India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: CM రేవంత్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని బోనులో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని BJP MP ఈటల రాజేందర్ మండిపడ్డారు. క్రికెట్ ప్లేయర్స్, పొలిటికల్ లీడర్స్, సినిమా స్టార్స్కి పెద్ద ఎత్తున మాస్ ఫాలోయింగ్ ఉంటుందని.. వారి పర్యటనల్లో ముందస్తు ఏర్పాట్లు అవసరమన్నారు. ఏదీ ఏమైనా, ఎవరి నిర్లక్ష్యమైనా ఒక నిండు ప్రాణం పోవడం బాధాకరమని చెప్పారు. ఈ ఘటన గుణపాఠం కావాలని, వీఐపీలు బాధ్యతాయుతంగా ఉండాలని సూచించారు.
అఫ్గానిస్థాన్పై పాకిస్థాన్ వరుస ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. జెట్స్ ద్వారా బాంబులతో దాడి చేయగా పక్టికా ప్రావిన్స్లోని బార్మల్ జిల్లాలో చిన్నపిల్లలు, మహిళలతో సహా 15 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాగా, దాడులపై పాకిస్థాన్ అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. అఫ్గాన్ బార్డర్లో దాక్కున్న తాలిబన్లను లక్ష్యంగా దాడులు చేసినట్లు మీడియా వర్గాలు చెబుతున్నాయి.
TG: ఈ సీజన్లో ఇప్పటివరకు 18.78 లక్షల టన్నుల సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వీటికి రూ.939 కోట్లు బోనస్ ఇవ్వాలని నిర్ణయించగా ఇప్పటికే రూ.531 కోట్లు రిలీజ్ చేసినట్లు పేర్కొంది. గత ఏడాది ఇదే సమయానికి 41.20 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా ఈ సారి 6 లక్షల టన్నులు అధికంగా సేకరించినట్లు అధికారులు తెలిపారు. ధాన్యం సేకరణలో కామారెడ్డి, NZB, మెదక్ ముందు వరుసలో ఉన్నాయి.
TG: ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును మరోసారి పెంచారు. నేటితో గడువు ముగియనుండగా, ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తూ బోర్డు అధికారులు ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలకు ఈ నిర్ణయం వర్తిస్తుందని పేర్కొన్నారు. మరోసారి గడువు పెంపు ఉండదని సమాచారం. రాష్ట్రంలో ఫిబ్రవరి 3 నుంచి ప్రాక్టికల్స్, మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
TG: రాష్ట్రంలో 25 లక్షల కుటుంబాలకు ఎలాంటి సాగు భూమి లేదని ధరణి కమిటీ నివేదిక పేర్కొంది. వీరిలో 70శాతం దళితులేనని తెలిపింది. భూమి లేని పేదలకు ఏటా రూ.12 వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి ఉపాధి హామీ కార్డులు, కులగణన సర్వే వివరాలను పరిగణనలోకి తీసుకోవాలని చూస్తోంది. మొదటి విడతగా వచ్చే నెలలో రూ.6 వేల చొప్పున ఇవ్వనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.
భారత రాజకీయాల్లో భీష్మ పితామహుడిగా పేరుగాంచిన అటల్ బిహారీ వాజ్పేయి జన్మించి నేటికి వంద సంవత్సరాలు పూర్తయింది. MPలోని గ్వాలియర్లో 1924 డిసెంబర్ 25న కృష్ణబిహారీ వాజ్పేయి, కృష్ణదేవి దంపతులకు ఆయన జన్మించారు. 1957లో తొలిసారి ఎంపీ అయిన వాజ్పేయి 5 దశాబ్దాల పాటు చట్టసభల్లో ఉన్నారు. 1996లో తొలిసారి ప్రధాని అయ్యారు. అణు పరీక్ష, రోడ్లు, కార్గిల్ యుద్ధంలో విజయం, సంస్కరణలు ఇలా దేశానికి ఎంతో సేవ చేశారు.
వాజ్పేయి పార్టీలకు అతీతంగా అభిమానం సొంతం చేసుకోవడంతో పాటు వ్యవహారశైలీ అలాగే ఉండేదని విశ్లేషకులు చెబుతారు. PV నరసింహారావు PMగా ఉన్నప్పుడు విపక్ష నేతగా ఉన్న వాజ్పేయిని ఐక్యరాజ్యసమితి సమావేశాలకు భారత ప్రతినిధిగా పంపారు. ఆయనపై PVకి ఉన్న నమ్మకం అలాంటిది. పాక్ సేనలతో పోరాడి బంగ్లాదేశ్ ఏర్పాటుకు కారణమైన అప్పటి PM ఇందిరాను దుర్గాదేవితో పోల్చడం వాజ్పేయి భోళాతనానికి నిదర్శనమని రాజకీయవేత్తలు అంటారు.
బాక్సింగ్ డే టెస్టుకు AUS జట్టును ప్రకటించింది. గాయపడిన హెడ్ కోలుకొని జట్టులో కొనసాగుతున్నారు. రేపు ఉదయం 5గంటలకు(IST) మెల్బోర్న్లో టెస్ట్ ప్రారంభం కానుంది. 3వ టెస్టు డ్రా కావడంతో ప్రస్తుతం సిరీస్ 1-1 సమంగా ఉంది. ఈ టెస్టులో గెలుపు WTC ఫైనల్ చేరేందుకు ఇరుజట్లకు కీలకం కానుంది.
AUS PLAYING XI: ఖవాజా, కొన్ట్సస్, లబుషేన్, స్మిత్, హెడ్, మార్ష్, క్యారీ, స్టార్క్, కమిన్స్ (కెప్టెన్), లయన్, బోలాండ్.
TG: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ, రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం కారణంగా ఉత్తరాది జిల్లాల్లో మినహా మిగతా చోట్ల చలి ప్రభావం కాస్త తగ్గింది. మరోవైపు నిన్న ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, నల్గొండలో వర్షాలు కురిశాయి.
గుర్తు తెలియని అంతర్జాతీయ నంబర్ల నుంచి వచ్చే కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని యూజర్లను కేంద్రం హెచ్చరించింది. టెలికం ఆపరేటర్లు సైతం దీనిపై అవగాహన కల్పించాలని సూచించింది. ‘+91తో కాకుండా వేరే కోడ్లతో వచ్చే కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. +8, +85, +65 వంటి స్టార్టింగ్ కోడ్లతో ప్రభుత్వ అధికారులమంటూ ఫోన్ చేస్తే వెంటనే సంచార్ సాథి పోర్టల్లోని <
Sorry, no posts matched your criteria.