్కరణల వల్ల భారతదేశం గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారింది.

News December 27, 2024

మన్మోహన్ ఆర్థిక సంస్కరణల ఫలితమిదే(1/2)

image

1991లో భారత ఆర్థిక వృద్ధి రేటు 3 శాతం ఉండగా, మన్మోహన్ ఆర్థిక సంస్కరణల తర్వాత ఇది 6-7 శాతానికి చేరుకుంది. ఇది అంతర్జాతీయ రుణదాతల నమ్మకాన్ని పెంపొందించింది. ప్రపంచ బ్యాంక్, IMF నుంచి రుణ సాయం అందడంతో ఆర్థిక వ్యవస్థను నిలబడింది. భారత రూపాయిపై విశ్వసనీయత పెరిగి, దేశం ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కింది. రెండేళ్లలోనే భారత విదేశీ నిల్వలు 1 బిలియన్ నుంచి 10 బిలియన్లకు చేరాయి.

News December 27, 2024

English Learning: Antonyms

image

✒ Despair× Contentment, Hope
✒ Derogatory× Laudatory, appreciative
✒ Docile× Headstrong, obstinate
✒ Destructive× Creative, Constructive
✒ Dwarf× Huge, Giant
✒ Eclipse× Shine, eclipse
✒ Eager× Indifferent, apathetic
✒ Ecstasy× Despair, Calamity
✒ Eccentric× Natural, Conventional

News December 27, 2024

మన్మోహన్ విద్యాభ్యాసం.. పెషావర్ టు ఆక్స్‌ఫర్డ్

image

ఇప్ప‌టి పాక్‌లోని చ‌క్వాల్‌లో వ్యాపారులైన గురుముఖ్ సింగ్, అమృత్ కౌర్ దంపతులకు 1932 Sep 26న మన్మోహన్ సింగ్ జన్మించారు. పెషావర్‌లో అప్పర్ ప్రైమరీ స్కూల్‌లో చదివారు. దేశ విభజన తర్వాత 1948లో వారి కుటుంబం అమృత్‌సర్‌కు వచ్చింది. పంజాబ్ వర్సిటీ నుంచి 1952లో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ, 1954లో మాస్టర్స్, 1957లో కేంబ్రిడ్జ్ నుంచి డిగ్రీ, 1962లో ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో DPhil పట్టా పొందారు.

News December 27, 2024

మన్మోహన్ ఫ్యామిలీ వివరాలు

image

మన్మోహన్ 1958లో గుర్‌శరన్ కౌర్‌ను వివాహం చేసుకున్నారు. ఈమె ప్రొఫెసర్, రచయిత. వీరికి ముగ్గురు కూతుళ్లు ఉపీందర్, దమన్, అమృత్ సింగ్ ఉన్నారు. ఉపీందర్ అకోలా వర్సిటీ డీన్, హిస్టరీ ప్రొఫెసర్, ఢిల్లీ వర్సిటీలో హిస్టరీ HODగా పనిచేశారు. ఈమె 6 పుస్తకాలు రాశారు. దమన్ అనేక నవలలు రాశారు. NATGRID సీఈవోగా పనిచేశారు. అమృత్ ACLUలో స్టాఫ్ అటార్నీగా సేవలందిస్తున్నారు. మన్మోహన్ అల్లుళ్లు ఉన్నతస్థానాల్లో ఉన్నారు.

News December 27, 2024

మన్మోహన్ హోదాలు.. లెక్చరర్ టు ప్రధాని

image

✒ 1957-65 పంజాబ్ వర్సిటీ లెక్చరర్, ప్రొఫెసర్
✒ 1966-69 UNOలో వర్క్
✒ 1969-71 ఢిల్లీ వర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్
✒ 1972 కేంద్ర ఆర్థికశాఖ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్
✒ 1976 ఆర్థికశాఖ కార్యదర్శి
✒ 1982-85 RBI గవర్నర్
✒ 1985-87 ప్రణాళికా సంఘం VC
✒ 1991లో యూజీసీ చైర్మన్
✒ 1991-96 ఆర్థిక మంత్రి; ✒ 2004-14 దేశ ప్రధాని

News December 27, 2024

రాజ్యసభలో 33 ఏళ్లు

image

మన్మోహన్ సింగ్ 1991 నుంచి 2024 వరకు 33 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 1991, 1995, 2001, 2007, 2013లో అస్సాం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1998 నుంచి 2004 మధ్య రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. చివరగా 2019లో రాజస్థాన్ నుంచి పెద్దలకు సభకు ఎంపికయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్‌తో ఆయన పదవీకాలం ముగిసింది. ఈయన 1999లో తొలిసారి దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.