India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కుటుంబంలో ఒక్కరు లేదా ఇద్దరు పొడుగ్గా ఉండటం కామన్. కానీ ఫ్యామిలీలో ఉన్న నలుగురూ తలెత్తుకుని చూసేంత ఎత్తుగా ఉంటే? మహారాష్ట్రలోని పుణేలో కులకర్ణి కుటుంబం ఇండియాలోనే అత్యంత ఎత్తైనది. గతంలో అత్యంత ఎత్తైన కుటుంబంగా లిమ్కా బుక్ వరల్డ్ రికార్డులోనూ చోటు సంపాదించుకుంది. నలుగురి ఉమ్మడి ఎత్తు 26 అడుగులు. తండ్రి 6.8 ఫీట్, తల్లి 6.2 ఫీట్, మొదటి కూతురు 6.6 ఫీట్, రెండో కూతురు 6.4 ఫీట్ ఉన్నారు.

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘తండేల్’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ వచ్చే నెల 7న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందని టాక్. చందూ మొండేటి తెరకెక్కించిన ఈ మూవీ ఈ నెల 7న థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టి సత్తా చాటింది.

TG: ప్రజలు సంక్షేమ పథకాలను చూసే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారని కేసీఆర్ అన్నారు. ఈ సీఎంపై ప్రజల్లో ఇంత తొందరగా వ్యతిరేకత వస్తుందనుకోలేదని చెప్పారు. రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు. తెలంగాణ మళ్లీ వెనక్కి వెళ్లిపోతోందని పార్టీ నేతలతో అన్నారు. నెలకు ఒక్కో అంశంపై పోరాటం చేయాలని సూచించారు.

చాలా మంది డబ్బులను సేవ్ చేసి మర్చిపోవడంతో అవి ఇన్యాక్టివ్ మోడ్లోకి వెళ్లిపోతాయి. అలా క్లెయిమ్ చేయని డబ్బు కొన్ని రూ.వేల కోట్లలో ఉందనే విషయం మీకు తెలుసా? ఇదంతా సేవింగ్స్, కరెంట్ అకౌంట్స్, టర్మ్ డిపాజిట్లు, జీవిత బీమా వంటి పాలసీల్లో ఉంది. బ్యాంక్ డిపాజిట్లలో రూ.62K కోట్లు, స్టాక్స్లో రూ.25K కోట్లు, మ్యూచువల్ ఫండ్స్లో రూ.35K కోట్లు, EPFలో రూ.48K కోట్లు, ఇన్సూరెన్స్లో రూ.21,500 కోట్లు ఉన్నాయి.

AP: రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 3న ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. అయితే సమావేశాలు ఎన్ని రోజుల పాటు నిర్వహిస్తారనేది బీఏసీ మీటింగ్లో నిర్ణయించనున్నారు.

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ఇటీవల తొక్కిసలాట జరిగి 18మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇవాళ ఢిల్లీ హైకోర్టు CJI ధర్మాసనం విచారణ జరిపింది. కోచ్లో పట్టే ప్రయాణికుల కంటే రైల్వే అదనపు టికెట్లు ఎందుకు అమ్ముతోందని మండిపడింది. కోచ్లో ప్రయాణికుల పరిమితిపై, అనుమతి లేకుండా కోచ్ల్లోకి ప్రవేశిస్తున్న వారిపై ఏ చర్యలు తీసుకుంటున్నారని రైల్వేస్తో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

TG: రాష్ట్రంలో త్వరలోనే ఉపఎన్నికలు వస్తాయని BRS చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు రాబోతోందని తెలిపారు. ఆయా నియోజకవర్గాల్లో కచ్చితంగా ఉపఎన్నికలు వస్తాయని, పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం కోసం కష్టపడాలని దిశానిర్దేశం చేశారు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వ గ్రాఫ్ పడిపోతోందని, ఇక లేవదని వ్యాఖ్యానించారు.

పొద్దున 3 గంటలకు అదే పనిగా కూస్తోందని కేరళ, పల్లిక్కల్ వాసి రాధాకృష్ణ కురూప్ ఓ కోడిపై ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. కొన్నాళ్లుగా నిద్రను చెడగొడుతూ ప్రశాంతమైన తన జీవితానికి భంగం కలిగిస్తోందని ఆయన స్థానిక RDOకు మొరపెట్టుకున్నారు. దానిని సీరియస్గా తీసుకున్న అధికారి వెంటనే ఇంటికొచ్చి పరిశీలించారు. పక్కింటి మేడపై కోళ్ల షెడ్డును గమనించి దానిని 14 రోజుల్లో మరోచోటకు మార్చాలని ఆదేశించారు.

బ్యాంకు కస్టమర్లకు కేంద్రం గుడ్న్యూస్ చెప్పబోతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం డిపాజిట్లపై ఉన్న ఇన్సూరెన్స్ కవరేజీని రూ.5 లక్షల నుంచి రూ.8-12 లక్షలకు పెంచబోతోందని సమాచారం. ప్రభుత్వం దీనిపై ఆలోచిస్తోందని ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ నాగరాజు చెప్పినట్టు మనీకంట్రోల్ తెలిపింది. ఈ నెలాఖరు నుంచే కొత్త రూల్స్ అమల్లోకి రావొచ్చని పేర్కొంది. ఫిక్స్డ్, సేవింగ్స్, కరెంట్, రికరింగ్ A/Cకు ఇవి వర్తిస్తాయంది.

TG: కొందరు నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంపై మాజీ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతలు భ్రమల్లో నుంచి బయటకు రావాలన్నారు. అధికారం అనుభవించి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు దూరంగా ఉండటమేంటని ప్రశ్నించారు. అటు BRS సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహిద్దామని, పార్టీ కమిటీలను నియమించాలని నేతలను ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.